27 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
26 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడు నేర్చుకోవడంతో పాటు టీచర్ గా అయి నేర్పించాలి కూడా, ఈ చదువు ఈ అంతిమ జన్మ కోసం మాత్రమే, అందుకే మంచి రీతిలో చదువుకోండి మరియు చదివించండి”
ప్రశ్న: -
సత్యయుగ రాజధాని దేని ఆధారంగా స్థాపనవుతుంది?
జవాబు:-
సంగమయుగ చదువు యొక్క ఆధారంతో స్థాపనవుతుంది. ఎవరైతే బాగా చదువుకుంటారో మరియు ఎవరిపైనైతే బృహస్పతి దశ ఉందో, వారు సూర్యవంశంలోకి వస్తారు. ఎవరైతే చదువుకోరో, సేవ చేయరో, వారిపై బుధ దశ కూర్చొంటుంది, వారు బుద్ధూ (మంద బుద్ధి కలవారు) గా ఉంటారు. వారు ప్రజల్లోకి వస్తారు. ఉన్నత ప్రజలు, నౌకర్లు మొదలైనవారంతా ఈ సమయంలోని చదువు ఆధారంగానే తయారవుతారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు లేక ఆత్మలకు ఆత్మిక తండ్రి అనగా పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రిని పరమాత్మ అని అంటారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమపిత పరమాత్మ. వారు కూర్చొని బ్రహ్మా తనువు ద్వారా అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలోని మనుష్యులు త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు అలా అనరు. మీరు త్రిమూర్తి శివ అనగా బ్రహ్మా, విష్ణు, శంకరుల రచయిత శివుడు అని అంటారు. త్రిమూర్తి బ్రహ్మాకు ఎలాంటి అర్థము లేదు. ఈ ముగ్గురు దేవతలకు రచయిత శివుడు కావుననే త్రిమూర్తి శివ అని అంటారు. వారొక్కరే రచయిత, మిగిలినవారంతా రచన. అనంతమైన తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటారు. ఈ సమయంలో అందరూ శివబాబాకు పిల్లలుగా అయ్యారు. ఆత్మలైన మనం 84 జన్మల చక్రంలో తిరుగుతామని పిల్లలకు తెలుసు. కనుక హద్దు తండ్రులు 84 మంది ఉంటారు. సత్యయుగంలో కూడా తల్లిదండ్రులు అనంతమైన వారసత్వాన్ని ఏమీ ఇవ్వరు. సత్యయుగం కోసం అనంతమైన వారసత్వమనేది ఇప్పుడు మీకు లభిస్తుంది. అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉంటుంది, మిగిలిన రాజ్య కుటుంబాలకు చెందిన పిల్లలకు తమ తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది. ఎంతైనా, అక్కడ చాలా సుఖముంటుంది. ఈ సమయంలో అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతమైన విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. అక్కడ దుఃఖం యొక్క నామ-రూపాలు ఉండవు. వామ మార్గం ప్రారంభమవుతూనే దుఃఖం ప్రారంభమవుతుంది. ఎవరు వచ్చినా సరే, వారికి – మీకు ఇద్దరు తండ్రులున్నారు, 84 జన్మలలో 84 మంది హద్దు తండ్రులు లభిస్తారు, అనంతమైన తండ్రి ఒక్కరే – అని అర్థం చేయించండి. ఇప్పుడు మూలవతనం అంటే ఏమిటి అనేది కూడా పిల్లలైన మీ బుద్ధిలో స్పష్టంగా ఉంది. చిత్రాలలో ఏ మూలవతనాన్ని అయితే చూపిస్తారో, దానిని కూడా పెద్దదిగా తయారుచేయాలి, అందులో చిన్న-చిన్న ఆత్మలు నక్షత్రాల వలె మెరుస్తూ ఉండాలి. ఎలాగైతే ఇంతకుముందు మీరు దీపపు పురుగుల హారాన్ని తయారుచేసేవారో, అలా ఈ మూలవతనానికి సంబంధించింది కూడా తయారుచేయాలి. ప్రొజెక్టర్ షో చూపించినప్పుడు కూడా, అందులో మూలవతనం యొక్క చిత్రాన్ని అలా చూపించాలి. వృక్షం పెద్దదిగా ఉంటే – ఆత్మలమైన మేము అక్కడ నివసిస్తాము అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలకు అర్థం చేసుకునేందుకు కూడా సహజమవుతుంది. వీరు అనంతమైన బాబా, వీరు బ్రహ్మా ద్వారా దైవీ సంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, తర్వాత దైవీ గుణాలు కల దేవతలుగా అవుతారు. ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలున్నాయి, వాటిని ఆసురీ అవగుణాలు అని అంటారు. వామ మార్గం నుండి దుఃఖం మొదలవుతుంది. అలాగని రజోప్రధానంగా అయినప్పుడు ఒక్కసారిగా దుఃఖితులుగా అవుతారని కాదు. కళలు నెమ్మది-నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ముఖ్యమైన చిత్రాలు – త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు స్వర్గం-నరకం గోళాలను చూపించే చిత్రము. మొట్టమొదట అర్థం చేయించేందుకు ఇవి చాలా అవసరము. వృక్షం చిత్రంలో కూడా కల్పము రెండు భాగాలుగా ఉంది. ఏక్యురేట్ గా ఉన్నప్పుడు పూర్తిగా అర్థం చేయించగలరు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పదే-పదే అర్థం చేయించేందుకు త్రిమూర్తి చిత్రం తప్పకుండా కావాలి. వారు నిరాకారుడైన అనంతమైన తండ్రి, వారిని అందరూ స్మృతి చేస్తారు. వారు మా అనంతమైన తండ్రి అని ఆత్మకు తెలుసు, వారిని దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. సత్యయుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు. అది సుఖధామము. దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.
మనం సతోప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి ఎలా వస్తాము అనేది మీకు తెలుసు. ఆత్మలో మాలిన్యం చేరుతూ ఉంటుంది. మనం 84 జన్మల పాత్రను అభినయించాలని ఆత్మలైన మీకు తెలుసు. అది ఏక్యురేట్ గా మన ఆత్మలో నిశ్చయించబడి ఉంది. ఎంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా నిశ్చయించబడి ఉంది. ఇవి గుహ్యాతి-గుహ్యమైన, అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలు ఏ మనుష్యమాత్రులు, సన్యాసులు మొదలైన వారి బుద్ధిలోకి రావు. నాటకం గురించి మాట్లాడుతారు, నాటకాన్ని డ్రామా అని అనరు. ఇది డ్రామా. డ్రామా, బయోస్కోప్ (సినిమా) మొదలైనవి ఇంతకుముందు ఉండేవి కావు. ఇంతకుముందు మూవీ (మూగ సైగలు) ఉండేది, ఇప్పుడు టాకీ తయారయింది. ఆత్మలైన మనం కూడా సైలెన్స్ నుండి టాకీలోకి వస్తాము. టాకీ నుండి మళ్ళీ మూవీలోకి వెళ్ళి, ఆ తర్వాత సైలెన్స్ లోకి వెళ్తారు, అందుకే – ఎక్కువగా మాట్లాడకండి అని పిల్లలైన మీకు నేర్పించడం జరుగుతుంది. రాయల్ మనుష్యులు చాలా నెమ్మదిగా మాట్లాడుతారు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళాలి. సూక్ష్మవతన జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది టాకీ ప్రపంచము, అది మూవీ. అక్కడ ఈశ్వరునితో సంభాషణ జరుగుతుంది. అక్కడ తెల్లని ప్రకాశ రూపముంటుంది, శబ్దం ఉండదు. అక్కడ మూవీ భాష ద్వారా పరస్పరంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కనుక ఇప్పుడు మీరు వయా మూవీ, సైలెన్సులోకి వెళ్ళాలి. తండ్రి అంటారు – ముందుగా నేను సూక్ష్మ సృష్టిని రచించాల్సి ఉంటుంది, ఆ తర్వాత స్థూల సృష్టిని రచిస్తాను. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అని అంటూ ఉంటారు కూడా. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనవాసులని కూడా మనుష్యులకు తెలియదు. అక్కడ ప్రపంచమేదీ లేదు. కేవలం బ్రహ్మా-విష్ణు-శంకరులు కనిపిస్తారు. 4 భుజాల కల విష్ణువును చూస్తారు, దీని ద్వారా ఇది ప్రవృత్తి మార్గమని ఋజువవుతుంది. సన్యాసులది నివృత్తి మార్గము. ఇది కూడా డ్రామా, దీనిని వర్ణిస్తూ తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – ముఖ్యమైన విషయము ‘మన్మనాభవ’. మిగిలినదంతా విస్తారము. అది అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. సారంలో – బీజము మరియు వృక్షము. బీజాన్ని చూసినప్పుడు పూర్తి వృక్షమంతా బుద్ధిలోకి వస్తుంది. తండ్రి బీజరూపుడు, వారికి ఈ వృక్షం మరియు సృష్టి చక్రానికి సంబంధించిన పూర్తి జ్ఞానముంది, అర్థం చేయించేందుకు సృష్టి చక్రం వేరుగా, వృక్షం వేరుగా ఉన్నాయి. వృక్షంలో ఈ చిత్రాలన్నింటినీ చూపించారు. ఏ ధర్మం వారికి చూపించినా సరే – మేము స్వర్గంలోకైతే రాలేమని వారు అర్థం చేసుకోగలరు. భారత్ ప్రాచీనంగా ఉన్నప్పుడు కేవలం దేవీ-దేవతలే ఉండేవారు. మిగిలినవారంతా శాంతిధామంలో ఉండేవారు. మీకు బీజం మరియు వృక్షం, రెండింటి గురించి తెలుసు. బీజం పైన ఉంది, వారిని వృక్షపతి అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మీపై బృహస్పతి దశ కూర్చొని ఉంది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారిపై బృహస్పతి దశ ఉందని అంటారు. ఆ తర్వాత శుక్ర దశ, బుధ దశ ఉంటాయి. బృహస్పతి దశ కలవారు సూర్యవంశీయులుగా అవుతారు. బుధ దశ కలవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు, వారు సేవ చేయలేరు. వారు తండ్రిని స్మృతి చేయలేరు కనుక వారు బుద్ధూ (మంద బుద్ధి కలవారు) అని అర్థము, ఇందులో కూడా నంబరువారుగా బుద్ధూలుగా అవుతారు. కొందరు ఉన్నతమైన ప్రజలుగా, కొందరు సాధారణ ప్రజలుగా అవుతారు. షావుకార ప్రజలెక్కడ, వారి నౌకర్లు ఎక్కడ. అంతా చదువుపై ఆధారపడి ఉంది. చదువు కూడా సతో గుణీ, రజో గుణీ, తమో గుణీగా ఉంటుంది. రాజధాని స్థాపనవుతుంది. చురుకైనవారు తండ్రి స్మృతిలో ఉంటారు. వారికి మొత్తం వృక్షం బుద్ధిలో ఉంటుంది. చదువు ద్వారానే టీచర్ గా, బ్యారిస్టర్ గా అవుతారు. టీచర్ మళ్ళీ ఇతరులను కూడా చదివిస్తారు. చదువుకోవడం అందరూ చదువుకుంటారు. చదువు ఒక్కటే కానీ కొందరు చదువుకుని ఉన్నతిలోకి వెళ్తారు, మరికొందరు అక్కడే టీచర్ గా అవుతారు. ఎవరైతే నేర్చుకుంటారో, వారు చదివిస్తారు. ఇప్పుడు మీరు కూడా చదువుకుంటారు. కొందరు చదువుకుంటూ-చదువుకుంటూ టీచర్ గా అవుతారు. టీచర్ యొక్క కర్తవ్యము – తమ సమానంగా టీచర్ గా తయారుచేయడము అని వారు స్వయం అంటారు. టీచర్ గా అవ్వకపోతే ఇతరుల కళ్యాణం ఎలా చేస్తారు. సమయం కొద్దిగానే ఉంది, వినాశనం అయ్యేంత వరకు నేర్చుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత నేర్చుకోవడం ఆగిపోతుంది. మళ్ళీ బాబా 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు. ఈ చదువు వందలాది సంవత్సరాలేమీ నడవదు. ఈ చదువు ఈ అంతిమ జన్మ కోసం మాత్రమే. చదువుకోవాలి మరియు చదివించాలి. అందరూ టీచర్లుగా అవ్వలేరు. ఒకవేళ అందరూ టీచర్లుగా అయితే, చాలా ఉన్నత పదవిని పొందాలి. కానీ తప్పకుండా నంబరువారుగా ఉంటారు. ముందుగా ఎవరికైనా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. చిత్రాలు ఉన్నట్లయితే బాగా అర్థం చేసుకుంటారు. త్రిమూర్తి చిత్రమైతే తప్పకుండా మీతో పాటు ఉండాలి. వారు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మా. వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కావున తప్పకుండా అందరికన్నా ముందే వచ్చి ఉంటారు కదా. అందరికన్నా ముందు బ్రహ్మా ఉన్నారు. ఇప్పుడు రచనను రచిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల వృక్షము చిన్నది. దేవతలు కొద్దిమందే ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు మీ కొత్త వృక్షము స్థాపనవుతుంది. ఇతర ధర్మాల ఆత్మలు పాత్రను అభినయించేందుకు పై నుండి వస్తారు. పడిపోయే మాటేమీ లేదు. ఇక్కడ మీ కొత్త వృక్షము స్థాపనవుతుంది. మాయ కూడా ఎదురుగా ఉంది. మీరు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వాల్సిందే. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎందుకంటే ప్రపంచం పరివర్తనవుతుంది, అందుకే శ్రమ అనిపిస్తుంది. దేవీ-దేవతా ధర్మము ఇప్పుడు సంగమయుగంలో స్థాపన అవుతుంది. సత్యయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, సత్యయుగం నుండి మళ్ళీ కలియుగం ఎలా తయారవుతుంది అనేది కూడా మీరు అర్థం చేయిస్తారు. కలియుగంలో తమోప్రధానులుగా అవ్వాల్సిందే. తమోప్రధానులుగా అయినప్పుడే మళ్ళీ సతోప్రధానులుగా అవుతారు. మీరు సతోప్రధానులుగా ఉండేవారు, తర్వాత మాలిన్యం చేరుతూ వచ్చింది. ఇప్పుడు ఏదైనా కొత్త ఆత్మ 2-3 జన్మలు తీసుకుంటే, వెంటనే మాలిన్యం చేరుతుంది. అందులోనే సుఖము, అందులోనే దుఃఖము అనుభవిస్తుంది. కొందరికి ఒక్క జన్మ కూడా ఉంటుంది. ఆత్మలు రావడం ఆగిపోయినప్పుడు వినాశనం జరుగుతుంది. అప్పుడిక ఆత్మలందరికీ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. పాపాత్ములు, పుణ్యాత్ములు అందరూ కలిసి వెళ్తారు. తర్వాత పుణ్యాత్ములు కిందకు దిగుతారు. సంగమంలో అంతా పరివర్తన అవుతుంది. కనుక పిల్లలు పూర్తి డ్రామాను బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి వద్ద ఈ జ్ఞానమంతా ఉంది కదా. నేను వచ్చి ఈ సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాలను తెలియజేస్తానని అంటారు. ఈ జ్ఞానాన్ని భక్తి మార్గంలో వినిపించను. భక్తులు స్మృతి చేస్తే వారికి సాక్షాత్కారాలు చేయిస్తాను. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు నా పాత్ర కూడా ప్రారంభమవుతుంది. సత్య, త్రేతా యుగాలలో నేను వానప్రస్థంలో ఉంటాను. పిల్లలను సుఖములోకి పంపించాను, ఇంకేమి కావాలి! నేను వానప్రస్థాన్ని తీసుకుంటాను. ఈ వానప్రస్థము తీసుకునే పద్ధతి భారత్ లోనే ఉంది. నేను వానప్రస్థంలో కూర్చుంటానని అనంతమైన తండ్రి అంటారు. అనంతమైన తండ్రియే వచ్చి గురువు రూపంలో వానప్రస్థములోకి తీసుకువెళ్తారు. మనుష్యులు భగవంతుడిని కలుసుకునేందుకు గురువుల సాంగత్యంలో ఉంటారు. శాస్త్రాలను చదువుతారు, తీర్థాలకు వెళ్తారు, గంగా స్నానాలు చేస్తారు కానీ ఏమీ లభించదు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. వారు దుఃఖము నుండి విముక్తులను చేసి రావణ రాజ్యము నుండి రామ రాజ్యంలోకి తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రి ఒకేసారి వచ్చి రావణుని దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు కావుననే వారిని ముక్తిదాత అని అంటారు. సత్యయుగంలో రామ రాజ్యముంటుంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మనైన నా స్వధర్మమే శాంతి. ఇక్కడ పాత్రలోకి రావడం వలన అశాంతిగా అయ్యాము. మళ్ళీ శాంతి గుర్తుకొస్తుంది. వాస్తవానికి మనము శాంతిధామ నివాసులము. ఇప్పుడు నాకు శాంతి కావాలి, మనసుకు శాంతి కావాలి అని అంటారు. ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంటుందని అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఇక్కడ కర్మలోకి వస్తుంది. ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది? ఇది అశాంతిధామము. సత్యయుగంలో సుఖశాంతులు, రెండూ ఉన్నాయి. పవిత్రత కూడా ఉంది, ధన-సంపదలు కూడా ఉన్నాయి. మీకు సుఖ-శాంతులు, ధన-సంపదలు మొదలైనవన్నీ ఎంతో ఉండేవని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇతరులకు అర్థం చేయించాలి. ఎవరైతే కల్పక్రితం వారసత్వం తీసుకున్నారో, వారే బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆలస్యంగా వచ్చినా కానీ, పాతవారి కంటే ముందుకు వెళ్ళిపోతారు. ఆలస్యంగా వచ్చేవారికి ఇంకా మంచి పాయింట్లు లభిస్తాయి. రోజు-రోజుకు సహజమవుతూ ఉంటుంది. ఇప్పుడు మేము అంతా అర్థం చేసుకున్నామని కూడా భావిస్తారు. కానీ తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యే శ్రమ కూడా చేయాలి. దాని కోసం తీవ్ర పురుషార్థం చేయడం మొదలుపెడతారు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందని అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. మృత్యువు కన్నా ముందే మేము పురుషార్థం చేయాలని భావిస్తారు. వారు తమ చార్టును పెట్టుకుంటారు. చదువైతే సహజమైనది, మిగిలినది స్మృతి విషయము. ఓ మనసా, ప్రభాత వేళలో రామ నామమును స్మరించు….. అని గాయనం కూడా చేయబడింది. ఓ నా మనసా! రాముడిని స్మరించు అని ఆత్మ చెప్తుంది. భక్తి మార్గంలో రాముడు ఎవరు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. వారు రఘుపతి రాఘవ రాజా రామ్ అని అంటారు. ఎంత తారుమారు చేసేసారు. అందరి భగవంతుడైన ఆ రాముడు ఎవరు అనేది మనుష్యులేమీ అర్థం చేసుకోరు. సమయాన్ని, ధనాన్ని వృథా చేస్తూ ఉంటారు. నేను పిల్లలైన మీకు విశ్వ రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను, దానినేమి చేసారు? 5000 సంవత్సరాల క్రితం మీకు స్వర్గ రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను. దానిని ఎలా పోగొట్టుకున్నారు? మనం ఎలా కిందకు పడుతూ వచ్చామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలి. ఒక్క క్షణంలో ఎక్కే కళ. దిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. బ్రహ్మా నుండి విష్ణువుగా అయ్యేందుకు ఒక్క సెకెండు, విష్ణువు నుండి బ్రహ్మాగా అయ్యేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. తండ్రి ఎన్ని పాయింట్లను అర్థం చేయిస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్ళాలి కనుక టాకీని (మాటలను) చాలా తగ్గించాలి. రాయల్ గా, చాలా నెమ్మదిగా మాట్లాడాలి.
2. జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత తీవ్ర పురుషార్థం చేసి సతోప్రధానంగా అవ్వాలి. స్మృతి చార్టును పెట్టుకోవాలి.
వరదానము:-
స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో, వాటిని చమత్కారంగా భావిస్తూ ప్రయోగించకండి, వాటిని కర్తవ్యంగా భావిస్తూ కార్యంలో ఉపయోగించండి. ప్రపంచంలోని మనుష్యుల వద్ద రిద్ధి-సిద్ధుల చమత్కారముంది, కానీ మీ వద్ద శ్రీమతము ఉంది. శ్రీమతము ద్వారా శక్తులు తప్పకుండా వస్తాయి, అందుకే సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం చేసేందుకు ప్రేరణనివ్వగలరు, ఇది కూడా శక్తియే. కానీ ఎప్పుడైతే శ్రీమతంలో మీ మన్మతం మిక్స్ అవ్వదో, అప్పుడు గాయన యోగ్యులుగా మరియు పూజన యోగ్యులుగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!