15 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

15 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

14 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు అమరలోక యాత్రలో ఉన్నారు, మీ ఈ ఆత్మిక యాత్ర బుద్ధికి సంబంధించింది, ఈ యాత్రను సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులైన మీరు మాత్రమే చేయగలరు”

ప్రశ్న: -

మీతో మీరు లేక పరస్పరంలో ఒకరితో ఒకరు ఎటువంటి మాటలు మాట్లాడుకోవడాన్ని శుభ సమ్మేళనమని అంటారు?

జవాబు:-

మీతో మీరు ఇలా మాట్లాడుకోండి – ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత ఛీ-ఛీ శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్తాను, ఈ తనువు దేనికీ పనికి రాదు, ఇప్పుడు ఇక బాబాతో పాటు వెళ్తాను. పరస్పరంలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇవే మాటలు మాట్లాడుకోండి – సేవను ఎలా వృద్ధి చేయాలి, అందరి కళ్యాణం ఎలా చేయాలి, అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని… ఇదే శుభ సమ్మేళనము.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు… (దిల్ కా సహారా టూట్ నా జాయే…)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు, అన్ని సెంటర్లకు చెందిన బ్రహ్మా ముఖవంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులకు తమ కులము గురించి తెలుసు. ఎవరు ఏ కులానికి చెందినవారైతే, వారికి ఆ కులము గురించి తెలుస్తుంది. తక్కువ కులానికి చెందినవారికైనా లేక మంచి కులానికి చెందినవారికైనా, ప్రతి ఒక్కరికీ తమ కులము గురించి తెలుస్తుంది మరియు ఫలానావారి కులము మంచిది అని అర్థం చేసుకుంటారు. కులము అనండి లేక జాతి అనండి, ఈ ప్రపంచంలో పిల్లలైన మీకు తప్ప ఈ బ్రాహ్మణ కులమే సర్వోత్తమమైనదని ఇంకెవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైన మీ కులమునే మొదటి నంబరు కులమని అంటారు. బ్రాహ్మణ కులము అనగా ఈశ్వరీయ కులము. మొదటిది నిరాకారీ కులము, తర్వాత సాకార సృష్టిలోకి వస్తారు. సూక్ష్మవతనంలోనైతే కులము ఉండదు. సాకార సృష్టిలో ఉన్నతోన్నతమైనది మీ బ్రాహ్మణ కులము. బ్రాహ్మణులైన మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు. పరస్పరంలో సోదరీ-సోదరులు కావున వికారాలలోకి వెళ్ళలేరు. పవిత్రంగా ఉండేందుకు ఇది చాలా మంచి యుక్తి అని మీరు అనుభవంతో చెప్పగలరు. మీలోని ప్రతి ఒక్కరూ, మేము బ్రహ్మాకుమారులమని లేక బ్రహ్మాకుమారీలమని చెప్పుకుంటారు. అందరూ శివ వంశీయులే, తర్వాత సాకారంలోకి వచ్చినప్పుడు ప్రజాపిత పేరు ఉండడం వలన సోదరీ-సోదరులు అవుతారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే తప్పకుండా రచయిత ఉన్నట్లే, వారు దత్తత తీసుకుంటారు. మీరు కుఖ వంశావళి కాదు, మీరు ముఖవంశావళి. మనుష్యులకు కుఖ వంశావళి మరియు ముఖ వంశావళి అంటే ఏమిటి అనే అర్థం కూడా తెలియదు. ముఖవంశావళి అనగా దత్తత తీసుకోబడిన పిల్లలు. కుఖ వంశావళి అనగా గర్భం ద్వారా జన్మ తీసుకున్నవారు. మీ ఈ జన్మ అలౌకికమైనది. మీకు లౌకిక, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాను అలౌకిక తండ్రి అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉన్నారు, ఇది కామన్. పారలౌకిక తండ్రి కూడా అందరికీ ఉన్నారు. భక్తి మార్గంలో – ఓ భగవంతుడా, ఓ పరమపితా అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ బాబాను (ప్రజాపిత బ్రహ్మాను) ఎప్పుడూ ఎవరూ పిలవరు. వీరు బ్రాహ్మణ పిల్లలకు బాబా. వారిరువురి గురించైతే అందరికీ తెలుసు కానీ బ్రహ్మా విషయంలో తికమకపడతారు ఎందుకంటే బ్రహ్మా సూక్ష్మవతనంలో ఉంటారు. వారిని ఇక్కడ చూపించరు. చిత్రాలలో కూడా బ్రహ్మాకు మీసము, గడ్డము ఉన్నట్లుగా చూపిస్తారు ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మా ఈ సృష్టిలో ఉన్నారు. సూక్ష్మవతనంలోనైతే ప్రజలను రచించలేరు. ఇది కూడా ఎవరి బుద్ధిలోకీ రాదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మిక యాత్రను గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ నుండైతే ఇక తిరిగి రారో, దానిని ఆత్మిక యాత్ర అని అంటారు. వేరే యాత్రలనైతే అందరూ జన్మజన్మలుగా చేస్తూ ఉంటారు మరియు ఆ యాత్రలకు వెళ్ళి తిరిగొస్తారు. అవి దైహిక యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక యాత్ర చేసినట్లయితే ఇక మీరు తిరిగి మృత్యులోకంలోకి రారు. తండ్రి మీకు అమరలోక యాత్రను నేర్పిస్తారు. వాళ్ళు కాశ్మీర్ వైపు అమరనాథ యాత్రకు వెళ్తారు. అదేమీ అమరలోకం కాదు. అమరలోకము అనేది – ఒకటి ఆత్మలది, మరొకటి మనుష్యులది, దానిని స్వర్గము లేక అమరలోకమని అంటారు. ఆత్మల లోకము నిర్వాణధామము. ఇకపోతే, సత్యయుగము అమరలోకము, కలియుగము మృత్యులోకము మరియు ఆత్మలు నివసించే నిర్వాణధామము శాంతిలోకము. తండ్రి అంటారు – మీరు అమరపురి యాత్రలో ఉన్నారు. ఆ దైహిక యాత్రలకు కాలినడకన వెళ్తారు. ఇది ఆత్మిక యాత్ర, ఈ యాత్రను నేర్పించేవారు ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే, వారు ఒక్కసారి మాత్రమే వచ్చి నేర్పిస్తారు. ఆ యాత్రలు జన్మ-జన్మలుగా చేస్తూ వచ్చారు. ఇది మృత్యులోకం యొక్క అంతిమ యాత్ర. దీని గురించి బ్రాహ్మణ కులభూషణులైన మీకు మాత్రమే తెలుసు. ఆత్మిక యాత్ర అనగా స్మృతిలో ఉంటారు. అంతమతి సో గతి (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది) అని అంటూ ఉంటారు. మీకు బాబా ఇల్లే గుర్తుకొస్తుంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుందని అర్థం చేసుకుంటారు. ఇది పాత వస్త్రము, పాత శరీరము. ఆత్మలో మాలిన్యం చేరినప్పుడు శరీరంలో కూడా మాలిన్యం చేరుతుంది. ఆత్మ పవిత్రంగా అయినప్పుడు, మనకు శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. బయటివారు ఏమీ అర్థం చేసుకోరు. కొంతమంది అర్థం చేసుకోవడాన్ని మీరు చూస్తారు. కొందరి బుద్ధిలో ఈ జ్ఞానం లేదు. అర్థం చేసుకునేవారు తప్పకుండా ఇతరులకు అర్థం చేయిస్తారు. మనుష్యులు యాత్రలకు వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రం అవుతారు. నెల, రెండు నెలలు పవిత్రంగా ఉంటారు. యాత్రలకు కూడా సీజన్ ఉంటుంది. యాత్రలకు అన్ని సమయాలలోనూ వెళ్ళలేరు. చలికాలం లేక వర్షాకాలంలో ఎవరూ వెళ్ళలేరు. మీ యాత్రలోనైతే వేడి-చలి అనే మాట ఉండదు. మీరు తండ్రి ఇంటికి వెళ్తున్నారని స్వయం బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మనం ఎంతగా స్మృతి చేస్తామో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి వస్తాము. ఇది తండ్రియే అర్థం చేయిస్తారు. ఇక్కడ కూడా పిల్లలు నంబరువారుగా ఉన్నారు. నిజానికి యాత్రను మర్చిపోకూడదు కానీ మాయ మర్చిపోయేలా చేస్తుంది. అందుకే – బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నామని రాస్తారు కూడా. అరే, ఏ స్మృతి యాత్రతోనైతే మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారో, అటువంటి ఔషధాన్ని మీరు మర్చిపోతారా. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభమని కూడా చెప్తారు. ఆత్మనైన నేను ముందు సతోప్రధానంగా ఉండేవాడిని, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యాను అని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు, శివబాబా మనకు మంచి యుక్తులను తెలియజేస్తున్నారు, ఇకపోతే అభ్యాసం చేయాలి. ఆలోచించడమనేది కళ్ళు మూసుకుని చేయరు (ఆ సమయంలో బాబా అలా యాక్ట్ చేసి చూపించారు). మీతో మీరు ఇలా మాట్లాడుకోండి – మేము సతోప్రధానంగా ఉండేవారము, మేమే రాజ్యం చేసేవారము. ఆ ప్రపంచం బంగారు యుగంగా ఉండేది, ఆ తర్వాత వెండి, రాగి, ఇనుప యుగాలలోకి వచ్చేసాము. ఇప్పుడిది ఇనుప యుగం యొక్క అంతిమము కావున బాబా వచ్చారు. తండ్రి ఆత్మలైన మనకు చెప్తారు – నన్ను స్మృతి చేయండి మరియు ఎక్కడి నుండైతే వచ్చారో, ఆ ఇంటిని స్మృతి చేయండి, అప్పుడు అంతమతి సో గతి జరుగుతుంది. మీరు అక్కడికే వెళ్ళాలి. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోండి అనే యుక్తిని తండ్రి తెలియజేస్తారు. నేను కూడా ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేస్తానని బాబా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. సత్యమైన సంపాదనను చేసుకోవాలి కదా. సుబహ్ కా సాయీ బేడా బనే లాయీ (ఓ ప్రాతః స్మరణీయ ప్రభూ! ఈ రోజంతటికీ సరిపడే సంపాదనను ఇచ్చే కొనుగోలుదారుడిని పంపించు) అని అంటారు. కావున వారిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. బాబా ఏది చేస్తే, ఎలా చేస్తే, అది పిల్లలకు కూడా అర్థం చేయిస్తారు. ఇందులో ఘర్షణ యొక్క విషయమేమీ లేదు. ఇది సంపాదన చేసుకునేందుకు చాలా మంచి యుక్తి. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేస్తే బే అనగా స్వర్గ రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుంది. మేము రాజయోగం నేర్చుకుంటున్నాము – అని పిల్లలకు తెలుసు. బాబా బీజరూపుడు, నాలెడ్జ్ ఫుల్ కనుక మనము కూడా వృక్షం గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఇది కూడా విస్తారమైన జ్ఞానము. ఆదిలో ఈ వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది, తర్వాత దీని ఆయువు ఎలా పూర్తవుతుంది మరియు తుఫాన్లు రావడంతో వృక్షం ఎలా పడిపోతుంది అనేది మీకు తెలుసు. కానీ, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క మొదటి పునాది అయిన దేవీ-దేవతా ధర్మం ప్రాయః లోపమైపోతుంది. ఇది కూడా జరగాల్సిందే. ఈ ధర్మం మాయమైపోయినప్పుడే మళ్ళీ ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతుందని అంటారు. ఈ ధర్మం కల్ప-కల్పము ప్రాయః లోపమైపోతుంది. ఆత్మలో మాలిన్యం చేరుకున్నప్పుడు నగ (శరీరం) కూడా అసత్యమైనదిగా అయిపోతుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు – ఇంతకుముందు మాలో మాలిన్యం ఉండేది, ఇప్పుడు మేము స్వచ్ఛంగా అవుతున్నాము కనుక ఇతరులకు మార్గాన్ని చూపిస్తాము. ప్రపంచమైతే ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. ఇంతకుముందు సతోప్రధాన స్వర్గం ఉండేది. కావున పిల్లలు ఉదయాన్నే లేచి తమతో తాము మాట్లాడుకోవాలి అనగా ఆత్మిక సంభాషణ చేయాలి. విచార సాగర మథనం చేయాలి. ఆ తర్వాత – ఇది 84 జన్మల చక్రమని, 84 జన్మలను ఎలా తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అనేది ఇతరులకు అర్థం చేయించాలి. తప్పకుండా ఎవరైతే ముందు వస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. వారు వచ్చి 84 జన్మల చక్రం గురించి అర్థం చేయిస్తారు. తండ్రి ఎక్కడ వచ్చారు అనేది కూడా తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని స్వయంగా ఇస్తారు. తండ్రి అంటారు – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ విధంగా ఎవరూ అర్థం చేయించలేరు. గీత మొదలైనవి వినిపిస్తూ ఉంటారు, అక్కడికి కూడా మనుష్యులు వెళ్తూ ఉంటారు. కానీ, భగవంతుడనేవారు ఎప్పుడో వచ్చి ఉంటారు, జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. అంటే, వారు వచ్చినప్పుడే వినిపిస్తారు కదా. ఆ వ్యక్తులు గీతా పుస్తకం పట్టుకుని కూర్చొని వినిపిస్తారు. ఇక్కడైతే భగవంతుడు జ్ఞానసాగరుడు, వీరేమీ చేతిలో పట్టుకుని చదవాల్సిన అవసరం లేదు. వీరేమీ నేర్చుకోరు. కల్పక్రితం కూడా వచ్చి పిల్లలైన మీకు సంగమంలో నేర్పించారు. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది స్మృతి యాత్ర. బ్రహ్మా ముఖవంశావళి వద్ద తప్ప ఇంకే మనుష్యుల వద్ద ఈ జ్ఞానం ఉండదని మీ బుద్ధికి మాత్రమే తెలుసు. అందరిలోనూ సర్వవ్యాపి జ్ఞానం నిండి ఉంది. పరమాత్మ బిందువని, జ్ఞానసాగరుడు, పతితపావనుడని ఎవరికీ తెలియదు. కేవలం అలా పాడుకుంటూ ఉంటారు. గురువులు ఏది నేర్పిస్తే అది సత్యం-సత్యం అని అంటూ ఉంటారే కానీ అర్థము తెలుసుకోరు, అలానే ఇది సత్యమా కాదా అని కూడా ఎప్పుడూ ఆలోచించరు. తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలైన మీరు నడుస్తూ-తిరుగుతూ తప్పకుండా స్మృతి యాత్రలో ఉండాలి లేదంటే వికర్మలు వినాశనమవ్వవు. ఏ కర్మలు చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. శ్రీనాథ ద్వారంలో భోజనం తయారుచేస్తున్నప్పుడు వారి బుద్ధిలో శ్రీనాథుడు ఉంటారు కదా. కూర్చోవడమే మందిరంలో కూర్చొని ఉన్నారు కదా. మేము శ్రీనాథుని కోసం భోగ్ తయారు చేస్తున్నాము – అని వారికి తెలుసు. భోజనం తయారుచేస్తారు, భోగ్ సమర్పిస్తారు, ఆ తర్వాత ఇంట్లోని వారు, పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. అక్కడ భోజనం తయారుచేసేటప్పుడు నోటిని కప్పుకుంటారు, మాట్లాడరు. మనసు ద్వారా ఏ వికర్మలు తయారవ్వవు. వారు శ్రీనాథుని మందిరంలో కూర్చొన్నారు. ఇక్కడ మీరు శివబాబా వద్ద కూర్చొన్నారు. ఇక్కడ కూడా బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. పిల్లలూ, అనవసరమైన మాటలేవీ మాట్లాడకండి. సదా తండ్రితో మధురాతి-మధురమైన మాటలను మాట్లాడాలి. తండ్రి ఎలా ఉన్నారో, పిల్లలు అలా ఉంటారు. చక్రం ఎలా తిరుగుతుంది అనేది తండ్రి స్మృతిలో ఉంటుంది కావున వారు వచ్చి పిల్లలైన మీకు వినిపిస్తారు. మా బాబా మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యమైనవారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయము, అయినా అర్థం చేసుకోరు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. ఆ బీజాన్ని మనం చైతన్యమైనదని అనము. వీరు నాలెడ్జ్ ఫుల్, చైతన్యమైనవారు. వీరు ఒక్కరే. ఆ బీజాలు అనేక రకాలవి ఉంటాయి. భగవంతుడిని మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. అంటే, వీరు తండ్రి అయినట్లు కదా. ఆత్మల తండ్రి పరమాత్మ కనుక పరస్పరంలో అందరూ సోదరులు అయినట్లు. ఆత్మలైన మీరు నివసించే చోటే తండ్రి కూడా నివసిస్తారు. నిర్వాణధామంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. ఈ సమయంలో ప్రజాపిత బ్రహ్మా సంతానమైన మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు. అందుకే శివవంశీ బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలవబడతారు. బ్రహ్మాకుమార-కుమారీలైన మేము పరస్పరంలో సోదరీ-సోదరులము అని కూడా మీరు వ్రాయాలి. తండ్రి బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారు కావున మీరు పరస్పరంలో సోదరీ-సోదరులు అయినట్లు కదా. కల్ప-కల్పము ఇదే విధంగా సృష్టిస్తారు. దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇతర మనుష్యులెవరినీ ప్రజాపిత బ్రహ్మా అని అనరు. బాబా అని సంబోధిస్తారు కానీ వారు హద్దు తండ్రి, వీరిని ప్రజాపిత అని అంటారు ఎందుకంటే చాలా మంది ప్రజలు ఉన్నారు అనగా అనేకమంది పిల్లలున్నారు. కావున, అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని విషయాల గురించి అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచం పూర్తిగా పాడైపోయింది, ఛీ-ఛీ గా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని వాహ్-వాహ్ అనబడే ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. మీలో కూడా చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అనేది గుర్తున్నట్లయితే, తండ్రి కూడా గుర్తుంటారు మరియు గురువు కూడా గుర్తుంటారు. పాత శరీరాన్ని వదిలేస్తారు ఎందుకంటే ఈ తనువు ఇప్పుడిక పనికి రాదు. ఇప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటే, శరీరం కూడా పవిత్రంగా అవుతుంది. పరస్పరంలో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడుకోవాలి, దీనినే శుభ సమ్మేళనమని అంటారు. ఇక్కడ మంచి-మంచి మాటలు మాట్లాడుకుంటారు. సేవను ఎలా వృద్ధి చేయాలి, కళ్యాణం ఎలా చేయాలి అని మాట్లాడుకోవాలి. వారిది ఛీ-ఛీ సమ్మేళనము. కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ ప్రగల్భాలు ఉండవు. దీనిని సత్యాతి-సత్యమైన సమ్మేళనమని అంటారు. మీకు ఈ కథను వినిపించారు – ఇది కలియుగము, సత్యయుగాన్ని స్వర్గము అంటారు. భారత్ స్వర్గంగా ఉండేది, భారతవాసులే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు అంతిమంలో ఉన్నారు. ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. దీని కోసం గంగా స్నానాలు మొదలైనవి చేయాల్సిన అవసరం లేదు. భగవానువాచ – నేను అందరికీ తండ్రిని, కృష్ణుడు అందరికీ తండ్రి కాలేరు. శ్రీ నారాయణుడు ఒకరు లేక ఇద్దరు పిల్లలకు తండ్రి, అంతేకానీ శ్రీకృష్ణుడు తండ్రి కారు. శ్రీకృష్ణుడు కుమారుడు. ఈ ప్రజాపిత బ్రహ్మాకు అయితే అనేక మంది పిల్లలున్నారు. కృష్ణ భగవానువాచ ఎక్కడ, శివ భగవానువాచ ఎక్కడ. ఎంత పెద్ద పొరపాటు చేసేసారు. ఎక్కడ ప్రదర్శనీ పెట్టినా, గీతా భగవంతుడు శివుడా లేక కృష్ణుడా అనేది ముఖ్యమైన విషయము. ముందుగా శివుడిని భగవంతుడు అంటారని అర్థం చేయించాలి. ఈ విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. దీనికి సంబంధించిన ప్రశ్నావళి ఉండాలి. గీతా భగవంతుని చిత్రం కూడా పెద్దగా, పర్మనెంట్ గా ఉండాలి. చిత్రం క్రింద – నిర్ణయించుకోండి, వచ్చి తెలుసుకోండి అని వ్రాయాలి. తర్వాత వారి చేత రాయించి సంతకం తీసుకోవాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరంలో శుభ సమ్మేళనము చేసుకొని సేవ వృద్ధి కోసం ప్లాన్లు తయారుచేయాలి. స్వ కళ్యాణం మరియు సర్వుల కళ్యాణం కోసం యుక్తులను రచించాలి. ఎప్పుడూ అనవసరమైన మాటలేవీ మాట్లాడకూడదు.

2. ఉదయాన్నే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి, విచార సాగర మథనం చేయాలి. భోజనం తయారు చేస్తూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. మనసు కూడా బయట భ్రమించకూడదు, దీని పట్ల అటెన్షన్ పెట్టాలి.

వరదానము:-

వినాశన సమయంలో పరీక్షలో పాస్ అయ్యేందుకు లేక అన్ని పరిస్థితులను ఎదుర్కోగలిగేందుకు ఆకారీ లైట్ రూపధారులుగా అవ్వండి. నడుస్తూ-తిరుగుతూ ఉన్న లైట్ హౌసుగా అయినప్పుడు మీ ఈ రూపం (శరీరం) కనిపించదు. ఎలాగైతే పాత్రను అభినయించే సమయంలో వస్త్రాన్ని ధరించి, కార్యం సమాప్తమవుతూనే వస్త్రాన్ని వదిలేస్తారో, అలా ఒక్క సెకండులో ధారణ చేయండి మరియు ఒక్క సెకండులో అతీతులుగా అవ్వండి – ఇటువంటి అభ్యాసం ఉన్నట్లయితే, వీరు లైట్ వస్త్రధారులు, లైట్ యే వీరి అలంకారము అని చూసేవారు అనుభవం చేసుకుంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top