05 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

05 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

4 November 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - విచార సాగర మథనం చేసి సేవకు సంబంధించిన రకరకాల యుక్తులు తీయండి, దీని ద్వారా అందరికీ తండ్రి పరిచయం లభించాలి”

ప్రశ్న: -

పిల్లలు ప్రతి ఒక్కరు తమ ఉన్నత భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు తండ్రి ఏ యుక్తిని తెలియజేస్తారు?

జవాబు:-

తమ ఉన్నత భాగ్యం తయారుచేసుకోవాలంటే – లోపల ఉన్న అన్ని ఛీ-ఛీ, చెడు అలవాట్లను తొలగించండి. అబద్ధం చెప్పడం, కోపగించుకోవడం అనేవి చాలా చెడ్డ అలవాట్లు. సేవ పట్ల అభిరుచి పెట్టుకోండి. తండ్రి ఎలాగైతే నిరహంకారిగా అయ్యి సేవ చేస్తారో, అలా ఎంత వీలైతే అంత ఇతరుల కళ్యాణార్థం ఆత్మిక సేవలో బిజీగా ఉండండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీ దారిలోనే మరణించాలి… (మర్నా తేరీ గలీ మే….)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు మొట్టమొదట – తండ్రి ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి! ఎప్పుడైతే మేము అనంతమైన తండ్రి సంతానము అనే నిశ్చయం ఏర్పడుతుందో, అప్పుడు పిల్లలకు అతీంద్రియ సుఖం అనుభవమవుతుంది. కేవలం ఈ ఒక్క మాటతోనే సంతోషపు పాదరసం ఎక్కుతుంది. ఇది స్థిరమైన సంతోషాన్ని కలిగించే పాయింటు. తమను తాము బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలుచుకుంటారని మీకు తెలుసు. ఇది కొత్త రచన. కనుక, వీరు మన తండ్రి అని అందరికీ నిశ్చయం ఏర్పరచాలి. తండ్రి కింద విష్ణువు ఉన్నారు (త్రిమూర్తి చిత్రంలో). తండ్రి నుండి విష్ణుపురి యొక్క వారసత్వం లభిస్తుంది, కనుక ఎంత సంతోషముండాలి. ఇది నిశ్చయం చేయించిన తర్వాత వారితో రాయించాలి. విష్ణువు అనే పదానికి వైష్ణవ అన్న అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ దేవీ-దేవతలు నిర్వికారులుగా ఉండేవారని భారతవాసులకు బాగా తెలుసు. స్వర్గంలో వీరి యొక్క పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులమని కూడా పాడుతారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. వికారులను పతితులు, భ్రష్టాచారులని అంటారు. క్రోధులను పతితులు, భ్రష్టాచారులని అనరు. క్రోధం అనేది సన్యాసులలో కూడా ఉంటుంది. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఉన్నతోన్నతమైన తండ్రి భారత్ లోకి వచ్చినప్పుడు ఈ మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే పరమాత్మ వచ్చి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. శరీరాలు వినాశనమవుతాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారనే నిశ్చయముండాలి, అటువంటప్పుడు ఎంత రెగ్యులర్గా ఉండాలి. ఇక్కడ ఇది హాస్టల్ కాదు. హాస్టల్ తయారుచేయాలంటే చాలా ఇళ్ళు కావాలి. 7 రోజుల కోసం, 4 రోజుల కోసం వచ్చినా కానీ, చాలా ఇళ్ళు కావాలి. తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే పతితపావనుడు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి, మీ పాపాలన్నీ భస్మమవుతాయనే గ్యారెంటీ నేను ఇస్తాను. మొదట – మేము శివబాబా సంతానమని, తర్వాత విశ్వ రాజ్యాధికారానికి హక్కుదారులుగా అవుతామని రాయించాలి. రాజా-రాణి, ప్రజలు అందరూ విశ్వానికి యజమానులే. మేళాలు, ప్రదర్శినీలలో అర్థం చేయించేవారికి బాబా డైరెక్షన్లు ఇస్తారు – ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే, వారే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. వారు జ్ఞాన సాగరుడు కనుక తప్పకుండా వారే డైరెక్షన్లు ఇస్తారు. కృష్ణుడు ఇవ్వలేరు. శివబాబా తప్ప ఇంకెవరూ భగవంతుడు కారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా దేవతలే. స్వర్గంలో దైవీ గుణాలు కల మనుష్యులుంటారు, కలియుగంలో ఆసురీ గుణాల కల మనుష్యులుంటారు. ఇది కూడా చివర్లో అర్థం చేయించాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి సంతకం చేయించాలి. విచార సాగర మథనం చేసి రకరకాల యుక్తులను తీయాలి. వారు మమ్మల్ని ఈ విధమైన ప్రశ్నలు అడిగారు, మేము ఈ విధంగా సమాధానమిచ్చామని బాబాకు చెప్పాలి. తర్వాత బాబా కూడా అలాంటి పాయింట్లను వినిపిస్తారు, వాటి ద్వారా వారు ప్రభావితమవుతారు. బాబాను సర్వవ్యాపి లేదా తాబేలు, చేప అవతారాలని అనడం కూడా వారిని నింద చేసినట్లే. అందుకే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబాయే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ నారాయణులు విశ్వానికి యజమానులుగా, సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానంగా అయిపోయారు. అందుకే తండ్రి అంటారు – నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు అని. ఏ ధర్మం వారైనా కావచ్చు, తండ్రి సందేశం అందరి కోసం ఉంటుంది. వారిని గాడ్ ఫాదర్, ముక్తిదాత అని అంటారు. ముక్తిని ఇచ్చేందుకు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు. కలియుగాంతంలో ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. సతోప్రధానంగా అయినప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళగలరు. ఇకపోతే, అక్కడకు రాలేని వారు శాంతిధామంలో ఉంటారు. ఈ విషయాన్ని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి, దీని ద్వారా తండ్రిని స్మృతి చేయాలని వారికి అర్థమవుతుంది. దేహధారులెవ్వరినీ స్మృతి చేయకూడదు. తండ్రి విదేహీ, విచిత్రుడు, మిగిలినవారి చిత్రాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరికైనా అర్థం చేయించాలనే ఆసక్తి ఉండాలి. ప్రదర్శినీలకు చాలామంది వస్తారు. సెంటర్లకు అంతమంది రారు. సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే పిల్లలకు చాలా ఉల్లాసముంటుంది. ఇక్కడ తండ్రిని పదే-పదే మర్చిపోతారు. సేవలో ఉంటే స్మృతి యాత్రను మర్చిపోరు. స్వయం స్మృతి చేస్తారు, ఇతరులు కూడా స్మృతి చేసేలా చేస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. మేము తప్పకుండా రాజ్యం తీసుకుంటామని మీ బుద్ధిలో ఉండాలి. ఇది గుర్తున్నా సరే సంతోషముంటుంది. దీనిని మర్చిపోయారంటే భయమనిపిస్తుంది.

బాబాకు రాయాలి – బాబా, మేము అతీంద్రియ సుఖంలో ఉన్నాము. ఇంకాస్త సమయంలో మేము మా సుఖధామానికి వెళ్తాము. 63 జన్మలుగా మేము చాలా వ్యాధిగ్రస్తులుగా ఉన్నాము. ఎలాంటి చికిత్స లభించక వ్యాధి తీవ్రతరమైంది. చూసుకోవడానికి ఎవరూ లేని కారణంగా, లోపల వ్యాధి తిష్ఠ వేసింది. ఈ వ్యాధి ఎలాంటిదంటే, దీనిని అవినాశీ సర్జన్ తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. ఇప్పుడు అందరూ వదిలి వెళ్ళే సమయము. పవిత్రంగా అయి ముక్తిధామంలోకి వెళ్తారు. ముక్తిలో ఉండడం మంచిది, పాత్రనే ఉండదని కొందరు అంటారు. ఎవరైనా నాటకంలో చిన్న పాత్రను అభినయించినంత మాత్రాన వారిని హీరో, హీరోయిన్ లేక ఉన్నత పాత్రధారులు అని అనరు. తండ్రి అర్థం చేయిస్తారు – ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పక్కా అయిపోతారు. స్మృతిని మర్చిపోకూడదు. తండ్రి ఒక్కరే ముఖ్యమైనవారు. మిగిలిన ఈ చిన్న-చిన్న చిత్రాలు అర్థం చేయించేందుకు ఉన్నాయి. వీటి ద్వారా – శివుడు, శంకరుడు ఒక్కరు కాదని ఋజువు చేయాలి. సూక్ష్మవతనంలో ఏమీ జరగదు. ఇదంతా భక్తిమార్గమని, జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రియేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వారు సంగమంలో జ్ఞానమిస్తారు అనేది పక్కా చేసుకోండి. భారతవాసులకు కల్ప-కల్పము స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఇది 5 వేల సంవత్సరాల విషయము. వారు లక్షల సంవత్సరాలని అంటారు. వారు – కేవలం కలియుగం మాత్రమే లక్షల సంవత్సరాలని అంటారు. మనము – ఈ చక్రమంతా 5 వేల సంవత్సరాలని అంటాము. ఎంత పెద్ద వ్యర్థ ప్రలాపాలు పలికారు. ఓ పతితపావనా అని పిలుస్తారు. కృష్ణుడిని పతితపావనుడు అని అనరు. ఏ ధర్మం వారు కూడా కృష్ణుడిని ముక్తిదాత అని అనరు. ఓ పతితపావనా అని అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. అయినా కూడా అర్థం చేసుకోరు. మాయ అంధకారం ఎంతగా ఉంది, పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని అంటారు. కానీ, సత్య-త్రేతా యుగాలలో ఇవి ఉండవు. ఈ చదువు ఎలాంటిదంటే, అనారోగ్యమున్నా కానీ క్లాసులో చదువుకోవచ్చు. ఇక్కడ సాకులు పని చేయవు. గోవులు చాలా బాగుంటాయి, కానీ కొన్ని కాళ్ళతో తన్నేవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరిలోనైతే క్రోధముంటుందో, వారు అహంకారానికి వశమై తన్నుతారు కూడా. డిస్ సర్వీసు చేస్తారు. ఏ అవగుణాలు ఉండకూడదు. కానీ కర్మబంధనాలు ఎలాంటివంటే, అవి ఉన్నత పదవిని పొందనివ్వవు. తండ్రి ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. కానీ ఎవరైనా తయారు చేసుకోలేకపోతే, తండ్రి ఏం చేస్తారు. ఇది చాలా గొప్ప సంపాదన. సంపాదన గురించి నషా ఉండాలి. సంపాదన చేసుకోకపోతే, పరిణామం ఏమవుతుంది! కల్ప-కల్పము ఇలాంటి పరిస్థితే ఉంటుంది. తండ్రి అందరినీ సావధాన పరుస్తారు, అవమానించరు. పిల్లలలో ఎలాంటి ఛీ-ఛీ అలవాట్లు ఉండకూడదు. అబద్ధం చెప్పడం చాలా చెడ్డది. యజ్ఞ సేవను సంతోషంగా చేయాలి. మీరు బాబా వద్దకు వచ్చినప్పుడు, సేవ చేయండి అని బాబా మీకు సూచన ఇస్తారు. ఎవరైతే మీకు తినిపిస్తారో, వారి సేవ తప్పకుండా చేయాలి. సేవ చేయడం తండ్రి నేర్పిస్తారు. ఉన్నతోన్నతుడైన తండ్రి కూడా ఎంత సేవ చేస్తున్నారో చూడండి. అజ్ఞానంలో కూడా చేయని పనిని, చేయాల్సి ఉంటుంది. అంత నిరహంకారులుగా అవ్వాలి. నియమ విరుద్ధమైన పనులేవీ చేయకూడదు. ఇతరుల కళ్యాణార్థం, ఎంత వీలైతే అంత అన్నీ మీ చేతులతోనే చేయాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో ఇతరులతో చేయించడం అనేది వేరే విషయము. మిమ్మల్ని మీరు నిరహంకారులుగా, నిర్మోహులుగా తయారుచేసుకోవాలి. తండ్రి స్మృతి లేకుండా ఎవరి కళ్యాణము జరగదు. ఎంత స్మృతి చేస్తే, అంత పావనంగా అవుతారు. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. జ్ఞానంలో అంతగా విఘ్నాలు కలగవు. జ్ఞానానికి సంబంధించిన పాయింట్లు చాలా ఉన్నాయి. తండ్రిని స్మృతి చేస్తే, సుగంధభరిత పుష్పాలుగా తయారవుతారు. తక్కువగా స్మృతి చేస్తే, కేవలం రత్నజ్యోతి పుష్పాలుగా అవుతారు. జిల్లేడు పూల వలె కూడా కొందరు ఉంటారు. కనుక స్వయాన్ని సుగంధభరిత పుష్పాలుగా తయారుచేసుకోవాలి. ఏ దుర్గంధము ఉండకూడదు. ఆత్మలు సుగంధభరితంగా తయారవ్వాలి. ఇంత చిన్న ఆత్మలో పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. ఇది అద్భుతము. సృష్టి ఒక్కటే ఉంది. పైన కానీ, కింద కానీ వేరే సృష్టి లేదు. త్రిమూర్తి యొక్క అర్థం కూడా మీకు తెలుసు. వారు కేవలం త్రిమూర్తి మార్గమని పేరు పెట్టారు. కొందరు బ్రహ్మాను త్రిమూర్తి అని అంటారు. వారి జీవితచరిత్ర గురించి ఏమీ తెలియదు. శాస్త్రాలలో శ్రేష్ఠాచార మనుష్యుల జీవిత కథలు ఉన్నాయి. లక్ష్మీనారాయణులు, రాధా-కృష్ణులు మొదలైన వారందరూ మనుష్యులే. కానీ ఇతరుల జీవిత కథలను శాస్త్రాలు అని అనరు. దేవతల జీవిత కథలను శాస్త్రాలని అంటారు. శివబాబా జీవిత చరిత్ర ఎక్కడుంది? వారు నిరాకారుడు. వారు స్వయంగా అంటారు – నేను పతిత పావనుడను, నన్ను అందరూ ‘తండ్రి’ అని పిలుస్తారు, నేను వచ్చి స్వర్గాన్ని స్థాపిస్తాను. భారత్ 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. ఇది ఎంత సహజము. కానీ ఎంత రాతి బుద్ధిగా ఉన్నారంటే, తాళం అసలు తెరుచుకోవడమే లేదు. జ్ఞాన-యోగాల తాళం వేసి ఉంది.

తండ్రి అంటారు – ‘ఉన్నతోన్నతమైనవారు తండ్రి’ అని ఇంటింటికీ సందేశమివ్వండి. మొదటి అంతస్తు – మూలవతనం, రెండవ అంతస్తు – సూక్ష్మవతనం, మూడవ అంతస్తు – ఈ సాకార ప్రపంచము. ఒకవేళ పిల్లలకు ఈ అంతస్తులు గుర్తున్నా సరే, ముందుగా బాబా తప్పకుండా గుర్తుంటారు. సేవ కోసం పరుగెత్తాలి. బాబా ఎక్కడికైనా వెళ్ళేందుకు వద్దు అని అనరు. వివాహాలకు వెళ్ళండి, తీర్థ స్థానాలకు వెళ్ళండి కానీ సేవ చేసేందుకు వెళ్ళండి. ఒకటి – ఆత్మిక యాత్ర, రెండవది – భౌతిక యాత్ర అని భాషణ చేయండి. అనేక పాయింట్లు లభిస్తూ ఉంటాయి. వానప్రస్థుల సమూహంలోకి వెళ్ళి సేవ చేయండి. వారేమంటారో కూడా వినండి. చేతిలో కరపత్రాలు ఉండాలి. అందులో ముఖ్యమైన 4-5 విషయాలు రాసి ఉండాలి – ఈశ్వరుడు సర్వావ్యాపి కాదు, గీతా భగవానుడు కృష్ణుడు కాదు అని స్పష్టంగా రాయండి. ఎవరు చదివినా కానీ, ఇది సత్యము అని భావించాలి. ఇందులో చాలా తెలివి కావాలి. బాబా, త్రిమూర్తి గురించి కూడా అర్థం చేయిస్తారు. దీనిని పదే-పదే పాకెట్ నుండి తీసి చూస్తూ ఉండండి. వీరు బాబా, ఇది వారసత్వం అని ఎవరికైనా అర్థం చేయించండి. విష్ణువు చిత్రం కూడా బాగుంది. ట్రైన్ లో కూడా సేవ చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తే, విశ్వానికి యజమానులుగా అవుతారు. చాలా సేవ చేయవచ్చు. కానీ అంత తెలివి ఎవ్వరికీ ఉండదు. చాలా పురుషార్థం చేయాలి. యుద్ధ మైదానంలో బద్ధకించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరాలలో కూడా చాలా సేవ జరగవచ్చు. బాబా కేవలం – మన్మనాభవ అని మాత్రమే అంటారు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వండి. ముఖ్యమైన విషయాలను పక్కా చేయించాలి. పిల్లలకు సేవకు సంబంధించి చాలా ఆలోచించాలి. త్రిమూర్తి చిత్రంలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. మెట్ల చిత్రం కూడా బాగుంది. ప్రతి ఒక్కరూ ధనం సంపాదించుకునే విషయంలో తమ ఉన్నతిని కోరుకుంటారు. చిన్న పిల్లలకు కూడా యుక్తులు నేర్పించండి, అప్పుడు అందరూ అంగీకరిస్తారు. ఈ బ్రహ్మాకుమార-కుమారీలది ఎంత అద్భుతము, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా జ్ఞానాన్ని ఇస్తారంటే, సన్యాసులు మొదలైనవారు కూడా అలా ఇవ్వలేరు అని అంటారు. ఉచితంగా ఏదైనా వస్తువు లభిస్తుందంటే, ఇది మా కళ్యాణం కోసం ఇస్తున్నారని భావిస్తారు. ఇది ఉచితము, మీరు చదువుకొని మీ కళ్యాణం చేసుకోండి అని వారికి చెప్పండి. శివబాబా భోళా భండారి కదా. చాలా మంది పిల్లలున్నారు. బాబాకు ధనంతో అవసరమేముంది. ట్రైన్ లో కూడా చాలా సేవ చేయవచ్చు. ఎవరైనా మంచి వ్యక్తి కనిపించారంటే, వెంటనే వారికి అర్థం చేయించి, చిత్రాలు ఇవ్వాలి. మీరు మీ కళ్యాణం చేసుకొని, ఇతరుల కళ్యాణం కూడా చేయండి అని వారితో చెప్పండి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నియమవిరుద్ధంగా ఏ పని కూడా చేయకూడదు. చాలా-చాలా నిరహంకారులుగా, నిర్మోహులుగా ఉండాలి. ఎంత వీలైతే అంత, ప్రతి పని తమ చేతులతోనే చేసుకోవాలి. యజ్ఞ సేవ చాలా సంతోషంగా చేయాలి.

2. చదువులో ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. అనారోగ్య సమయంలో కూడా తప్పకుండా చదువుకోవాలి. ఉల్లాసంగా ఉండేందుకు సేవ పట్ల అభిరుచి పెట్టుకోవాలి.

వరదానము:-

భక్తి మార్గంలో గణేశుడిని విఘ్న వినాశకుడు అంటూ పూజిస్తారు, అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అనగా విద్యాపతిగా కూడా భావిస్తారు. కనుక ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవుతారో, వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు. ఎందుకంటే నాలెడ్జ్ ను లైట్-మైట్ అని అంటారు, దీని ద్వారా గమ్యాన్ని చేరుకోవడం సహజమవుతుంది. ఇలా ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉన్నారో, తండ్రితో సదా కంబైండ్ గా ఉంటూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో, వారు ఎప్పుడూ విఘ్నాలతో ఓడిపోరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top