12 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
11 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - పాత్రధారులు ప్రతి ఒక్కరు సగం సమయం సుఖం, సగం సమయం దుఃఖపు పాత్రను అభినయిస్తారు, ఇది కూడా ఒక్క ఈశ్వరీయ నియమము”
ప్రశ్న: -
తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, అది పిల్లల బుద్ధిలో యథార్థంగా ఎప్పుడు కూర్చొంటుంది?
జవాబు:-
బుద్ధి శుద్ధంగా అయినప్పుడు అది పిల్లల బుద్ధిలో యథార్థంగా కూర్చొంటుంది. ఎవరెంతగా పురుషార్థం చేసి మాలిన్యాన్ని తొలగించుకుంటూ ఉంటారో, అంతగా తండ్రి అర్థం చేయించేది బుద్ధిలో కూర్చొంటుంది. పిల్లలు ఇప్పటికీ సతో వరకు కూడా అతి కష్టం మీద చేరుకున్నారు. ప్రతి ఒక్కరి పురుషార్థం ఎవరిది వారిదే. కొందరు సతోగా, కొందరు తమోగా కూడా ఉన్నారు కానీ సతోప్రధానంగా తయారవ్వాలి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
దూరదేశంలో నివసించేవారు…
ఓంశాంతి. పిల్లలు మేళాలలో, ప్రదర్శనీలలో అర్థం చేయించేటప్పుడు, చెప్పదగిన విషయాలను తప్పకుండా అర్థం చేయించాలి. సోదరులందరికీ (ఆత్మలకు) అనంతమైన తండ్రి ఒక్కరేనని తప్పకుండా అర్థం చేయించాలి. భారత్ యొక్క ఆది సనాతన ధర్మమేమిటి అని కూడా అడగాల్సి ఉంటుంది. వారు హిందు ధర్మాన్నే ఆది సనాతన ధర్మమని భావిస్తారు. ఇస్లామీయులు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైనవారికి తమ ధర్మాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అనేది తెలుసు. భారతవాసులది హిందు ధర్మమా లేక దేవీ-దేవతా ధర్మమా? దీనిని ఎవరు మరియు ఎప్పుడు స్థాపన చేసారు? ఈ విషయం భారతవాసులకు అసలు తెలియదు. ఇది తప్పకుండా అర్థం చేయించాల్సిన విషయము. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. భారతదేశం ప్రాచీనమైనదని మహిమ చేస్తారు. కానీ వారిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అన్న విషయం వారికి తెలియదు. హిందు అనేది ధర్మమేమీ కాదు. 5 వేల సంవత్సరాల క్రితం దేవీ-దేవతా ధర్మముండేదని, ఆ సమయంలో తప్పకుండా లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు తమను తాము హిందువులు అని చెప్పుకునేవారు కాదు. అచ్ఛా, అలాగైతే హిందు ధర్మానికి కూడా ఏదో ఒక శకం ఉండాలి. విక్రమ శకం అని అంటారు, దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పటి నుండి తమను తాము హిందువులుగా చెప్పుకోవడం ప్రారంభించి ఉండవచ్చు, అప్పటి నుండి విక్రమ శకమని కూడా అంటారు. అంటే సగం-సగం అయినట్లు. ఆ సమయంలో వారిని ఆది సనాతన దేవీ-దేవతలని అనరు. ధర్మ స్థాపన జరిగినప్పుడు దానిని శకం అని అంటారు. అయితే దానిని ఎవరు స్థాపన చేసారు? వికర్మ శకాన్ని రావణుడు స్థాపన చేసాడు. ఆ సమయంలో అందరి కర్మలు వికర్మలుగా అవుతూ ఉంటాయి. కర్మ-అకర్మ-వికర్మ అని పేర్లు అయితే ఉన్నాయి కదా. కనుక విక్రమ రాజా శకం కూడా నడుస్తుంది. అది సగం సమయముంటుంది. ఇప్పుడు ఈ విక్రమ శకం హిందువుల శకమైతే కాదు కదా? కనుక భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం ఎప్పుడు స్థాపనయిందని అడగాలి. ఇది తెలియాలి కదా. ఇవి చాలా సున్నితమైన విషయాలు. వీటి గురించి తెలిసినప్పుడు, కొత్త ప్రపంచముండేదని లెక్కించగలరు. రాత్రి-పగలు తప్పకుండా ఉంటాయి, కనుక రెండు సగం-సగం ఉంటాయి. ఇది ఒక ఈశ్వరీయ లా (నియమము), దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. ఈ విధమైన సమాచారాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. క్రైస్తవులకు కూడా సగం సమయం సుఖపు పాత్ర, సగం సమయం దుఃఖపు పాత్ర కొనసాగుతుంది. మనం ఏదైతే అర్థం చేయిస్తామో, అందులో మొత్తం చరిత్ర-భూగోళాలు వచ్చేస్తాయి. ఇక్కడకు వచ్చే మనుష్యులు అందరికీ సుఖ-దుఃఖాల పాత్ర లభించి ఉంది. ఒకటి-రెండు జన్మలు కోసం వచ్చినా సరే, రెండు సగం-సగముంటాయి. ఇది ఒక ఈశ్వరీయ లా (నియమము). ప్రదర్శనీలలో విన్నప్పుడు బాగుంది-బాగుంది అని అంటారు. బయటకు వెళ్తూనే మర్చిపోతారు. ఎవరో అరుదుగా అటెన్షన్ పెడతారు. కొంతమంది ఒక నెల వచ్చి కూడా మాయమైపోతారు. కొందరు 10 నిమిషాలు అర్థం చేసుకుంటారు, కొందరు ఒక గంట, మరి కొందరు కొంత సమయం వచ్చి నడుస్తూ-నడుస్తూ అలసిపోతారు. సెంటర్లలో ఇలా జరుగుతూ ఉంటుంది. దైవీ సంప్రదాయం ఎలా తయారవుతుంది. కొత్త ప్రపంచం యొక్క ధర్మం పాత ప్రపంచంలో స్థాపనవుతుంది అనేది కూడా ఒక అద్భుతము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తాయి. తండ్రి ద్వారా మీరు మీ 84 జన్మల గురించి తెలుసుకున్నారు. నేను 84 జన్మల కథను వినిపించేందుకు వస్తాను అని తండ్రి అంటారు, అంటే వారు తప్పకుండా చివర్లోనే వచ్చి వినిపిస్తారు కదా. ద్వాపరం మధ్యలోనైతే వినిపించలేరు ఎందుకంటే చివర్లో రావల్సినవారు అప్పటికి ఇంకా జన్మ తీసుకోరు. రాజయోగ జ్ఞానం ద్వాపరంలో లభించదు. మహాభారత యుద్ధం కూడా ద్వాపరంలో జరగదు. మహాభారత యుద్ధం తర్వాతనే సత్యయుగం స్థాపనవుతుంది అనగా దేవీ-దేవతా ధర్మం స్థాపనవుతుంది. దానికన్నా ముందే బ్రాహ్మణ ధర్మం స్థాపనవుతుంది అంటే తప్పకుండా బ్రహ్మా ద్వారా స్థాపన చేసి ఉండవచ్చు. అప్పుడు బ్రాహ్మణులు జన్మ తీసుకొని ఉంటారు కదా. విరాట రూపాన్ని ఏదైతే చూపించారో, అందులో శివుడిని కూడా చూపించలేదు, బ్రాహ్మణుల పిలకను కూడా చూపించలేదు. ప్రదర్శనీలలో కూడా విరాట రూప చిత్రం తప్పకుండా ఉండాలి. బ్రహ్మా ద్వారా ముందు తప్పకుండా బ్రాహ్మణులనే రచిస్తారు. మరి ఆ బ్రాహ్మణులను ఎప్పుడు రచిస్తారు, ఎక్కడ రచిస్తారు. బ్రాహ్మణులది సంగమయుగం, శూద్రులది కలియుగము. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలని పిలిపించుకుంటారు. ప్రజలు అంటేనే మనుష్య సృష్టి కనుక బ్రాహ్మణులు తప్పకుండా ఉంటారు. క్రీస్తును క్రైస్తవ ధర్మపిత అని అంటారు. ఇతను ప్రజాపిత. భగవంతుడు బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అంతేకానీ క్రీస్తు ద్వారా, బౌద్ధుల ద్వారా రచిస్తారని కాదు. మనుష్య సృష్టి బ్రహ్మాతోనే ప్రారంభమవుతుంది. కనుక తప్పకుండా మొట్టమొదట బ్రాహ్మణులనే రచిస్తారు. బ్రాహ్మణులనే మళ్ళీ దేవతలుగా తయారుచేస్తారు. విరాట రూపాన్ని కూడా భారత్ లోనే చూపిస్తారు, ఇతర ధర్మాలవారు విరాట రూపాన్ని తయారుచేయలేరు. ఈ కొత్త-కొత్త విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. కొత్త పాయింట్లు కూడా వెలువడుతూ ఉంటాయి, పాతవి కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే కొత్త-కొత్త పిల్లలు కూడా అర్థం చేసుకునేందుకు కొన్ని కొత్త పాయింట్లు, కొన్ని పాత పాయింట్లు లభించాలి. అల్ఫ్, బే గురించి బుద్ధిలో ఉండనంత వరకు ఇంకేం అర్థం చేసుకోగలరు. అల్ఫ్ మరియు బే గురించి ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజమని మీకు తెలుసు. అందరికీ తండ్రి ఒక్కరే. వారు తప్పకుండా వస్తారు కూడా. శివజయంతిని భారత్ లోనే జరుపుకుంటారు కానీ భారతవాసులకు శివజయంతి అంటే ఏమిటో తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరుల గురించి కూడా తెలియదు, శ్రీ కృష్ణుని గురించి కూడా తెలియదు. శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేదో కూడా తెలియదు. క్రీస్తు వచ్చి వెళ్ళారు, వారి వద్ద పోప్ ల గురించిన పూర్తి లిస్ట్ ఉంటుంది. కానీ ఈ లక్ష్మీనారాయణులు కూడా భారత్ లో రాజ్యం చేసి వెళ్ళారని భారతవాసులకు తెలియదు. ఏ చిత్రాలనైతే తయారుచేస్తారో, పూజిస్తారో, వారి కర్తవ్యాలను గురించి అసలు తెలియదు. దేవతల నుండి క్షత్రియులు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు, వారేమైనా యుద్ధం చేసారా? రాజ్యం చేతులు మారినప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు విజయం పొంది ఉంటారు. అక్కడ ఈ మాటే లేదు. వారు మంచి రీతిగా రాజ్యాన్ని అందిస్తారు. మనుష్యులు ఎంత అంధకారంలో ఉన్నారు. మీకు ఎంత ప్రకాశం లభిస్తుంది. అలాగని అన్ని విషయాలు అందరికీ గుర్తుంటాయని కాదు. ఒకవేళ గుర్తుంటే, బాబా ఏదైతే అర్థం చేయించారో, అవన్నీ ప్రదర్శనీలలో అర్థం చేయించాలి. ప్రదర్శనీలకు ఒక రోజు వస్తారు, తర్వాత రెండవ రోజు రారు. వారు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది ఏమీ తెలియదు. దేవీ-దేవతా ధర్మం ఎక్కడికి వెళ్ళింది అనేది ఇంతకుముందు మాకు తెలియదు అని అభిప్రాయాన్ని రాయించాలి. హిందు ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమయింది, ఆ శకం చెప్పండి అని అడుగుతారు. ప్రదర్శనీలలో ప్రతి ఒక్కరు ఏమేమి అర్థం చేయిస్తారు అనేది ఎవరికీ తెలియదు అందుకే అభిప్రాయాలను రాయించేవారు కూడా ఉండాలి. ఇది 5 వేల సంవత్సరాల చక్రమని మీరు ఋజువు చేసి చెప్తారు, అది వారికి రాయమని చెప్పండి. శకం మొదలైనవాటి గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనైనా విన్నారా? మరి మేము ఎక్కడి నుండి నేర్చుకున్నాము? మాకు నేర్పించేవారు తప్పకుండా భగవంతుడే అయ్యి ఉంటారు. భగవంతుడు తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వారు కూడా తప్పకుండా ఏదో ఒక తనువులోకి వస్తారు. పరమాత్మ జ్ఞానసాగరుడు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు. ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. వారి పేరు ‘శివ’. భక్తి మార్గంలో వారికి అనేక పేర్లు పెట్టారు. తక్కువలో తక్కువ వారికి లక్షన్నర పేర్లు తమ-తమ భాషలలో పెడతారు.
పిల్లలకు రోజు ఎంతగా అర్థం చేయిస్తారు. కానీ ఇంకా శుద్ధ బుద్ధి కలవారిగా అవ్వలేదు. పురుషార్థం చేస్తూ ఉంటే మాలిన్యం తొలగిపోతుంది. ఇప్పటివరకు పిల్లలు సతో వరకు కూడా అతి కష్టం మీద చేరుకున్నారు. వారిలో కూడా కొందరు తమోగా, సతోప్రధానంగా, సతోగా, రజోగా, తమోగా ఉన్నారు, ఇందులో కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి పురుషార్థం ఎవరిది వారిది నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనుష్యులది వినాశకాలే విపరీత బుద్ధి. కేవలం పాండవులకే ప్రీతి బుద్ధి ఉండేది. వారికే విజయం లభించింది. అసురులు మరియు దేవతలు ఇరువురూ మనుష్యులే. అంతేకానీ, అసురులకు ఏదో భయంకరమైన రూపముంటుందని కాదు. వారు యుద్ధంలో బాంబులు, గ్యాస్ మొదలైన వాటి నుండి రక్షించబడడానికి డ్రెస్సులు ధరిస్తారు. వారు ఆసురీ సంప్రదాయం వారు, మీరు రాముని సంప్రదాయం వారు ఎందుకంటే మీరు 5 వికారాలు వదిలారు. పవిత్రంగా అయి పూర్తి విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు. మీకు ఎవరితోనూ గొడవలు లేవు. బాబా ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. కొందరు ఒక నెల, రెండు నెలలు వస్తారు, తర్వాత అలసిపోతారు. ఇక వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు సాధారణ ప్రజలలోకి వస్తారు, ప్రజలైతే చాలా మంది తయారవుతారు. ఇప్పుడు కూడా, ఎంత మంది ప్రజలున్నారో చూడండి. కొన్ని చోట్ల అన్నం కొరత ఉన్న కారణంగా మనుష్యులు ఆకలితో కూడా మరణిస్తారు, కొన్ని చోట్ల వర్షాలు పడని కారణంగా కరువు కూడా వస్తుంది. ఇందులో గవర్నమెంట్ ఏం చేయగలదు! ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడింకా కుండపోత వర్షాలు కూడా కురుస్తాయి. వినాశనమైతే జరగాల్సిందే. మీరు సాక్షాత్కారాలలో ఏవైతే చూసారో, అవన్నీ ప్రాక్టికల్ గా జరుగుతాయి. సాక్షాత్కారంలో ఒక్క కృష్ణుని మహల్ ను చూస్తారు, అన్నింటినీ చూడలేరు. అచ్ఛా, చూసారనుకోండి, తర్వాత వినాశనం జరిగింది, శరీరాన్ని వదిలేస్తారు అప్పుడు అంతా మర్చిపోతారు కదా. ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. తర్వాత ప్రపంచమే మారిపోతుంది. మీరు అంతా మర్చిపోతారు. ఇప్పుడు మీకు ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి జ్ఞానం ఉంది. మూలవతనం, సూక్ష్మవతనం యొక్క చక్రం ఎలా తిరుగుతుందనే పూర్తి జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. ఎవరిలో ఎంత ఎక్కువగా జ్ఞానముంటుందో, అంత ఎక్కువ నషా ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యాము. తర్వాత వినాశనం జరిగినప్పుడు మన శరీరాలు సమాప్తమైపోతాయి. అంటే ఈ జ్ఞానం ఈ జన్మ ఉన్నంతవరకే ఉంటుంది. కనుక మనం ఈ శరీరాన్ని వదిలి, వెళ్ళి రాకుమార-రాకుమారీలుగా అవుతామని బుద్ధిలో అంతగా నషా ఉండాలి. మనుష్యులైతే చదువుకుని వెళ్ళి, తమ-తమ సంపాదన చేసుకుంటారు. తండ్రి అంటారు – నేనేమీ సంపాదించను, నేను మీకు నేర్పించి నా ఇంటికి తీసుకువెళ్తాను. మీరు సంపాదన చేసుకుంటారు, పోగొట్టుకుంటారు కూడా. మీకు పూర్తి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. బాబా కూడా ఈ జ్ఞానముంది, దానిని పాత్ర అనుసారంగా కూర్చొని అర్థం చేయిస్తారు. తర్వాత బాబా కూడా నిర్వాణధామంలోకి వెళ్ళిపోతారు. ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ ఎవరెవరి పాత్ర ఉంటుందో, వారు మళ్ళీ రాజధానిలోకి వస్తూ ఉంటారు. మిగిలిన సమయమంతా శాంతిధామంలో ఉంటారు. ఉన్నత పదవి పొందేందుకు పిల్లలకు ఎంత జ్ఞానం లభిస్తుంది. ఇది కొత్తవారెవరి బుద్ధిలోనూ కూర్చోదు. జ్ఞానం చాలా బాగుందని మాత్రమే అంటారు. మళ్ళీ వారి కార్య-వ్యవహారాలలోకి వెళ్ళిపోతారు. బయటకు వెళ్తూనే మాయ మరపింపజేస్తుంది, తాళం వేస్తుంది. చాలా మంది పిల్లలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా ధారణ జరగదు. ఎవరైనా లోపలకు వచ్చినప్పుడు ఈ విషయాలను ముందుగా చెప్పండి- వీరంతా బ్రహ్మాకుమార-కుమారీలు, శివబాబా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు, ఇప్పుడిది కలియుగ అంతిమము, తర్వాత సత్యయుగం వస్తుంది. బ్రహ్మా యొక్క పిల్లలందరూ బ్రహ్మాకుమారులు, వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇలా సేవ సమాచారం బాబాకు లభిస్తూ ఉంటే, బాబా సలహానిస్తారు. కానీ బాబాకు పూర్తిగా వినిపించరు. చాలామంది పై గ్రహచారం కూర్చొంటుంది. ఇప్పుడిప్పుడు చూస్తే ఫస్ట్ క్లాస్ గా ఉంటారు, రేపు చూస్తే థర్డ్ క్లాస్ గా అయిపోతారు. గ్రహచారం లేకపోతే, ఆశ్చర్యం కలిగించేలా ఎందుకు పారిపోతారు? ఏ పిల్లలైతే ప్రదర్శనీలకు వెళ్ళి బాగా సేవ చేస్తారో, వారు తమ సమయాన్ని కూడా సఫలం చేసుకుంటారు. బాప్ దాదాను ఎప్పుడూ వదలకూడదు. బాబా పిల్లలను ఏమైనా అన్నా కానీ, మళ్ళీ వెంటనే ప్రేమిస్తారు కూడా. బాబా పిల్లలకు సంబంధించినదేదీ మనసులో పెట్టుకోరు. ఇది కేవలం శిక్షణ ఇచ్చేందుకు నేర్పిస్తారు.
ఇక్కడ పిల్లలకు టోలీ తినిపించడం జరుగుతుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. లౌకిక తండ్రి బజారు నుండి వచ్చేటప్పుడు పిల్లలు తప్పకుండా గుర్తుకొస్తారు. ఏదో ఒక టోలీ (తిను బండారాలు) తీసుకువస్తారు. బయట సెంటర్లలో టోలీ లభించదు. ఇక్కడ తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ద్వాపరంలో ఏ ఋషులు-మునులు అయితే సతోప్రధానంగా ఉండేవారో, ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి లేదో, వారు కూడా రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదని చెప్పేవారు. నేడు కలియుగంలో అందరి బుద్ధికి తాళం వేయబడి ఉంది, అటువంటప్పుడు వారు ఎలా తెలుసుకోగలరు. శాస్త్రాలైతే ఆ ఋషులు-మునులు కూడా చదివేవారు. అర్థం చేయించేందుకు మీకు చాలా పాయింట్లు లభిస్తాయి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. భగవంతుడు మనల్ని చదివించి భగవతి-భగవాన్ గా తయారుచేస్తారు అనే సంతోషం మరియు నషాలో ఉండాలి. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని ఇతరులకు వినిపించాలి.
2. ఎలాగైతే తండ్రి పిల్లలకు సంబంధించిన ఏ విషయాలను మనసులో పెట్టుకోరో, అలా ఎవ్వరి విషయాలను మనసులో పెట్టుకోకూడదు.
వరదానము:-
ఏ కర్మనైనా కర్మయోగీ స్థితిలోకి పరివర్తన చేయండి, కేవలం కర్మ చేసేవారిగా కాదు, మీరు కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారం మరియు యోగం అంటే పరమార్థం, రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థమై ఉండాలి. దీని కోసం సేవలలో – నేను నిమిత్తము అనే మంత్రాన్ని మరియు చేయించేవారి స్మృతి యొక్క సంకల్పం సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకుండా ఉంటే సేవలో నిర్మాణమే నిర్మాణాన్ని చేస్తూ ఉంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!