23 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
22 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - రావణుని మతమును అనుసరిస్తూ ఏ వికర్మలు చేయకండి, పతితులకు పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలపండి”
ప్రశ్న: -
తెలివైన, వివేకవంతులైన పిల్లలు ఏ పురుషార్థాన్ని చేస్తూ కూడా ఒక్క శ్రీమతముపై తప్పకుండా అటెన్షన్ పెడతారు?
జవాబు:-
వివేకవంతులైన పిల్లలు ఉన్నత పదవిని పొందేందుకు నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ – నేను నిమిత్తంగా అయి అనేకాత్మల కళ్యాణం చేయాలి అన్న శ్రీమతముపై తప్పకుండా సదా అటెన్షన్ పెడతారు. ఎవరైతే అనేకుల కళ్యాణం చేస్తారో, వారి కళ్యాణం స్వతహాగానే జరుగుతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాను….
ఓంశాంతి. ఇప్పుడు పిల్లల బుద్ధిలో కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం, రెండూ ఉన్నాయి ఎందుకంటే పాత ప్రపంచ వినాశనం ఇప్పుడు జరగనున్నదని మరియు కొత్త ప్రపంచాన్ని తండ్రియే రచిస్తారని పిల్లలకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, అలాగే రాత్రిని (శివరాత్రి) కూడా జరుపుకుంటారని పిల్లలకు తెలుసు. ఈ రెండు పదాల అర్థం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. శివజయంతి అనగా శివుని జన్మ. ఇక్కడ మనుష్యుల జన్మదినాన్ని జరుపుకుంటారు, శివునికైతే జన్మయే ఉండదు. వారు ఎలా జన్మ తీసుకుంటారు అనేది అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని విషయంలో, వారు జన్మించారని చెప్తూ ఉంటారు. శివ జయంతి గురించైతే ఎటువంటి వర్ణన లేదు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని అంటూ ఉంటారు కూడా. మరి వారు పైన సూక్ష్మవతనంలో కూర్చొని ఎవరికైనా ప్రేరణనిస్తారా? అలా జరగదు. పతితపావనుడైన తండ్రినే స్మృతి చేస్తారు. ఎప్పుడైతే తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారో, అప్పుడు మనుష్యుల బుద్ధిలో కూర్చుంటుంది. డ్రామాలో ఉన్న కారణంగా తండ్రికి సంగమంలో రావాల్సే ఉంటుంది. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరో కష్టం మీద అర్థం చేసుకున్నారు. నిజంగా పరమాత్మ బ్రహ్మా ద్వారా భారత్ ను మళ్ళీ శ్రేష్ఠాచారీ సత్యయుగీ ప్రపంచంగా తయారుచేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని ఎవరూ రాయరు. తండ్రి వచ్చి ఉన్నారని, స్వర్గ రాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని యథార్థ రీతిగా ఎవరూ అర్థం చేసుకోరు. రావడం వేలాది మంది వస్తారు కానీ వారిలో కొంత మంది మాత్రమే నిలుస్తారు, మళ్ళీ ఆ కొంత మందిలో కూడా వస్తూ-వస్తూ తగ్గిపోతూ ఉంటారు. ఎంత తమోప్రధాన బుద్ధికలవారిగా అయ్యారు! ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు – నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది యోగాగ్ని, దీనితో మీరు సతోప్రధానంగా తయారవుతారు. ఎలాంటి వికర్మలు చేయకండి. వికర్మలు చేయించేవాడు రావణుడు, అతని మతమును అనుసరించకండి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. తండ్రి, పతితులను పావనంగా తయారుచేసేందుకు వచ్చారు. మీ వ్యాపారం కూడా ఇదేనని తండ్రి అంటారు. మేము పతితులకు పావనంగా తయారయ్యే మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింతన చేయండి. మార్గము చాలా సహజమైనది. యోగబలంతోనే మనం సతోప్రధానంగా అవుతాము. ఇది అవినాశీ సర్జన్ ఇచ్చిన మందు. ఇది మంత్రమేమీ కాదు. ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. కల్ప-కల్పము ఈ విషయాన్ని అర్థం చేయించారు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని అంటూ ఉంటారు కూడా. దేని పట్ల వైరాగ్యం? ఈ పాత ఛీ-ఛీ ప్రపంచం పట్ల వైరాగ్యము. పాత ప్రపంచంలో పూర్తి పాపాత్ములుగా అయిపోయారు. ఓ పతితపావనా, ముక్తిదాత రండి అని అంటారు కూడా. దేని నుండి ముక్తులుగా చేయాలి? దుఃఖము నుండి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయాలి. రావణుడిని ఇంగ్లీషులో ఈవిల్ (సైతాన్) అని అంటారు. అందుకే అంటారు – సైతాన్ రాజ్యం నుండి విముక్తులను చేసి ఇంటికి తీసుకువెళ్ళండి, మాకు గైడ్ (మార్గదర్శకులు) గా అయి మీతో పాటు తీసుకువెళ్ళండి అని. ఎలాగైతే ఎవరైనా జైలు నుండి విడిపించి చాలా ప్రేమగా ఇంటికి తీసుకువెళ్తారో, అలా అనంతమైన తండ్రి పిల్లలందరినీ పాలన చేస్తారు – నేను మిమ్మల్ని జైలు నుండి విడిపించేందుకు వచ్చాను. మేళాలలో, ప్రదర్శనీలలో కూడా, అందరూ జైలులో ఏ విధంగా ఉన్నారు అనేది మోడల్ రూపంలో చూపించడం జరిగింది. అయినా మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, మీరు సత్యయుగానికి యజమానులుగా అవుతారని అంటారు. ఇది ఎంత సులభము. ఏ ధర్మం వారైనా అర్థం చేసుకోగలరు. ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుంది అనేది తెలియజేయాలి. చివర్లో ఆత్మలందరూ తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవీ-దేవతా ధర్మం ప్రారంభమవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన అని రాసి ఉంది. త్రిమూర్తి చిత్రము నంబరువన్ చిత్రము. త్రిమూర్తి మరియు సృష్టి చక్రం, ఈ చిత్రాలపై బాగా స్పష్టంగా అర్థం చేయించవచ్చు. ఒకటి శాంతిధామము, రెండవది సుఖధామము మరియు ఇది దుఃఖధామము అని కూడా అర్థం చేయించారు. ఈ దుఃఖధామం పట్ల వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తయింది. సత్య-త్రేతా యుగాల పగలు మొదలవుతుంది.
తండ్రి అంటారు – ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది, అందుకే దీని పట్ల వైరాగ్యం కావాలి. అది హద్దు వైరాగ్యము, ఇది అనంతమైన వైరాగ్యము. ఆ సన్యాసులు మొదలైన వారెవ్వరూ కొత్త ప్రపంచాన్ని రచించరు. రచయిత తండ్రి కదా. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, వారు హెవెన్ (స్వర్గం)ను స్థాపన చేసేవారు. ఇంకెవ్వరూ చేయలేరు. ఈ చదువు సత్యయుగీ రాజధానిని ప్రాప్తి చేసుకునేందుకు ఉంది. జ్ఞానసాగరుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు అని వారినే అంటారు. వారిలో దేని గురించిన జ్ఞానముంది? బ్యారిస్టర్, సర్జన్ గా అయ్యే జ్ఞానమా? పరమాత్మలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. అందులోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది – బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవాటన్నింటి మూల సారము ఈశ్వరీయ జ్ఞానము. ఆ భౌతిక విద్యను చదవడం, ఇంజనీర్ మొదలైనవారిగా అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. సత్యయుగీ కొత్త ప్రపంచానికి సంబంధించిన ఆచార-పద్ధతులేవైతే ఉంటాయో, అవే అక్కడ కొనసాగుతాయని మీకు తెలుసు. మనం కల్ప క్రితం ఎలాగైతే మహళ్ళు మొదలైనవి నిర్మించామో, అదే రిపీట్ చేస్తాము, దానినే సత్యయుగమని అంటారు. అక్కడి ఆచార-పద్ధతుల గురించి, అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఎలా తయారవుతాయి అనేది మనుష్యులకు తెలియదు. వారు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా మహిమ చేయబడతారు. అక్కడి ఆచార పద్ధతులు ఏవైతే ఉంటాయో, వాటి అనుసారంగానే రాజ్యం నడుస్తుంది. అది డ్రామాలో నిశ్చయించబడింది, ఆత్మలు తమ పాత్రను అభినయిస్తారు. అక్కడ ఇళ్ళు ఎలా నిర్మిస్తారు, ఎలా ఉంటారు, ఇవన్నీ నిశ్చయించబడి ఉన్నాయి. ఈ పాత ప్రపంచానికి సంబంధించినవి ఎలాగైతే నడుస్తాయో, అలాగే ఆ కొత్త ప్రపంచానివి కూడా నడుస్తాయి. ఇక్కడ అసురులున్నారు, అక్కడ దేవతలుంటారు. శాస్త్రాల్లో ఈ విషయాలేవీ లేవు. జ్ఞానం మరియు భక్తి, బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని అంటూ ఉంటారు కూడా. ఇలా అన్నప్పుడు బ్రహ్మా పేరు తీసుకుంటారే కానీ విష్ణువు పేరు కాదు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులు, విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు. అందుకే, లక్ష్మీ-నారాయణులే 84 జన్మల తర్వాత ఈ విధంగా తయారవుతారని బాబా అర్థం చేయించారు. రాజయోగ తపస్సును ఇక్కడే చేస్తారు, సూక్ష్మవతనంలో చేయరు. యజ్ఞాలు మొదలైనవి కూడా ఇక్కడే రచించబడతాయి. తండ్రి అర్థం చేయిస్తారు – ఇది అంతిమ యజ్ఞము, తర్వాత సత్య-త్రేతా యుగాలలో ఏ యజ్ఞము ఉండదు. రకరకాల యజ్ఞాలను రచిస్తారు, వర్షం పడకపోతే యజ్ఞం రచిస్తారు. ఏదైనా దుఃఖం వస్తే యజ్ఞం రచిస్తారు, యజ్ఞంతో దుఃఖం తొలగిపోతుందని భావిస్తారు. ఇది అన్నింటికంటే పెద్ద యజ్ఞము, ఈ జ్ఞాన యజ్ఞంతో మొత్తం సృష్టి యొక్క దుఃఖం తొలగిపోతుంది. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన యజ్ఞము. ఇందులో అన్నీ స్వాహా అయిపోతాయి. ఎంత మంచి రీతిగా అర్థం చేయించడం జరుగుతుంది.
ఢిల్లీలో మండపాన్ని (టెంటు) తయారుచేసి మేళా నిర్వహించారు. ఇది కూడా మంచిదే. మండపాన్ని తయారుచేయడానికి సమయమేమీ పట్టదు. హాలు కోసం ఎంతో హైరానా పడాల్సి ఉంటుంది కదా, దాని కంటే మండపాన్ని (టెంటు) తీసుకోవచ్చు. చిన్న-చిన్న పల్లెటూర్ల కోసం చిన్న మండపాలను కూడా తయారుచేసుకోండి. పల్లెటూర్లు మొదలైన స్థానాలలో కరెంటు లేకపోతే పగలు పూట కూడా ప్రదర్శనీలు పెట్టవచ్చు. మీ సామాగ్రియే ఉండాలి, అద్దెకు ఎందుకు తీసుకోవాలి! ప్రదర్శనీ కమిటీ వారికి తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు – వాటర్ ప్రూఫ్ మండపాన్ని (టెంటు) తయారుచేయండి, అప్పుడు వర్షం పడినా పర్వాలేదు. బాబా ఢిల్లీకి వెళ్ళినప్పుడు చలిలో కూడా మండపంలోకి వెళ్ళి భాషణ చేసేవారు. చలి కోసం అందరికీ వెచ్చదనం అందించే వస్త్రాలున్నాయి. ప్రదర్శనీల కోసమైతే ఎన్ని మండపాలనైనా తయారుచేయవచ్చు. ఎవరూ విఘ్నాలు వేయకుండా ఇన్ష్యూరెన్స్ కూడా చేయవచ్చు. సేవైతే చేయాల్సి ఉంటుంది కదా. అర్థం చేయించాలి కూడా. తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం తండ్రితో పాటు ఉన్నాము. జ్ఞానసాగరుడైన తండ్రి నుండి మనకు జ్ఞానం లభిస్తుంది. సత్యయుగంలో జ్ఞానం యొక్క అవసరముండదు. తండ్రి అంటారు – నేను సద్గతినిచ్చేందుకు వచ్చాను, తర్వాత రావణుని వలన దుర్గతి కలుగుతుంది. సద్గతిదాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. స్వయం అర్థం చేసుకోరు కానీ ఇది మనుష్యులకు చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. ఇకపోతే, స్వయం అర్థం చేసుకునేందుకు తీరిక ఉండదు. పెద్ద-పెద్ద వ్యక్తుల వద్దకు కూడా వెళ్ళి ఎంతగా అర్థం చేయిస్తారు. తండ్రి శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని ఎలా తయారుచేస్తారో అర్థం చేసుకోండి. శ్రేష్ఠాచారులుగా తయారుచేయడం తండ్రి పని, అందుకే తండ్రిని పిలుస్తారు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటూ ఉంటారు. తండ్రి వచ్చినట్లయితే, మేము బలిహారమవుతాము, శ్రీమతమనుసారంగా యథార్థంగా నడుచుకుంటామని కూడా భావిస్తారు. అయినా తండ్రి శ్రీమతమును అనుసరించరు. భగవంతుడు ఎవరు అనేది మనుష్యులకు తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. అరే, పతితపావనుడైన భగవంతుడు ఒక్కరే కదా. వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? అలా అయితే, అందరూ భగవంతుడిగా పిలవబడతారు. భగవంతుడు చిన్నగా, పెద్దగా అవ్వరు కదా. కొందరు మాంసం తింటూ ఉన్నట్లుగా, కొందరు కొట్లాడుకుంటూ ఉన్నట్లు కూడా ప్రదర్శనీలలో చూపించారు. మరి ఇవన్నీ భగవంతుడు చేస్తారా? అని వారిని అడగండి. ఆ సమయంలో మనుష్యులు సంతోషించి వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళగానే మళ్ళీ ఎక్కడి విషయాలు అక్కడే ఉండిపోతాయి. కేవలం ప్రజలు తయారవుతారు. రాజులుగా తయారయ్యేందుకు ఎంతగా కష్టపడతారు. రాజులుగా అవుతామని అందరూ చేతులు ఎత్తుతారు. 5-7 రోజుల తర్వాత చూస్తే, వారు ఉండనే ఉండరు. మాయ ఎంత శక్తివంతమైనది, వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. రాజధానిని స్థాపన చేయడం ఎంత కష్టము. ధర్మ స్థాపన చేయడంలో కష్టమేమీ ఉండదు. అక్కడ అసురుల విఘ్నాలేవీ కలగవు. ఇక్కడ పిల్లలు, మేము వివాహం చేసుకోము అని అంటే, నీవు తప్పక వివాహం చేసుకోవాలి, వివాహం లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని తండ్రి అంటారు. అరే, వివాహం చేసుకోకపోతే మంచిదే కదా. వివాహం చేసుకోకపోతే పిల్లలు కూడా ఉండరు. బర్త్ కంట్రోల్ (జనాభా నియంత్రణ) అవుతుంది. ఇప్పుడు ఎవరు చేస్తారో, వారు పొందుతారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇక మున్ముందు చాలా త్వర-త్వరగా తయారవుతారు. కల్ప క్రితం ఎలాగైతే స్థాపన జరిగిందో, అలాగే జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. గడిచిన ప్రతి రోజు కల్ప క్రితం వలె గడుస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు – గడిచిన ఈ రోజంతా డ్రామానుసారంగా గడిచింది, మళ్ళీ రేపు ఏదైతే జరగనున్నదో అది డ్రామానుసారంగానే జరుగుతుంది అనే ఆలోచన వస్తుంది. ఇది డ్రామా అని, దీని ఆదిమధ్యాంతాలు ఏమిటి అనేది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మేము పురుషార్థం చేస్తున్నామని, మిగిలినవారంతా ఘోర అంధకారంలో ఉన్నారని మీకు తెలుసు. ఏ పాత్ర అయితే నడుస్తుందో, అది డ్రామానుసారంగా నడుస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు అనారోగ్యం పాలైతే, దాన్ని కూడా డ్రామానుసారంగా కర్మ భోగాన్ని అనుభవించాల్సిందేనని అంటారు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. డ్రామా బుద్ధిలో ఉంది కనుక ఏ చింత ఉండదు. విఘ్నాలు కలిగితే, పని ఆలస్యమైతే – కల్ప-కల్పము ఇలాగే ఆలస్యమై ఉంటుందని అర్థం చేసుకుంటారు. లక్షణాలు అలా కనిపిస్తాయి. ఉన్నత పదవిని పొందేందుకు చాలా పురుషార్థం చేయాలి. మేము ఉన్నతిలోకి వెళ్తున్నామా? బాబా సేవ చేస్తున్నామా లేక ఒకే స్థానంలో కూర్చుండిపోయామా? మేము ఎవరి కళ్యాణమైనా చేస్తున్నామా? అని చూసుకోవాలి. అనేకుల కళ్యాణం చేస్తే మన కళ్యాణం కూడా జరుగుతుంది. పరీక్ష పూర్తయినప్పుడు, మేము ఈ పదవిని పొందుతామని అంతా తెలిసిపోతుంది. ఇది కల్ప-కల్పపు పందెము. తర్వాత చివర్లో, మేము ఇంత సమయం పురుషార్థం ఎందుకు చేయలేదు? బాబా శ్రీమతమనుసారంగా ఎందుకు నడుచుకోలేదు? అని చాలా పశ్చాత్తాపపడతారు. బాబా కేవలం ‘మన్మనాభవ’ అని చెప్తారు, అంతే. ఎంత ప్రేమగా చెప్తారు – పిల్లలూ, నన్ను స్మృతి చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేసే సేవను చేయండి. మరి పురుషార్థం చేసి ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు! అటువంటివారిని తెలివైన, వివేకవంతులైన పిల్లలు అని అంటారు. ఫలానా వారు శ్రీమతమును అనుసరించడం లేదు, ఎవరికీ కళ్యాణం చేయడం లేదు కనుక తప్పకుండా పదవి కూడా తక్కువదే లభిస్తుందని చదివించేవారు కూడా అర్థం చేసుకుంటారు. ఎంతగా అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. మీ కోసం మీరు సేవను చేసుకోవాలి, ఎవరు చేస్తారో, వారే పొందుతారు. కనుక మేము ఎందుకు అలాంటి సేవను చేయకూడదు అని పురుషార్థం చేయాలి. ఎక్కడైనా ప్రదర్శనీ జరిగితే, అక్కడికి సగం జీతంపై కూడా వెళ్ళి సేవ చేస్తారు. కొంతమందైతే మొత్తం జీతాన్ని కూడా వదిలి సేవ చేస్తారు. బాబా అంటారు – పిల్లలకు ఏదైనా కావాలంటే పంపండి. శరీర నిర్వహణను వేయి రూపాయలతోనైనా చేయవచ్చు, 10 రూపాయలతోనైనా చేయవచ్చు. ఎవరి వద్దనైనా చాలా ధనం ఉంటే, లక్షల రూపాయలు కూడా ఖర్చవుతాయి. బాబా అంటారు – మీరు గడ్డి కోస్తున్నా కూడా, కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అన్ని చింతల నుండి ముక్తులుగా అయ్యేందుకు డ్రామాను యథార్థ రీతిగా బుద్ధిలో ఉంచుకోవాలి. ఏది గడిచినా, అది కల్ప క్రితం వలె గడిచింది అని భావించాలి.
2. మేము పతితులను పావనంగా తయారుచేసే మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింతన నడవాలి. శ్రీమతమనుసారంగా స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి.
వరదానము:-
సంగమయుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారులుగా భావిస్తూ నడుచుకోండి – ఒకటి లైట్ (ప్రకాశ) కిరీటం అనగా పవిత్రత కిరీటం మరియు రెండవది – బాధ్యతల కిరీటం. పవిత్రత మరియు శక్తి – లైట్ మరియు మైట్ ల కిరీటాన్ని ధారణ చేసేవారిలో డబుల్ ఫోర్స్ సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబుల్ ఫోర్స్ కల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సేవలో మరియు పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!