17 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
16 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ దేహ భానం నుండి మరణించండి అనగా ఈ పాత పతిత దేహం పట్ల ప్రీతిని తొలగించి ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని జోడించండి”
ప్రశ్న: -
సంగమంలో పిల్లలైన మీ సహజ సౌందర్యం ఏమిటి?
జవాబు:-
జ్ఞాన నగలతో సదా అలంకరించబడి ఉండడమే మీ సహజ సౌందర్యము. ఎవరైతే జ్ఞాన నగలతో అలంకరించబడి ఉంటారో, వారి ముఖం సంతోషంతో పుష్పం వలె వికసించి ఉంటుంది. ఒకవేళ సంతోషం ఉండడం లేదంటే, తప్పకుండా ఏదో ఒక దేహాభిమానపు అలవాటు ఉంది, దాని కారణంగానే అన్ని వికారాలు ఉత్పన్నమవుతాయి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
సభలో దీపం వెలిగింది… (మెహఫిల్ మే జల్ ఉఠీ శమా…)
ఓంశాంతి. ఈ పాట అర్థం ఎంత విచిత్రంగా ఉంది. ప్రీతి ఎందుకు కలిగింది? (మరణించేందుకు) ఎవరి పట్ల ప్రీతి కలిగింది? భగవంతుని పట్ల ప్రీతి కలిగింది ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధంగా ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ప్రీతి కలిగిందా? దాని వల్ల తాము మరణిస్తామని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? పాట అర్థం ఎంత అద్భుతంగా ఉంది. దీపపు పురుగులు దీపం పట్ల ప్రీతిని ఉంచి, దాని చుట్టూ తిరిగి, కాలిపోయి మరణిస్తాయి. మీరు కూడా తండ్రి వద్దకు వస్తూ-వస్తూ ఈ శరీరాన్ని వదిలేయాలి అనగా తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. ఎవరి పట్లనైతే మనం ప్రీతిని ఉంచుకున్నందుకు మరణిస్తామో, వారు పెద్ద శత్రువు అయినట్లు, అందుకే మనుష్యులు భయపడతారు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు దాన-పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. శరీరం వదిలేటప్పుడు మనుష్యులు భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. భగవంతుడు ఎంత ప్రసిద్ధమైనవారు. వారు వచ్చారంటే మొత్తం పాత ప్రపంచమంతటినీ సమాప్తం చేసేస్తారు. మనం పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే ఈ విశ్వవిద్యాలయంలోకి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచము, నరకము అని అంటారు. తండ్రి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తారు – కేవలం నన్ను స్మృతి చేయండి, నేనే హెవెన్లీ గాడ్ ఫాదర్ ను. ఆ ఫాదర్ నుండి మీకు ధనం, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కుమార్తెలకు వారసత్వం లభించదు. వారిని వేరే ఇంటికి పంపించేస్తారు. అంటే వారు వారసులు కారు. వీరు తండ్రి, ఆత్మలందరికీ తండ్రి, అందరూ వీరి వద్దకు రావాల్సిందే, మరణించాల్సిందే. తండ్రి తప్పకుండా ఏదో ఒక సమయంలో వస్తారు, అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా తక్కువమంది మనుష్యులుంటారు. పాత ప్రపంచంలోనైతే చాలామంది ఉన్నారు. కొత్త ప్రపంచంలో మనుష్యులు కూడా తక్కువ మందే ఉంటారు మరియు సుఖం కూడా చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో చాలామంది మనుష్యులుంటారు కనుక దుఃఖం కూడా చాలా ఉంటుంది. అందుకే తండ్రిని పిలుస్తూ ఉంటారు. భారత్ కు పితగా భావించబడే బాపూ గాంధీ కూడా, ఓ పతితపావనా రండి అని పిలిచేవారు. కానీ, కేవలం వారి (పతితపావనుడు) గురించి తెలియదు. పతితపావనుడు పరమపిత పరమాత్మ అని, వారే ఈ ప్రపంచానికి లిబరేటర్ (ముక్తిదాత) అని అర్థం చేసుకుంటారు కూడా. సీతారాములనైతే మొత్తం ప్రపంచమంతా నమ్మదు కదా. ఆ త్రేతాయుగం రాముడే పతితపావనుడు అని అనడం తప్పు. మొత్తం ప్రపంచం పరమపిత పరమాత్మను లిబరేటర్ గా (ముక్తిదాతగా), గైడ్ గా (మార్గదర్శకునిగా) అంగీకరిస్తుంది. వారు దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు. అచ్ఛా, దుఃఖం ఇచ్చేవారు ఎవరు? తండ్రి అయితే దుఃఖాన్ని ఇవ్వరు ఎందుకంటే వారు పతితపావనుడు, పావన ప్రపంచమైన సుఖధామానికి తీసుకువెళ్ళేవారు. మీరు ఆ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి దైహికమైన పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు, మేము ఆత్మలము, పరమపిత పరమాత్మ మాకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని భావించాలి. మేము విద్యార్థులము – అనే విషయాన్ని మర్చిపోకూడదు. శివబాబా మధుబన్ లో మురళిని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఇక్కడ ఆ వెదురు మురళీ ఏదీ లేదు. కృష్ణుడు డాన్స్ చేయడం, మురళిని మోగించడం, ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. కృష్ణుడు మురళిని వాయిస్తారని మీరు అనలేరు. మురళిని శివబాబా వినిపిస్తారు. మీ వద్దకు మంచి-మంచి పాటలను తయారుచేసేవారు వస్తారు. ఎక్కువగా పురుషులే పాటలను తయారుచేస్తారు. మీరు భక్తి మార్గపు పాటలు మొదలైనవి పాడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అంటారు – అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేయండి. శివుడిని బిందువు అని అంటారు. వ్యాపారస్థులు సున్నా పెట్టినప్పుడు ‘శివ’ అని అంటారు. ఒకటి పక్కన ఒక సున్నా పెడితే అది 10 అవుతుంది, మరొక సున్నా పెడితే 100 అవుతుంది….. మీరు కూడా శివబాబాను స్మృతి చేయాలి. శివుడిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా అర్ధకల్పానికి చాలా షావుకార్లుగా అయిపోతారు. అక్కడ పేదలు ఎవరూ ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమనే పేరే ఉండదు. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనినే సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన అని అంటారు. ఇదే మీతో పాటు వస్తుంది. మనుష్యులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి మరియు పవిత్రంగా అవ్వాలి. పవిత్రత ఉంటే శాంతి, సంపద లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు. ఆత్మలైన మీరు ముందు పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. సన్యాసులను కూడా సెమీ-పవిత్రులని అంటారు. మీది ఫుల్ సన్యాసము. వారు ఎంత సుఖాన్ని పొందుతారు అనేది మీకు తెలుసు. వారికి కొద్దిగా సుఖముంటుంది, ఆ తర్వాత ఇక దుఃఖమే ఉంటుంది. అదంతా భక్తి మార్గము. భక్తి మార్గంలో హనుమంతుడిని పూజిస్తే, వారి సాక్షాత్కారం కలుగుతుంది. చండికా దేవికి ఎంత పెద్ద మేళా జరుగుతుంది, వారి చిత్రం కూడా ఉంటుంది, ఎవరిపైనైతే ధ్యానం ఉంచుతారో, వారు తప్పకుండా తమ ముందుకు వస్తారు కదా. కానీ దాని వల్ల ఏం లభిస్తుంది? అనేక రకాల మేళాలు జరుగుతాయి ఎందుకంటే వాటి వలన సంపాదన జరుగుతుంది కదా. ఇవన్నీ వారికి వ్యాపారాలు వంటివి. నరుని నుండి నారాయణునిగా తయారుచేసే వ్యాపారంలో తప్ప మిగిలిన వాటన్నింటిలోనూ ఉన్నది ధూళి మాత్రమే అని అంటారు. కానీ ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు. తండ్రికి చెందినవారిగా అయి తమ దేహ సహితంగా అంతా తండ్రికి ఇచ్చేయాలి, ఎందుకంటే మనకు కొత్త శరీరం కావాలని మీకు తెలుసు. తండ్రి అంటారు – మీరు కృష్ణపురికి వెళ్ళగలరు కానీ ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయినప్పుడే వెళ్ళగలరు. మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని కృష్ణపురిలో అనరు. ఇక్కడ మనుష్యమాత్రులందరూ, ఓ లిబరేటర్ (ముక్తిదాత) రండి, ఈ పాపాత్ముల ప్రపంచం నుండి విముక్తి కలిగించండి అని పిలుస్తూ ఉంటారు. మనల్ని తమతో పాటు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్ళడం మంచిదే కదా. మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ అసలు శాంతి అని దేనినంటారు అనేది వారికి తెలియదు. కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. శాంతి అయితే శాంతిధామంలో ఉంటుంది. తర్వాత ఈ శరీరాలను తీసుకొని కర్మలనైతే చేయాల్సిందే. సత్యయుగంలో కర్మలు చేస్తూ శాంతిగా ఉంటారు. అశాంతిలో మనుష్యులకు దుఃఖం కలుగుతుంది, అందుకే శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. శాంతిధామం మన ఇల్లు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగంలో శాంతి, సుఖం అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కావాలా లేక కేవలం శాంతి మాత్రమే కావాలా. ఇక్కడైతే దుఃఖం ఉంది, అందుకే పతితపావనుడైన తండ్రిని కూడా ఇక్కడ పిలుస్తారు. భగవంతుడిని కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా ముందు అవ్యభిచారీగా, తర్వాత వ్యభిచారీ భక్తిగా అవుతుంది. వ్యభిచారీ భక్తిలో ఏమేమి చేస్తారో చూడండి. మెట్ల చిత్రంలో ఎంత బాగా చూపించారో చూడండి. కానీ మొట్టమొదట భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణుడిని ఆ విధంగా తయారుచేసింది ఎవరు, మునుపటి జన్మలో వారు ఎవరు అనేది నిరూపించాలి. ఈ విషయాలను అర్థం చేయించడానికి చాలా యుక్తి కావాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో, వారి హృదయం కూడా సాక్ష్యం ఇస్తుంది. యూనివర్సిటీలో ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు తప్పకుండా ముందుకు వెళ్ళిపోతారు. నంబరువారుగా అయితే ఉంటారు. కొంతమంది మంద బుద్ధి కలవారు కూడా ఉంటారు. నా బుద్ధి తాళం తెరవండి అని ఆత్మ శివబాబాతో అంటుంది. తండ్రి అంటారు – బుద్ధి తాళాన్ని తెరిచేందుకే కదా నేను వచ్చింది, కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయంటే వాటివల్ల అసలు మీ తాళం తెరుచుకోవడమే లేదు, మరి బాబా ఏం చేయగలరు. చాలా పాపాలు చేసారు, దానికి ఇప్పుడు బాబా ఏం చేయగలరు! నేను తక్కువగా చదువుతున్నాను అని టీచరుకు చెప్తే టీచరు ఏం చేస్తారు? టీచరు ఏమీ కృపను చూపించరు. కావాలనుకుంటే, ఎక్స్ ట్రా టైమ్ ఇస్తారు. ఆ విషయంలో మిమ్మల్ని కాదనరు. ప్రదర్శినీ చిత్రాలు ఖాళీగా ఉన్నాయి, కూర్చొని ప్రాక్టీస్ చేయండి. భక్తి మార్గంలోనైతే కొంతమంది మాలను తిప్పమని చెప్తారు. కొంతమంది ఫలానా మంత్రాన్ని జపించమని చెప్తారు. ఇక్కడైతే తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. తండ్రినే స్మృతి చేయాలి. వారి నుండి వారసత్వం లభిస్తుంది. సత్యయుగంలోనైతే పారలౌకిక తండ్రి వారసత్వం లభిస్తుంది, ఇక స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది కావున తండ్రి నుండి మంచి రీతిగా వారసత్వం తీసుకోవాలి కదా. ఇందులో కూడా తండ్రి అంటారు – ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళకండి. ఏ మాత్రం వికారాల రుచి తగిలినా, అది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. సిగరెట్ మొదలైనవాటిని ఒక్కసారి రుచి చూసినా, వెంటనే సాంగత్యపు రంగు అంటుకుంటుంది. ఇక తర్వాత ఆ అలవాటును వదలడం కష్టమైపోతుంది. అప్పుడు ఎన్ని సాకులు చెప్తారు. ఏదీ అలవాటు చేసుకోకూడదు. ఛీ-ఛీ అలవాట్లను తొలగించుకోవాలి. తండ్రి అంటారు – జీవిస్తూనే దేహ భానాన్ని వదలండి, నన్ను స్మృతి చేయండి. దేవతలకు ఎప్పుడూ పవిత్రమైన నైవేద్యాన్నే పెడతారు కావున మీరు కూడా పవిత్రమైన భోజనాన్నే తినండి.
ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె హర్షితంగా ఉండాలి. కన్యకు పతి లభించగానే ముఖం వికసించిపోతుంది కదా. మంచి నగలు, వస్త్రాలు మొదలైనవి ధరించడంతో మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞానపు నగలను ధరిస్తారు. అక్కడ స్వర్గంలోనైతే సహజ సౌందర్యముంటుంది. కృష్ణుని పేరే సుందరుడు. అక్కడ రాజా-రాణి, యువరాజు-యువరాణి అందరూ సుందరంగా ఉంటారు. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల వంటి సహజ సౌందర్యాన్ని ఇక్కడ ఎవరూ తయారుచేయలేరు. వారిని ఎవరూ ఈ కనుల ద్వారా చూడలేరు. అయితే, సాక్షాత్కారం జరుగుతుంది కానీ సాక్షాత్కారంతో ఎవరూ ఉన్నది ఉన్నట్లుగా చిత్రాన్ని తయారుచేయలేరు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్టుకు సాక్షాత్కారం జరిగితే, అతను వెంటనే అదే సమయంలో కూర్చుని తయారుచేయాలి, అయినా అంత ఖచ్చితముగా తయారుచేయడం కష్టం. కనుక పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బాబా నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. మన ఈ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషం కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటారు – కామం మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే పిలిచారు కదా.
తండ్రి అంటారు – మీరు ఒక్క నా నుండే వినండి మరియు ఈ శ్రీమతాన్నే ఇతురులకు వినిపించండి. తండ్రి, కొడుకును ప్రత్యక్షం చేస్తారు. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. ఫాదర్ అంటే ఎవరు? శివ్ ఫాదర్. శివుడు మరియు సాలిగ్రామాలకు మహిమ ఉంది. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్. ఈ మహిమ వారిదే. తండ్రి అంటారు – మధురమైన పిల్లలూ, ఫాలో చేసి పవిత్రంగా అవ్వండి. ఫాలో చేయడంతోనే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వలన మీరు 63 జన్మలు మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు పారలౌకిక తండ్రిని ఫాలో చేసి పైకి ఎక్కాలి. తండ్రితో పాటు వెళ్ళాలి. తండ్రి అంటారు – ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు – మధురాతి-మధురమైన పిల్లలూ, మొట్టమొదట అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. లౌకిక తండ్రి పతితంగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. పారలౌకిక తండ్రి పావనంగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. ఎంత తేడా ఉంది! ఇప్పుడు పారలౌకిక తండ్రి పావనంగా అవ్వమని చెప్తున్నారు. వికారాల్లోకి వెళ్ళేవారిని పతితులు అని అంటారు.
పతితులను పావనంగా తయారుచేసే మార్గాన్ని చూపించడమే మీ మిషన్. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది కావున పావనంగా అవ్వండి అని పారలౌకిక తండ్రి కూడా ఇప్పుడు చెప్తున్నారు. కావున ఇప్పుడు ఏం చేయాలి? తప్పకుండా పారలౌకిక తండ్రి మతమును అనుసరించాలి కదా. ప్రదర్శనీలో ఈ ప్రతిజ్ఞను కూడా రాయించాలి – పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తారా? పతితంగా అవ్వడం మానేస్తారా? ఇవి రాయమని వారికి చెప్పాలి. బాబా గ్యారంటీ ఇస్తారు, మీరు కూడా గ్యారంటీ ఇవ్వవచ్చు. అసలు మీరు పతితంగా ఎందుకవుతారు, మళ్ళీ ఓ పతితపావనా రండి, అని ఎందుకు పిలుస్తారు. విషయమంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అని పిల్లలైన మీకు ప్రతిరోజు సంతోషం ఉండాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎటువంటి అశుద్ధమైన (ఛీ-ఛీ) అలవాట్లు అలవాటు చేసుకోకూడదు. జీవిస్తూనే దేహ భానాన్ని వదిలేయాలి. పుష్పాల వలె హర్షితంగా ఉండాలి.
2. పారలౌకిక తండ్రిని ఫాలో చేసి పావనంగా అవ్వాలి. వారి శ్రీమతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేయాలి మరియు చేయించాలి.
వరదానము:-
ఎవరైతే సదా తమ శ్రేష్ఠ వృత్తిలో స్థితులై ఉంటారో, వారు ఎటువంటి వాయుమండలంలోనైనా, వైబ్రేషన్లలోనైనా చలించరు. వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. ఒకవేళ మీ వృత్తి శ్రేష్ఠంగా ఉంటే వాయుమండలం శుద్ధంగా అయిపోతుంది. చాలా మంది, ఏం చేయాలి, వాయుమండలమే అలా ఉంది, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైంది అని వర్ణిస్తూ ఉంటారు. కనుక ఆ సమయంలో శక్తిశాలి ఆత్మకు బదులుగా బలహీన ఆత్మగా అయిపోతారు. కానీ వ్రతం (ప్రతిజ్ఞ) యొక్క స్మృతి ద్వారా వృత్తిని శ్రేష్ఠంగా తయారు చేసుకున్నట్లయితే శక్తిశాలిగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!