21 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
20 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీ వంటి సౌభాగ్యశాలురు ఇంకెవ్వరూ లేరు, ఎందుకంటే ఏ తండ్రినైతే మొత్తం ప్రపంచమంతా పిలుస్తుందో, వారు మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు వారితో మాట్లాడుతారు”
ప్రశ్న: -
ఏ పిల్లలకైతే విచార సాగర మథనం చేయడం వస్తుందో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
వారి బుద్ధిలో రోజంతా – అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి, అందరి కళ్యాణం ఎలా చేయాలి అన్న తపన ఉంటుంది. వారు సేవ కోసం కొత్త-కొత్త ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు. వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది. వారు తమ సమయాన్ని వృథా చేసుకోరు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. పిల్లల ఎదురుగా నిరాకారుడైన పరమపిత పరమాత్మ మాట్లాడుతున్నారని కేవలం పిల్లలకు మాత్రమే తెలుసు. భగవంతుడిని ఉన్నతమైనవారని అంటారు. వారి స్థానం ఉన్నతమైనది. వారి నివాస స్థానం ప్రసిద్ధమైనది. మేము మూలవతన నివాసులమని పిల్లలకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాలన్నింటి గురించి తెలియదు. గాడ్ ఫాదర్ తెలియజేస్తారు. నిరాకారుడైన భగవంతుడు మాట్లాడుతున్నారని పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్యులెవ్వరికీ తెలియదు. వారు నిరాకారుడైన కారణంగా – భగవానువాచ ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరి బుద్ధిలోకీ రాదు. ఈ విషయం తెలియని కారణంగా గీతలో కృష్ణుని పేరు వేసేసారు. ఇప్పుడు వారు పిల్లల ఎదురుగా మాట్లాడుతున్నారు. సమ్ముఖంగా లేకుండా వినలేరు. దూరం నుండి వింటారు కానీ నిశ్చయం ఏర్పడదు. వారు, ఇది భగవానువాచ అని వినడం వింటారు కానీ యథార్థంగా మీకు తెలుసు. శివబాబా భగవంతుడు. బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ప్రాక్టికల్ గా మీకు తెలుసు. మీ బుద్ధి వెంటనే పైకి వెళ్ళిపోతుంది. శివబాబా ఉన్నతోన్నతమైన స్థానంలో నివసించేవారు. ఎవరైనా గొప్ప వ్యక్తి లేక రాణి మొదలైనవారు వస్తే, వీరు ఫలానా స్థానంలో ఉంటారు, ఈ సమయంలో ఇక్కడకు వచ్చారు అని తెలుస్తుంది, అలా పిల్లలైన మీకు కూడా – బాబా మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు, మేము కూడా బాబాతో పాటు తిరిగి వెళ్తాము, మేము పరంధామ నివాసులము అని తెలుసు. ఇప్పుడు మీకు తండ్రి మరియు ఇల్లు గుర్తుకువస్తాయి. ఆ తండ్రియే సృష్టి రచయిత. తండ్రి వచ్చి పిల్లలైన మీకు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం యొక్క రహస్యాలను అర్థం చేయించారు. ఎవరి బుద్ధిలో ఉంటుందో, వారే అర్థం చేసుకుంటారు. తప్పకుండా మనం భవిష్య 21 జన్మల కోసం, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నాము. పురుషార్థమైతే చేయాల్సిందే. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలకూడదు. పరీక్షలు జరిగేంతవరకు మనం తప్పకుండా చదువుకోవాల్సిందేనని స్కూల్లో పిల్లలకు తెలుసు. మేము పెద్ద-పెద్ద పరీక్షలు పాస్ అవుతాము, ఒక కాలేజీని వదిలి రెండవ కాలేజీకి, మూడవ కాలేజీకి వెళ్తాము అని వారికి లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. అంటే వారు చదువుతూ ఉండాలని అర్థము. పెద్ద వ్యక్తుల పిల్లలైతే, పెద్ద పరీక్షలు పాస్ అవ్వాలనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. మనం చాలా పెద్ద తండ్రికి పిల్లలమని మీకు తెలుసు. మనం శివబాబా సంతానమని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు చాలా పెద్ద, ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలు. చాలా పెద్ద చదువును చదువుకుంటారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు అని మీకు తెలుసు. చదివించేవారు తండ్రి కనుక ఎంత ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉండాలి. ఈ విషయాన్ని ఎవ్వరికైనా అర్థం చేయించవచ్చు. మనం చాలా గొప్ప తండ్రికి పిల్లలము. చాలా గొప్ప సద్గురువు మతం అనుసారంగా మనం నడుచుకుంటాము. టీచరు, గురువుల మతం అనుసారంగా నడుచుకోవాల్సి ఉంటుంది కదా. వారిని ఫాలోవర్స్ (అనుచరులు) అని అంటారు. ఇక్కడ తండ్రి మతం అనుసారంగా కూడా నడుచుకోవాలి, టీచర్ మతం అనుసారంగా కూడా నడుచుకోవాలి, అలాగే గురువు మతం అనుసారంగా కూడా నడుచుకోవాలి. వారు మనకు తండ్రి, టీచర్, సద్గురువు అని మీకు తెలుసు. వారి మతం అనుసారంగా తప్పకుండా నడుచుకోవాలి. వారు ఒక్కరే. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, వారు మాట్లాడుతారు.
బాబా పిల్లలను అడుగుతారు – శివబాబా మాట్లాడుతారా, అచ్ఛా – శంకరుడు మాట్లాడుతారా, బ్రహ్మా మాట్లాడుతారా, విష్ణువు మాట్లాడుతారా (ఎవరో చెప్పారు – శివుడు మరియు బ్రహ్మా మాట్లాడుతారు, విష్ణువు మరియు శంకరుడు మాట్లాడరు అని). విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు అని మీరు అంటారు కదా, మరి వారు మాట్లాడరా? మూగవారా? (జ్ఞానం చెప్పరు) నేను జ్ఞానం గురించి అడగడం లేదు, మాట్లాడడం గురించి అడుగుతున్నాను. విష్ణువు, లక్ష్మీ-నారాయణులు మాట్లాడుతారా? శంకరుడు మాట్లాడరు అంటే అది సరే. మిగిలిన ముగ్గురూ ఎందుకు మాట్లాడరు. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు, అంటే తప్పకుండా మాట్లాడుతారు కదా. శివబాబా నిరాకారుడు కదా, వారెలా మాట్లాడుతారని మనుష్యులు శివబాబా కోసం అనుకుంటూ ఉండవచ్చు. శివబాబా కూడా వీరిలోకి వచ్చి మాట్లాడుతారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మాకు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. దత్తత తీసుకోబడ్డారు కదా. సన్యాసులు కూడా సన్యాసం తీసుకున్న తర్వాత తమ పేరు మార్చుకుంటారు. మీరు కూడా సన్యసించారు కనుక మీ పేరు కూడా మారాలి. మొదట్లో బాబా పేర్లు పెట్టారు. కానీ ఎవరికైతే పేర్లు పెట్టారో, వారు కూడా చనిపోయారు – ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు, అందుకే ఎన్ని పేర్లు పెట్టాలి, ఎంతమందికి పెట్టాలి. ఈ రోజుల్లో మాయ కూడా చాలా తీవ్రంగా ఉంది. బుద్ధి చెప్తుంది – లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు దానిని విష్ణుపురి అని అనేవారు. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేస్తారన్నప్పుడు, వారు ఎందుకు మాట్లాడరు! బాబా ఇక్కడి గురించి చెప్పడం లేదు. నిరాకారుడు ఎలా మాట్లాడుతారని మనుష్యులంటారు. వారికి, నిరాకారుడు ఎలా వస్తారు అనేది తెలియనే తెలియదు. వారిని పతితపావనుడు అని అంటారు. వారు జ్ఞానసాగరుడు కూడా, చైతన్యమైనవారు కూడా, ప్రేమసాగరుడు కూడా. ఇప్పుడు ప్రేమ అనేది ప్రేరణ ద్వారా కలగదు, వారు కూడా ఇతనిలోకి ప్రవేశించి పిల్లలను ప్రేమించగలరు కదా, అప్పుడే మేము పరమపిత పరమాత్ముని ఒడిలోకి వచ్చామని అంటారు. బాబా, ఇక మీతోనే తింటాము, మీదే వింటాము… బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు బుద్ధిలోకి రారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు – మీ వంటి సౌభాగ్యశాలురు ఎవ్వరూ లేరు. మనం ఎంత ఉన్నతమైన పాత్రధారులము అనేది మీకు తెలుసు. ఇది ఆట కదా. ఇంతకుముందు, మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ప్రవేశించారు కనుక డ్రామా ప్లాన్ అనుసారంగా వారి ద్వారా వింటున్నారు.
తండ్రి అంటారు – మధురాతి-మధురమైన పిల్లలు, బాబా నిరాకారుడని మీకు తెలుసు. వారు ఆత్మలైన మనకు తండ్రి. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైనవాటిలో రాసి లేవు. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయ్యింది. విద్యార్థులు చదువుకున్నప్పుడు వారి బుద్ధిలోకి మొత్తం చరిత్ర-భూగోళాలు వస్తాయి. కానీ, బాబా ఎక్కడున్నారు అనేది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాన్ని యథార్థంగా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మరియు ప్రాక్టికల్ గా ఆ సంతోషముంటుంది. బాబా పరంధామం నుండి వస్తారు, మనల్ని చదివిస్తారు. రోజంతా పరస్పరంలో ఇదే ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండాలి. ఈ జ్ఞానం తప్ప మిగిలినవన్నీ సర్వనాశనం చేసే విషయాలు. శరీర నిర్వహణార్థం మీరు వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి కూడా చేయాలి మరియు దానితో పాటు ఈ ఆత్మిక సేవ కూడా చేయాలి.
ఈ భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండేదని, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని మీకు తెలుసు. దేవతల చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటి యథార్థ జ్ఞానం ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. నంబరువన్ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని తీసుకోండి, ఆలోచించండి – తప్పకుండా వీరు భారత్ లో రాజ్యం చేసేటప్పుడు ఒకే ధర్మముండేది. రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమైంది అనగా కలియుగం పూర్తి అయి సత్యయుగం ప్రారంభమైంది. కలియుగము రాత్రి. సత్యయుగము ఉదయము. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారని విచార సాగర మథనం చేయాలి. సాగరంలో రాయిని వేసినట్లయితే అలలు ఉత్పన్నమవుతాయని అంటారు. అలాగే మీరు కూడా రాయి వేయండి, మనుష్యులకు అర్థం చేయించండి. ఆలోచించండి – భారత్ లో దేవీ-దేవతల రాజ్యముండేది కదా, వారే మళ్ళీ భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు, తర్వాత వాటినే దోచుకున్నారు. ఇది నిన్నటి విషయము. ఇప్పుడు భక్తి మార్గముంది కావున తప్పకుండా దీని తర్వాత జ్ఞాన మార్గముంటుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి కూడా వచ్చి తమ జీవిత కథను తెలియజేస్తారు. ఇది మీకు ఎందుకు గుర్తు రావడం లేదు. బాబా వచ్చి మనకు ఈ పూర్తి జ్ఞానాన్ని వినిపిస్తారు, వివేకం కూడా ఉండాలి కదా. ఎవరికైనా సరే, ఇవే విషయాలను వినిపించండి. ఈ చిత్రము మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ లక్ష్మీ-నారాయణులు అందరికన్నా గొప్ప రాజు-రాణి. భారత్ స్వర్గంగా ఉండేది కదా. ఇది నిన్నటి విషయము. తర్వాత వీరు ఈ రాజ్య సింహాసనాన్ని ఎలా పోగొట్టుకున్నారు. నా పిల్లలు కూడా ఇదంతా వింటారు కానీ బుద్ధిలో ఎప్పుడూ మెదలదు. బుద్ధిలో గుర్తు కూడా ఉండదు. ఒకవేళ గుర్తుంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. వాస్తవానికి ఇది చాలా సహజము. మీరు ఇక్కడకు లక్ష్మీ-నారాయణుల వలె తయారయ్యేందుకు వస్తారు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయమని అర్థం చేయించడం జరిగింది. ఇంతకంటే లాంగ్ లాంగ్ ఎగో (చాలా కాలం క్రితం) అనేది ఇంకేదీ ఉండదు. అన్నింటికన్నా పురాతనమైనది భారత్ కథనే. నిజానికి ఇదే సత్యాతి-సత్యమైన కథ అయి ఉండాలి. అన్నింటికన్నా పెద్ద కథ ఇదే. వీరి రాజ్యముండేది, ఇప్పుడు ఆ రాజ్యం లేదు. ఆ రాజ్యం గురించి కొద్దిగా కూడా ఎవరికీ తెలియదు. మీ బుద్ధిలో నంబరువారుగా మెదులుతూ ఉంటుంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అది కూడా పూర్తి రీతిలో ఎవ్వరూ స్మృతి చేయరు. తండ్రి బిందువు, నేను కూడా బిందువు -ఇది కూడా బుద్ధిలో నిలవదు. కొందరి బుద్ధిలోనైతే మంచి రీతిలో మెదులుతుంది. ఎవరికైనా కూర్చొని అర్థం చేయించినప్పుడు 4-5 గంటలు కూడా పడుతుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఉదాహరణకు సత్యనారాయణ కథను కూర్చొని వింటారు కదా. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, వారు 2-3 గంటలు కూర్చొని వింటారు. ఇక్కడ కూడా – ఎవరికైతే చాలా ఆసక్తి ఉంటుందో, వారికి అసలు ఇంకేమీ తోచదు. కేవలం ఈ విషయాలను అర్థం చేసుకోవడంలోనే ఆనందం కలుగుతుంది. ఈ విషయాలు బాగా అనిపిస్తాయి. వారు ఈ సేవలోనే నిమగ్నమవ్వాలని, ఇతర వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ వదిలేయాలని భావిస్తారు. కానీ అలాగే ఎవ్వరూ కూర్చొని ఉండిపోకూడదు. పిల్లలైన మీరు ఈ సత్యనారాయణ కథను వింటున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఎంత మంచి విషయాలు తిరుగుతూ ఉంటాయి. మనం ఈ సామాగ్రిని డెలివరీ చేసేందుకు ఎవర్రెడీగా ఉన్నాము, సామాగ్రీ సదా రెడీగా ఉండాలి. మీరు ఈ చిత్రాన్ని కూడా చూపించి – ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎలా లభించింది, వీరు ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఆ సమయంలో సృష్టిలో ఎంతమంది మనుష్యులు ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు – ఇలా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఏదో ఒక రాయి ఇలా వేస్తూ ఉంటే, విచార సాగర మథనం జరగగలదు. మన ఈ కులానికి చెందినవారైతే వారికి వెంటనే అల చేరుకుంటుంది. మన కులానికి చెందినవారు కాకపోతే ఏమీ అర్థం చేసుకోరు, వెళ్ళిపోతారు. ఇది నాడిని చూసే విషయము. మీరు ఈ మధురాతి-మధురమైన జ్ఞానం తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు. ఒకవేళ జ్ఞానం కాకుండా ఇంకేదైనా మాట్లాడినట్లయితే, అది అసురత్వానికి సంబంధించిందని, అందులో ఏ సారము లేదని భావించండి. మన వద్ద వినాలనే అభిరుచి ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. బాబా అర్థం చేయిస్తారు – ఆసురీ విషయాలను ఎప్పుడూ వినకూడదు, కళ్యాణకారీ విషయాలనే వినండి, లేదంటే అనవసరంగా మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు. తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్నే వినిపిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – ఇంకే మాటలు మాట్లాడకండి, ఇందులో చాలా సమయాన్ని వృథా చేసుకుంటారు. ఫలానా వారు ఇలా ఉన్నారు, వారు ఇలా చేస్తారు… వీటిని ఆసురీ విషయాలని అంటారు. ప్రపంచం వారి విషయం వేరు, మీకైతే ఒక్కొక్క క్షణము చాలా విలువైనది. మీరు ఎప్పుడూ అలాంటి మాటలు వినకండి, మాట్లాడకండి. దీని కన్నా మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే, మీకు చాలా సంపాదన ఉంటుంది. అంతటా తండ్రి పరిచయాన్ని వెళ్ళి ఇవ్వండి. ఈ ఆత్మిక సేవనే చేస్తూ ఉండండి.
మీరే సత్యాతి-సత్యమై మహావీరులు. ఈ మార్గాన్ని ఎవరో ఒకరికి తెలియజేయాలని రోజంతా ఇదే తపన ఉండాలి. తండ్రి అంటారు – అల్ఫ్ (శివబాబా) అయిన నన్ను స్మృతి చేస్తే బే (రాజ్యాధికారం) లభిస్తుంది. ఇది ఎంత సహజము. వెళ్ళి, ఈ విధంగా సేవ చేయాలి. పిల్లలు సేవ పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తండ్రి కూడా పిల్లలైన మీకు అర్థం చేయించడానికే వచ్చారు కదా. పిల్లలైన మీరు కూడా చదువుకునేందుకు మరియు చదివించేందుకు వచ్చారు. సమయం వృథా చేసుకునేందుకు లేక కేవలం రొట్టెలు తయారుచేసేందుకు రాలేదు. బుద్ధిలో రోజంతా సేవ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనకు అవసరం లేని విషయాలను వినడంలో మరియు మాట్లాడడంలో సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఎంత వీలైతే అంత చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి.
2. మనల్ని చదివించేవారు ఎవరు అన్న సంతోషంలో మరియు ఉల్లాసంలో సదా ఉండాలి. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలకూడదు. నోటి నుండి జ్ఞాన రత్నాలే వెలువడాలి.
వరదానము:-
సదా తమ సతోప్రధాన సంస్కారాలలో స్థితులై, సుఖ-శాంతులను అనుభూతి చేయడమే సత్యమైన అహింస. దేని ద్వారానైతే దుఃఖము మరియు అశాంతి ప్రాప్తిస్తాయో, అది హింస. కనుక, రోజంతటిలో ఏ రకమైన హింస చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పదం ద్వారా ఎవరి స్థితినైనా విచలితం చేస్తే, అది కూడా హింసనే. 2. ఒకవేళ మీ సతోప్రధాన సంస్కారాలను అణిచి వేసి, ఇతర సంస్కారాలను ఆచరణలోకి తీసుకొస్తే, అది కూడా హింసనే. అందుకే సూక్ష్మత లోకి వెళ్ళి ‘మహాన్ ఆత్మను’ అనే స్మృతి ద్వారా డబల్ అహింసకులుగా అవ్వండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!