24 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
23 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇక్కడ మీరు శ్రీకృష్ణుని వలే రాకుమారునిగా తయారయ్యే చదువును చదువుకుంటారు, మిమ్మల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడు”
ప్రశ్న: -
భగవానువాచ అనే పదాన్ని బాబా ఉపయోగించినప్పుడు, పిల్లల్లో కూడా చాలా మంది తికమకపడతారు – ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే భగవంతుడు గుప్తంగా ఉన్నారు. వారు, బహుశా ఈ దాదానే భగవానువాచ అని అన్నారని భావిస్తారు. కానీ నిరాకారుడైన భగవంతుడికి మాట్లాడేందుకు తప్పకుండా నోరు కావాలి కదా. బాబా అంటారు – నేను ఇతనిలోకి ఎలా ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తున్నాను అనేది అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన విషయము.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. భగవానువాచ. భగవంతుడు ఏమంటారు? ఇలా భగవానువాచ అని ఎవరన్నారు? చూసేందుకైతే ఎవరూ కనిపించడం లేదు. మనుష్యులను భగవంతుడు అని అనరు. ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నారో, వారే ‘భగవానువాచ’ అని అంటున్నారని కొందరు భావిస్తారు. కానీ నిరాకారుడైన భగవంతుడు మాట్లాడుతున్నారని కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఎవరు కూర్చొని ఉన్నారు! భగవంతుడు ఎక్కడ ఉన్నారు! ఇది కొత్త విషయం కదా, అందుకే మనుష్యులు తికమకపడతారు. కానీ తప్పకుండా భగవానువాచ ఉంది. వారు, నేను పిల్లలకు రాజయోగం నేర్పిస్తున్నానని అంటారు. నరుని నుండి నారాయణునిగా లేక కృష్ణునిగా, నారి నుండి లక్ష్మిగా లేక రాధగా చేసేందుకు యోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తాను, ఇంతకన్నా ఇంకేమి కావాలి. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా, రాకుమారులకే రాకుమారులుగా తయారుచేస్తాను. రాకుమార-రాకుమారీలు కూడా మందిరాలకు వెళ్తూ ఉండవచ్చు కదా. వికారీ రాకుమారులు, నిర్వికారీ రాకుమారుడైన శ్రీకృష్ణునికి నమస్కరిస్తారు. కావున నేను మిమ్మల్ని రాకుమారులకే రాకుమారులుగా తయారుచేస్తాను. శ్రీకృష్ణుని వలె స్వర్గానికి రాకుమారునిగా తయారవ్వండి. జ్ఞానం చదువుకోవడంతోనే కదా అలా తయారవుతారు. డాక్టరు లేక బ్యారిస్టరు విద్యార్థులతో ఇలా అంటారు కదా – నేను మిమ్మల్ని డాక్టరుగా లేక బ్యారిస్టరుగా తయారుచేస్తాను అని. కానీ చదువుకుంటేనే అలా తయారవుతారు. బాబా అంటారు – పిల్లలూ, రాజయోగాన్ని నేర్పించేది ఒక్క భగవంతుడే, అంతేకానీ కృష్ణుడు కాదు అని మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. రాధా-కృష్ణులు వేర్వేరు రాజ్యాలకు చెందిన పిల్లలు. వారివురికీ నిశ్చితార్థం జరుగుతుంది, వివాహం తర్వాత పేరు మారుతుంది, అందుకే చిత్రంలో కూడా లక్ష్మీ-నారాయణుల కింద రాధా-కృష్ణులను చూపించారు.
ఇప్పుడు తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు – ఒకప్పుడు ఈ బ్రహ్మా కూడా నంబరువన్ భక్తునిగా ఉండేవారు. చివర్లో నారాయణుడిని పూజించేవారు. కృష్ణుని భక్తి చేసినా లేక నారాయణుని భక్తి చేసినా, విషయం ఒక్కటే. కృష్ణుడే పెద్దవారయ్యాక నారాయణునిగా అవుతారు. ఇప్పుడు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ సమయంలో ఇతని ఆత్మ కూడా చదువుకుంటుంది, తర్వాత భవిష్యత్తులో శ్రీకృష్ణునిగా అవుతుంది. తండ్రి అంటారు – పిల్లలూ, మీరు జ్ఞాన చితిపై కూర్చొని తెల్లగా అవుతారు, మళ్ళీ కామ చితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. ఇది కంసపురి, నేను మిమ్మల్ని కృష్ణపురిలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. శ్రీకృష్ణుడే సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు… ఇక్కడ ఎవరిలోనూ సర్వ గుణాలు లేవు. నేను పిల్లలైన మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులుగా తయారుచేసేందుకు వచ్చాను. యోగబలంతో ఇలా తయారవ్వాలి. బాహుబలం అంటే హింసాయుతమైన యుద్ధము, అది విల్లు-బాణాలతో జరిగేది, ఆ తర్వాత తుపాకులతో, ఖడ్గాలతో జరిగింది. ఇప్పుడిక బాంబులతో జరుగుతుంది. ఇంట్లో కూర్చొనే అంతా సమాప్తమయ్యే విధంగా బాంబులను తయారుచేస్తామని వారు స్వయంగా అంటారు. అప్పుడిక మిలటరీ ఏం చేస్తుంది! తండ్రి అంటారు – మధురాతి-మధురమైన పిల్లలూ, ఇది పాఠశాల. నేను మిమ్మల్ని రాకుమారుడైన శ్రీకృష్ణుని వలె తయారుచేస్తాను. సత్యయుగం యొక్క మొదటి రాకుమారుడు ఇప్పుడు 84 జన్మలను తీసుకొని కలియుగంలో బికారిగా అయ్యారు. అతని రాజ్యం భారత్ లోనే ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకోవాల్సి వచ్చింది కదా. ఒకవేళ కృష్ణుడిని భగవంతుడు అని అంటే, భగవంతుడు పునర్జన్మలలోకి ఎలా వస్తారు? భగవంతుడైతే నిరాకారుడు. వారు ఒక్కరే రచయిత, మిగిలినవారంతా రచన. అందుకే ఆత్మలైన మనమందరము పరస్పరంలో సోదరులమని అంటారు. బాబా అర్థం చేయిస్తారు – బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలైన మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు. అటువంటప్పుడు అశుద్ధ దృష్టి ఎలా ఉండగలదు. మీరు ఆ ఒక్క తండ్రి నుండి భవిష్యత్తు కోసం వారసత్వాన్ని తీసుకుంటారు. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే శాంతిధామానికి, సుఖధామానికి ఎలా వెళ్తారు. మేము పతితులుగా అయిపోయాము, మమ్మల్ని పావనంగా తయారుచేసేందుకు రండి అని పిలుస్తారు కూడా. అందుకే తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి. ఇది మీ అంతిమ జన్మ. ఆత్మలైన మీరంతా ఇప్పుడు తిరిగి వానప్రస్థంలోకి వెళ్ళగలరు, అందుకే మీరు వానప్రస్థులు. ఈ విధంగా ఏ గురువు మార్గం చూపించలేరు. ఈ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే పతిత-పావనుడు, నిరాకారుడు. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేయండి, నేను కొంత సమయం కోసం ఈ తనువును అప్పుగా తీసుకున్నాను. శరీరం లేకుండా ఆత్మ ఎలా మాట్లాడగలదు! భగవానువాచ – నేను వృద్ధ సాధారణ తనువులోకి ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. నేను గర్భంలోకి రాను. గర్భంలో ప్రవేశించేవారికి పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నాకు తప్పకుండా ప్రకృతి యొక్క ఆధారం కావాలి. నేను ఇతనిలో కూర్చొని మిమ్మల్ని చదివిస్తాను. ఇంతకుముందు ఇతను వజ్రాల వ్యాపారం చేసేవారు. ఇతనికి ఏ గురువు నేర్పించలేదు, అకస్మాత్తుగా తండ్రి ప్రవేశించారు. తండ్రి చేసేవారు-చేయించేవారు కనుక ఇతని ద్వారా కర్తవ్యాన్ని చేయిస్తూ ఉంటారు. ఇతను కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇతనితో పాటు మీరు కూడా నేర్చుకుంటూ ఉంటారు. (శివబాబా) మీకు చెప్తారు, కానీ ముందు నేను (బ్రహ్మా) వింటాను. పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, కానీ ఇతని ఆత్మ కూడా చదువుకుంటూ ఉంటుంది. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ చదివించరు. ఇది పావనంగా అయ్యే విషయము. ఈ సంగమయుగము, పురుషోత్తములుగా అయ్యే యుగము. శ్రీకృష్ణుడు పురుషోత్తమునిగా ఉండేవారు. స్వయంవరం తర్వాత వారి డిగ్రీ కొద్దిగా తగ్గిపోతుంది, అందుకే శ్రీకృష్ణునికి చాలా మహిమ ఉంది. దాని పేరే శ్రీకృష్ణపురి. దీనిని కంసపురి అని అంటారు. ఇకపోతే కృష్ణుడు మరియు కంసుని గురించి కథ తయారుచేయబడింది.
పరిపక్వ అవస్థ తయారైందంటే, భక్తి దానంతటదే వదిలిపోతుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. మీరు ఎప్పుడూ ఎవరికీ భక్తి చేయవద్దని చెప్పకూడదు. వారికి జ్ఞానమివ్వాలి. తండ్రి మీకు జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గం యొక్క రాకుమారునిగా తయారుచేసేందుకు వచ్చారు. కృష్ణుడు కూడా స్వర్గానికి యజమానిగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా లేరు. వారు కూడా మళ్ళీ రాజయోగం ద్వారా ఆ విధంగా తయారవుతున్నారు. మీకు కూడా పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. స్వర్గ స్థాపన చేసేవారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారే వచ్చి కొత్త సృష్టిని రచిస్తారు. కలియుగం పూర్తి అయినప్పుడు వారు కొత్త సృష్టిని రచిస్తారు. వారు సత్య-త్రేతా యుగాలలోకి రారు. నేను కల్ప-కల్పము సంగమయుగంలో వస్తానని చెప్తారు. వారు కల్పం అన్న పదాన్ని తీసివేసి కేవలం యుగే-యుగే అని రాసేసారు. అలా అయినా సరే నాలుగు యుగాలు ఉన్నాయి, ఐదవది సంగమయుగము. అచ్ఛా, అటువంటప్పుడు 5 అవతారాలని భావించండి. కానీ తాబేలు, చేప, పరశురామ… ఇలా ఇన్ని అవతారాలుంటాయా! ఇవన్నీ శాస్త్రాల విషయాలు. ధర్మం పేరును మరియు భారత్ పేరును మార్చేసారు. హిందు ధర్మము మరియు హిందుస్థాన్ అని అంటారు. భారత్ అన్న పేరును ఎందుకు మార్చాలి! యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని ఉంది కదా. ఇందులో కూడా భారత్ అన్న పదం వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు భక్తిని కేవలం ఒక జన్మ మాత్రమే చేయలేదు, భక్తి ద్వాపరం నుండి చేస్తూ వచ్చారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది, కేవలం శివుని భక్తి మాత్రమే చేసేవారు. ఆ శివబాబానే ఇంతకుముందు భారత్ ను స్వర్గంగా తయారుచేసారు మరియు మళ్ళీ ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చారు. కావున పతిత శరీరంలో కూర్చొని చెప్తున్నారు – నేను పతితులను పావనంగా తయారుచేసేందుకు పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి వస్తాను. భక్తి మార్గంలో నా కోసం చాలా భారీ మందిరాలను నిర్మిస్తారు. ఇది ఎంత స్పష్టమైన విషయము. వీరిలోకి బాబా ప్రవేశించగానే, గీత మొదలైనవి చదవడం విడిచిపెట్టేసారు. భక్తి దానంతటదే వదిలిపోయింది. సులభంగానే వదిలేసారు. భక్తి చేయకండి అని మీకు ఎవరూ చెప్పలేదు.
ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తారు – నేను మిమ్మల్ని మళ్ళీ కృష్ణపురికి యజమానులుగా చేస్తాను. కృష్ణునివి 8 వంశాలు నడుస్తాయి. ముందు సత్యయుగ రాకుమారుడు అని అంటారు, తర్వాత సత్యయుగానికి మహారాజుగా అవుతారు. వారివి 8 తరాలు కొనసాగుతాయి. ఆ సమయంలో రెండవ రాజ్యమేదీ ఉండదు. ఇప్పుడు బాబా అంటారు – పిల్లలైన మీరు కూడా సత్యయుగ రాకుమారులుగా అవ్వండి. భక్తిలో ఏ సుఖము లేదు. జ్ఞానం ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎవరి తండ్రి అయినా మరణించినప్పుడు, మీ తండ్రి ఎక్కడకు వెళ్ళారని అడిగితే స్వర్గస్థులయ్యారని అంటారు. ఆత్మ మరియు శరీరం, రెండు వెళ్ళాయని భావిస్తారు. కానీ, శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు, ఇక వెళ్ళింది ఆత్మ మాత్రమే. స్వర్గస్థులయ్యారని అంటే అంతకుముందు నరకంలో ఉన్నారని అర్థము. ఆత్మ శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్తే, ఇక అందులో ఏడ్వాల్సిన అవసరమేముంది? ఇప్పుడు స్వర్గమేమైనా ఇక్కడ ఉందా? కానీ అర్థం చేసుకోరు. అంతా ఈశ్వరుని ఆజ్ఞ, సుఖము-దుఃఖము అన్నీ ఈశ్వరుడే ఇస్తారు, అన్నీ ఈశ్వరుని రూపాలే అని అంటారు. కానీ తండ్రి అంటారు – నేను పిల్లలకు దుఃఖమెలా ఇవ్వగలను. తండ్రి నుండి పిల్లలు ఎప్పుడైనా దుఃఖం కోరుకుంటారా? తండ్రి పిల్లలను యోగ్యులుగా తయారుచేసి, ఆస్తిని ఇచ్చి వెళ్తారు. ఇకపోతే, దుఃఖమనేది ప్రతి ఒక్కరికి తమ కర్మల అనుసారంగానే లభిస్తుంది. తండ్రి అంటారు – ఇప్పుడు సంతానం కావాలని అడగకండి. ఇప్పుడు ఈ ఆస్తులు మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి. అప్పుడిక మీ పిల్లలకు ఏం లభిస్తుంది! పిల్లలు మీ ఆస్తికి యజమానులుగా అవ్వగలిగేంత సమయమే లేదు. పిల్లలు పెద్దవారైతే కదా యజమానులుగా అవుతారు, కానీ అంత సమయమే లేదు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు అంటారు – కలియుగం పూర్తవ్వడానికి ఇంకా 40 వేల సంవత్సరాలు ఉంది, ఈ బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు వినాశనం-వినాశనం అని అంటూ ఉంటారు. ఒక కథ ఉంది కదా – పులి వచ్చింది, పులి వచ్చింది… అని అంటారు, చివరికి అది వచ్చి తినేసింది. మృత్యువు నెమ్మది-నెమ్మదిగా వస్తుందని, ఇదంతా జరుగుతూనే ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మీరు మహాకాలుడు వచ్చి ఉన్నారని అంటారు. కాలుడికే కాలుడైన శివబాబా వచ్చి ఉన్నారు, వారు ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు. కావున శరీరాన్ని తప్పకుండా వదలాల్సి ఉంటుంది, అందుకే బాబా అంటారు – యోగంతో పవిత్రంగా అవ్వండి. వారు ఆత్మలను పవిత్రంగా తయారుచేసి తిరిగి తీసుకువెళ్తారు. ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే, చివర్లో చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు ఉన్నత పదవిని కూడా పొందలేరు. శ్రీకృష్ణుడు నంబరువన్ పాస్ విత్ ఆనర్, వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. 21 జన్మల కోసం రాజ్యం పొందుతారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. బుద్ధిలో కూర్చొంటుంది కూడా కానీ మళ్ళీ మాయమైపోతుంది. ఎవరి చేత భక్తి వదిలేలా చేయకూడదు. భక్తులకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు అంటారు – నేను కల్పక్రితం వలె మళ్ళీ అదే సాధారణ తనువులోకి వచ్చాను. కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇది ఉన్నతోన్నతమైన చదువు. మనం సతోప్రధానంగా ఉండేవారమని, ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నామని మీకు తెలుసు. తర్వాత, భారత్ యే సతోప్రధానంగా తయారవుతుంది. ఇతర ధర్మాల వారు అంత సుఖాన్ని అనుభవించలేదు, అంత దుఃఖాన్ని కూడా అనుభవించలేదు. విదేశీయుల వద్ద ధనం చాలా ఉంది కనుక పేద దేశానికి అప్పు ఇస్తారు. కానీ అది వారు రిటర్న్ ఇస్తున్నారని పాపం వారికి తెలియదు. పూర్తిగా ఘోరమైన అంధకారంలో, కుంభకర్ణుని నిద్రలో నిద్రించి ఉన్నారు. చివర్లో అయ్యో-అయ్యో అని అంటూ మేల్కొంటారు. అప్పుడు మీరు – టూ లేట్ (చాలా ఆలస్యమైపోయింది) అని అంటారు ఎందుకంటే అప్పటికి యుద్ధం మొదలైపోతుంది. అప్పుడిక ఏం చేస్తారు! అడవికి నిప్పు అంటుకుంటే ‘టూ లేట్’ అయిపోతుంది, అందుకే తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు త్వరత్వరగా పురుషార్థం చేస్తూ వెళ్ళండి. బాబా పెద్ద కష్టమేమీ ఇవ్వరు. బాబాకు వచ్చి చెప్తారు – బాబా, ఒకవేళ మేము పూజ చేయకపోతే, మీరు నాస్తికులుగా అయిపోయారని వారంటారు. బాబా సలహానిస్తారు – సాక్షీగా అయి బాబా స్మృతిలో ఉండండి. బాహ్యంగా ఏదో కాస్త పూజ చేయండి. ఒకటేమో హృదయపూర్వకంగా చేయడం, మరొకటి ఇతరులను తృప్త పరిచేందుకు చేయడం. లోలోపల మీరు శివబాబాను స్మృతి చేయాలి. ఎవరైనా విసిగిస్తే, మీరు పూజ చేసి చూపించండి, అప్పుడు వారు సంతోషపడతారు. ఇలా చేయడం పాపమేమీ కాదు. బాబా అయితే చాలామందికి చెప్తూ ఉంటారు – వివాహాలు మొదలైనవాటికి వెళ్ళండి, ఇరువైపులా యుక్తియుక్తంగా సంబంధాలను నిర్వర్తించాలి. అక్కడ కూడా వినిపిస్తూ ఉంటే, ఎవరో ఒకరికి బాణం తగులుతుంది. యుక్తిగా నడుచుకోవాలి. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు – ఇప్పుడు పతితంగా అవ్వకూడదు. పవిత్రంగా అయితేనే మీరు కృష్ణపురికి యజమానులుగా అవుతారు. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలూ, ఇలాంటి యుక్తుల ద్వారా మీ మిత్ర-సంబంధీకులకు అర్థం చేయించాలి. అది భౌతిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక యాత్రను తండ్రి నేర్పిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని, దుఃఖాలన్నీ దూరమవుతాయని అంటారు. ఎవరో అరుదుగా మాత్రమే ఈ వ్యాపారం చేస్తారు అనగా వైకుంఠ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. అలాగని, ధనం మొదలైనవాటిని వ్యర్థంగా, ఫలితం లేకుండా ఖర్చు పెట్టకూడదు. ఇళ్లు-వాకిళ్ళను కూడా సంభాళించాలి, పిల్లల పాలనను కూడా చేయాలి. కేవలం శ్రీమతాన్ని అనుసరించాలి. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలని సలహా తీసుకోవాలి. బాబా, కూతురు వివాహం చేసుకుంటానని అంటుంది, బాబా అంటారు – అప్పుడు వివాహం చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఆమె భాగం, ఆమెకు ఇచ్చేయండి. కానీ ఇంకేమైనా అడగాలంటే అడిగి శ్రీమతాన్ని అనుసరించండి అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, ఇందులోనే కళ్యాణముంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ప్రతి కర్మను సాక్షీగా అయి శివబాబా స్మృతిలో చేయాలి. లౌకికం, అలౌకికం రెండు వైపులా యుక్తియుక్తంగా సంబంధాలను నిర్వర్తించాలి. లౌకికం వారితో యుక్తియుక్తంగా నడుచుకోవాలి.
2. ఈ సమయంలో అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున తప్పకుండా పావనంగా అవ్వాలి. ఎలాంటి బంధనాలు తయారుచేసుకోకూడదు.
వరదానము:-
ఏ రకమైన విఘ్నాల నుండైనా, బలహీనతల నుండైనా లేక పాత సంస్కారాల నుండైనా ముక్తులుగా అవ్వాలనుకుంటే శక్తిని ధారణ చేయండి అనగా అలంకార రూపులుగా అయి ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరించబడి ఉంటారో, వారు భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణీ సంకల్పం లేక సంస్కారం టచ్ చేయలేదు. వారు పాత ప్రపంచం నుండి లేక ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తుల నుండి సహజంగానే పక్కకు తప్పుకుంటారు, వారిని కారణంగానైనా, అకారణంగానైనా ఎవరూ టచ్ చేయలేరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!