20 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

20 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

19 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రి మీకు ఎలాంటి శ్రేష్ఠ కర్మలను నేర్పించడానికి వచ్చారంటే, దానితో మీరు 21 జన్మల రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోగలరు, స్థిరమైన, అఖండమైన రాజ్యానికి యజమానులుగా అవ్వగలరు”

ప్రశ్న: -

గృహస్థులకు మరియు సన్యాసులకు మధ్య ఏ ఒక్క సిద్ధాంతంలో చాలా పెద్ద తేడా ఉంది?

జవాబు:-

గృహస్థుల సిద్ధాంతం ఏమిటంటే – భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తారు మరియు సన్యాసుల సిద్ధాంతం ఏమిటంటే – బ్రహ్మ తత్వాన్ని గుర్తు చేస్తూ-చేస్తూ అందులో లీనమైపోతాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – బ్రహ్మ తత్వములో ఎవరూ లీనమవ్వరు. ఆత్మ అమరమైనది, అది ఎలా లీనమవుతుంది. ఒకవేళ భగవంతుడు వస్తే తప్పకుండా టీచరుగా అయి శిక్షణనిస్తారు. ప్రేరణ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వరు కదా.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము….. (తుమ్హే పాకే హమ్నే…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు మాత్రమే ‘బాబా’ అని అంటారు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారని అనగా వారు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ అనగా ఆత్మలందరూ స్మృతి చేస్తారు. వారిని ఏదో ఒక విధంగా స్మృతి చేస్తారు, కానీ మనం ఆ పరమపిత పరమాత్మ నుండి రాజ్యాధికారాన్ని తీసుకోవాలని వారికి తెలియదు. మనకు తండ్రి ఇచ్చే సత్యయుగ విశ్వ రాజ్యాధికారం స్థిరమైనది, అఖండమైనది, అచలమైనది అని మీకు తెలుసు. మన ఆ రాజ్యాధికారం 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. మొత్తం విశ్వంపై మన రాజ్యం ఉంటుంది. దానిని ఎవరూ లాక్కోలేరు, దోచుకోలేరు. మన రాజ్యం స్థిరమైనది ఎందుకంటే అక్కడ ఒక్క ధర్మమే ఉంటుంది, ద్వైతము ఉండదు (రెండు ధర్మాలు ఉండవు). అది అద్వైత రాజ్యము. పిల్లలు పాటను వినేటప్పుడు తమ రాజ్యం యొక్క నషా బుద్ధిలోకి రావాలి. ఇటువంటి పాటలు ఇంట్లో ఉండాలి, వీటి ద్వారా తండ్రి మరియు వారసత్వం వెంటనే గుర్తుకొస్తాయి. తండ్రి స్మృతికి సంబంధించిన ఆనందభరితమైన పాటలు ఉండాలి. మీదంతా గుప్తము. గొప్ప వ్యక్తులకు చాలా ఆర్భాటం ఉంటుంది. మీకు ఏ ఆర్భాటము లేదు. బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారిలో కూడా ఏ ఆర్భాటం లేకపోవడాన్ని మీరు చూస్తారు. వస్త్రాలు మొదలైనవన్నీ అవే ఉంటాయి. మనకు ఈ రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి బాబా వీరిలోకి ప్రవేశించారని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. మొత్తం సృష్టిలో ఈ సమయంలో ఉన్న మనుష్యమాత్రులందరూ దేహాభిమానంలోకి వచ్చి అధర్మయుక్తమైన పనులు చేస్తున్నారు, అందుకే వారిని తెలివిహీనులు అని అంటారు. అందరి బుద్ధికి తాళం వేయబడి ఉంది. మీరు ఎంత తెలివైనవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసింది. మీరు దేనికి పనికి రానివారిగా అయిపోయారు. తండ్రి వద్దకు వెళ్ళేందుకు యజ్ఞ-తపాదులు చాలా చేస్తారు కానీ ఏమీ లభించదు. అలాగే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. పరమాత్మ గురించి ఎవరికీ తెలియదు, వారిని సర్వవ్యాపి అని అంటారు. ఇది కూడా ఎంత రాంగ్ అయిపోతుంది. పిత (తండ్రి) అనే పదం బుద్ధిలోకి రాదు. ఎవరైనా తండ్రి అని పిలిచినా, అది కూడా నామ మాత్రంగానే అంటారు. ఒకవేళ వారు పరమపిత అని అర్థం చేసుకుంటే, ఇక బుద్ధి ఒక్కసారిగా ప్రకాశించడం మొదలవుతుంది. తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అటువంటప్పుడు, మనం కలియుగ నరకంలో ఎందుకు ఉన్నాము! ఇప్పుడు మనం ముక్తి-జీవన్ముక్తులను ఎలా పొందగలము అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు మీకు వివేకం లభించింది. బాబా మనకు ఈ స్మృతినిప్పించారు – కొత్త ప్రపంచం, కొత్త భారత్ ఉన్నప్పుడు మన రాజ్యముండేది, ఒకే మతం, ఒకే భాష, ఒకే మహారాజా-మహారాణి ఉండేవారు. సత్యయుగంలో మహారాజా-మహారాణి అని, త్రేతాలో రాజా-రాణి అని అంటారు. తర్వాత ద్వాపరంలో వామ మార్గం మొదలవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి కర్మలపై అనగా కర్మలనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకదానిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు – నేను మీకు ఎలాంటి కర్మలను నేర్పిస్తానంటే, వాటి ద్వారా 21 జన్మలు రాజ్యాధికారాన్నే పొందుతూ ఉంటారు. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు, కానీ అక్కడ ఈ రాజ్య వారసత్వం అనంతమైన తండ్రి ఇచ్చినది అనే జ్ఞానముండదు. తర్వాత, ద్వాపరం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది, అప్పుడు సంబంధాలు వికారీగా అయిపోతాయి. అప్పుడిక ఎలాంటి కర్మలను చేస్తారో, అలాంటి ఫలం లభిస్తుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇక సత్యయుగంలో ఉన్నదంతా సమాప్తమైపోతుంది. అప్పుడు, కర్మలనుసారంగా జన్మలు తీసుకుంటారు. భారత్ లో పూజ్య రాజులు ఉండేవారు, పూజారి రాజులు కూడా ఉండేవారు. సత్యయుగంలో రాజా-రాణి మరియు ప్రజలు అందరూ పూజ్యులుగా ఉంటారు. తర్వాత ద్వాపరంలో భక్తి మొదలైనప్పుడు యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ పూజారులుగా అయిపోతారు. ఆ గొప్ప సూర్యవంశీ రాజులే పూజారులుగా అవుతారు, ఆ తర్వాత వైశ్య వంశీయులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు. ఆ ప్రారబ్ధం 21 జన్మల వరకు కొనసాగుతుంది, తర్వాత భక్తి మార్గం మొదలవుతుంది. ఎవరైతే పూజ్య దేవీ-దేవతలుగా ఉండి వెళ్ళారో, వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. ఇది కేవలం భారత్ లో మాత్రమే జరుగుతుంది. తండ్రి వినిపించే ఈ 84 జన్మల కథ కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వారు రావడమే తర్వాత వస్తారు, వృద్ధి చెందుతూ-చెందుతూ ఎంతోమంది అయిపోతారు. దేవీ-దేవతలకు రకరకాల ఆచారాలు, పద్ధతులు ఉండేవి, భారత్ లోని గురువులకు అలాంటివి లేవు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం మొదలవ్వడంతో మొత్తం ఆచారాలు, పద్ధతులన్నీ మారిపోతాయి, అప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. ఒకప్పుడు ఒక్క శివునికి మాత్రమే అవ్యభిచారీ పూజ చేసేవారు. వారి మందిరాలను నిర్మిస్తారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తారు. ఒకరు లక్ష్మీనారాయణుల మందిరాన్ని నిర్మిస్తే, ఇక ఇతరులు కూడా నిర్మిస్తారు. తర్వాత సీతా-రాముల మందిరాలను నిర్మించడం మొదలుపెడతారు. కలియుగంలో చూడండి, గణేశుడు, హనుమంతుడు, చండికా దేవి మొదలైన అనేక దేవీల చిత్రాలను తయారుచేస్తూ ఉంటారు. భక్తి మార్గానికి సామాగ్రి కూడా కావాలి కదా. బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది, కానీ వృక్షం ఎంత పెద్దదిగా ఉంటుంది, అదే విధంగా భక్తి కూడా విస్తారమైపోతుంది. ఎన్నో శాస్త్రాలను తయారుచేయడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు – ఈ భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమవ్వనున్నది, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. భక్తి ప్రభావం కూడా చాలా ఉంది కదా. భక్తి ఎంత సుందరంగా ఉంటుంది. నృత్యాలు, తమాషాలు, పాటలు కీర్తనలు మొదలైనవాటికి ఎంత ఖర్చు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, ఆది సనాతన ధర్మాన్ని స్మృతి చేయండి. మీరు జన్మ జన్మలుగా అనేక రకాల భక్తిని చేస్తూ వచ్చారు. గృహస్థ ధర్మం వారే భక్తిని మొదలుపెడతారు. సన్యాసులైతే భక్తి చేయరు. యజ్ఞ-తపాదులు, దాన-పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ గృహస్థుల పనులు, సన్యాసులవి కావు. వారు నివృత్తి మార్గం వారు. వారి నియమం ఏమిటంటే – ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవిలో ఉండడము మరియు బ్రహ్మతత్వాన్ని గుర్తు చేయడము. వారు తత్వ జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు. తత్వాన్ని అనగా బ్రహ్మతత్వాన్నే ఈశ్వరుడు అని అంటారు. వాస్తవానికి భారతవాసులు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. కానీ, హిందుస్థాన్ లో ఉండడం వలన తమది హిందూ ధర్మమని అనుకున్నారు. అదే విధంగా సన్యాసులు కూడా ఆత్మలు నివసించే స్థానాన్ని అనగా తత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. బ్రహ్మమును లేక తత్వమునే గుర్తు చేస్తారు. వాస్తవానికి సన్యాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు అడవులలోకి వెళ్ళి శాంతిగా ఉండేవారు. అలాగని వారు బ్రహ్మతత్వంలోకి వెళ్ళి లీనమవుతారని కాదు. తండ్రి అంటారు – ఇది వారి మిథ్యా (అసత్యమైన) జ్ఞానము. అలా ఎవరూ లీనమవ్వలేరు. ఆత్మ అయితే అవినాశీ కదా. అది ఎలా లీనమవ్వగలదు. భక్తి మార్గంలో ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కలుస్తారని మళ్ళీ అంటారు. ఇప్పుడు ఎవరు రైట్? వారేమో బ్రహ్మతత్వంతో యోగం జోడించి బ్రహ్మములో లీనమైపోతామని అంటారు. గృహస్థులేమో, భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని, పతితులను పావనంగా తయారుచేస్తారని అంటారు. అలాగని పై నుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తారని కాదు. టీచరు ఇంట్లో కూర్చొని ప్రేరణ ఇవ్వరు కదా! ప్రేరణ అనే పదమే లేదు. ప్రేరణతో ఏ పనీ జరుగదు. శంకరుని ప్రేరణతో వినాశనం జరుగుతుందని అంటారు. కానీ ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. వారు ఈ ముసలాలు మొదలైనవి తయారుచేయాల్సిందే. ఇక్కడ ప్రేరణ విషయమే లేదు. మనుష్యులైతే – భగవంతుని ప్రేరణతో అంతా జరుగుతుంది, శంకరుడు కళ్ళు (మూడవ నేత్రం) తెరవగానే ప్రళయం జరిగిందని అంటారు. ఇవన్నీ కథలు, అర్థాన్ని ఏ మాత్రం తెలుసుకోరు. ఎవరి మందిరానికైనా వెళ్తే అచ్యుతమ్ కేశవమ్….. అని అంటారు, కానీ దీని అర్థమేమీ వారికి తెలియదు. ఎవరికీ తమ పూర్వజుల మహిమ గురించి తెలియదు. ధర్మ స్థాపకులను గురువులు అని అంటారు. వాస్తవానికి వారిని గురువు అని అనడం రాంగ్. క్రీస్తు గురువేమీ కారు. వారు కేవలం ధర్మ స్థాపనను చేస్తారు. ఎవరైతే సద్గతినిస్తారో వారినే గురువు అని అంటారు. వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి వంశావళి వస్తుంది. వారు ఎవరికీ సద్గతినివ్వరు. మరి వారిని గురువు అని ఎలా అంటారు. గురువైతే ఒక్కరే, వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. భగవంతుడైన తండ్రియే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు, ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. ఎప్పుడూ ఎవరూ వారిని స్మృతి చేయకుండా ఉండలేరు. మనుష్యులు – ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా, అని ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. తండ్రి అర్థం చేయిస్తారు – ఇదంతా రచన, రచయిత అయిన తండ్రిని నేనే. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు, వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సోదరుడు, సోదరునికి వారసత్వాన్ని ఇవ్వలేరు. వారసత్వం సదా తండ్రి నుండి లభిస్తుంది. నేను అనంతమైన పిల్లలందరికీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. అందుకే నన్ను – ఓ పరమాత్మా, క్షమించండి అని గుర్తు చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు.

తండ్రి అంటారు – నేను మీరు పిలవడం వల్లనేమీ రాను. ఇది డ్రామాలో తయారుచేయబడి ఉంది. డ్రామాలో నేను వచ్చే పాత్ర కూడా నిశ్చయించబడి ఉంది. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన లేక కలియుగ వినాశనం, సత్యయుగ స్థాపన చేయాల్సి ఉంటుంది. నేను నా సమయానికి నా అంతట నేనే వస్తాను. ఈ భక్తి మార్గానికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఇప్పుడు భక్తి మార్గపు పాత్ర పూర్తయినప్పుడు నేను వచ్చి ఉన్నాను. బాబా, కల్పక్రితం కూడా మీరు బ్రహ్మా తనువులోకి వచ్చారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. మళ్ళీ ఎప్పుడూ లభించదు. ఇది జ్ఞానం, అది భక్తి. జ్ఞానం యొక్క ప్రారబ్ధము ఎక్కే కళ. సెకండులో జీవన్ముక్తి అని అంటారు. జనకునికి సెకెండులో జీవన్ముక్తి లభించింది కదా. కానీ ఒక్క జనకుడు మాత్రమే జీవన్ముక్తిని పొందారా. జీవన్ముక్తినైతే అందరూ పొందుతారు కదా. విశ్వమంతా పొందుతుంది. సద్గతి అన్నా జీవన్ముక్తి అన్నా పదాలు ఒక్కటే. జీవన్ముక్తి అనగా జీవితాన్ని ఈ రావణ రాజ్యం నుండి ముక్తి చేస్తారు. పిల్లలకు ఎంత దుర్గతి కలిగింది అనేది బాబాకు తెలుసు. పూర్తిగా దుఃఖితులుగా అయిపోయారు. వారికి మళ్ళీ సద్గతి కలగనున్నది. ముందు ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామం నుండి తర్వాత సుఖధామంలోకి వస్తారు. ఈ చక్రం యొక్క రహస్యాన్ని తండ్రి అర్థం చేయించారు. తండ్రి అంటారు – ఈ సమయంలో సృష్టి అనే వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది, తమోప్రధానమైపోయింది, అందుకే ఎవరూ తమను తాము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం వారమని భావించరు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు. అపవిత్రంగా, పతితులుగా ఉన్న మనము స్వయాన్ని దేవతలమని ఎలా చెప్పుకోగలము, అందుకే, ఈ వికారాలను వదులుతూ వెళ్ళండి అని అంటారు. ఈ వికారాలు మొదలైనవి అర్ధకల్పం నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మ వీటిని వదలడం శ్రమ అనిపిస్తుంది. శ్రమించకుండా విశ్వానికి యజమానులుగా అవ్వరు. తండ్రిని స్మృతి చేసినప్పుడే మీకు మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకోగలరు అనగా రాజ్యానికి అధికారులుగా అవుతారు. ఎంత మంచి రీతిగా స్మృతి చేస్తారో, శ్రీమతాన్ని అనుసరిస్తారో, అంతగా మీరు రాజులకే రాజుగా అవుతారు. చదివించే టీచరు చదివించడానికి వచ్చారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే పాఠశాల. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంత ప్రసిద్ధమైనది. దీనిని అమరకథ, సత్య నారాయణ కథ, మూడవ నేత్రం కథ అని కూడా అంటారు.

పాట ఎంత బాగుందో చూడండి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఆ యజమానత్వాన్ని ఎవరూ దోచుకోలేరు. భూకంపాలు మొదలైనవేవీ సంభవించవు. అక్కడ విఘ్నాలు అనే మాటలే ఉండవు. అటువంటి స్థిరమైన, అఖండమైన పవిత్రత సుఖ-శాంతుల రాజ్యాన్ని ఇప్పుడు మీరు పొందుతున్నారు. కల్పక్రితం వలె ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ స్వర్గంగా అవుతుంది. మనమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఈ విధంగా తయారయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. దీనినే స్వదర్శన చక్రధారులుగా అవ్వడమని అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. వికారాలన్నింటినీ వదిలేయాలి.

2. బ్రహ్మా తండ్రి సమానంగా సాధారణంగా మరియు గుప్తంగా ఉండాలి. బాహ్య ఆర్భాటాలు మొదలైనవి చేయకూడదు. తమ భవిష్య రాజ్యం యొక్క నషాలో ఉండాలి.

వరదానము:-

వాణి ద్వారా సేవ చేసేటప్పుడు మనసు పవర్ ఫుల్ గా ఉండాలి. మనసు ద్వారా ఇతరుల మనసును చేంజ్ చేయండి (మార్చండి), అనగా మనసు ద్వారా మనసును కంట్రోల్ చేయండి, మరియు వాణి ద్వారా లైట్-మైట్ ను ఇచ్చి నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేయండి. కర్మణా అనగా సంపర్కాలు మరియు తమ రమణీకమైన పనుల ద్వారా వారికి అసలైన ఫ్యామిలీ యొక్క అనుభవం చేయించండి. ఇలా మూడు స్వరూపాలలో ఉంటూ, ప్రతి కర్మను చేసినప్పుడు సిద్ధి స్వరూపులుగా స్వతహాగా అయిపోతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top