18 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
17 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - చ్యారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానం ఇంటి నుండి మొదలవుతుంది), మీ పరివారంలోని వారికి జ్ఞానాన్ని వినిపించండి, మీ హమ్ జీన్స్ (తోటి వారి) యొక్క కళ్యాణాన్ని చేయండి”
ప్రశ్న: -
ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు తమ అవస్థను ఏకరసంగా తయారుచేసుకోగలరు?
జవాబు:-
అవస్థను ఏకరసంగా తయారుచేసుకునేందుకు తండ్రి శ్రీమతము ఏమిటంటే – పిల్లలూ, ప్రతి రోజూ ఉదయాన్నే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు బాబా ఏదైతే వినిపిస్తారో, అది వినండి. ఒకవేళ స్మృతి చేయకపోతే అనవసరమైన ఆలోచనలు నడుస్తాయి, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, అందుకే బాబా సలహాను ఇస్తున్నారు – పిల్లలూ, ప్రతి రోజూ ఉదయాన్నే లేచి మీతో మీరు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకోండి – నడుస్తూ-తిరుగుతూ, తింటూ….. భోజనం తయారుచేస్తూ ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేస్తాము.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు – ఆత్మిక తండ్రి సర్వాత్మలకు తండ్రి, వారు అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు, వారినే శివాయ నమః అంటారు. వారిని తండ్రి అని కూడా అంటారు, ఆ తండ్రి స్వర్గ రచయిత, వారిని పతితపావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. ఇప్పుడు మనం వారితో పాటు కూర్చొని ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఉదాహరణకు, ఎక్కడో ఒక గీతా పాఠశాలలో 6 అడుగుల కృష్ణుని చిత్రం ఉండేది. వాస్తవానికి కృష్ణుడిని చిన్న బాలునిగానే చూపిస్తారు, మళ్ళీ గీతా భగవంతుడు కృష్ణుడు అంటారు. అయితే గీతను వారు ఎప్పుడు వినిపించారు? చిన్నతనంలోనా లేక 6 అడుగులు పెరిగిన తర్వాత వినిపించారా? రాధాకృష్ణులు జంటగా ఉండేవారు. కృష్ణునికి రాధ ఏమవుతారు? రాధను భగవతి అని, కృష్ణుడిని భగవాన్ అని అంటారు. వీరిద్దరికి ఉన్న సంబంధమేమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు గీతోపదేశం చేసారు, కానీ ఎప్పుడు చేసారు? మీరు ఈ విధమైన ప్రశ్నలను అడిగారంటే – బ్రహ్మాకుమార, కుమారీలు తప్ప ఇలా ఇంకెవ్వరూ అడగలేరని మనుష్యులకు అర్థమవుతుంది. గొప్ప-గొప్ప రాజులు మొదలైనవారంతా సన్యాసులను చూసినప్పుడు తప్పకుండా వారి పాదాలకు నమస్కరిస్తారు. ఈ విధమైన ప్రశ్నలు అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. మీరైతే ధైర్యం చేస్తారు. వారు ఏమంటారు అంటే – బ్రహ్మాకుమారీలలో ఎంత జ్ఞానముందంటే వారు కూర్చొని రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇస్తారు, వారి జీవిత చరిత్రను వినిపిస్తారు. మీరు అడుగవచ్చు – శివజయంతిని జరుపుకుంటారు కదా, పూజలు మొదలైనవి కూడా చేస్తారు కదా, అంటే తప్పకుండా వారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటారు, అందుకే శివజయంతిని జరుపుకుంటున్నారు అని. అయితే వారెప్పుడు వచ్చారు? శివబాబా అయితే నిరాకారుడు. వారికి తమకంటూ శరీరం లేదు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు శరీరంలోకి వచ్చి ఉంటారు. నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది? ఆత్మ అమరమైనది. మరణించి, మళ్ళీ జన్మించినప్పుడే జయంతిని జరుపుకుంటారు. ఆత్మకు జయంతి ఉండదు. ఆత్మ అవినాశి. ఆత్మ యొక్క జయంతి అని అయితే అనరు. శివుడు నిరాకారుడు, వారి చిత్రాన్ని లింగం రూపంలో ఉంచుతారు. పిల్లలైన మీకు ఈ ఆలోచన ఉండాలి. ఇక్కడ నుండి మీ ఇంటికి, వ్యాపార-వ్యవహారాల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ బుద్ధి నుండి తొలగిపోతాయి, చింతన నడవదు. గురువులు మొదలైనవారి సంకెళ్ళలో కూడా చాలా మంది చిక్కుకొని ఉంటారు, ఇక అడగకండి. అబలలు చాలా అమాయకంగా ఉంటారు కదా. మీరు వారిని ఈ విధంగా అడుగవచ్చు – శివజయంతిని జరుపుకుంటారు కదా, అయితే వారెవరు, వచ్చి ఏం చేసారు, ఎప్పుడొచ్చారు అని. జయంతి అంటేనే జన్మ. నిరాకార శివుని జన్మదినాన్ని జరుపుకుంటారు. వారు నిరాకారుడు, కనుక వారి జన్మదినాన్ని ఎలా జరుపుకుంటారు? ఎవరిలోకి వచ్చారు? ఆత్మ శరీరంలోకి వెళ్ళినప్పుడు, జన్మ తీసుకున్నారని అంటారు. ఆత్మ అయితే ఆత్మనే. శరీరంలో ప్రవేశించినప్పుడు, ఆత్మ పాత్రను అభినయించేందుకు శరీరం తీసుకుంది అని అంటారు. వారు (శివబాబా) నిరాకారుడు. వారు జన్మను ఎలా తీసుకున్నారు? ఎవరిలోకి వచ్చారు? వారిని పరమాత్మ అని అంటారు. ఇది ఎవ్వరికీ కూడా తెలియదు. అనేక శాస్త్రాలు మొదలైనవి చదువుకున్నారు, కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. ఇప్పుడు మీరు జ్ఞానాన్నే వినిపించాలి. కొంతమంది 2-3 సంవత్సరాలు వస్తారు, తర్వాత వారిలో అజ్ఞానం ప్రవేశిస్తుంది. అప్పుడు, బాబా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ధారణ చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. కానీ పురుషుడు (పతి) జ్ఞానంలో ఉంటూ, స్త్రీ (పత్ని) అజ్ఞానంలో ఉంటే, వారు హంస మరియు కొంగల వలె అవుతారు. అందుకే, ముందు పత్నికి జ్ఞానమివ్వాలి. పత్ని తన పతిని గురువుగా, ఈశ్వరునిగా భావిస్తారు. అటువంటప్పుడు, పత్ని గురువు ఆజ్ఞను పాటించాలి కదా. ఇది ఇక్కడి విషయము. అక్కడ (స్వర్గంలో) ఆజ్ఞను పాటించడము, పాటించకపోవడము అన్న ప్రశ్నే ఉండదు. అక్కడ, అందరూ ప్రేమగా నడుచుకుంటారు. అక్కడ ఇలాంటి విషయమేమీ ఉండదు. అందుకే, దానం ఇంటి నుండే మొదలవుతుందని అంటారు. పత్ని జ్ఞానంలో వస్తూ, పతి రాకపోతే, ఆ పత్ని ఏం చేయగలరు! భూ-భూ చేయాలి. పిల్లలైన మనము కూడా భూ-భూ చేయాలి, తమ తోటివారి కళ్యాణం చేయాలి. వారికి కూడా – తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. ఇప్పుడు యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది, బాబా వచ్చి ఉన్నారు. ఓ పతితపావనా రండి, అని మనుష్యులు పిలుస్తూ ఉంటారు. పతిత ప్రపంచ వినాశనం జరగనున్నది, మీరు మళ్ళీ పతితులుగా ఎందుకు అవుతారు! తల్లి జ్ఞానంలో ఉన్నారంటే తమ తోటివారి కళ్యాణం చేయడం ఆమె కర్తవ్యము. ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కోసం మొత్తం రాజ్యాన్ని అంతా తీసుకుంటారు. మీపై ఎవ్వరూ చేయి వేయలేరు (అనగా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు). మీరు పూర్తి విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎంత తేడా ఉందో చూడండి. ఇలా వారసత్వాన్ని ఇచ్చేవారిని ఎంతగా స్మృతి చేయాలి. మొత్తం రోజంతటిలో శివబాబాను స్మృతియే చేయనివారు ఇక్కడ చాలామంది ఉన్నారు. రోజంతా ఇల్లు, వ్యాపార-వ్యవహారాలకు సంబంధించిన పనులలోనే ఉంటారు. లేదంటే ఉదయాన్నే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. బాబా, మేము మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము, మీ నుండి మేము వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము, బాబా, మీరు ఎంత మధురమైనవారు, మీ స్మృతితో మా వికర్మలు వినాశనమవుతాయి. మీతో మీరు లోలోపల మాట్లాడుకోవాలి, దీనినే విచార సాగర మథనం అని అంటారు. బాబా, మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. ఇప్పుడు మేము తమోప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. అప్పుడే సత్యయుగీ రాజ్యాన్ని పొందుతాము. బాబా, మిమ్మల్ని మేము నిరంతరం స్మృతి చేస్తాము. 63 జన్మలలో మేము ఎన్ని పాపాలు చేసాము. తలపై ఎంత భారముంది, అందుకే – బాబా, మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తాము. బాబా, మేము వంట చేస్తున్నా, బయట తిరగడానికి వెళ్ళినా సరే, మీ స్మృతిలోనే ఉంటాము. ఈ విధంగా మాట్లాడుతూ ప్రతిజ్ఞ చేసారంటే, వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. బాబా, మేము మీ స్మృతిలో భోజనం తయారుచేస్తాము. మేము తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఒకవేళ రేపే శరీరం వదిలేస్తే, మేము సతోప్రధానంగా అసలు అవ్వలేము! మృత్యువు గురించి భయముంటుంది కదా. బాబా, మేము జీవిస్తూనే మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఆ తర్వాత, ఈ రోజంతటిలో మేము ఎంత స్మృతి చేసాము అనేది చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే, స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, యుక్తిగా నడుచుకోవాలి. ఇలా తీవ్ర వేగంతో పురుషార్థంలో నిమగ్నమైతే స్మృతి కూడా ఉంటుంది మరియు ఆయువు కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో మీ ఆయువు పెరుగుతుంది. స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఇంకా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఉదాహరణకు హిందువులను, క్రైస్తవులుగా కన్వర్ట్ చేయడానికి నన్స్ చాలా చోట్లకు తిరుగుతూ ఉంటారు. ఇళ్ళకు, దుకాణాలకు వెళ్ళి – బైబిల్ తీసుకోండి, ఇది తీసుకోండి, మా క్రైస్తవ ధర్మంలో చాలా సుఖముంది అని అందరికీ చెప్తారు. వారిది కూడా ఒక సంస్థే, అలాగే బౌద్ధులది కూడా ఒక సంస్థే. వీరు ఏం చేస్తున్నారు అనేది హిందువులకు అర్థం కాదు. మా హిందూ ధర్మం వారిని క్రైస్తవులుగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రదర్శనీలలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారు తమ అభిప్రాయాలను కూడా రాసి ఇస్తారు, ఇంటికి వెళ్తూనే సమాప్తమైపోతుంది. దీని గురించే – కోతుల ముందు రత్నాలను ఉంచితే, వాటిని రాళ్ళు అనుకొని విసిరేస్తాయి అని అంటూ ఉంటారు. అలాగే, ఈ అవినాశి జ్ఞానరత్నాలను కూడా వారు రాళ్ళుగా భావించి విసిరేస్తారు. ఈ విషయాలను కూడా వారేమీ అర్థం చేసుకోరు. అయితే, ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారికి టచ్ అవుతుంది. విషయం చాలా సహజమైనది. తండ్రి స్వర్గ రచయిత. తండ్రి భారత్ లో ఒక్కసారి మాత్రమే వస్తారు.
తండ్రి అంటారు – మీరు పతితపావన తండ్రినైన నన్ను పిలుస్తూ వచ్చారు, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి ఇప్పుడు నేను వచ్చాను. మీరు కూడా అంటారు – మేము ఈ భ్రష్టాచారీ సృష్టిని శ్రేష్ఠాచారిగా తయారుచేసి తీరుతాము. ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు శివబాబా శ్రీమతాన్ని అనుసరిస్తున్నారు. శివ భగవానువాచ – నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా, రాజులకే రాజుగా తయారుచేస్తాను. గీతలో కూడా చాలా బాగా వ్రాయబడి ఉంది – నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తాను అని అన్నారు. కనుక ఈ విషయం వారికి కూడా వినిపించాలి కదా. పతితపావన సీతారామ అని పిలుస్తారు కూడా. ఇప్పుడు దీని అర్థం కూడా వారు తెలుసుకోరు. అందరూ భక్తులు అనగా సీతలు. ఓ రామా, వచ్చి సీతలైన మమ్మల్ని ఉద్ధరించండి అని వారు పిలుస్తారు. మళ్ళీ, రఘుపతి రాఘవ రాజా రామ….. అని అంటారు. వాస్తవానికి ఇది రాజా రాముని విషయం కాదు. ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే – శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేయడము. కృష్ణుడిని మరియు రాముడిని నల్లగా ఎందుకు చూపించారని అడగాలి. సత్య, త్రేతాయుగాలలో సుందరంగా ఉంటారు – తర్వాత శ్యామంగా (నల్లగా) అవుతారు. మొదటిది బంగారు యుగం, తర్వాత వెండి యుగం, తర్వాత రాగి, తర్వాత ఇనుప యుగం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇనుప యుగము. బంగారు యుగం ఉన్నప్పుడు ఎంత గౌరవముండేది. కావున మీరు యుక్తిగా వెళ్ళి అర్థం చేయించాలి. వారు అంత త్వరగా తమ హఠమును వదిలిపెట్టరు. వృక్షం ఆయువు పెరిగినప్పుడు, ఆ వృక్షం శిథిలావస్థను చేరుకుంటుంది. ఈ ప్రపంచానికి కూడా ఆయువు ఉంటుంది కదా. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం ఉంటుంది. పాత ప్రపంచం అంటే కలియుగం, తమోప్రధాన ప్రపంచము. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా సతోప్రధానంగా ఉండరు. ఇప్పుడు తమోప్రధానత సమాప్తమవ్వాల్సి ఉంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? ఆ తండ్రియే చేస్తారు. అలాగని ప్రళయం జరుగుతుందని కాదు. పతితులుగా అయినప్పుడే తండ్రిని పిలుస్తారు. మీరు వచ్చి పావనంగా చేయండి అని అడుగుతారు. వారు తప్పకుండా పాత ప్రపంచంలోనే వస్తారు. వారిని పతితపావనుడు అంటున్నారంటే, వారు తప్పకుండా అంతిమంలోనే వస్తారు. వారు స్వయంగా చెప్తారు – నేను కల్ప-కల్పము కల్పం యొక్క సంగమయుగంలో పావన ప్రపంచాన్ని తయారుచేయడానికి వస్తాను అని. ఇప్పుడు ఇది సంగమము. ఇప్పుడు తండ్రి అందరినీ సద్గతిలోకి తీసుకువెళ్తారు. మరి, అటువంటి తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి కదా. మీ అవస్థను తయారుచేసుకోవాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇవి శరీరం యొక్క కర్మేంద్రియాలు. తండ్రి అంటారు – ఓ పిల్లలూ, నేను మీకు ఏదైతే వినిపిస్తానో, అది వినండి. ముక్తి-జీవనముక్తి కోసం ఇంకెవ్వరి మాటలను వినకండి. పావనంగా తయారుచేసేందుకు పరంధామం నుండి తండ్రి వచ్చారు. మళ్ళీ మీరు పాత శాస్త్రాలను ఎందుకు గుర్తు చేసుకుంటారు? భగవంతుడు లభిస్తారనే మీరు భక్తి చేస్తారు. వారు సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కదా. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ రాజ్యం ఎలా లభించింది? ఆత్మ గురించి ఈ విధంగా అంటారు – ఆత్మ ఒక బిందువు, ప్రకాశించే ఒక అద్భుతమైన నక్షత్రము. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు నన్ను పరమాత్మ, సుప్రీమ్ సోల్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడైనా పరమాత్మ అని అంటారా? పరంధామంలో ఉన్న పరమాత్మనే సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు మీ తండ్రి. వారు వచ్చి ఇతనిలో (బ్రహ్మాలో) ప్రవేశిస్తారు. గురువు శిష్యుని పక్కన కూర్చొంటారు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. వారు మన తండ్రి అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి 5 వేల సంవత్సరాల క్రితం కూడా యోగం నేర్పించారు. నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపురిని స్మృతి చేయండి అని చెప్పారు. ఈ విధంగా తప్పకుండా సంగమయుగంలోనే చెప్తారు. సత్యయుగంలో ఒకే ధర్మముండేది. కావున ఇప్పుడు మళ్ళీ ఒకే ధర్మం ఉంటుంది కదా. ఈ ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఇది ఆ సమయమే. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి అంటారు – మంచి రీతిలో సేవ చేసే పిల్లలను నేను స్మృతి చేస్తాను ఎందుకంటే వారు నా సహాయకులు. అనేకుల కళ్యాణం చేసేవారు నాకు ప్రియంగా అనిపిస్తారు. మీకు ఒక్క తండ్రి మాత్రమే ప్రియంగా అనిపిస్తారు, వారి నుండే మీకు వారసత్వం లభిస్తుంది. అందుకే పిల్లలైన మీరు మంచి రీతిగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. స్మృతి యాత్రలో ఉండాలి. అనవసరమైన ఆలోచనలు కూడా చాలా వస్తాయి. భక్తి మార్గంలో వారికి శివుని దర్శనం కలగాలి అని తమను తాము హతమార్చుకుంటారు కూడా. దర్శనం కోసం చాలా శ్రమిస్తారు. తండ్రి స్మృతితో పాపాలు కట్ అవుతాయి మరియు 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుందని ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. దర్శనం అయినంత మాత్రాన పాపాలేమీ కట్ అవ్వవు. విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇప్పుడు మనం ఎలా తయారవుతున్నాము అనేది మీ బుద్ధిలో ఉంది. మరుసటి జన్మలో మనం ఇలా (లక్ష్మీనారాయణుల వలె) తయారవుతాము. ఇది సత్యయుగంలోని రాకుమారుడు, రాకుమారీలుగా తయారయ్యే కాలేజి. తండ్రి వచ్చి ధర్మంతో పాటు దైవీ రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ముక్తి-జీవన్ముక్తుల కోసం జ్ఞానం యొక్క విషయాలను ఏవైతే వినిపించారో, వాటిని మాత్రమే వినాలి మరియు ధారణ చేయాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. తమ కళ్యాణాన్ని మరియు తమ లౌకిక పరివారం యొక్క కళ్యాణాన్ని చేయాలి.
2. వ్యర్థ ఆలోచనలను సమాప్తం చేసేందుకు ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయాలి. స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండాలి.
వరదానము:-
లౌకిక రీతిలో కూడా ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో, వారు ముందు-వెనుక ఆలోచించి, అర్థం చేసుకున్న తర్వాత అడుగు వేస్తారు. అలాగే, ఇక్కడ కూడా పిల్లలైన మీరు ఏదైనా కార్యం చేసినప్పుడు, మూడు కాలాలను ఎదురుగా ఉంచుకొని, తర్వాత చేయండి. కేవలం వర్తమానాన్ని మాత్రమే చూడకండి, అనంతమైన తెలివిని ధారణ చేయండి. విజయం పట్ల నిశ్చయం యొక్క ఆధారంపై మరియు త్రికాలదర్శితనం యొక్క ఆధారంపై ప్రతి కర్మను చేయండి, ప్రతి మాటను మాట్లాడండి. అప్పుడు వీరు అలౌకికమైనవారు లేక అసాధారణమైన వారని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!