29 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
28 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు శబ్దానికి అతీతంగా వెళ్ళాలి కనుక నోటి ద్వారా ‘శివ-శివ’ అని అనవలసిన అవసరం కూడా లేదు”
ప్రశ్న: -
ఒక్క తండ్రిని మాత్రమే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు, ఇతరులను అలా అనరు – ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పతితం నుండి పావనంగా అవుతుంది. కేవలం తండ్రి మాత్రమే పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇంకే దేహధారులైన మనుష్యులు పావనంగా చేయలేరు. తండ్రి మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేస్తారు. మీరు శివబాబా నుండి శక్తి తీసుకుంటారు. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంత శక్తి లభిస్తుంది మరియు మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ..
ఓంశాంతి. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు భక్తి మార్గంలోని మహిమను విన్నారు. మీరు కూడా మహిమను గానం చేసేవారు. ఇప్పుడు మహిమను గానం చేయరు, అలాగే మీకు మహిమ అవసరమూ లేదు. భక్తులు ఏదైతే చేస్తారో, అది పిల్లలైన మీరు చేయకూడదు. ఇంతకుముందు మీరు భక్తులుగా ఉండేవారు. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. వారు అందరినీ ఒకేసారి కలవలేరు. తండ్రి అందరినీ ఒకేసారి ఎలా చదివిస్తారు? అలా జరగదు. అలాగే, భక్తులందరూ కూడా ఒకే చోట కలవలేరు. అయితే, తండ్రికి తప్పకుండా చదివించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది రాజయోగము. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు స్థాపనవ్వనున్నాయి. పిల్లలు ప్రదర్శనీలలో అర్థం చేయించాలి. పండుగల సమయంలో కూడా మీరు చాలా బాగా సేవ చేయవచ్చు. మీరు మీ కోసమే రాజ్య స్థాపనను చేసుకోవాలి. మీరు శివశక్తులు, మహారథి సైన్యము. మీరు ఇంకే డ్రిల్లు మొదలైనవి నేర్చుకోరు. మీరు ఆత్మిక డ్రిల్లును నేర్చుకుంటారు. ఈ డ్రిల్లు భారత్ లో ప్రసిద్ధి గాంచినది. ఇది యోగము యొక్క డ్రిల్లు. ఆత్మ పరమపిత పరమాత్మతో యోగమును జోడించాలి, వారి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇందులో యుద్ధం యొక్క విషయమేమీ లేదు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. దీనికి యుద్ధంతో సంబంధమేమీ లేదు. మీరు అనంతమైన తండ్రికి వారసులు కనుక తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రి శ్రీమతమును అనుసరించాలి. తండ్రి మతము యుద్ధము మొదలైనవి చేసేందుకు కాదు. తండ్రి కేవలం – మధురాతి మధురమైన పిల్లలూ! మీరు సతోప్రధానంగా ఉండేవారు, రాజ్యం చేసేవారు, ఇప్పుడు మీకు స్మృతి కలిగింది అని తెలియజేస్తారు. తండ్రి అంటారు – మీకు మీ జన్మల గురించి తెలియదు. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారని కూడా అంటారు. 84 లక్షల జన్మలు అనేది కేవలం వ్యర్థ ప్రలాపము. భక్తి మార్గంలో ఎవరికి ఏం తోస్తే, అది చదువుతూ ఉంటారు. డ్రామానుసారంగా ఇది భక్తి మార్గపు సామాగ్రి. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండనే ఉండదు. భక్తి వేరు, జ్ఞానము వేరు. పిల్లలైన మీకు తప్ప ఇతర ఏ ఋషులు, మునుల బుద్ధిలో ఈ జ్ఞానము లేదు. వారికి సుఖము వేరు, దుఃఖము వేరు అనే విషయం కూడా తెలియదు. సుఖాన్ని తండ్రి ఇస్తారు, దుఃఖాన్ని రావణుడు ఇస్తాడు. మీరు సూర్య వంశీయులుగా, చంద్ర వంశీయులుగా ఉండేవారు. ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగి శూద్ర వంశీయులుగా అయ్యారు. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు – మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మీరు 84 జన్మలను అనుభవించి కిందికి దిగుతూ తుచ్ఛ బుద్ధి కలవారిగా, తమోప్రధానులుగా అయ్యారు. సతోప్రధానులను స్వచ్ఛమైన, ఉన్నతమైన బుద్ధి కలవారని అంటారు. తమోప్రధానులను నీచ బుద్ధి కలవారని అంటారు. నీచ బుద్ధి కలవారు ఉన్నత బుద్ధి కలవారికి నమస్కరిస్తారు. మేమే ఉన్నతంగా ఉండేవారము, ఇప్పుడు మేమే నీచులుగా అయ్యాము – అని మీకు కూడా తెలియదు. ఎవరైతే మొదటి నంబరులో జన్మ తీసుకుని ఉంటారో, వారే సతోప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. 84 జన్మలు కూడా సూర్య వంశీయులే తీసుకుంటారు. మేము విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు పావనంగా, సతోప్రధానంగా ఉండేవారము – అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పతితులు విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. వారి మహిమ ఎంత ఉన్నతమైనదో చూడండి. వారు సర్వ గుణ సంపన్నులు… త్రేతాలో 14 కళల సంపూర్ణులని అనరు. సూర్య వంశీయులను 16 కళల సంపూర్ణులని అంటారు. 14 కళలు అనే మాట పక్కన సంపూర్ణులు అనే పదము రాదు. సంపూర్ణులు అనే పదము 16 కళల వారికే వ్రాయాలి. ఇప్పుడు పిల్లలైన మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు.
ఈ జ్ఞానము అతి సజహమైనదని, దీని కన్నా సహజమైనది ఇంకేదీ ఉండదని కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి దయాహృదయుడు కదా. పిల్లలు భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తింటూ, తింటూ అలసిపోయి ఉంటారని తండ్రికి తెలుసు కావుననే ద్రౌపది పాదాలను ఒత్తినట్లుగా చూపించారు. తండ్రి వద్దకు వృద్ధ మాతలు వస్తారు. తండ్రి అంటారు – మీరు భక్తిలో ఎదురుదెబ్బలు తింటూ-తింటూ అలసిపోయారు కనుక బాబా ఇప్పుడు మీ అలసటనంతా దూరం చేస్తారు. భక్తిలో రామ-రామ అని జపిస్తూ మాల తిప్పుతూ ఉంటారు. బాబాకు క్రిస్టియన్ ఫాదర్లతో కూడా సంబంధముండేది. ఆ ఫాదర్లు కూడా బైబిల్ తీసుకొని అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మంది క్రిస్టియన్లుగా అవుతారు. ఇక్కడ మాలను తిప్పే విషయమేమీ లేదు. తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. శివ-శివ అని నోటి ద్వారా అనవలసిన అవసరం లేదు. మనము శబ్దానికి అతీతంగా వెళ్ళనున్నాము. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు – నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది మరియు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. కమల పుష్పము చాలా ప్రసిద్ధమైనది. దానికి చాలా పెద్ద సంసారం ఉంటుంది. అయినా కానీ, అది అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. మీరు కూడా విషయ సాగరంలో ఉంటూ అతీతంగా, ప్రియంగా ఉండండి. ఇది విషయ సాగరము. దీనిని నది అని అనరు.
పిల్లలైన మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఈ వివేకంతోనే ఇప్పుడు మీరు మహారాజ కుమారులుగా అవుతారు. మీకు చాలా సంతోషముండాలి. పురుషార్థం చేయాలి. కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురి ఆత్మలు పురుషార్థం చేయాలి. లౌకిక సంబంధంలో తండ్రి వారసత్వం కేవలం కుమారులకు మాత్రమే లభిస్తుంది, కుమార్తెలకు లభించదు. ఇక్కడ ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు – స్మృతి యాత్ర ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందగలరు. ప్రదర్శనీలో మొట్టమొదటగా తండ్రి పరిచయాన్నివ్వాలి, ఆ తర్వాత వారసత్వం గురించి తెలియజేయాలి. వారికి ముందుగా – వీరు మీ అనంతమైన తండ్రి అనే నిశ్చయాన్ని కలుగజేయాలి. వారికి అర్థం చేయించాలి – భగవంతుడు ఒక్కరే, బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా భగవంతుడు కాదు, వారు దేవతలు. భగవంతుడు పతితపావనుడైన నిరాకార తండ్రి. వారి మహిమయే వేరు. ఈ రోజుల్లో ప్రదర్శనీలలో త్రిమూర్తి చిత్రం గురించి అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు తండ్రి, వీరు దాదా. వారసత్వం వారి నుండి లభిస్తుంది. వారు నిరాకారుడు. వారి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? వారు అందరికీ రచయిత. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా రచన. రచనకు రచయిత నుండే వారసత్వం లభించగలదు. ఆ నిరాకార తండ్రి వీరి ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. రచయిత అందరికీ ఒక్కరే కనుక సర్వుల సద్గతిదాత ఒక్కరేనని అంటారు. వారిని జ్ఞాన సాగరుడని అంటారు. మిగిలినవారంతా శాస్త్రాల అథారిటీ. వీరు జ్ఞాన సాగరుడు, వీరే స్వయం అథారిటీ కూడా. స్వయంగా వరల్డ్ ఆల్మైటీ అథారటీ చెప్తున్నారు – నాకు వేద శాస్త్రాలన్నింటి గురించి తెలుసు. నేను మీకు వాటి సారాన్ని అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. ఇవి సత్య, త్రేతా యుగాలలో ఉండవు. భక్తి ద్వారానే మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. సర్వశక్తివంతుడు అని ఒక్క తండ్రినే మాత్రమే అంటారు. వారితో యోగాన్ని జోడించడం ద్వారానే మనము పవిత్రంగా అవుతాము కనుక వారు సర్వశక్తివంతుడే కదా. వారు మనందరినీ పతితుల నుండి పావనులుగా చేస్తారు. రావణ రాజ్యం నుండి విముక్తులను చేస్తారు. ఇప్పుడు మీరు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంత ఎక్కువ శక్తి లభిస్తుంది మరియు మాలిన్యము తొలగిపోతుంది. పతితుల నుండి పావనులుగా, తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాలని మీకు రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి. మాయా తుఫానులు వస్తాయి. తండ్రి అంటారు – జాగ్రత్తగా ఉండాలి. మీ యుద్ధము మాయతో ఉంది. వ్యర్థమైన వికల్పాలు చాలా వస్తాయి. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ రానటువంటి వికల్పాలు కూడా వస్తాయి. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. శ్రమంతా స్మృతి యాత్రలోనే ఉంది. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి – అని యోగం గురించే బాబా అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఇతర మనుష్యులెవ్వరూ అర్థం చేయించలేరు. వారు, అందరూ భగవంతుని రూపాలే అని, ఎక్కడ చూసినా పరమాత్మయే పరమాత్మ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు ఆత్మలు, మీరు 84 జన్మలను అనుభవిస్తారు. ఒకవేళ అందరూ పరమాత్మలే అయినట్లయితే, పరమాత్మ జనన మరణాల చక్రంలోకి వస్తారా? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలో మంచి-చెడు సంస్కారాలుంటాయి. మంచి సంస్కారాలున్న వారి మహిమను గానము చేస్తారు. చెడు సంస్కారాలున్న వారిని పాపులు, నీచులు అని అంటారు. తండ్రి పవిత్రంగా అయ్యేందుకు సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. స్వయానికి కూడా దుఃఖమును ఇచ్చుకోకూడదు. ఎలాంటి వికర్మలు, దొంగతనం మొదలైనవి చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా అసత్యము చెప్పాల్సి వస్తే బాబాను సలహా అడగండి. అన్నింటికన్నా పెద్ద పాపం కామ ఖడ్గాన్ని ఉపయోగించడం, దానిని ఉపయోగించకండి.
తండ్రి అంటారు – పిల్లలూ, చేతులతో కర్మలు చేస్తూ బుద్ధియోగాన్ని నాతో జోడించండి (హాత్ కార్ డే బూద్ధి యార్ డే). తండ్రి సర్జన్ కూడా. అందరి అనారోగ్యం ఒకే రకంగా ఉండదు. కర్మ కూడా ఒకే రకంగా ఉండదు. కావున అడుగడుగులోనూ సలహాను అడగాల్సి ఉంటుంది. గమ్యము చాలా ఉన్నతమైనది. అమరనాథ యాత్రకు వెళ్ళినప్పుడు అమరనాథునికి జై, బద్రీనాథునికి జై, హే బద్రీనాథ, మమ్మల్ని రక్షించండి అని అంటారు. ఇప్పుడు మీరు తీర్థ యాత్రలు మొదలైనవేవీ చేయకూడదు. ఈ జ్ఞాన విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ పాత్ర వారిదే. మీరు కూడా తండ్రితో పాటు పాత్రధారులు. ఎవరు ఎంతగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇందులో ఎవరి గొప్పతనం లేదు. గొప్పతనమంతా ఒక్కరిదే. వారే మనుష్యులందరికీ సద్గతినిస్తారు, పిల్లలందరినీ పతితుల నుండి పావనులుగా చేస్తారు. డ్రామాలో నాకు కూడా పాత్ర లభించి ఉంది. 5 తత్వాలకు కూడా తమ-తమ పాత్ర లభించి ఉంది. దానిని అభినయించాల్సి ఉంటుంది. భూమి కంపించాల్సి ఉంటుంది, వినాశనం జరుగుతుంది. మీకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఇందులో గొప్ప ఏముంది. రాజ్యము చేస్తూ-చేస్తూ పతితులుగా అయ్యారు. మీరు కూడా ఇంతకుముందు ఎలా ఉండేవారు. పైసకు కొరగానివారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది మీ పాత్ర. మళ్ళీ మనము ఇలా అవ్వాల్సిందే. ఇందులో గొప్ప ఏమీ లేదు, మహిమ చేసే విషయమేమీ లేదు. ఇది తయారై ఉన్న డ్రామా. తండ్రి కూడా వచ్చి తమ పాత్రను అభినయిస్తారు. భక్తులు వారి గొప్పతనాన్ని వినిపిస్తారు, మహిమను చేస్తారు, మనము ఆ పని చేయలేము. ఇక్కడ తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఈ డ్రామా రహస్యం చాలా అద్భుతమైనది. ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా, మేము సత్యయుగంలో ఈ విషయాన్ని కూడా మర్చిపోతాము, ఇది చాలా విచిత్రమైన డ్రామా! ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి. పాత్రధారులెవరైనా పాత్రను బాగా అభినయిస్తే, వారికి చప్పట్లు కొడతారు. మనము కూడా – మధురమైన బాబా పాత్ర, శివబాబా పాత్ర చాలా బాగుందని అంటాము. మనము కూడా బాబాతో పాటు మంచి పాత్రను అభినయిస్తాము. ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా కొందరికి అర్థం కాదు, అప్పుడిక వారు మన రాజధానిలోకి వచ్చేది లేదు అని అర్థమవుతుంది. ఎవరైతే ఇంతకుముందు బ్రాహ్మణులుగా అయ్యారో, వారే మళ్ళీ బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతారని కూడా తెలుసు. దేవతలలో కూడా ప్రజలు మొదలైన వారంతా తయారవుతారు. అందరికీ అనాది పాత్ర లభించి ఉంది. సృష్టి కూడా ఒక్కటే. అది నడుస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కరే, సృష్టి ఒక్కటే. అదే చక్రము తిరుగుతూ ఉంటుంది. చంద్రునిలో ఏముంది, ఆపైన ఏముంది చూడాలని మనుష్యులు పరిశోధన చేస్తూ ఉంటారు. దాని పైన సూక్ష్మవతనముంది. అక్కడ ఏం చూస్తారు? ప్రకాశమే ప్రకాశము. చాలా ప్రయత్నం చేస్తారు కానీ సైన్సుకు కూడా హద్దు ఉంది కదా. మాయ ఆర్భాటం కూడా చాలా ఉంది. సైన్సు సుఖము కోసము ఉంది మరియు దుఃఖము కోసము ఉంది. అక్కడ విమానాలు ఎప్పుడూ పడిపోవు. దుఃఖము అన్న మాటే ఉండదు. ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖముంది, దొంగలు దోచుకుంటారు, అగ్ని అంతా కాల్చేస్తుంది. అక్కడ భవనాలు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్క రాజుకు ఆబూ అంతటి భూమి ఉంటుంది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకే వచ్చారు. బాబాను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. మీరందరూ ప్రేయసులు. ఇప్పుడు ప్రియతముడు అంటున్నారు – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అమరపురికి యజమానులుగా అవుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. సత్యయుగంలో శ్రేష్ఠాచారీ ప్రపంచముంటుంది. ఇది భ్రష్టాచారీ ప్రపంచము. ఎంతమంది బి.కె.లు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు! మీరు కూడా వారసత్వాన్ని తీసుకోండి. ఒకవేళ శ్రీమతాన్ని అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి స్వర్గాన్ని తయారుచేసేందుకు వస్తారు. కలియుగంలో అనేకమంది మనుష్యులున్నారు. సత్యయుగంలో కొద్దిమందే ఉంటారు. కనుక వినాశనం తప్పకుండా జరుగుతుంది. కావుననే మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. చెడు సంస్కారాలను తొలగించి ఇప్పుడు మంచి సంస్కారాలను ధారణ చేయాలి. ఏ వికర్మలు జరగకుండా అటెన్షన్ పెట్టాలి.
2. ఈ విచిత్రమైన డ్రామాలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసుకుంటూ తమతో తాము ఇలా మాట్లాడుకోవాలి – మేము భగవంతునితో పాటు పాత్రను అభినయిస్తున్నాము, మా పాత్ర ఎంత బాగుంది.
వరదానము:-
తండ్రి ద్వారా ఏ ఖజానా అయితే లభిస్తుందో, దానిని మననం చేసినట్లయితే, అది మీ లోపల ఇమిడిపోతూ ఉంటుంది. ఆస్తి అయితే అందరికీ ఒకే విధంగా లభించింది. కానీ ఎవరైతే మననం చేసి దానిని తమదిగా చేసుకుంటారో, వారికి దాని నషా మరియు సంతోషం ఉంటుంది. కావుననే ఎంత బాగా మననం చేస్తే, అంత నషా ఎక్కుతుంది అని అంటారు. ఎవరైతే మననం యొక్క ఆనందంలో సదా నిమగ్నమై ఉంటారో, వారిని ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ చిక్కు ఆకర్షించలేదు. వారికి దివ్య బుద్ధి వరదానము స్వతహాగా లభిస్తుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!