10 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
9 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - భారత్ అందరికీ తీర్థ స్థానము, అందుకే అన్ని ధర్మాల వారికి తీర్థ స్థానమైన భారత్ యొక్క మహిమను వినిపించండి, అందరికీ సందేశమునివ్వండి”
ప్రశ్న: -
ఏ పురుషార్థముతో మీ అంతమతి సో గతి జరుగుతుంది? నిద్రాజీతులుగా అవుతారు?
జవాబు:-
రాత్రివేళ నిద్రించే ముందు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఎప్పుడు నిద్ర వస్తే, అప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). ఉదయం లేచినప్పుడు అవే పాయింట్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా అభ్యాసము చేస్తూ మీరు నిద్రను జయించినవారిగా అవుతారు. ఎవరైతే చేస్తారో, వారే పొందుతారు. చేసేవారి నడవడిక ప్రసిద్ధమవుతూ ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఎవరైతే ప్రియునితో ఉంటారో..
ఓంశాంతి. ఎవరైతే ప్రియునితో పాటు ఉంటారో… ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలా మంది ఉన్నారు కానీ వారందరి తండ్రి, రచయిత అయిన వారొక్కరే. వారే జ్ఞానసాగరుడు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. సద్గతి కూడా మనుష్యులకు, సత్యయుగ స్థాపన జరగనున్నప్పుడే కలుగుతుంది. బాబానే సద్గతిదాత అని అంటారు. సంగమ సమయము వచ్చినప్పుడల్లా జ్ఞాన సాగరుడు వచ్చి సద్గతిలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు. దుర్గతి కూడా అందరికీ ఒకేలా ఉండదు. అన్నింటికంటే ప్రాచీనమైనది భారత్. భారతవాసుల విషయంలోనే 84 జన్మలని అంటూ ఉంటారు. ఎవరైతే మొట్టమొదటి మనుష్యులై ఉంటారో, తప్పకుండా వారే 84 జన్మలకు అర్హులుగా ఉంటారు. దేవతలకు 84 జన్మలు ఉంటాయి అంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలు ఉంటాయి. ముఖ్యమైనవారి గురించే చెప్తూ ఉంటారు. తండ్రి బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచించేందుకు మొట్టమొదట సూక్ష్మలోకాన్ని రచిస్తారు. తర్వాత కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. త్రిలోకనాథుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే, వారి పిల్లలు కూడా తమను తాము త్రిలోకనాథులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా మంది మనుష్యులు త్రిలోకనాథ్ అనే పేరు కూడా పెట్టుకుంటారు, అంతేకాక గౌరీశంకర్, రాధేశ్యామ్ అని డబల్ దేవతల పేర్లను కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు రాధా-కృష్ణులు వేర్వేరు రాజ్యాలకు చెందినవారు. ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో, వారి బుద్ధిలో చాలా మంచి పాయింట్ల ధారణ జరుగుతుంది. ఎవరైతే తెలివైన డాక్టరుగా ఉంటారో, వారి బుద్ధిలో చాలా మందులు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతి రోజూ కొత్త-కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఎవరికైతే మంచి ప్రాక్టీసు ఉంటుందో, వారు కొత్త-కొత్త పాయింట్లను ధారణ చేస్తూ ఉంటారు. ఎవరైతే ధారణ చేయరో, వారిని మహారథులని అనరు. అంతా బుద్ధిపై ఆధారపడి ఉంటుంది మరియు భాగ్యముపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కూడా డ్రామా. డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నానని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోలేదంటే, ఏమీ తెలుసుకోనట్లే. మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరులకు తండ్రి పరిచయాన్నివ్వడం పిల్లల కర్తవ్యము. ప్రపంచమంతటికీ తెలియజేయాలి. మాకు తెలియదని ఎవ్వరూ అనకూడదు. విదేశాల నుండి కూడా చాలా మంది వస్తారు. వారందరికీ బొంబాయిలో ఏర్పాట్లు చేస్తారు. వారైతే సమర్థమైనవారు కూడా. వారి వద్ద చాలా ధనము ఉంది. శివుడిని తమ పెద్ద గురువుగా భావిస్తారు కదా కనుక ఈ ధర్మపితలకు కూడా కొంత పాత్ర ఉందని అర్థం చేయించబడింది. ఈ క్రీస్తు, ఇబ్రహీమ్ మొదలైనవారంతా కలుసుకోవడానికి వస్తారని పిల్లలకు ప్రారంభంలో సాక్షాత్కారం అయ్యింది. కనుక వారికి ఫీల్డును తయారుచేయాలి. టూరిస్టులు మొదలైనవారంతా బొంబాయికి వస్తూ ఉంటారు. భారత్ అందరినీ చాలా ఆకర్షిస్తుంది. నిజానికి భారత్ తండ్రి జన్మ స్థలము. కానీ అందరిలో భగవంతుడు ఉన్నారని చెప్పడం వలన అనంతమైన తండ్రి మహత్వాన్ని మాయం చేసేసారు. భారత్ అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానమని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. మిగిలిన సందేశకులందరూ తమ-తమ ధర్మాలను స్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి ధర్మానికి చెందినవారు కూడా వస్తారు. ఇప్పుడిది అంతిమము. తిరిగి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. వారిని అడగండి – మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఎవరు? క్రీస్తు క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసారు, మరి వారు మిమ్మల్ని ఇక్కడకు లాక్కొని వచ్చారా? ఇప్పుడు అందరూ విసిగిపోయి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అందరూ పాత్రను అభినయించేందుకే వస్తారు. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ చివరికి దుఃఖములోకి రావాల్సిందే. అప్పుడు దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకువెళ్ళడం తండ్రి పని మాత్రమే. తండ్రి జన్మ స్థలము భారత్. ఇంతటి మహత్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఎవరికైతే తెలుసో, వారికి నషా ఎక్కి ఉంది. కల్ప-కల్పము భారత్ లో బాబా వస్తారు. ఇది అందరికీ తెలియజేయాలి, ఆహ్వానం అందించాలి. రచనను గురించిన జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. ఈ విధంగా సేవాధారులుగా అయి మీ పేరును ప్రసిద్ధము చేసుకోవాలి. ఈ మేళా అన్ని వైపులకు వెళ్తుంది. కనుక ఎవరైతే చురుకైన పిల్లలున్నారో, వారి సహాయాన్ని కోరుతూ ఉంటారు. వారి పేరును జపిస్తూ ఉంటారు. ఒకటి శివబాబాను జపిస్తారు, రెండు బ్రహ్మాబాబాను, మూడు కుమారకా, గంగే, మనోహర్, వీరిని జపిస్తారు. భక్తి మార్గంలో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు నోటి ద్వారా పేర్లను జపిస్తారు – ఫలానావారు చాలా సర్వీసబుల్, వారు నిరహంకారి, మధురమైనవారు, వారికి దేహాభిమానము లేదు అని. స్నేహము ఇస్తే స్నేహము లభిస్తుందని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు – మీరు దుఃఖితులుగా అయ్యారు. మీరు నన్ను స్మృతి చేస్తే నేను కూడా సహాయం చేస్తాను. మీరు ద్వేషిస్తే, మిమ్మల్ని మీరే ద్వేషించుకున్నట్లు, పదవి లభించదు. ఎంత అపారమైన ధనము లభిస్తుంది. ఎవరికైనా లాటరీ లభిస్తే, ఎంత సంతోషం కలుగుతుంది. అందులో కూడా ఎన్ని బహుమతులు లభిస్తాయి. రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి కూడా ఉంటాయి. ఇది కూడా ఈశ్వరీయ రేస్. ఇది జ్ఞాన-యోగాల రేస్. ఇందులో ఎవరైతే వేగంగా వెళ్తారో, వారే కంఠహారంగా అవుతారు మరియు సింహాసనముపై సమీపంగా కూర్చొంటారు.
మీరందరూ కర్మయోగులు. మీ ఇంటిని కూడా సంభాళించండి. క్లాసులో ఒక గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకోవాలి. స్కూల్లో కూడా అలా చేస్తూ ఉంటారు కదా. చదువుకుని, తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తారు. తండ్రి అంటారు – ఒక గంట, అర్ధ గంట… రోజులో 8 గంటలుంటాయి కదా. వాటిలో కూడా తండ్రి అంటారు – ఒక గంట, అర్ధ గంట, 15-20 నిముషాలైనా క్లాసులో చదువుకుని, ధారణ చేసి, అప్పుడు కార్య-వ్యవహారాలలోకి వెళ్ళండి అని. ఇదివరకు బాబా మిమ్మల్ని – తండ్రి స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని కూర్చోబెట్టేవారు. స్మృతి యొక్క జ్ఞానమైతే ఉండేది కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ చూడండి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోండి. అప్పుడు అంతమతి సో గతి జరుగుతుంది. తర్వాత ఉదయం లేచినప్పుడు, అవే పాయింట్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా అభ్యాసము చేస్తూ-చేస్తూ మీరు నిద్రను జయించినవారిగా అవుతారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. చేసేవారిది కనిపిస్తుంది. వారి నడవడిక ప్రసిద్ధమవుతుంది. ఫలానావారు విచార సాగర మథనము చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు, లోభము మొదలైనది ఏమీ లేదు అని చూడడం జరుగుతుంది. ఈ శరీరము పాతది. దీని గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచించకూడదు., జ్ఞాన-యోగాల ధారణ పూర్తిగా ఉన్నప్పుడు శరీరము కూడా బాగుంటుంది. ధారణ లేకపోతే శరీరము ఇంకా పాడవుతూ ఉంటుంది. పాడవుతూ-పాడవుతూ పూర్తిగా శ్మశానపాలవుతుంది. కొత్త శరీరము భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను పవిత్రంగా తయారుచేసుకోవాలి. ఇది పాత, మురికి పట్టిన శరీరము. దీనికి ఎంత పౌడర్ రాసినా కానీ, ఇది పైసకు కూడా కొరగానిది. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివబాబాతో జరుగుతుంది. వివాహము జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరానికి స్థూలమైన అలంకరణ ఎక్కువగా చేయకూడదు. జ్ఞాన-యోగాలతో స్వయాన్ని అలంకరించుకుంటే ఫరిశ్తాలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. ఇందులో జ్ఞానం యొక్క మునకలు వేస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గంలోని దేవ కన్యలుగా అవుతారు. ప్రజలను దేవ కన్యలని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయారని, మహారాణులుగా, పట్టపురాణులుగా చేసారని అంటూ ఉంటారు. అంతేకానీ, ఎత్తుకుపోయి ప్రజలలో చండాలురుగా చేసారని చెప్పరు కదా. పట్టపురాణులుగా చేయటం కోసమే ఎత్తుకుపోయారు. మీరు కూడా అలాంటి పురుషార్థము చేయాలి. ఏది లభిస్తే, అది చాలని అనుకోకూడదు. ఇది పాఠశాల. ఇక్కడ ముఖ్యమైనది చదువు. గీతా పాఠశాలలు చాలా తయారుచేస్తారు. అక్కడ కూర్చుని గీతను వినిపిస్తారు, కంఠస్థము చేయిస్తారు. ఏదైనా ఒక శ్లోకం తీసుకుని, దానిపై విస్తారంగా అర్థం చేయిస్తారు. కొందరు మామూలుగా చదువుతారు, మరి కొందరు ఒక శ్లోకముపై అర్ధ గంట, ముప్పావు గంట ఉపన్యసిస్తారు. దాని వలన లాభమేమీ ఉండదు. ఇక్కడైతే తండ్రి కూర్చుని చదివిస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది. ఇతర వేద-శాస్త్రాలు మొదలైనవి చదవడంలో లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు. పురుషార్థము చేస్తూ ఉండండి కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడైతే చాలా భక్తి చేస్తారో, అప్పుడు భగవంతుడు లభిస్తారు. రాత్రి తర్వాత పగలు తప్పకుండా ఉంటుంది. కల్పము ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు అర్థం చేయించేందుకు కూడా శక్తి కావాలి. యోగబలము ద్వారా పని చేయాలి. ఒకవేళ చేయలేకపోతే, శక్తి లేనట్లు, యోగము లేనట్లు. ఎవరైతే యోగయుక్తులైన పిల్లలుంటారో, బాబా కూడా వారికే సహాయము చేస్తారు. డ్రామాలో ఏది ఉంటే, అది రిపీట్ అవుతుంది. క్షణ-క్షణం ఏదైతే గడుస్తుందో, అది టిక్-టిక్ అంటూ గడుస్తుంది. మనము శ్రీమతము అనుసారంగా కర్మలోకి వస్తాము. శ్రీమతాన్ని అనుసరించకపోతే శ్రేష్ఠంగా అవ్వలేరు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. మనమంతా ఒక్కటవ్వాలని మనుష్యులు భావిస్తారు కానీ దాని అర్థము తెలియదు. ఒక్కటవ్వాలి అంటే ఏమిటి? అందరూ ఒక్క తండ్రి వలె అవ్వాలనా లేక సోదరులుగా అవ్వాలనా? ఒకవేళ సోదరులుగా అవ్వాలి అని అన్నా, అది సరియైనదే. శ్రీమతము ద్వారా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరంతా ఒకే మతమును అనుసరిస్తారు. మీ తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. ఎవరైతే శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించరో, వారు శ్రేష్ఠంగా అవ్వలేరు. ఒకవేళ అస్సలు నడుచుకోకపోతే, వారు సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా, తెలివైనవారిగా ఉంటారో, వారినే రేసులో ఉంచుతారు. పెద్ద-పెద్ద రేసులలో మంచి గుర్రాలనే ఉంచుతారు. ఎందుకంటే లాటరీ కూడా పెద్ద మొత్తంలో పెడతారు. ఇది కూడా మానవ అశ్వాల రేస్. హుస్సేన్ గుర్రాన్ని కూడా చూపిస్తారు. హింస రెండు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది కామ ఖడ్గము. దాని వలన అర్ధ కల్పముగా మిమ్మల్ని మీరు కూడా హతమార్చుకుంటూ వచ్చారు, ఇతరులను కూడా హతమారుస్తూ వచ్చారు. ఈ హింస గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. వారు కేవలం, ఇది వికారము అని అంటారు. తండ్రి చెప్తున్నారు – పిల్లలూ, ఈ కామము మహాశత్రువు. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. ఇది కూడా ఋజువు చేసి చెప్పాలి – మాది ప్రవృత్తి మార్గము, రాజయోగము, మీది హఠయోగము, మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు, మేము శివాచార్యుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటాము అని. మున్ముందు మీ ప్రత్యక్షత తప్పకుండా జరుగుతుంది. కొందరు ప్రశ్న అడుగుతారు – దేవతలవి 5000 సంవత్సరాలలో 84 జన్మలైతే, క్రైస్తవులవి ఎన్ని జన్మలు అని. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలయ్యింది. వారికి సగటున ఎన్ని జన్మలు ఉండవచ్చో ఇప్పుడు లెక్క వేయండి. 30-32 జన్మలని తేలుతుంది. ఇదైతే స్పష్టంగా ఉంది. ఎవరైతే ఎక్కువ సుఖాన్ని చూస్తారో, వారు ఎక్కువ దుఃఖాన్ని కూడా చూస్తారు. ఇతర ధర్మాల వారికి తక్కువ సుఖము, తక్కువ దుఃఖము లభిస్తుంది. సరాసరి లెక్కను తీయాలి. ముఖ్యమైన గురువులు ఎవరైతే ఉన్నారో, వారి జన్మల లెక్క తీస్తాము. ఎవరైతే చివర్లో వస్తారో, వారు కొన్ని జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీమ్ యొక్క లెక్కను కూడా తీయవచ్చు. మహా అయితే 1-2 జన్మల తేడా ఉండవచ్చు. ఖచ్చితంగా అయితే చెప్పలేరు. సుమారుగా చెప్పగలరు. ఇవన్నీ విచార సాగర మథనము చేయాల్సిన విషయాలు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అయినా చెప్పండి, ముందు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే వారి నుండి వారసత్వము తీసుకోవాలి. ఇంతకుముందు ఎన్ని జన్మలు తీసుకున్నారో, అన్నే తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. బాగా అర్థం చేయించండి. ఇది శ్రమతో కూడిన పని.
పిల్లలు బొంబాయిలో చాలా శ్రమ చేస్తున్నారు. ఎందుకంటే వారు చాలా విజయవంతులుగా అవ్వాల్సి ఉంది. ఇందులో బుద్ధి కావాలి. బాబా ధనము పట్ల చాలా ప్రేమ ఉండాలి. కొందరు ధనం తీసుకోరు. అరే! జ్ఞాన రత్నాలను తీసుకోండి మరియు ధారణ చేయండి అని చెప్పినప్పుడు మేమేమి చేయాలి, మేము అర్థము చేసుకోలేము అని వారంటారు. అర్థము చేసుకోలేకపోతే మీ భాగ్యం అంతే. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శరీరాన్ని మంచి రీతిలో ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జ్ఞాన-యోగాలను ధారణ చేయాలి. ఏ వస్తువు పట్ల లోభము పెట్టుకోకూడదు. ఈ జ్ఞాన-యోగాలతో అలంకరించుకోవాలి. స్థూలమైన అలంకరణతో కాదు.
2. ఒక గంట, అర్ధ గంట చదువును తప్పకుండా చదువుకోవాలి. జ్ఞాన-యోగాలలో రేస్ చేయాలి.
వరదానము:-
విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండైనా వెలువడే శబ్దము ద్వారా వారి హృదయములోని రహస్యాలను తెలుసుకుంటే విజయులుగా అవ్వగలరు. కానీ హృదయంలోని రహస్యాలను తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో, అంతగా ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాలను తెలుసుకొని, వారిని రాజీ చేయగలరు. రాజీ చేయగలిగేవారే విజయులుగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!