31 May 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

May 30, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీకు శుద్ధమైన నషా ఉండాలి, మేము శ్రీమతంపై మా తనువు-మనసు-ధనములతోనే ముఖ్యంగా భారత్ ను మరియు మొత్తం ప్రపంచాన్ని స్వర్గముగా తయారుచేసే సేవ చేస్తున్నాము’’

ప్రశ్న: -

పిల్లలైన మీలో కూడా అందరికన్నా ఎక్కువ సౌభాగ్యశాలులు అని ఎవరిని అంటారు?

జవాబు:-

ఎవరైతే జ్ఞానాన్ని మంచి రీతిలో ధారణ చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో, వారు చాలా-చాలా సౌభాగ్యశాలులు. భారతవాసీ పిల్లలైన మీది అహో సౌభాగ్యము, మీకు స్వయంగా భగవంతుడు కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు సత్యాతి-సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. మీ ఈ వృక్షము నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంటింటినీ స్వర్గముగా తయారుచేసే సేవను మీరు చేయాలి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పిల్లలైన మీరు – మేము సైన్యము అని భావిస్తారు. మీరు అందరికన్నా శక్తివంతమైనవారు ఎందుకంటే మీరు సర్వశక్తివంతుని యొక్క శివ శక్తి సైన్యము. ఇంతటి నషా ఎక్కాలి. బాబా ఇక్కడ నషా ఎక్కిస్తారు, ఇంటికి వెళ్ళడంతో మర్చిపోతారు. శివ శక్తి సైన్యమైన మీరు ఏం చేస్తున్నారు? మొత్తం ప్రపంచము, ఏదైతే రావణుని సంకెళ్ళలో బంధించబడి ఉందో, దానిని విడిపిస్తారు. వీరంతా శోకవాటికలో ఉన్నారు. విమానాలలో తిరుగుతూ ఉండి ఉండవచ్చు, పెద్ద-పెద్ద ఇళ్ళు ఉండవచ్చు, కానీ ఇవన్నీ సమాప్తమవ్వనున్నాయి. దీనిని ఎండమావుల వంటి రాజ్యమని అంటారు. బయటి నుండి చూడడానికి చాలా ఆడంబరంగా ఉంటుంది, లోపల అంతా ఖాళీ ఖాళీగా ఉంది. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది. బాబా అంటారు, నేను వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, అంతా ఇదే ఉండేది. విభజన కూడా ఇప్పుడే జరిగింది, దానిని మీరు చూస్తున్నారు. ఇకపోతే, యుద్ధ మైదానము మొదలైనవాటి విషయమేమీ లేదు. వీరు రథము, వీరిలో శివబాబా విరాజమానమై కూర్చుని పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు భారత్ కు సేవ చేస్తున్నారు. ఏ పండుగలనైతే ఈ భారత్ లో జరుపుకుంటూ ఉంటారో – అవన్నీ ఇప్పటికి సంబంధించినవే. మూడవ నేత్రం కథ, గీత యొక్క కథ, శివ పురాణము, రామాయణము మొదలైనవన్నీ ఈ సమయాన్ని గురించి కూర్చుని తయారుచేసారు. సత్య-త్రేతాయుగాలలోనైతే ఈ విషయాలు లేవు. ఆ తర్వాత శాస్త్రాలను తయారుచేయడం మొదలుపెట్టారు. అవి మళ్ళీ తయారవుతాయి. పిల్లలైన మీరు అంతా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారు. ఈ సమయంలో ఎవ్వరికీ సృష్టి చక్రం గురించి యథార్థ రీతిలో తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు శుద్ధ అహంకారం ఉండాలి. మీరు తనువు-మనసు-ధనములతో భారత్ కు సేవ చేస్తున్నారు, ముఖ్యంగా భారత్ కు, సాధారణంగా మొత్తం ప్రపంచానికి. తండ్రి సహాయంతో మనం ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తాము. మీరు శ్రీమతం అనుసారంగా ఈ సేవను చేస్తారు. శ్రీమతము శివబాబాది. కానీ శివుని పేరును మాయం చేసేసారు. ఇకపోతే, బ్రహ్మా మతాన్ని మరియు శ్రీకృష్ణుని మతాన్ని చూపించారు. అది కూడా కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. మీరు భారత్ ను స్వర్గంగా అనగా వజ్రం తుల్యంగా తయారుచేస్తారు. కానీ ఎంత సాధారణంగా ఉన్నారు, ఎటువంటి అహంకారము లేదు. ఇక్కడ మీరు తమదంతా స్వాహా చేయాలి అనగా శివబాబాపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి. అప్పుడు శివబాబా మళ్ళీ 21 జన్మల కోసం బలిహారమవుతారు. గృహస్థ వ్యవహారం సంభాళించకండి అనైతే బాబా చెప్పరు. దానిని కూడా సంభాళించాలి, కానీ శ్రీమతము అనుసారంగా. అవినాశీ సర్జన్ నుండి ఏదీ దాచిపెట్టకూడదు. గురువు లేకపోతే ఘోర అంధకారము ఉంటుంది అని అంటూ ఉంటారు కూడా. ఈ బ్రహ్మా దాదా కూడా అంటారు, శివబాబా లేకుండా నేను మరియు మీరు పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారము. వారైతే శివ-శంకరులను కలిపేస్తారు. బ్రహ్మా ఎవరు? ఎప్పుడు వస్తారు? వచ్చి ఏమి చేస్తారు? ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. జంతువులైతే అర్థం చేసుకోవు. ఇప్పుడు పిల్లలైన మీరు నంబరువారు పురుషార్థమనుసారంగా తెలుసుకున్నారు. సద్గురువు లేకపోతే ఘోర అంధకారం ఉంటుందని విద్వాంసులు, పండితులు మొదలైనవారెవరికీ తెలియదు. గురువులైతే చాలామంది ఉన్నారు. అందరి సద్గురువు ఒక్కరే, వారిని వృక్షపతి అని అంటారు. కావున పిల్లలైన మీకు నషా ఎక్కాలి. ఈ కనులతో చూస్తున్న ఈ ప్రపంచము ఇక ఉండదు. దేనినైతే ఇప్పుడు బుద్ధి ద్వారా తెలుసుకున్నారో, అదే ఉంటుంది. కావున ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించాలి. పిల్లలను కూడా సంభాళించాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు. కొందరు అంటారు, బాబా, నేను మీకు రెండు నెలల బిడ్డను. కొందరేమో, నేను ఒక నెల బిడ్డను అని అంటారు. ఒక నెల పిల్లలు కూడా వెంటనే ధారణ చేసి ఒక్కసారిగా యువకులుగా అవుతారు, మరికొందరు 20 సంవత్సరాల వారు కూడా ఎక్కడివారు అక్కడే (మరుగుజ్జులుగానే) ఉంటారు. ఇది కొత్త వృక్షము, నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుందని మీకు తెలుసు. మొదట తప్పకుండా ఆకులు వెలువడతాయి. తర్వాత పుష్పాలు వెలువడతాయి. పుష్పాలుగా ఇక్కడే అవ్వాలి. అక్కడ అందరూ పుష్పాలుగానే ఉంటారు. ఇక్కడైతే కొందరు గులాబీలుగా, కొందరు చామంతులుగా అవుతారు. ధారణ ఏ విధంగా ఉంటుందో, అటువంటి పదవి లభిస్తుంది. అక్కడ అది పుష్పాల విషయము కాదు, పదవికి సంబంధించిన విషయము. కావున ఈ నషా ఉండాలి, మేము ఈ నేత్రాల ద్వారా పవిత్ర శివాలయమైన స్వర్గాన్ని చూస్తాము. అర్ధకల్పముగా, ఫలానావారు స్వర్గానికి వెళ్ళారు అని కేవలం అనేవారు. ఈ కోరికను ప్రాక్టికల్ గా తండ్రే ఇప్పుడు పూర్తి చేస్తారు.

ఇప్పుడు మీరు తండ్రికి పిల్లలుగా అవుతారు కావున భారత్ సంపన్నమవుతుంది. 33 కోట్లమంది దేవతలు అని అంటూ ఉంటారు, ఇంతమంది ఏమీ సత్య-త్రేతాయుగాలలో ఉండరు. ఇదైతే మొత్తం భారత్ లోని దేవీ-దేవతా ధర్మము వారి జనాభా సంఖ్య. బయట చూడండి, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. చైనా-జపాన్ వారైతే బౌద్ధులు, చెప్పడం కూడా బౌద్ధులనే చెప్తారు కానీ అభిప్రాయ భేదాలు ఎంతగా ఉన్నాయి. ఇక్కడ భారత్ లోనైతే శివబాబాను తొలగించేసారు, వారి గురించి అసలు తెలియనే తెలియదు. వారి చిత్రము ఉంది, పాడుతారు కూడా, నందీగణము కూడా ఉంది కానీ వారి గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తండ్రి చెప్పారు, నేను పరంధామం నుండి వచ్చి ఇక్కడ ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నాను. మీరు చక్రాన్ని తెలుసుకున్నారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారం వినాశనమయ్యింది. ఇంతకుముందైతే ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అనంతమైన తండ్రి, రచయిత, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్ గురించి మీరు తెలుసుకున్నారు. 84 జన్మలను ఎవరు తీసుకోవాలి! ఎవరు తీసుకుంటూ ఉండవచ్చు, ఇది మీకు తెలుసు. ఇప్పుడు మీ మూడవ నేత్రం తెరచుకుంది కావున ఇంతటి నషా ఉండాలి. మనుష్యులు మద్యం తాగినప్పుడు, దివాలా తీసి ఉన్నా, కానీ నషాలో, నేను అందరికన్నా షావుకారును అని భావిస్తారు. బాబా అయితే వైష్ణవులు, ఎప్పుడూ వీటిని ముట్టుకోలేదు. కానీ మద్యం తాగితే నషా ఎక్కుతుందని విన్నారు. యాదవులు కూడా మద్యం తాగి, ముసలాలు తయారుచేసి ఒకరి కులాన్ని ఒకరు నాశనం చేసుకున్నారు అని అంటారు. ఇక్కడ కూడా మిలిటరీ వారికి మద్యం తాగించడంతో చావడము లేక చంపడము విషయంలో లెక్క చేయరు. నషా ఎక్కిపోతుంది. కావున పిల్లలైన మీకు కూడా సదా నారాయణీ నషా ఉండాలి. మేము కల్పక్రితం యొక్క ఆ శక్తి సైన్యమే. అనేక సార్లు మేము భారత్ ను వజ్రం తుల్యంగా తయారుచేసాము, ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. సంశయబుద్ధి కలవారు వినాశనం చెందుతారు, నిశ్చయబుద్ధి కలవారు విజయం పొందుతారు. సంశయబుద్ధి కలవారు ఉన్నత పదవిని పొందరు. ప్రజలలో తక్కువ పదవిని పొందుతారు. అక్కడైతే మీ మహళ్ళలో సదా వాయిద్యాలు మోగుతూ ఉంటాయి. దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఇంతకుముందు రాజుల మహళ్ళ యొక్క ద్వారాల బయట అరుగుల మీద సన్నాయి వాయిద్యాలు మోగుతూ ఉండేవి. ఇప్పుడైతే ఆ రాజుల ఆడంబరము సమాప్తమైపోయింది. ప్రజల రాజ్యంగా అయ్యింది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం పవిత్రంగా అయి యోగంలో ఉంటూ, చక్రాన్ని స్మృతి చేస్తూ-చేస్తూ భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాము, కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. బాబా సలహానిస్తారు, అన్నింటికన్నా మంచి కర్తవ్యము పేదవారి సేవ చేయడము. ఈ రోజులలో పేదవారైతే చాలామంది ఉన్నారు. వ్యాధిగ్రస్థులకు సుఖం లభించాలని మనుష్యులు చాలా హాస్పిటల్స్ ను తయారుచేస్తారు, ఎవరైతే హాస్పిటల్స్ ను తెరుస్తారో, వారికి మరుసటి జన్మలో మంచి శరీరం లభిస్తుంది, వ్యాధిగ్రస్థులుగా అవ్వరు. కొందరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎప్పుడో అరుదుగా అనారోగ్యం పాలవుతారు. అంటే తప్పకుండా మునుపటి జన్మలో ఆరోగ్యాన్ని దానం చేసి ఉంటారు. అదే హాస్పిటళ్ళను తెరవడము. కొందరు చదువులో చాలా చురుకుగా ఉంటారు అంటే తప్పకుండా చదువును దానం చేసి ఉంటారు. కొందరు సన్యాసులకు చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్థమవుతాయి, అప్పుడు ఆ ఆత్మ పూర్వ జన్మ సంస్కారాలను తనతో పాటు తీసుకువచ్చింది అని అంటారు. కావున ఇక్కడ కూడా ఎవరైనా 3 అడుగులు భూమిని తీసుకుని ఈ ఆత్మిక హాస్పిటల్ ను తెరవాలి మరియు ఇలా రాయాలి, ఇక్కడకు వచ్చి 21 జన్మల కోసం తండ్రి నుండి ఆరోగ్యము యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ఇది ఎంత సహజమైన విషయము. మీరు ఇలా అడుగుతారు – చెప్పండి, లక్ష్మీ-నారాయణులకు ఈ వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు, కావున తప్పకుండా అడుగుతున్నవారికి స్వయం తెలిసే ఉంటుంది. తండ్రినే స్వర్గ రచయిత. ఏ విధంగా రచిస్తారు అనేది మీరు కూర్చున్నట్లయితే మేము అర్థం చేయిస్తాము. మేము కూడా వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. శివబాబా, బ్రహ్మాబాబా ద్వారా స్థాపన చేయిస్తున్నారు, ఆ తర్వాత పాలన కూడా వారే చేస్తారు. శంకరుని ద్వారా వినాశనం కూడా జరగాలి. తప్పకుండా నరకం యొక్క వినాశనమే జరుగుతుంది కదా. కొత్త ప్రపంచమైతే ఇప్పుడు తయారవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుందని చిన్న బ్యాడ్జి ద్వారా మీరు అర్థం చేయించవచ్చు. ఇదే రాజయోగము. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. ఎవరైతే మన కులానికి చెందినవారిగా ఉంటారో, వారికి వెంటనే మనసుకి హత్తుకుంటుంది. వారి ముఖం ప్రకాశిస్తుంది మరియు పురుషార్థంతో తమ వారసత్వాన్ని తీసుకుంటారు. మన బ్రాహ్మణ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు శూద్ర కులం నుండి తప్పకుండా మారుతారు, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మీరు భారత్ కు చాలా సేవ చేస్తారు కానీ గుప్తంగా. ఇంతకుముందు కూడా ఈ విధంగా చేసారు. ఇప్పుడు డ్రామా గురించి మంచి రీతిలో తెలుసుకోవాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లు అని అంటూ ఉంటారు. ఇకపోతే, ఆత్మ మిగిలి ఉంటుంది. ఆత్మ అయితే మరణించదు. ఆత్మ శరీరము నుండి వేరైతే, ఇక దాని కొరకు ప్రపంచమే లేనట్లు. మళ్ళీ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో, అప్పుడు తల్లిదండ్రుల సంబంధము మొదలైనవి కొత్తవి ఉంటాయి. ఇక్కడ మీరు కూడా అశరీరిగా అవ్వాలి. ఇప్పుడైతే ఈ ప్రపంచం ప్రాక్టికల్ గా సమాప్తం అవ్వనున్నది.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మల భారం ఏదైతే ఉందో, అది తొలగిపోతుంది మరియు మీరు సంపూర్ణులవుతారు. మాట్లాడడము, నడవడము, తినడము, తాగడము… అన్ని విషయాలలోనూ పిల్లల మ్యానర్స్ చాలా బాగుండాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. రాజులు చాలా తక్కువగా మరియు నెమ్మదిగా మాట్లాడుతారు, మౌనంగా ఉంటారు. మీ లోనైతే చాలా సభ్యత ఉండాలి. దేవతలలో సభ్యత ఉండేది. ఇక్కడైతే మనుష్యులు కోతుల వలె ఉన్నారు కావున అసభ్యంగా ఉన్నారు. కొద్దిగా కూడా తెలివి లేదు. అనంతమైన తండ్రి, ఎవరైతే సృష్టిని స్వర్గంగా తయారుచేస్తారో, వారిని రాయి-రప్పలలో, కుక్క, పిల్లి అన్నింటిలోనూ తోసేసారు. మాయ పూర్తిగా బుద్ధికి గాడ్రేజ్ తాళం వేసింది. ఇప్పుడు బాబా వచ్చి తాళం తెరుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత వివేకవంతులుగా అయ్యారు. శివబాబా, బ్రహ్మా, విష్ణు, శంకరుడు, లక్ష్మీ-నారాయణులు, జగదంబ మొదలైన వారందరి జీవిత కథలను మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు సద్గురువైన శివబాబా నుండి పూర్తి తెలివి లభించింది. బాబా నాలెడ్జ్ ఫుల్ కదా. ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నిజంగా ఇంతకుముందు మనకు ఏమీ తెలియదు. కోతుల వంటి నడవడిక ఉండేది. ఇప్పుడు మనం అంతా తెలుసుకున్నాము. బాబా కొత్త రచనను ఎలా రచిస్తారు. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులాన్ని తయారుచేస్తారు, ఇది మీకు తెలుసు. పూజింపబడే మూర్తి ఏమీ మాట్లాడదు. మనమే పూజ్యులుగా ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు.

ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. మీకు తెలుసు, సంగమయుగంలో సత్యయుగం యొక్క రచన ఎలా జరుగుతుంది, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. బ్యారిస్టరు ఎవరినైనా చదివిస్తే, వారు ఎలా తయారుచేస్తారు? భగవంతుడు కూడా వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతవాసులైన పిల్లలది అహో సౌభాగ్యము… మీలో కూడా ఎవరైతే మంచి రీతిగా ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తూ ఉంటారో, వారే సౌభాగ్యశాలులు. మున్ముందు చాలా ఇల్లులు స్వర్గముగా అవుతాయి. వృక్షము నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇందులో శ్రమ ఉంది. ఎంత ఉన్నతిలోకి వెళ్తారో, అంతగా మాయా తుఫానులు తీవ్రంగా వస్తాయి. కొండపై ఎంతగా పైకి ఎక్కుతారో, అంతగా తుఫానులను, చలిని మొదలైనవాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేవలో ఎంత సమయం లభిస్తే అంత మంచిది, అడ్వర్టైజ్ చేయండి. మనసులో వచ్చిన సలహాను తెలపండి, ఇలా-ఇలా చేయాలి అని చెప్పండి. చేస్తే చేయండి అని బాబా అంటారు. పాపం మనుష్యులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా అయ్యారు. ఏ వస్తువూ సత్యంగా లేదు. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము… ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గవాసులుగా అవుతారు.

(పాట:- కొత్త ప్రపంచం యొక్క మొగ్గలు…) ఈ పాటలో సీత యొక్క మహిమను చేస్తారు. సీత ఏ దేశములోనైతే ఉండేవారో, ఆ దేశం పవిత్రంగా ఉండేది. మరి ఆ దేశంలోకి మళ్ళీ రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఆశ్చర్యమేమిటంటే, వానర సైన్యాన్ని తీసుకున్నారని అంటారు. ఇప్పుడు వానర సైన్యము ఎక్కడి నుండి వచ్చింది! ఇక్కడ కూడా మనుష్యుల సైన్యముంది. గవర్నమెంట్ వానర సైన్యాన్ని ఏమైనా తీసుకుంటుందా. మరి అక్కడ వానర సైన్యము ఎలా వచ్చింది? ఇది కూడా అర్థం చేసుకోరు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి యాత్రతో తమ వికర్మల భారాన్ని తొలగించుకోవాలి, మంచి మ్యానర్స్ ను ధారణ చేయాలి. సభ్యత (మ్యానర్స్) తో వ్యవహరించాలి. చాలా తక్కువగా మాట్లాడాలి.

2. ఏ విషయములోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలో తమదంతా సఫలం చేసుకోవాలి. శివబాబాపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి.

వరదానము:-

63 జన్మలు అన్ని ఖజానాలను వ్యర్థంగా పోగొట్టుకున్నారు, ఇప్పుడు సంగమయుగంలో సర్వ ఖజానాలను యథార్థంగా, విధి పూర్వకంగా జమ చేసుకోండి, జమ చేసుకునేందుకు విధి ఏమిటంటే – ఏయే ఖజానాలైతే ఉన్నాయో, వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల శుభవృత్తితో కార్యంలో ఉపయోగించండి. కేవలం బుద్ధి అనే లాకర్ లో జమ చేయకండి, కానీ ఖజానాలను కార్యంలో ఉపయోగించండి. వాటిని స్వయం పట్ల కూడా ఉపయోగించండి, లేదంటే వాటిని కోల్పోతారు, అందుకే యథార్థ విధితో జమ చేయండి, అప్పుడు సంపూర్ణత యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకుని సిద్ధి స్వరూపులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top