21 March 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

March 20, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - మీ వద్ద ఏదైతే ఉందో, దానిని ఈశ్వరీయ సేవలో ఉపయోగించి సఫలం చేసుకోండి, కాలేజ్ మరియు హాస్పిటల్ ను తెరుస్తూ వెళ్ళండి’’

ప్రశ్న: -

పిల్లలైన మీకు శివబాబాతో కల ఏ ఒక్క సంబంధం చాలా రమణీకమైనది మరియు గుహ్యమైనది?

జవాబు:-

మీరంటారు, శివబాబా మాకు తండ్రి కూడా, అలాగే కొడుకు కూడా, కానీ తండ్రి మళ్ళీ కొడుకుగా ఎలా అవుతారు, ఇది చాలా రమణీకమైన మరియు గుహ్యమైన విషయము. మీరు వారిని బాలకునిగా కూడా భావిస్తారు ఎందుకంటే వారిపై పూర్తిగా బలిహారమవుతారు. మొత్తం వారసత్వాన్ని ముందు మీరు వారికి ఇస్తారు. ఎవరైతే శివబాబాను తమ వారసునిగా చేసుకుంటారో, వారే 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. ఈ కొడుకు (శివబాబా) అంటారు, నాకు మీ ధనం అవసరం లేదు. మీరు కేవలం శ్రీమతంపై నడిచినట్లయితే, మీకు రాజ్యాధికారం లభిస్తుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మాతా ఓ మాతా… (మాతా ఓ మాతా…)

ఓంశాంతి. ఓం శాంతి, ఎవరన్నారు? శరీరం అన్నదా లేక ఆత్మ అన్నదా? ఇది పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. ఒకటి ఆత్మ, ఇంకొకటి శరీరము. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మ స్వయం తన పరిచయాన్ని ఇస్తుంది, ఏమనంటే – నేను కూడా ఆత్మను, బిందు స్వరూపాన్ని. ఎలాగైతే పరమాత్మ తండ్రి – నన్ను పరమాత్మ అని ఎందుకంటారు? అని చెప్తూ తమ పరిచయాన్ని ఇస్తారు ఎందుకంటే నేను అందరికీ తండ్రిని. అందరూ, ఓ పరమపిత పరమాత్మా, ఓ భగవంతుడా అని అంటారు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అంధ శ్రద్ధ యొక్క విషయం లేదు. ఎలాగైతే ఇతరులు ఏదైతే వినిపిస్తారో, అది సత్యం కాదో, అలా మనుష్యులు ఈశ్వరుని కోసం ఏదైతే చెప్తారో, అదంతా అసత్యము. ఒక్క ఈశ్వరుడే సత్యము. వారు సత్యాన్ని తెలియజేస్తారు. మిగిలిన మనుష్యమాత్రులందరూ వారి కోసం అసత్యం చెప్తారు, అందుకే తండ్రిని సత్యం (ట్రూత్) అని అంటారు, వారు సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. భారత్ యే సత్య ఖండంగా ఉండేది. తండ్రి అంటారు, నేనే సత్య ఖండాన్ని తయారుచేసాను. ఆ సమయంలో భారత్ తప్ప ఇతర ఏ ఖండమూ లేదు. ఇవన్నీ సత్యమైన తండ్రే తెలియజేయగలరు. పూర్వమున్న ఋషులు, మునులు అందరూ అంటూ ఉండేవారు, మాకు రచయిత అయిన ఈశ్వరుడు మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని. తెలియదు-తెలియదు అని అంటూ వచ్చారు. ఎవ్వరూ పరిచయాన్ని ఇవ్వలేరు. తండ్రి పరిచయాన్ని తండ్రే ఇస్తారు. నేను మీ తండ్రిని. నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాత ప్రపంచాన్ని శంకరుని ద్వారా వినాశనం చేయిస్తాను. కొత్త సృష్టిని బ్రహ్మా ద్వారా రచిస్తాను. నేనే మీకు నా సత్య పరిచయాన్ని ఇస్తాను. ఇకపోతే, నా గురించి మీకు ఏదైతే వినిపిస్తారో, అది అసత్యమే వినిపిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. సత్యయుగీ లక్ష్మీ-నారాయణులు ఉన్నతోన్నతులుగా ఉండేవారు. కొత్త ప్రపంచము, ఏదైతే ఉన్నతంగా ఉండేదో, దానికి యజమానులుగా ఉండేవారు. ఇకపోతే, ఇంతటి ఉన్నతమైన ప్రపంచాన్ని ఎవరు తయారుచేసారు మరియు దానికి యజమానులుగా ఎవరు చేసారు? ఇది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే స్వర్గ రాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుని ఉంటారో, వారి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయని తండ్రికి తెలుసు. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖాన్ని పొందాము అని పాడుతారు కూడా. ఇది ఎవరి గురించి పాడుతారు? లౌకికమైనవారి గురించా లేక పారలౌకికమైన వారి గురించా? లౌకికం వారికైతే ఈ మహిమ ఉండజాలదు. సత్యయుగంలో కూడా ఈ మహిమ ఎవ్వరికీ ఉండజాలదు. ఆ తల్లి-తండ్రి నుండి 21 జన్మల అపారమైన సుఖపు వారసత్వాన్ని తీసుకునేందుకు, రాజ్య భాగ్యం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. భగవంతుడు ఉన్నదే రచయిత, కావున వారితో పాటు తల్లి కూడా ఉంటారు కదా. మేము తల్లి-తండ్రి వద్దకు వచ్చామని ఇక్కడ పిల్లలైన మీరు అంటారు. ఇక్కడ గురువులు-సాధువులు ఎవరూ లేరు. తండ్రి అంటారు, మీరు నా నుండి మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణులే రాజ్యం చేసేవారు. శ్రీకృష్ణుడిని అందరూ ప్రేమిస్తారు, మరి రాధేను ఎందుకు ప్రేమించరు? లక్ష్మీ-నారాయణులు బాల్యంలో ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. వీరు ద్వాపరయుగంలో ఉండేవారని మనుష్యులు భావిస్తారు. మాయా రావణుడు పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా చేసేసాడు. మీరు కూడా ఇంతకుముందు రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు. బాబా మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేసారు. పారసబుద్ధి కలవారిగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. స్వర్గంలో బంగారు మహళ్ళు ఉంటాయి. ఇక్కడ బంగారం కాదు కదా, రాగి కూడా లభించదు. నాణాలు రాగివి కూడా తయారుచేయడం లేదు. అక్కడైతే రాగికి ఏ విలువా ఉండదు. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు అని ఏదైతే అంటూ ఉంటారో, అది మళ్ళీ తప్పకుండా జరగనున్నది. తప్పకుండా ఇంతకుముందు కూడా నిప్పు అంటుకుంది, వినాశనం జరిగింది, అదే మళ్ళీ జరగనున్నది, తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం వలె మళ్ళీ దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతూ ఉంది. పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తాను, ఇప్పుడు ఎవరు ఎంతగా చదువుకుంటే అంత. ఆలోచించాలి, సత్యయుగంలో రాజా-రాణులైన ఈ లక్ష్మీ-నారాయణులు మరియు ప్రజలు ఎక్కడ నుండి వచ్చారు? వారు రాజ్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు? ఒకరి నుండి ఒకరు తీసుకుంటారా లేక సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులు తీసుకున్నారా! చంద్రవంశీయుల నుండి తర్వాత వికారీ రాజులు తీసుకుంటారు, ఆ రాజుల నుండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడైతే ఏ రాజ్యమూ లేదు. లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా – 8 తరాలు నడిచాయి. త్రేతాలో సీతా-రాముల రాజ్యం నడిచింది. తర్వాత మాయ రాజ్యం మొదలయ్యింది. వికారీ రాజులు, నిర్వికారీ రాజుల మందిరాలను నిర్మించి పూజించడం మొదలుపెట్టారు. పూజ్యులుగా ఉండేవారు, వారే పూజారులుగా అయ్యారు. ఇప్పుడైతే వికారీ రాజులు కూడా లేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచం యొక్క చరిత్ర రిపీట్ అవుతుంది. కొత్త ప్రపంచం కోసం తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరైతే పరీక్షను పాస్ అవుతారో, వారే కల్ప-కల్పము ఉన్నత పదవిని పొందుతారు. ఇది చదువు, గీతా పాఠశాల. వాస్తవానికి దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము) అని అనాలి ఎందుకంటే దీని ద్వారానే భారత్ స్వర్గంగా అవుతుంది. కానీ ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోరు. ఇంకాస్త సమయం ఉంది. మున్ముందు ప్రభావం వెలువడుతుంది. ఇదంతా శివబాబానే అర్థం చేయిస్తారు. శివబాబా అనాలా లేక శివ బాలకుడు అనాలా? శివుడు తండ్రి కూడా, అలాగే తల్లి కూడా. ఒకవేళ శివ భగవానుడు తల్లి కాకపోతే, మీరు ఎందుకు ఇలా పిలుస్తారు – మీరే మాకు తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అని. బుద్ధి పని చేస్తుంది. శివ భగవానుడు తండ్రి కూడా, అలాగే తల్లి కూడా. ఇప్పుడు చెప్పండి, శివునికి తల్లి ఉన్నారా? శివుడు మీ కొడుకా? ఎవరైతే శివుడు మాకు తండ్రి కూడా, కొడుకు కూడా అని అంటారో, వారు చేతులెత్తండి! ఇది చాలా రమణీకమైన మరియు గుహ్యమైన విషయము. తండ్రి మళ్ళీ కొడుకుగా ఎలా అవ్వగలరు? వాస్తవానికి కృష్ణుడైతే గీతను వినిపించలేదు. వారైతే వారి తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకు. సత్యయుగంలోనైతే కుండ మొదలైనవి పగలగొట్టే విషయం లేదు. గీతను వినిపించినవారు శివ్. వారిని బాలకునిగా కూడా భావిస్తారు ఎందుకంటే వారిపై బలిహారం కూడా అవుతారు. మొత్తం వారసత్వాన్ని వారికి ఇస్తారు. శివబాబా, మీరు వచ్చినట్లయితే మేము బలిహారమవుతాము అని మీరు పాడేవారు కూడా, ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నన్ను వారసునిగా చేసుకున్నారంటే, నేను మిమ్మల్ని 21 జన్మల కోసం వారసులుగా చేసుకుంటాను. లౌకిక కొడుకు మీ నుండి తీసుకుంటారు, ఏమీ ఇవ్వరు. వీరైతే ఎంత ఇస్తారో చూడండి. అయితే, మీ పిల్లలను కూడా సంభాళించండి కానీ శ్రీమతంపై నడవండి. ఈ సమయంలోని పిల్లలు, తండ్రి ధనంతో పాపాలే చేస్తారు. ఈ కొడుకు అంటారు – నేను మీ ధనాన్ని ఏమి చేసుకోవాలి. నేనైతే మీకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను, కేవలం శ్రీమతంపై నడవండి. యోగంతో 21 జన్మల కోసం ఆరోగ్యము మరియు చదువుతో రాజ్యము లభిస్తాయి. ఇటువంటి కాలేజ్ మరియు హాస్పిటల్ ను తెరవండి. శివబాబా అయితే దాత, నేను తీసుకుని ఏం చేస్తాను! అయితే, ఈశ్వరార్థము సేవలో ఉపయోగించండి అనే యుక్తిని తెలియజేస్తాను. శ్రీమతంపై నడవండి. శ్రీకృష్ణార్థం అర్పణ చేస్తారు, వారైతే రాకుమారుడు, వారేమైనా ఆకలితో ఉండేవారా. శివబాబా మీకు రిటర్న్ లో ఎంతో ఇస్తారు. భగవంతుడు భక్తి ఫలాన్ని ఇస్తారు. వారు దుఃఖహర్త, సుఖకర్త. మీకు సద్గతి చేసేవారు ఇంకెవ్వరూ లేరు. నేను పిల్లలైన మీకు సద్గతినిస్తాను. అచ్ఛా బాబా, మరి దుర్గతిని ఎవరు కలిగిస్తారు? అయితే పిల్లలూ, రావణుడు ప్రవేశించిన కారణంగా, రావణుని మతముపై అందరూ మీకు దుర్గతినే కలిగిస్తూ వచ్చారు. రావణుని మతముపై పూర్తిగా భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని శ్రేష్ఠాచారులుగా, స్వర్గానికి యజమానులుగా చేస్తాను. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో, అది ఆసురీ మతముపైనే చేస్తారు. ఇప్పుడు దేవతలుగా అవ్వాలంటే ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క నాతో సాంగత్యాన్ని జోడించండి. ఎంతగా నా మతముపై నడుస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోకపోతే ప్రజల్లో కూడా తక్కువ పదవిని పొందుతారు. ఒక్కసారి విని ధారణ చేసారంటే స్వర్గంలోకైతే వస్తారు కానీ తక్కువ పదవిని పొందుతారు. రోజు-రోజుకు ఉపద్రవాలు ఎన్నో జరుగుతాయి. అప్పుడు మనుష్యులు కూడా, తప్పకుండా ఇది అదే సమయమని భావిస్తారు. కానీ చాలా ఆలస్యంగా రావడంతో అంతటి ఉన్నత పదవినైతే పొందలేకపోతారు. యోగం లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. ఇప్పుడిది అందరి యొక్క వినాశన సమయము. లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. ఇక్కడ మీ కర్మలు వికర్మలు అవుతూ ఉంటాయి. సత్యయుగంలో కర్మలు అకర్మలు అవుతాయి. కర్మలనైతే తప్పకుండా అందరూ చేస్తారు. కర్మ లేకుండానైతే ఎవ్వరూ ఉండలేరు. ఆత్మ అంటుంది, నేను ఈ కర్మలను చేస్తాను. రాత్రికి అలసిపోయిన కారణంగా విశ్రాంతి తీసుకుంటాను, ఈ ఇంద్రియాలను వేరుగా భావించి పడుకుంటాను, దీనిని నిద్ర అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఓ ఆత్మ, నేను నీకు వినిపిస్తాను, దానిని ధారణ చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చదువును కూడా చదువుకోండి. చదువుతోనే ఉన్నత పదవి లభిస్తుంది. పవిత్రంగా అవ్వకుండా ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. మాయ బుద్ధిని అపవిత్రంగా చేస్తుంది, అందుకే బాబా పేరు పతితపావనుడు. మీరు తల్లి తండ్రి, మేము మీ పిల్లలము… అని పాడుతారు. కానీ మీరిప్పుడు ప్రాక్టికల్ గా కూర్చున్నారు, ఈ సహజ రాజయోగ బలంతో 21 జన్మల కోసం మనం స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు, అందుకే మీరు వచ్చారు. భక్తి మార్గంలో మీరు పాడేవారు, ఇప్పుడు గాయనం సమాప్తమైంది. స్వర్గంలో గాయనం ఉండనే ఉండదు, మళ్ళీ భక్తిలో ఉంటుంది. తండ్రి అంటారు, నేను మీకు తల్లి-తండ్రిగా అయి మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తాను. మాయ మళ్ళీ నరకవాసులుగా చేస్తుంది. ఇది ఆట. దీనిని అర్థం చేసుకుని మరణించే కన్నా ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోండి. లేదంటే రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. పతితులు వారసత్వాన్ని తీసుకోలేరు. వారు తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోతారు. వారిలో కూడా నంబరువారు పదవులు ఉంటాయి.

తండ్రి అంటారు, ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు నా మతముపై నడిచినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది, ఇందులో అంధ శ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. చదువులో ఎప్పుడూ అంధ శ్రద్ధ ఉండదు. పరమాత్మ చదివిస్తారు. నిశ్చయం లేకుండా ఎలా చదువుకుంటారు? చదువుకుంటూ-చదువుకుంటూ మళ్ళీ మాయ విఘ్నాలు వేస్తుంది, అప్పుడు చదువును వదిలేస్తారు, అందుకే అంటూ ఉంటారు – ఆశ్చర్యవంతులై వింటారు, వర్ణిస్తారు… మళ్ళీ బాబాకు విడాకులిచ్చేస్తారు అని. కానీ ఎంతైనా ప్రేమ ఉంది కనుక వచ్చి కలుస్తారు. తండ్రికి పిల్లలుగా అయి మళ్ళీ తండ్రిని వదిలేసాము అని మున్ముందు పశ్చాత్తాపపడతారు. వెళ్ళి మాయకు చెందినవారిగా అయినట్లయితే వారికి శిక్షలు కూడా చాలా పడతాయి మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. కల్ప-కల్పాంతరాలకు తమ రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. శిక్షలు అనుభవించి ప్రజా పదవిని పొందారు, దీనితో అసలు లాభం ఏముంటుంది! తండ్రి సమ్ముఖంలోకి వచ్చి చాలా వింటారు – మళ్ళీ వ్యాపార-వ్యవహారాల్లోకి వెళ్ళి మర్చిపోతారు. మొదటి నంబరు పాపము – కామ ఖడ్గాన్ని నడిపించడము, అందుకే తండ్రి అంటారు, మురికి పట్టిన వస్త్రాలుగా ఎప్పుడూ అవ్వకండి. తండ్రి వచ్చి అందరి వస్త్రాలను శుభ్రం చేస్తారు. తండ్రే పతితులందరినీ పావనంగా చేసేవారు. సత్యయుగంలో పతితులెవ్వరూ ఉండరు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు రావణ మతమును విడిచి శ్రీమతముపై నడవాలి, ఇతర సాంగత్యాలన్నీ తెంచి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా అయి చదువును తప్పకుండా చదువుకోవాలి. ఎటువంటి విఘ్నం వచ్చినా కూడా, తండ్రి చేతిని విడిచిపెట్టకూడదు. యోగంతో ఆరోగ్యాన్ని మరియు చదువుతో రాజ్యాన్ని తీసుకోవాలి.

వరదానము:-

ఏ విధంగానైతే హంస సదా నీటిలో ఈదుతుంది కూడా మరియు ఎగిరేదిగానూ ఉంటుంది, అలా సత్యమైన హోలీహంస పిల్లలైన మీకు ఎగరడమూ మరియు ఈదడమూ తెలుసు. జ్ఞాన మననం చేయడం అనగా జ్ఞానామృతంలో లేక జ్ఞాన జలంలో ఈదడము మరియు ఎగరడము అనగా ఉన్నత స్థితిలో ఉండడము. ఇటువంటి జ్ఞాన మననం చేసే మరియు ఉన్నత స్థితిలో ఉండే హోలీహంసలు ఎప్పుడూ కూడా దుఃఖపడరు లేక నిరాశ చెందరు. వారు గతించిన దానికి బిందువు పెట్టి, ఎందుకు ఏమిటి అనే వల నుండి ముక్తులై ఎగురుతూ మరియు ఎగిరిస్తూ ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top