22 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

22 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

21 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన డ్రామాలో హీరో-హీరోయిన్ల పాత్ర మీది, తండ్రిది కాదు. తండ్రి వద్ద కేవలం పతితులను పావనంగా తయారుచేసే కళ మాత్రమే ఉంది”

ప్రశ్న: -

బ్రహ్మా చిత్రాన్ని చూసి ప్రశ్నలు వేసేవారికి ఏ రహస్యాన్ని అర్థం చేయించాలి?

జవాబు:-

వారికి అర్థం చేయించండి – వీరు ఆది ఆత్మ, వీరే ఇప్పుడు అంతిమంలో ఉన్నారు. మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుని యొక్క చివరి జన్మలోనే తండ్రి వస్తారు. ఇది పతిత తనువు, వీరే పావనంగా తయారవ్వాలి. వీరు భగవంతుడేమీ కాదు. భగవంతుడు సదా పవిత్రుడు. వారు వీరి తనువును ఆధారంగా తీసుకున్నారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ….. (ముఖడా దేఖ్లే ప్రాణీ…..)

ఓంశాంతి. శాంతి కోసం బయట ప్రతి గడప వద్ద ఎదురుదెబ్బలేమీ తినకూడదు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. గృహస్థ వ్యవహారంలో ఉంటే శాంతి లభించదు, శాంతి అనేది అడవిలో లభిస్తుంది అని హఠయోగ సన్యాసులు భావిస్తారు. కానీ శాంతి అక్కడ కూడా లభించదని తండ్రి అర్థం చేయిస్తారు. దీని గురించి ఒక కథను లేదా ఉదాహరణను వినిపిస్తారు – రాణి మెడలోనే హారం ఉంది కానీ ఆమె దాని కోసం బయటంతా వెతికారు అని….. ఈ విధంగా శాంతి మీ మెడలోనే ఉంది. దీని కోసం బయట ఎక్కడ వెతుకుతారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఆత్మ అయిన మీ స్వధర్మమే శాంతి, మీ ఈ శరీరము కర్మేంద్రియాలతో కూడినది, దీని ద్వారా మీరు పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఆత్మ అవినాశీ. ఆత్మ ఏమీ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు, అలాగే వినాశనం కూడా అవ్వదు. అయితే, ఆత్మ పతితంగా అవుతుంది, ఆత్మకే పావనంగా అవ్వాల్సి ఉంటుంది. ఆత్మకు ముందు కిశోర శరీరం లభిస్తుంది, తర్వాత అది యువత శరీరంగా, వృద్ధాప్య శరీరంగా అవుతుంది. కానీ ఆత్మ అయితే ఏకరసంగా ఉంటుంది. ముందుగా ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మనైన నేనే బ్యారిస్టరు మొదలైనవారిగా తయారవుతాను. దీనినే ‘ఆత్మాభిమానీ భవ’ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరు దేహాభిమానులుగా అయిపోయారు, అందుకే స్వయాన్ని శరీరంగా భావిస్తున్నారు. నేను ఆత్మను, ఇది నా శరీరము అనే విషయాన్ని మర్చిపోయారు. కావున స్వయాన్ని రియలైజ్ అవ్వాలి. 84 జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు – ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో, వారే తర్వాత దేవతలుగా అవుతారు. అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. కొంతమంది ముందు వస్తారు, కొంతమంది 50-100 సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి 80-82 జన్మలు ఉంటాయి, కొంతమందికి మరోలా ఉంటాయి. మనుష్యులైతే 84 లక్షల జన్మలని అంటారు. దీనితో కూడా సంతృప్తి చెందక ప్రతి కణంలోనూ భగవంతుడు ఉన్నారని అంటారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటారంటే – నేను మనుష్య తనువులోనే లేను అన్నప్పుడు జంతువులలో, రాయి రప్పలలో, ప్రతి కణంలో ఎలా ఉంటాను. నంబరువన్ ఆత్మనే చివరి నంబరులో తమోప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. నేను స్వయంగా చెప్తున్నాను – నేను అనేక జన్మల అంతిమంలో సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో, వారు ఇప్పుడు తప్పకుండా పతితులుగా అయి ఉంటారు, పావనంగా అయితే ఉండలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు – మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుడు మొదటి నంబరులో ఉన్నారు. వీరు పెద్దవారైన తర్వాత శ్రీనారాయణునిగా అవుతారు. అప్పటికి 20-25 సంవత్సరాలు గడిచిపోతాయి కావున లక్ష్మీనారాయణుల విషయంలో పూర్తి 84 జన్మలు అని అనరు. శ్రీకృష్ణుడు నంబరువన్. వీరే స్వయంవరం తర్వాత నారాయణునిగా అవుతారు. కానీ పిల్లలే లెక్క తీయాలి కదా. పూర్తి 84 జన్మలు, 5000 సంవత్సరాలు అని శ్రీకృష్ణునికి మాత్రమే చెప్తారు. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – నేను కల్ప-కల్పము, ఎవరికైతే ఆది నుండి అంతిమం వరకు పాత్ర ఉంటుందో, వారి తనువులోకి వస్తాను. ఇతరులెవ్వరిలోనూ రాలేను. ఇది లెక్క కదా. బ్రహ్మాయే మొదటి నంబరువారు. నేను ఇంకెవరిలోకైనా ఎలా రాగలను. చాలామంది మిమ్మల్ని, కేవలం బ్రహ్మాలోకే ఎందుకు వస్తారు అని అడుగుతారు. కానీ ఇది లెక్క కదా. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు అని అంటూ ఉంటారు. విష్ణువు లేక శంకరుని ద్వారా స్థాపన చేయరు. ఇది ఇంకెవరి పని కాదు. మనుష్యులకు రచయిత మరియు రచనల గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిది ఏం జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు….. ఇది ఇప్పటి విషయమే. ఏది జరిగేది ఉందో, అదే జరుగుతుంది. అది మారదు. ఈ రోజు ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. బాబా అర్థం చేయించారు కూడా – ఏ విషయాన్ని చూసినా, ఇది కొత్త విషయమేమీ కాదు, ఇది 5 వేల సంవత్సరం క్రితం కూడా జరిగింది అన్నట్లు చూడండి. ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాయండి. వారు వచ్చి అడిగితే అడగనివ్వండి. వ్రాయడంలో తప్పేమీ లేదు. ఈ యుద్ధం ఇంతకుముందు కూడా జరిగింది, కొత్తేమీ కాదు. మహాభారత యుద్ధం 5 వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. క్రైస్తవులు భారత్ కు వచ్చి రాజ్యాన్ని లాక్కున్నారు, ఇది కొత్తేమీ కాదు. మళ్ళీ కల్పము తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపనవుతుంది. ఎవరికైతే 84 జన్మలు పూర్తి అయ్యాయో, వారే మొదటి నంబరులో లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు – నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. దీనిని తలకిందులుగా ఉన్న వృక్షమని అంటారు. ఈ కల్పవృక్షం యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలు. స్వస్తిక్ లో నాలుగు భాగాలు సమానంగా ఉండడాన్ని మీరు చూస్తారు. యుగాలు కూడా సమానంగా ఉన్నాయి, ఇందులో తేడా ఉండదు.

తండ్రి అర్థం చేయిస్తారు – ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో చూడండి. కొంతమంది చంద్రునిపైకి వెళ్తారు, కొంతమంది అగ్నిపై నడవడం, కొంతమంది నీటిపై నడవడం నేర్చుకుంటారు. ఇవన్నీ వ్యర్థమే, వీటి వలన లాభమేమీ లేదు. వీటితో మనుష్యులు పావనంగా అయి ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళలేరు. ఇవేమి చేసినా కానీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ తన ఇంటిని మరియు తండ్రి ఇంటిని మర్చిపోయింది. ఆత్మ తనను తానే మర్చిపోయి దేహాభిమానిగా అయిపోయింది. మళ్ళీ మందిరాలకు వెళ్ళి – మీరు సర్వగుణసంపన్నులు, మేము నీచులము, పాపులము అని మహిమను పాడుతారు. తమను తాము నిందించుకుంటారు. తండ్రి ఎప్పుడూ పూజారిగా అవ్వరు. అచ్ఛా, రెండవ నంబరులో శంకరుడిని కూడా సదా పూజ్యుడు అని అంటారు, ఇతను కూడా పూజారిగా అవ్వరు, ఇతని పాత్ర ఇక్కడ లేనే లేదు. ఈ స్టేజిపై బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఉంది. బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఏమిటి అనేది ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు, దీని అర్థాన్ని కొద్దిగా కూడా తెలుసుకోరు. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా అంటూ ఉంటారు కానీ ఎవరైతే స్థాపన చేస్తారో, వారి చిత్రమే లేదు. నోటితో అంటారు కానీ వారు ఎక్కడ ఉన్నారు, అసలు శివుడంటే ఎవరు అనేది కూడా తెలియదు. ఆత్మ గురించి, భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము….. అని అంటారు. ఆత్మనైన నేను అవినాశీ, ఈ శరీరం వినాశీ. ఆత్మ ఎన్ని శరీరాలు తీసుకుంటుంది అనేది ఏమీ తెలియదు. మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్, అని అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. దుఃఖం మొదలైనప్పటి నుండి పిలుస్తూ వచ్చారు. ఈ విషయం కూడా అర్థం చేయించబడింది – భారత్ లో రావణ రాజ్యం మొదలైనప్పుడు ఇతర ధర్మాలలో కూడా రావణ రాజ్యం ఉంటుందని కాదు, ఆ ధర్మాలు వాటి సమయమనుసారంగా సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంటుంది. ఈ కథ అంతా భారత్ పై ఉంది. మిగిలినవి ఉపకథలు. తండ్రి మధ్యలోనే వస్తారు. భారత్ తమోప్రధానమైనప్పుడు వృక్షమంతా తమోప్రధానంగా అయిపోతుంది. ఇతర ధర్మాల వారికి కూడా సుఖ-దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుంది. వృక్షంలో కొత్త-కొత్త ఆకులు వెలువడతాయి, అవి చాలా శోభాయమానంగా ఉంటాయి. కొత్తవారికి కూడా సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. చివర్లో వచ్చేవారికి కొంత గౌరవముంటుంది. వారు ఒక్క జన్మలోనే సతో, రజో, తమోలను దాటవచ్చు కానీ వారికి ఏ విలువ ఉండదు. ఎవరైతే హీరో-హీరోయిన్ల పాత్రను అభినయిస్తారో, వారికి విలువ ఉంటుంది. అలాగని, బాబాయే హీరో-హీరోయిన్ పాత్రను అభినయిస్తారని అనరు. బాబా గురించి అలా అనలేము. వారు వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు. స్వయం వారు పతితంగా అవ్వరు. మీరు పతితం నుండి పావనంగా తయారయ్యే శ్రమ చేస్తారు. శ్రీమతాన్ని అనుసరించి రాజయోగం ద్వారానే రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. బాబా అంటారు – నేను రాజ్యం చేయను, మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ప్రపంచంలోని మనుష్యులు చాలా మాటలు చెప్తూ ఉంటారు. భగవానువాచ – నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. కానీ దీని అర్థం మనుష్యులకే స్వయం తెలియదు కావున ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. భగవానువాచ అని అంటున్నారంటే – భగవంతుడు తప్పకుండా వచ్చి ఉంటారు. అప్పుడు, ఓ పిల్లలూ, అని సంబోధించి ఉంటారు. భారత్ లోనే శివ జయంతి, శివ రాత్రిని జరుపుకుంటారు. తండ్రి రావడం కూడా భారత ఖండములోనే వస్తారు. భారత్ యే అవినాశీ ఖండము. దీనికి చాలా భారీ మహిమ ఉంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో, అలా భారత్ మహిమ కూడా అపారమైనది. భారత్ లోనే పరమపిత పరమాత్మ వచ్చి మనుష్యమాత్రులందరికీ సద్గతినిస్తారు. అందరికీ సుఖాన్నిస్తారు. వారి జన్మస్థలం భారత్. భారత్ యే ప్రాచీన దేశము. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించేందుకు భారత్ లోనే వచ్చారు. కానీ కృష్ణుడిని భగవంతుడు అని అనడంతో భగవంతుని మహిమ నిలవలేదు. భగవంతుడైతే ఒక్కరే, వారినే సద్గురువు అని అంటారు. ఇకపోతే, గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యాపారాన్ని నేర్పించేవారిని కూడా గురువు అని అంటారు. ఈ రోజుల్లోనైతే అందరినీ అవతారంగా భావిస్తున్నారు. ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా పతితంగా అయినప్పుడు బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు.

తండ్రియే వచ్చి సత్యాతి-సత్యమైన అమరకథను వినిపిస్తారు. మనం 84 జన్మలలోకి ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ముందు మంచి జన్మలు తీసుకుంటారు, తర్వాత దిగుతూ వస్తారు. ప్రపంచానికి కూడా దిగే కళ ఏర్పడుతుంది. మనుష్యుల బుద్ధి సతో, రజో, తమోగా అవుతుంది. సత్యయుగం నుండి కొద్ది-కొద్దిగా దిగే కళ మొదలవుతుంది. మీరు ఎక్కే కళలోకి వెళ్ళే సమయంలో మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. సర్వుల సద్గతిదాత అయితే ఒక్క తండ్రియే కదా. ఆ గురువులైతే కేవలం శాస్త్రాలను వినిపిస్తారు. వాటిని వింటూ-వింటూ పడిపోతూనే వచ్చారు. అనంతమైన తండ్రి వచ్చి పిల్లలను అడుగుతారు – నేను మిమ్మల్ని ఇంత షావుకార్లుగా తయారుచేసి వెళ్ళాను, ఇన్ని వజ్ర-వైఢూర్యాల మహళ్ళను ఇచ్చి వెళ్ళాను, అవన్నీ ఏమయ్యాయి? లౌకిక తండ్రి పిల్లలకు ధనం ఇస్తారు కానీ పిల్లలు ఆ ధనాన్ని పాడుచేస్తే, తండ్రి వారిని పిలిచి – నీవు ఇంత ధనాన్ని ఎక్కడ పోగొట్టావు? అని అడుగుతారు. పిల్లల వద్ద ధనం ఉంటే దానిని చాలా వ్యర్థం చేస్తారు. తండ్రి చూస్తే ధర్మాత్మగా ఉంటారు, పిల్లలేమో విదేశాలకు వెళ్ళి లక్షల రూపాయలను వ్యర్థం చేసి వస్తారు. కానీ తండ్రి ఏమీ చేయలేరు. తండ్రి విడాకులు కూడా ఇవ్వలేరు ఎందుకంటే అది తాతగారి ఆస్తి. కానీ లోలోపల మథనపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎంత చెడ్డగా ఉంటారంటే, తండ్రి మరణించిన తర్వాత, 12 నెలల్లోనే మొత్తం ఆస్తినంతటినీ పోగొట్టేస్తారు. అవి హద్దు విషయాలు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి అంటారు – మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మరి నిరుపేదలుగా ఎందుకయ్యారు? ఇంత ధనాన్ని ఏం చేసారు? తండ్రి పిల్లలను మాత్రమే అడుగుతారు – భారత్ ను ఇంత షావుకారుగా తయారుచేసాను, ఆ ధనమంతా ఏమైపోయింది. మళ్ళీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు. శాస్త్రాలు మొదలైనవాటి వెనుక ఎంత ఖర్చు చేస్తారు. తల వంచి నమస్కరిస్తూ వచ్చారు, నుదురు కూడా అరిగిపోయింది. ధనం మొదలైనవన్నీ పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది డ్రామా. నేను మిమ్మల్ని షావుకార్లుగా చేస్తాను. రావణుడు మిమ్మల్ని నిరుపేదగా చేస్తాడు. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు కదా. భారత్ యే బంగారు పిచ్చుకగా ఉండేది. ఎంత ధనముండేదంటే, అది ఇతర ధర్మాలవారు దోచుకుని వెళ్ళిపోయారు. భారత్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. భారత్ యే స్వర్గం ఉండేది, భారత్ యే నరకంగా ఉంది. ఇప్పుడిది నరకము, కావుననే తాము పతితులము అని అర్థం చేసుకునే విధంగా బాబా మెట్ల చిత్రాన్ని తయారుచేయించారు. చిన్న-చిన్న పిల్లలకు కూడా చిత్రాలపై అర్థం చేయిస్తారు కదా. చిత్రాలు లేకుండా పిల్లలు ఏం అర్థం చేసుకోగలరు. తండ్రియే వచ్చి పతితం నుండి పావనంగా తయారయ్యే సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఈ యుక్తి అతి సులభమైనది, అలాగే అతి కష్టమైనది కూడా. సత్యయుగంలో దేహీ-అభిమానులుగా ఉంటారు. అక్కడ ఆత్మ ఈ విధంగా భావిస్తుంది – ఇప్పుడు శరీరం పెద్దదయ్యింది, ఈ పాత శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి అని. ఇప్పుడు వెళ్ళి బిడ్డగా అవ్వాలి అన్నట్లు సాక్షాత్కారం జరుగుతుంది. ఇక పాత శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు కూడా. బాజాలు మోగిస్తారు. సత్యయుగంలోనైతే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ వేడుకలా జరుపుకుంటారు, ఇక్కడ ఎంతగా దుఃఖపడతారు. ఎవరైనా మరణిస్తే, స్వర్గస్థులయ్యారు అంటారు అంటే వారు ఇప్పటివరకు నరకంలో ఉన్నారని కదా. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. తండ్రి మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తారు. తండ్రి జీవన్ముక్తిని ఇవ్వడానికే వస్తారు. రావణుని బంధనం నుండి విడిపించి జీవన్ముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు – నేను కల్పక్రితం వలె వచ్చి రాజయోగం నేర్పిస్తాను, కల్ప-కల్పము బ్రహ్మా తనువులోకే వస్తాను. మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా తయారవ్వాలి. యజ్ఞంలో బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన యజ్ఞము. ఈ రథాన్ని స్వాహా చేయాలి. అశ్వము అని ఈ రథాన్ని అంటారు. రాజస్వ అనగా స్వరాజ్యం కోసం ఈ అశ్వాలన్నీ (శరీరాలన్నీ) ఇందులో స్వాహా కానున్నాయి. ఆత్మ అయితే స్వాహా అవ్వదు. ఆత్మలు లెక్కాచారాలు సమాప్తం చేసుకొని వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్తగా అందరి పాత్ర మొదలవుతుంది. దీనినే చరిత్ర-భూగోళాలు రిపీట్ అవ్వడము అని అంటారు. తండ్రి, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాత ప్రపంచాన్ని సమాప్తం చేయడానికే వస్తారు. కేవలం ఈ మహాభారత యుద్ధం గురించి మాత్రమే శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. కనుక ఈ యుద్ధం ద్వారా ఈ స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని అర్థం చేయించాలి. అందుకే, దీని గురించి శాస్త్రాలలో గాయనముంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గడిచిపోయిన విషయాల గురించి చింతన చేయకూడదు. ఏ విషయమైతే గడిచిపోయిందో, దానిని నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని భావిస్తూ మర్చిపోవాలి.

2. ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో మీ తనువు-మనసు-ధనం, అన్నింటినీ స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు శ్రమించాలి.

వరదానము:-

మీరు ఏ సంకల్పం చేసినా, మాట మాట్లాడినా, కర్మ చేసినా, అది మాస్టర్ త్రికాలదర్శులుగా అయి చేసినట్లయితే ఏ కర్మ వ్యర్థంగా లేక అనర్థంగా అవ్వదు. త్రికాలదర్శి అనగా సాక్షి స్థితిలో స్థితులై, కర్మల గుహ్య గతిని తెలుసుకొని, ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించండి, అలా చేయిస్తే ఇక ఎప్పుడూ కర్మ బంధనంలో బంధించబడరు. ప్రతి కర్మను చేస్తూ కర్మబంధన ముక్తులుగా, కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top