13 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

13 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

12 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తత్వాల సహితంగా మనుష్య మాత్రులందరినీ మార్చే యూనివర్సిటీ (విశ్వవిద్యాలయం) కేవలం ఇదొక్కటే, ఇక్కడి నుండే అందరి సద్గతి జరుగుతుంది”

ప్రశ్న: -

తండ్రి పట్ల నిశ్చయం ఏర్పడుతూనే ఏ సలహాను వెంటనే అమలులోకి తీసుకురావాలి?

జవాబు:-

1. తండ్రి వచ్చారని నిశ్చయం ఏర్పడినప్పుడు తండ్రి యొక్క మొట్టమొదటి సలహా ఏమిటంటే – ఈ కనులతో చూసేదంతా మర్చిపోండి, ఒక్క నా మతమునే అనుసరించండి. ఈ సలహాను వెంటనే అమలులోకి తీసుకురావాలి. 2. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారంటే, ఇక మీకు పతితులతో ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండకూడదు. నిశ్చయబుద్ధి కల పిల్లలకు ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం రాదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఇది ఇల్లు కూడా మరియు యూనివర్సిటీ కూడా. దీనినే గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అని అంటారు ఎందుకంటే ప్రపంచంలోని మనుష్యమాత్రులందరి సద్గతి జరుగుతుంది. ఇదే రియల్ వరల్డ్ యూనివర్సిటీ. ఇది ఇల్లు కూడా. ఇక్కడ మీరు మాతా-పితల ఎదురుగా కూర్చున్నారు, అంతేకాక ఇది యూనివర్సిటీ కూడా. స్పిరిచ్యుల్ ఫాదర్ కూర్చొని ఉన్నారు. ఈ ఆత్మిక నాలెడ్జ్ ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను స్పిరిచ్యుల్ ఫాదర్ తప్ప ఇతర మనుష్యులెవరూ ఇవ్వలేరు. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు మరియు జ్ఞానంతోనే సద్గతి జరుగుతుంది, అందుకే జ్ఞానసాగరుడు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ద్వారా ప్రపంచంలోని మనుష్యులు మాత్రమే కాదు, ప్రతి వస్తువు మరియు పంచ తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. సర్వుల సద్గతి జరుగుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. పాత ప్రపంచము మరియు ప్రపంచములో నివసించేవారంతా మారిపోతారు. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో, ఇవన్నీ మారి కొత్తగా అవ్వనున్నాయి. ఇక్కడ అసత్యపు మాయ, అసత్యపు శరీరం ఉన్నాయి….. అని అంటూ ఉంటారు, ఇది అసత్య ఖండంగా తయారయ్యింది. భారత్ సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్య ఖండంగా ఉంది. రచయిత మరియు రచనల గురించి మనుష్యులు చెప్పేదంతా అసత్యము. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకుంటారు – ఇది భగవానువాచ. ఆ తండ్రి ఒక్కరే భగవంతుడు కదా. వారు నిరాకారుడు, వాస్తవానికి ఆత్మలన్నీ నిరాకారియే, తర్వాత ఇక్కడకు వచ్చి సాకార రూపాన్ని తీసుకుంటాయి. అక్కడ ఆకారము ఉండదు. ఆత్మలు మూలవతనంలో లేక బ్రహ్మ మహాతత్వంలో నివసిస్తాయి. అది ఆత్మల ఇల్లు, బ్రహ్మ మహాతత్వము. ఇది ఆకాశ తత్వము, ఇక్కడ సాకార పాత్ర నడుస్తుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి. దీని అర్థం తెలియదు కానీ రిపీట్ అవుతుంది అని కేవలం అంటూ ఉంటారు. బంగారు యుగం, వెండి యుగం….. ఈ యుగాలన్నీ గడిచిన తర్వాత ఏమవుతుంది? తప్పకుండా మళ్ళీ బంగారు యుగం వస్తుంది. సంగమయుగం ఒక్కటే ఉంటుంది. సత్య-త్రేతాయుగాలకు మరియు త్రేతా-ద్వాపరయుగాలకు మధ్యనున్న సంగమాలను సంగమము అని అనరు. అది రాంగ్ అవుతుంది. నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగంలో వస్తాను అని తండ్రి అంటారు. మీరు పతితంగా అయినప్పుడే నన్ను పిలుస్తారు. మీరు పావనంగా చేసేందుకు రండి అని అంటారు. సత్యయుగంలోనే పావనంగా ఉంటారు. ఇప్పుడిది సంగమము. దీనిని కళ్యాణకారీ సంగమయుగమని అంటారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మిలనం యొక్క సంగమము, దీనిని కుంభము అని కూడా అంటారు. వారు నదుల మేళాను చూపిస్తారు. రెండు నదులైతే ఉంటాయి, మూడవదానిని గుప్త నది అని అంటారు. ఇది కూడా అసత్యమే. గుప్త నది అనేది ఏమైనా ఉంటుందా? గుప్త నది ఉంటుంది అనే మాటను సైన్సు వారు కూడా ఒప్పుకోరు. బాణం వేయగానే గంగ వెలువడిందని చెప్తారు, ఇదంతా అసత్యము. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని అంటూ ఉంటారు. ఈ పదాలను పట్టుకున్నారు కానీ వీటి అర్థం తెలియదు. మొట్టమొదట జ్ఞానము అనగా పగలు, సుఖము, తర్వాత భక్తి అనగా రాత్రి, దుఃఖము. బ్రహ్మా పగలు, బ్రహ్మా రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా ఒక్కరే ఉండరు కదా, చాలామంది ఉంటారు కదా. పగలు అర్ధకల్పం ఉంటుంది, తర్వాత రాత్రి కూడా అర్ధకల్పం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలుగుతుంది.

దేహ సహితంగా మీరు ఈ కనులతో చూసేదంతా జ్ఞానం ఆధారంగా మర్చిపోవాలి అని తండ్రి అంటారు. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ చేసుకోవాలి, పిల్లలను కూడా సంభాళించాలి కానీ బుద్ధి యోగం ఒక్కరితోనే జోడించాలి. అర్ధకల్పం మీరు రావణుని మతాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున ఏం చేసినా సరే, తండ్రి సలహా అనుసారంగా చేయండి. ఇంతకాలం మీ ఇచ్చి-పుచ్చుకోవడాలు పతితులతోనే జరుగుతూ వచ్చాయి, దాని ప్రతిఫలం ఏమయింది. రోజు-రోజుకు పతితులుగానే అవుతూ వచ్చారు ఎందుకంటే భక్తి మార్గమంటేనే దిగే కళ యొక్క మార్గము. సతోప్రధానం నుండి సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంటుంది. తప్పకుండా దిగాల్సిందే. దీని నుండి ఎవరూ విడిపించలేరు. లక్ష్మీ-నారాయణులకు కూడా 84 జన్మలను చూపించారు కదా. ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్….. అలా-అలా మాలిన్యం చేరుకుంటూ ఉంటుంది. అలా ఈ సమయంలో ఇనుప యుగం వారిగా అయ్యారు. గోల్డెన్ ఏజ్ లో కొత్త ప్రపంచముండేది, కొత్త భారత్ ఉండేది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇది నిన్నటి విషయమే. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేసారు. ఇప్పుడు తండ్రి అంటారు – మీ శాస్త్రాలు రైటా లేక నేను రైటా? తండ్రిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. ఎవరైతే చాలా వేదశాస్త్రాలను చదువుతారో, వారిని అథారిటీ అని అంటారు. తండ్రి అంటారు – వీరంతా భక్తి మార్గంలోని అథారిటీ. జ్ఞానం విషయంలో నన్ను, మీరు జ్ఞాన సాగరుడు, మేము కాదు అని మహిమ చేస్తారు. మనుష్యులంతా భక్తి సాగరంలో మునిగిపోయి ఉన్నారు. సత్యయుగంలో ఎవరూ వికారాల్లోకి వెళ్ళరు. కలియుగంలోనైతే మనుష్యులు ఆదిమధ్యాంతాలు దుఃఖపడుతూనే ఉంటారు. తండ్రి కల్పక్రితం కూడా ఇలా అర్థం చేయించారు, ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితం కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చదువుకొని పొందుతున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రపంచం వినాశనమైపోతుంది, అందుకే అనంతమైన తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. వారు తండ్రి, టీచరు మరియు గురువు కూడా. సుప్రీమ్ ఫాదర్ మరియు సుప్రీమ్ టీచరు కూడా. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనే జ్ఞానమంతా తెలియజేస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వీరు 5 వేల సంవత్సరాల క్రితం వలె వచ్చిన అదే గీతా భగవంతుడని, శ్రీకృష్ణుడు గీతా భగవంతుడు కాదని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మనుష్యులను భగవంతుడని అనరు. భగవంతుడు పునర్జన్మ రహితుడు. వీరిది దివ్య జన్మ అని అంటారు. లేదంటే, నిరాకారుడినైన నేను ఎలా మాట్లాడాలి. నేను తప్పకుండా వచ్చి పావనంగా తయారుచేయాలి అన్నప్పుడు యుక్తులను చెప్పాల్సి ఉంటుంది. ఆత్మలైన మనము అమరులమని మీకు తెలుసు. రావణ రాజ్యంలో మీరందరూ దేహాభిమానులుగా అయిపోయారు. సత్యయుగంలో దేహీ-అభిమానులుగా ఉంటారు. ఇకపోతే, రచయిత అయిన పరమాత్మ గురించి మరియు వారి రచన గురించి అక్కడ సత్యయుగంలో కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ అక్కడ కూడా, మేము మళ్ళీ ఈ విధంగా పడిపోవాల్సి ఉంటుందని తెలిస్తే రాజ్యం యొక్క సంతోషమే ఉండదు, అందుకే తండ్రి అంటారు – అక్కడ ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది, మీకు సద్గతి కలిగిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. దుర్గతిలో ఉన్నప్పుడు జ్ఞానం యొక్క అవసరం ఉంటుంది. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు, అందరూ కామ చితిపై కూర్చుని కాలిపోయి మరణించారు. తండ్రి అంటారు – నా పిల్లలైన ఆత్మలు వచ్చి శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తారు, వారు కామ చితిపై కూర్చుని తమోప్రధానంగా అయిపోయారు. మేము పతితంగా అయిపోయామని పిలుస్తారు కూడా. కామ చితి వలనే పతితంగా అవుతారు. క్రోధం లేక లోభం వలన పతితంగా అవ్వరు. సాధు సన్యాసులు మొదలైనవారు పావనమైనవారు, దేవతలు పావనమైనవారు, అందుకే పతిత మనుష్యులు వెళ్ళి వారికి తల వంచి నమస్కరిస్తారు. మీరు నిర్వికారులు, మేము వికారులము అని పాడుతారు కూడా. నిర్వికారీ ప్రపంచము, వికారీ ప్రపంచము అని అంటూ ఉంటారు కదా. భారత యే నిర్వికారీ ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు వికారీగా ఉంది. భారత్ తో పాటు మొత్తం ప్రపంచమంతా వికారీగానే ఉంది. నిర్వికారీ ప్రపంచంలో నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఒకే ధర్మముండేది, పవిత్రత ఉండేది కావున శాంతి, సంపద కూడా ఉండేవి, అలా మూడూ ఉండేవి. పవిత్రత ఫస్ట్, ఇప్పుడు పవిత్రత లేదు కనుక శాంతి, సంపద కూడా లేవు.

జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు మిమ్మల్ని కూడా అలా ప్రియంగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో అందరూ ప్రియమైనవారే. మనుష్యులు, జంతువులు మొదలైనవన్నీ ప్రియమైనవే. పులి, మేక ఒకేచోట కలిసి నీరు తాగుతాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అక్కడ అశుద్ధ పరిచే వస్తువేదీ ఉండదు. ఇక్కడ అనారోగ్యాలు, దోమలు మొదలైనవి చాలా ఉన్నాయి. అక్కడ ఇటువంటివేవీ ఉండవు. షావుకార్ల వద్ద ఫర్నీచర్ కూడా ఫస్ట్ క్లాసుగా ఉంటుంది. పేదవారి విషయంలో ఫర్నీచర్ కూడా సాధారణంగా ఉంటుంది. భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది. ఎంత చెత్త చేరుకుంది. సత్యయుగంలో ఎంత శుభ్రత ఉంటుంది. బంగారు మహళ్ళు మొదలైనవి ఎంత ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. వైకుంఠంలో ఆవులు కూడా ఎంత ఫస్ట్ క్లాసుగా ఉంటాయో చూడండి. కృష్ణునితో పాటు ఎంత మంచి ఆవులను చూపిస్తారు. కృష్ణపురిలో ఆవులైతే ఉంటాయి కదా. అక్కడి వస్తువులు ఎంత ఫస్ట్ క్లాసుగా ఉంటాయి. స్వర్గమంటే మరి ఏమిటి! ఈ పాత ఛీ-ఛీ ప్రపంచంలోనైతే చాలా చెత్త ఉంది. ఇదంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అయిపోతుంది. ఎలాంటి బాంబులను తయారుచేస్తూ ఉంటారు. బాంబు వేయగానే నిప్పు అంటుకుంటుంది. ఈ రోజుల్లోనైతే రకరకాల జీవాణువులను కూడా వెదజల్లుతూ ఉంటారు, అవి ఒకేసారి అనంతంలో సమాప్తం అయిపోయేలా వినాశనం చేస్తాయి. చికిత్స చేయించుకునేందుకు హాస్పిటల్స్ మొదలైనవి కూడా ఉండవు. తండ్రి అంటారు – పిల్లలకు ఎటువంటి కష్టం కలగకూడదు, అందుకే ప్రకృతి వైపరీత్యాలు, కుండపోత వర్షాలు జరుగుతాయని అంటూ ఉంటారు. పిల్లలు వినాశన సాక్షాత్కారాన్ని కూడా చూసారు. వినాశనం తప్పకుండా జరగనున్నదని బుద్ధి కూడా చెప్తుంది. కొంతమంది, వినాశన సాక్షాత్కారం జరిగితేనే మేము నమ్ముతామని అంటారు. అచ్ఛా, నమ్మకపోతే మీ ఇష్టం అని చెప్పండి. కొంతమంది, మాకు ఆత్మ సాక్షాత్కారం జరిగితేనే మేము నమ్ముతామని అంటారు. అచ్ఛా, ఆత్మ ఒక బిందువు, దానిని చూసారనుకుందాము, అయితే ఏమిటి, దాని వలన సద్గతి కలుగుతుందా? పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడు, వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని అంటారు. కానీ వారు అలా ఉండరు. గీతలో – ఇక చాలించండి, నేను సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా రాసారు. కానీ అలా ఏమీ జరగలేదు. తండ్రిని పిల్లలు చూసి, మేము సహించలేము అని అనడమనేదేమీ జరగదు. ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత పరమాత్మ తండ్రి కూడా అలాగే ఉంటారు. కాకపోతే కేవలం వారు జ్ఞానసాగరుడు. మీలో కూడా జ్ఞానముంది. తండ్రియే వచ్చి చదివిస్తారు, ఇంకే విషయము లేదు. ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో, ఆ భావనను పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇకపోతే భగవంతుడు ఎవరికీ లభించరు. మీరా సాక్షాత్కారాలను పొంది ఎంత సంతోషించేవారు. మరుసటి జన్మలో కూడా భక్తురాలిగానే జన్మించి ఉంటారు. వైకుంఠంలోకైతే వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు వైకుంఠంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం వైకుంఠానికి, ఆ కృష్ణపురికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇక్కడ అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయి కదా. మనం మన రాజ్య భాగ్యాన్ని మళ్ళీ తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. ఇది రాజయోగ బలము. బాహుబలంతో కూడిన యుద్ధాలైతే అనేక సార్లు అనేక జన్మలుగా జరుగుతూ వచ్చాయి. యోగబలంతో మీరు ఎక్కే కళలోకి వెళ్తారు. తప్పకుండా స్వర్గ రాజధాని స్థాపనవుతుందని మీకు తెలుసు. ఎవరైతే కల్పక్రితం పురుషార్థం చేసి ఉంటారో, వారు మళ్ళీ అలాగే చేస్తారు. మీకు హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, వారికి ఎప్పుడూ సంశయం రాదు. సంశయబుద్ధి కలవారు కూడా తప్పకుండా ఉన్నారు. బాబా అన్నారు – ఆశ్చర్యవంతులై వింటారు, వినిపిస్తారు, పారిపోతారు….. అహో మాయ, నీవు వీరిపై విజయం పొందుతావు. మాయ చాలా బలశాలి అయినది. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ సేవ చేసేవారికి, సెంటర్లు నడిపించేవారికి కూడా మాయ చెంపదెబ్బ వేస్తుంది. కొంతమంది వ్రాస్తారు – బాబా, వివాహం చేసుకుని నల్ల ముఖం చేసేసుకున్నాము, కామ ఖడ్గంతో మేము ఓడిపోయాము, బాబా, ఇక ఇప్పుడు మీ ముందుకు వచ్చేందుకు యోగ్యులుగా లేము, బాబా, మేము మీ ముందుకు రావచ్చా అని మళ్ళీ వ్రాస్తారు. బాబా వారికి ఇలా వ్రాస్తారు – నల్ల ముఖం చేసుకున్నారు కనుక ఇప్పుడు ఇక్కడకు రాలేరు, ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు, కానీ అక్కడే ఉండి పురుషార్థం చేయండి. ఒక్కసారి పడిపోయారు అంటే ఇక పడిపోయినట్లే. అలాగని రాజ్య పదవిని పొందగలరని కాదు. ఎవరైతే జ్ఞాన మార్గంలో సదా ఉన్నతిని పొందుతారో, వారు వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు, కానీ ఒకవేళ తప్పటడుగు వేసి మాయకు వశమై దిగజారిపోతే ఏకంగా చండాలురైపోతారు….. అని అంటారు కదా. ఎముకలన్నీ విరిగిపోతాయి. 5 అంతస్తుల నుండి పడిపోతారు. తర్వాత కొంతమంది సత్యం రాస్తారు. కొంతమందైతే అసలు వినిపించరు. ఇంద్రప్రస్థంలోని దేవకన్యల ఉదాహరణ కూడా ఉంది కదా. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఈ సభలో పతితులు కూర్చునేందుకు అనుమతి లేదు. కానీ కొన్ని పరిస్థితులలో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. పతితులే వస్తారు కదా. ఇప్పుడు ఎంతమంది ద్రౌపదులు పిలుస్తున్నారో చూడండి. బాబా, మేము వివస్త్రలుగా కాకుండా రక్షించండి అని అంటారు. బంధనంలో ఉన్నవారి పాత్ర కూడా నడుస్తుంది. కామేశు, క్రోధేశుగా ఉంటారు కదా. చాలా గొడవలు జరుగుతాయి. బాబా వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి అంటారు – పిల్లలూ, దీనిని జయించండి, ఇప్పుడు పవిత్రంగా ఉండండి, నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారని గ్యారంటీ ఉంది. వార్తాపత్రికలలో కూడా, ఎవరో ప్రేరేపించి మా చేత ఈ బాంబులు మొదలైనవి తయారు చేయిస్తున్నారని స్వయం వారు కూడా వ్రాస్తారు. వీటి వలన వాళ్ళ కులమే నాశనమవుతుంది. కానీ ఏమి చేయగలరు, డ్రామాలో నిశ్చయించబడి ఉంది. రోజురోజుకు బాంబులను ఇంకా తయారుచేస్తూ ఉంటారు. సమయమైతే ఎక్కువ ఏమీ లేదు కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యయుగీ ప్రేమభరిత రాజధానిలోకి వెళ్ళేందుకు చాలా-చాలా ప్రియంగా తయారవ్వాలి. రాజ్య పదవి కోసం తప్పకుండా పావనంగా అవ్వాలి. పవిత్రత ఫస్ట్ కనుక కామం మహాశత్రువుపై విజయం పొందాలి.

2. ఈ పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగిగా అయ్యేందుకు, ఈ కనులకు దేహ సహితంగా ఏవైతే కనిపిస్తున్నాయో, వాటిని చూస్తూ కూడా చూడకూడదు. ప్రతి అడుగులో తండ్రి నుండి సలహా తీసుకుని నడుచుకోవాలి.

వరదానము:-

శక్తిశాలీ ఆత్మలు ఎవరైతే ఉంటారో, వారు సమస్యలను, ఒక తిన్నని మార్గాన్ని సులభంగా దాటేస్తున్నట్లుగా దాటేస్తారు. సమస్యలు వారికి ఎక్కే కళకు సాధనంగా అయిపోతాయి. ప్రతి సమస్య ముందు నుండే తెలుసు అన్నట్లుగా వారికి అనుభవమవుతుంది. వారు ఎప్పుడూ ఆశ్చర్యపోరు, సదా సంతుష్టంగా ఉంటారు. వారి నోటి నుండి ఎప్పుడూ కారణం అనే పదం వెలువడదు, అదే సమయంలో కారణాన్ని నివారణలోకి మార్చేస్తారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top