09 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
8 September 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు తెలివైనవారిగా అయ్యారు కనుక సంపాదన పట్ల చాలా-చాలా అభిరుచి ఉండాలి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటి నుండి కూడా సమయాన్ని తీసి తండ్రిని స్మృతి చేసినట్లయితే సంపాదన జరుగుతూ ఉంటుంది”
ప్రశ్న: -
పిల్లలైన మీకు ఎప్పుడూ లభించనటువంటి ఏ శ్రీమతం ఇప్పుడు లభిస్తుంది?
జవాబు:-
1. మీకు ఈ సమయంలో తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు – మధురమైన పిల్లలూ, ఉదయాన్నే లేచి తండ్రి స్మృతిలో కూర్చోండి, అప్పుడు పూర్తి వారసత్వం లభిస్తుంది. 2. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి, ఇటువంటి శ్రీమతం ఇతర సత్సంగాలలో ఎప్పుడూ లభించదు. ఆ సత్సంగాలలో తండ్రి మరియు వారసత్వం యొక్క విషయము ఉండదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవే తల్లివి, తండ్రివి….. (తుమ్ హీ హో మాతా పితా…..)
ఓంశాంతి. విశేషంగా ఈ భారత్ లో మరియు మొత్తం ప్రపంచంలో అనేక రకాల సత్సంగాలుంటాయి. మేము వారసత్వాన్ని పొందుతున్నాము అని మనుష్యుల బుద్ధిలో ఉండేటువంటి సత్సంగం గాని, చర్చి గాని, మందిరం గాని ఏదీ ఉండదు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చొని ఉన్నారు. మేము మా తండ్రి నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము – అనే ఆలోచనతో అన్ని సెంటర్లలోనూ తమ అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఇతర ఏ సత్సంగంలో లేక చర్చి మొదలైనవాటిలో ఈ విధంగా భావించరు. ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచమైన స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలందరూ ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలున్నారు మరియు వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి – అని అందరికీ శ్రీమతం లభిస్తుంది. మనం బాబా నుండి ఈ వారసత్వాన్ని తీసుకోబోతున్నాము. మనం ఆ తండ్రికి చెందినవారిగా అయ్యాము. ఆత్మకు ఇప్పుడు తండ్రి ద్వారా పరిచయం లభించింది. తండ్రి డైరెక్షన్ ఇస్తారు – నన్ను స్మృతి చేయండి మరియు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. అలాగని అందరూ ఇక్కడికే వచ్చి కూర్చునేది లేదు. స్కూల్లో చదువుకొని తర్వాత తమ-తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు. బాలురు-బాలికలు ప్రతి ఒక్కరూ తమ టీచరు నుండి వారసత్వాన్ని పొందగలరు. ఇది కూడా అటువంటిదే. రోజూ చదువుకొని, తర్వాత తమ ఇంటికి వెళ్ళి వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి. మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉన్నారు మరియు మీరు విద్యార్థులు కూడా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈ విధంగా సన్యాసులు మొదలైనవారెవ్వరూ చెప్పరు. ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా కూర్చుని ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవుతారు. ఇతరులెవ్వరూ పవిత్రంగా అయి పరమపిత పరమాత్మను స్మృతి చేయరు. గీతను వింటారు మరియు చదువుకుంటారు కానీ తండ్రిని అయితే స్మృతి చేయరు కదా! వారు చెప్పేదానికి మరియు చేసేదానికి తేడా ఉంటుంది. మన తండ్రి నాలెడ్జ్ ఫుల్ అని, వారిలో మొత్తం డ్రామా చక్రం యొక్క నాలెడ్జ్ ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మనకు కూడా నాలెడ్జ్ లభిస్తుంది. ఈ చక్రం చాలా బాగుంది. ఇది పురుషోత్తమ యుగం అయిన కారణంగా మీ ఈ జన్మ కూడా పురుషోత్తమమైనదే. ఎక్స్ ట్రా (అధిక) మాసముంటుంది కదా.
మనం తప్పకుండా తండ్రి ద్వారా పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనం మళ్ళీ మర్యాదా పురుషోత్తములుగా అవుతున్నాము. తర్వాత 84 జన్మల చక్రం తిరిగాము. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. ఇతర ఏ సత్సంగంలోనూ ఈ విషయాన్ని అర్థం చేయించరు. మనం ఈ విధంగా తయారవ్వాలని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ లక్ష్మీనారాయణుల చిత్రంపై మీరు బాగా అర్థం చేయించవచ్చు. తప్పకుండా బ్రహ్మా ద్వారా యోగబలంతో వీరు ఈ పదవిని పొందారు. ఈ విధంగా బుద్ధిలో ఇమర్జ్ చేసుకోవాలి. బ్రహ్మా-సరస్వతులు మరియు లక్ష్మీ-నారాయణుల రెండు రూపాలను కూడా చూపించారు. బ్రహ్మా-సరస్వతులను, వారితో పాటు ప్రజలను కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రతి విషయం గురించి చాలా బాగా ఆలోచించాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ విధంగా తయారవుతారు అని బ్రహ్మాకు కూడా చెప్తారు, అంటే, నన్ను స్మృతి చేయండి అని బ్రహ్మా ముఖ వంశావళి అయిన వారందరికీ చెప్పినట్లు. ఏ విధంగా స్మృతి చేయాలి అనేది కూడా బుద్ధిలో ఉంది. చిత్రాలు కూడా ఎదురుగా ఉంచారు. వీటిపై అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ప్రదర్శినీలలో కూడా ఈ చిత్రాలపై అర్థం చేయించండి. నిజంగా వీరు అందరికీ అనంతమైన తండ్రి అనే నిశ్చయం కూర్చుంటుంది. ఈ లెక్కన మనకు అనంతమైన వారసత్వం లభించాలి. నిరాకారీ ఆత్మలైన మనము పరస్పరంలో సోదరులము. సాకారంలోకి వచ్చినప్పుడు సోదరీ-సోదరులుగా అయ్యాము. సాకారంలోకి వచ్చినప్పుడే చదువుకోగలము. బ్రహ్మా సంతానమే సోదరీ-సోదరులు అవుతారు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. ఈ విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఎవరికి అర్థం చేయించినా, ముందు తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మనది బ్రదర్ హుడ్ (సహోదర భావము). సర్వవ్యాపి అనడంతో ఫాదర్ హుడ్ (పితృ భావము) అయిపోతుంది. ఫాదర్ హుడ్ అయితే వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది. ఇలా అందరినీ ఫాదర్ అని అనుకుంటూ పడిపోతూ వచ్చారు. వారసత్వం ఏమీ లభించలేదు. ఇప్పుడు బ్రదర్ హుడ్ అని భావించడంతోనే వారసత్వం లభిస్తుంది. కావున దీని గురించి బాగా అర్థం చేయిస్తే, బుద్ధిలో అష్ట దేవతలు మొదలైనవారు ఎవరైతే కూర్చుని ఉన్నారో, వారంతా బుద్ధి నుండి తొలగిపోతారు. ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఏ ఆత్మిక తండ్రి ద్వారానైతే సర్వులకు సద్గతి లభించనున్నదో, వారే సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తారు. అందరూ సుఖమయంగా అయిపోతారు. వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గాన్ని రచించేవారు అని అంటారు. ముందు, బుద్ధిలో తండ్రి ప్రభావాన్ని కూర్చోబెట్టాలి. వీరు ఆత్మల అనంతమైన తండ్రి. వీరినే పతిత-పావన అని అంటారు. ఆత్మలైన మీరు పరమపిత పరమాత్ముని సంతానము. ఈ నిశ్చయాన్ని పక్కా చేసుకోండి. ఈ ముఖ్యమైన విషయాన్ని ముందు బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. అప్పుడు, మేము తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాము, మేము తండ్రిని స్మృతి చేసి విశ్వానికి యజమానులుగా అవుతామని మాకు నిశ్చయం ఉంది అని అంటారు. వారికి ఈ సంతోషం ఎంతగానో ఉంటుంది. వివేకవంతులైతే మరియు బుద్ధిలో పూర్తి నిశ్చయముంటే, అప్పుడు దాదాలోకి వస్తున్న ఇలాంటి అనంతమైన తండ్రిని ముందు కలుసుకోవాలి, శివబాబా బ్రహ్మా ద్వారానే మాతో మాట్లాడగలరు అని అంటారు. ఆత్మలైన మీరు వారిని కలవలేదంటే, ఎలా స్మృతి చేస్తారు. పిల్లలు దత్తత తీసుకోబడితే తండ్రి గుర్తుకొస్తారు. దత్తతయే జరగకపోతే ఎలా గుర్తుకొస్తారు. ముందు వారికి చెందినవారిగా అవ్వండి. ఇటువంటి తండ్రినైతే వెంటనే కలవాలి. తండ్రి కూడా, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా అనే అడుగుతారు. నేను ఆత్మలైన మీ తండ్రిని. శివబాబా మీతో మాట్లాడుతున్నారు. నా ఆత్మకు తండ్రి అంటే మీకు కూడా తండ్రియే. నిజంగా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరేనని మీకు నిశ్చయముందా అని అడుగుతారు. వారే వారసత్వాన్ని ఇస్తారు. పవిత్రంగా కూడా అవ్వాలి. వారిని తప్ప మిగిలినదంతా మర్చిపోవాలి. ఆత్మలైన మీరు ఇంటి నుండి వివస్త్రలుగా వచ్చారు కదా! అక్కడ దేహం కానీ, సంబంధాలు కానీ, ఏవీ ఉండేవి కావు. ఆత్మ శరీరంలో ప్రవేశించి, వారు పెద్ద అయినప్పుడు, వీరు నీకు తండ్రి, వీరు ఫలానా అని అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ అన్ని సంబంధాలకు అతీతమైనది. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు – మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు. మరొక శరీరం లభించేంత వరకు బంధన రహితంగా ఉంటుంది. తల్లి గర్భంలోకి వెళ్ళి, మళ్ళీ బయటకు వచ్చి, తెలివైనవారిగా అయిన తర్వాత, సంబంధాల విషయం వస్తుంది. కనుక ఇక్కడ కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. జీవిస్తూనే అంతా మర్చిపోవాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయడము – ఇదే అవ్యభిచారి స్మృతి. దీనినే యోగమని అంటారు. ఇక్కడ మనుష్యులకు అనేకుల స్మృతి ఉంటుంది. మీది అవ్యభిచారి స్మృతి. ఈ శారీరిక సంబంధాలన్నీ సమాప్తమవ్వనున్నాయని ఆత్మకు తెలుసు. మన సంబంధం ఒక్క తండ్రితోనే ఉంది, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. అలాగని, మిత్ర-సంబంధీకులను స్మృతి చేస్తే వికర్మ తయారవుతుందని కూడా కాదు. ఏదైనా తప్పుడు కర్మ చేసినప్పుడు వికర్మ తయారవుతుంది. అంతేకానీ, ఇతరులను స్మృతి చేయడంతో వికర్మ తయారవ్వదు. కాకపోతే, తప్పకుండా సమయం వృథా అవుతుంది. ఒక్క తండ్రిని స్మృతి చేయడంతో వికర్మలు వినాశనమవుతాయి. ఇది పాపాలను కట్ చేసుకునేందుకు యుక్తి. ఇకపోతే, సంబంధాలు మొదలైనవైతే గుర్తు ఉంటాయి. శరీర నిర్వహణార్థం వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ చేసుకోండి కానీ సమయం లభించినప్పుడల్లా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడే మాలిన్యం తొలగుతుంది. ఇదే ముఖ్యమైన విషయము. పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అని లోలోపలే ఆలోచించండి. తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. సన్యాసులు కూడా శరీరాన్ని వదిలి, గృహస్థుల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు. వారు జన్మ-జన్మలకు పావనంగా అయిపోతారని కాదు. నిర్వికారీ ప్రపంచమనేది ఇప్పుడేమీ లేదు. ఇది వికారీ ప్రపంచము. దీని నుండి ఎవరూ బయటపడలేరు. వికారీ ప్రపంచంలో ఉంటున్న కారణంగా ఏవో ఒక లోపాలు తప్పకుండా ఉంటాయి. ఇకపోతే ప్రపంచాలైతే రెండే ఉన్నాయి – వికారీ ప్రపంచము మరియు నిర్వికారీ ప్రపంచము. పావన ప్రపంచంలో దేవతలుండేవారని అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు ఈ పతిత ప్రపంచం వినాశనం కానున్నది. వినాశనమయ్యేందుకు ముందే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా అంటారు – దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనంగా అయిపోతారు. తండ్రి అంటారు – మీరు నన్ను పతితపావనుడు అని అంటారు కదా. గంగలో మునకలు వేసేవారైతే చాలా మంది ఉన్నారు. ఇలా చేయడం వలన పావనంగా అవ్వరు. ప్రదర్శినీలో చాలా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రజాపిత అయితే ఇక్కడే కావాలి. క్రింద ఈ బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీలు తపస్సు చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని బాగా అర్థం చేయించాలి. ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా అర్థం చేయించాలి. సరిగ్గా అర్థం చేయించకపోతే పేరును అప్రతిష్టపాలు చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా తికమకపడితే, అచ్ఛా, కొంచెం ఆగండి, మేము వేరే సోదరిని పంపిస్తాము అని చెప్పండి. ఒకరికంటే ఒకరు చురుకుగా ఉంటారు కదా! ప్రదర్శినీలు, మేళాలలో చెక్ చేయాలి – వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా, ఏమీ వాదించడం లేదు కదా. గేటు వద్ద కూడా అందరూ తెలిసినవారు ఉండాలి ఎందుకంటే అనేక రకాల వారు వస్తారు కదా! గొప్పవారికి తప్పకుండా గౌరవం ఇవ్వాలి. తేడా అయితే తప్పకుండా ఉంటుంది. వీరి పట్ల ప్రేమ ఉంది, వీరి పట్ల లేదు అని అనుకోకూడదు. ద్వైత దృష్టి ఉందని అనుకోకూడదు. దీనిని ద్వైత దృష్టి అని అనరు. ఇక్కడ గొప్పవారికి ఎక్కువ గౌరవ మర్యాదలు ఇస్తున్నారని భావిస్తారు. సర్వీసబుల్ గా ఉన్న వారికి గౌరవ మర్యాదలు ఇస్తారు కదా! ఎవరైనా భవనాన్ని తయారుచేసి ఇచ్చినట్లయితే, వారికి తప్పకుండా గౌరవ మర్యాదలు ఇస్తారు కదా! ఆ భవనం మీ కోసమే తయారయ్యింది కదా! ఎవరైతే శ్రమించి రాజుగా అవుతారో, వారిని ప్రజలు ఆటోమేటిక్ గా గౌరవిస్తారు కదా! తక్కువ పదవి వారి కంటే, ఉన్నత పదవిలోని వారికి ఎక్కువ గౌరవ మర్యాదలు ఇస్తారు కదా! అనంతమైన తండ్రికి మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ పిల్లలే. కానీ వారు భారత్ లోనే జన్మ తీసుకున్నారు. మొదట ఉన్నతంగా ఉన్న భారతవాసులే ఇప్పుడు నీచంగా అయిపోయారు. కనుక తండ్రి అంటారు – నేను చదివించేందుకు వచ్చాను. నేను భారత్ లో వస్తాను, అప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. ‘ప్రత్యేకంగా’ మరియు ‘సాధారణంగా’ – అని ఉంటాయి కదా! ఇప్పుడు భారత్ యే నరకంగా ఉంది, తర్వాత స్వర్గంగా అవ్వనున్నది. కనుక భారత్ లోకే వెళ్తారు కదా! ఇంకో చోటుకు వెళ్ళి ఏం చేస్తారు. భారత్ లోనే భక్తి మార్గంలో మొట్టమొదట చాలా శోభాయమానమైన సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఎలాగైతే విదేశాలలో పెద్ద-పెద్ద చర్చిలను నిర్మిస్తూ ఉంటారు, ఎందుకంటే అది పోప్ ల రాజ్యము. చర్చిలన్నీ ఒకేలా ఉండవు. నంబరువారుగా ఉంటాయి కదా! సోమనాథ మందిరం ఎంతగా వజ్ర-వైఢూర్యాలతో సంపన్నంగా ఉండేది. ముసల్మానులు మొదలైనవారు దోచుకొని వెళ్ళిపోయారు. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. చర్చి నుండి ఏం దోచుకోగలరు. మనుష్యులు ధనం వెనుక పడతారు కదా! మహమ్మద్ గజనీ ఎంత దోచుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఆంగ్లేయులు వచ్చారు, వారు కూడా ఇక్కడ నుండి ధనాన్ని తరలిస్తూ వచ్చారు. చాలా ధనం తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు అది తిరిగి లభిస్తుంది. కోట్ల రూపాయలను ఇస్తారు. ఇవన్నీ అవసరం పడిన సమయానికి లభిస్తున్నాయి. మీకు రావాల్సిన లెక్క అందకపోతే సమయానికి అవసరాలు ఎలా తీరతాయి. ఈ డ్రామా ఎలా తయారుచేయబడింది, ఈ ఇచ్చి-పుచ్చుకునే లెక్క ఎలా ఉంటుంది అనేది తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా చక్రం తిరుగుతాయి అనేది కూడా పిల్లలకు అర్థం చేయించారు. అయినా బాబా అంటారు – పిల్లలూ, మన్మనాభవ. ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రతి వస్తువు సతో నుండి తమోప్రధానంగా అయిపోతుంది. రోజంతా వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటారు, ఆ సమయాన్ని వదిలేయండి. ఇక మిగతా ఎంత టైమ్ లభిస్తే అంత, నన్ను స్మృతి చేయండి. వ్యాపారాలు మొదలైనవాటిలో కూడా అప్పుడప్పుడు సమయం లభిస్తుంది. చాలా మంది ఉద్యోగం ఎలా ఉంటుందంటే, కేవలం సంతకం చేస్తే సరిపోతుంది. ఇలాంటివారు చాలా మంది ఫ్రీగా ఉంటారు. ఒకవేళ అలా కాకపోయినా, రాత్రి సమయం మీదే కదా! రోజంతా శరీర నిర్వహణార్థము ఆ సంపాదన చేసుకుంటారు. రాత్రి ఈ సంపాదన చేసుకోండి. ఈ సంపాదన భవిష్య 21 జన్మల కోసము. ఒక ఘడియ, అర్ధ ఘడియ – ఎంత వీలైతే అంత, తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీకు చాలా సంపాదన జరుగుతుందని అంటూ ఉంటారు. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు, నిజంగా చాలా సంపాదన చేసుకోవచ్చని అర్థం చేసుకుంటారు. మేము ఇంత సమయం స్మృతి చేసాము అని కొందరు చార్టు కూడా రాస్తారు. అజ్ఞాన కాలంలో కొందరు తమ దినచర్యను వ్రాసుకుంటారు. మీరు కూడా చార్టు రాసుకున్నట్లయితే అటెన్షన్ ఉంటుంది. సమయం ఏమీ వృథా అవ్వడం లేదు కదా! వికర్మలేవీ చేయలేదు కదా! అని చెక్ చేసుకోండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ దేహధారినీ గుర్తు చేస్తూ, తమ సమయాన్ని వృథా చేసుకోకూడదు. వికర్మగా అయ్యేటువంటి తప్పుడు కర్మ ఏదీ జరగకూడదు.
2. జీవిస్తూనే అంతా మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. దానితో పాటు తెలివైనవారిగా అయి రాత్రిళ్ళు కూడా మేలుకొని, ఈ అవినాశీ సంపాదన చేసుకోవాలి. స్మృతి చార్టు పెట్టుకోవాలి.
వరదానము:-
ఎవరైతే సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారో, వారు ఎప్పుడూ ఏ దృశ్యాన్ని చూసి భయపడరు లేక చలించరు. సదా అచంచలంగా-స్థిరంగా ఉంటారు. ఎందుకంటే అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అయిపోతారు. ఒకవేళ దేనినైనా చూసి, అంశ మాత్రమైనా అలజడి కలిగితే లేక మోహం ఉత్పన్నమైతే, అంగదుని సమానంగా అచంచలంగా-స్థిరంగా ఉన్నారని అనరు. అనంతమైన వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటుగా రమణీకత కూడా ఇమిడి ఉంటుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!