31 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
30 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - విశాల బుద్ధి కలవారిగా అయి పెద్ద-పెద్దవారి అభిప్రాయాలను తీసుకొని అనేకాత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాళ్లు మొదలైనవి తీసుకొని చాలా ప్రదర్శినీలను ఏర్పాటు చేయండి”
ప్రశ్న: -
ఇప్పుడు మీకు కలిగిన ఏ స్మృతిని స్మరణ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు?
జవాబు:-
ఇప్పుడు స్మృతి కలిగింది – మేము పూజ్యులైన రాజులుగా ఉండేవారము, తర్వాత పేదవారిగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబా మమ్మల్ని రాజులుగా చేస్తున్నారు. బాబా ఇప్పుడు మాకు మొత్తం విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తున్నారు. మేము ప్రపంచ చరిత్ర-భూగోళాలను గురించి తెలుసుకున్నాము. ఈ స్మృతులను స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడూ స్వయాన్ని దుఃఖితులుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నయన హీనులకు దారి చూపించు ప్రభూ….. (నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తండ్రిని కలుసుకోవడము మరియు తండ్రి నుండి వారసత్వం తీసుకోవడము చాలా సహజమని పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి ఒక్క సెకండులో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుందని అంటూ ఉంటారు. జీవన్ముక్తి అనగా సుఖం, శాంతి, సంపద మొదలైనవాటి వారసత్వము. జీవన్ముక్తి మరియు జీవన బంధనము అనేవి రెండు పదాలు. ఈ సమయంలో భక్తి మార్గం మరియు రావణ రాజ్యం ఉన్న కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి బంధనాల నుండి ముక్తులుగా చేస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. కొడుకు జన్మించగానే తల్లిదండ్రులు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు వారసుడు జన్మించాడని భావిస్తారు. ఇలా భావించడం ఎంత సహజమో, అలా అది కూడా సహజమే. పిల్లలంటారు – బాబా! కల్పక్రితం వలె మీరు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. మీ నుండే వారసత్వాన్ని పొందే సహజమైన మార్గం లభించింది. కొత్త సృష్టి రచయిత భగవంతుడేనని ప్రతి ఒక్కరికీ తెలుసు. వారు మనల్ని భ్రమించడం నుండి రక్షిస్తారు. నిన్న భక్తి చేసేవారము, ఈ రోజు తండ్రి ద్వారా సహజ జ్ఞానము మరియు రాజయోగాల మార్గం లభించింది. మేము బి.కె.ల ద్వారా ఇద్దరు తండ్రులుంటారు అని తెలుసుకున్నామని పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. ఇద్దరు తండ్రులుంటారని మీరు తప్ప ఇంకెవరూ నోటితో చెప్పలేరు. మీ ప్రతి విషయం అద్భుతమైనదే. ఎవరైతే ఇక్కడికి చెందినవారో, వారికి వెంటనే స్మృతి వస్తుందని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. అయితే, స్మృతి కలిగినవారికి కూడా మాయ ఏదో ఒక సమయంలో గట్టిగా చెంప దెబ్బ వేసి విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రియే స్మృతినిప్పించారు. పవిత్రత కంకణాన్ని కూడా బాగా కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యమేమిటి అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ ప్రతిజ్ఞను ఎవరు చేయించారు. కామము మహాశత్రువు. తండ్రి అంటారు – ఎప్పుడూ పతితంగా అవ్వను అని నాకు ప్రతిజ్ఞ చేయండి మరియు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం యొక్క పాపాలు కాలిపోయి సమాప్తమైపోతాయి. తండ్రి గ్యారంటీ ఇస్తారు. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు అంటే ఈ విషయం సరైనదే కదా అని పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా. కంసాలి కూడా ఏమని గ్యారంటీ ఇస్తారు, నేను పాత ఆభరణాన్ని కొత్తదిగా చేస్తానని చెప్తారు. అతని పనే అది. అగ్నిలో వేయడంతో అది తప్పకుండా స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. అలా ఆత్మలో కూడా మాలిన్యం చేరుకుందని తండ్రి అర్థం చేయిస్తారు. సతో, రజో, తమోలలోకి ఎలా వస్తారు అనేది అర్థం చేయించడం చాలా సులభము. చిత్రాలు కూడా సహజంగా అర్థం చేయించగలిగే విధంగా తయారుచేయబడ్డాయి. యూనివర్శిటీలు, కాలేజీలు మొదలైనవాటిలో కూడా అనేక రకాల మ్యాపులు (చిత్రపటాలు) ఉంటాయి కదా! అలాగే ఇవి కూడా మీకు మ్యాపుల వంటివి. మీరు ఎవరికైనా మంచి రీతిగా అర్థం చేయించగలరు. జ్ఞాన సాగరుడు, పతితపావనుడైన తండ్రియే వచ్చి ఈ మార్గాన్ని తెలియజేస్తారు. ఇంకెవ్వరూ పతితులను పావనంగా చేయలేరు. మనుష్యులు నయన హీనులుగా, దుఃఖితులుగా ఉన్నారు. మొదటి రెండు యుగాలలో దుఃఖం ఉండదని, అలాగే భక్తి కూడా ఉండదని పిల్లలైన మీకు తెలుసు. అది స్వర్గము. భారత్ లో ఈ సమయంలో ఉన్న మనుష్యులకు మరియు భారత్ యొక్క ప్రాచీన కాలంలోని మనుష్యులకు తేడా ఉంది కదా! కానీ ఈ విషయాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. ఎన్ని పూజలు జరుగుతాయి. ఎవరు ఎంత షావుకార్లుగా ఉంటారో, అంతగా దేవీ దేవతలకు మంచి ఆభరణాలను వేస్తారు. ఈ విషయంలో స్వయంగా బాబా అనుభవజ్ఞులు. బొంబాయిలో లక్ష్మీనారాయణుల మందిరం యొక్క ట్రస్టీ లక్ష్మీనారాయణుల కోసం వజ్రాల హారాన్ని తయారుచేయించారు. బాబాకు ఆ ట్రస్టీ పేరు కూడా గుర్తుంది. ముందు శివబాబా మందిరాన్ని తయారుచేసారు, అప్పుడు దానిని చాలా అలంకరించారు. తర్వాత దేవతల మందిరాలను తయారుచేసారు, అప్పుడు లక్ష్మీనారాయణులు మొదలైనవారికి కూడా ఎన్ని ఆభరణాలను వేసారు. ఆ సమయంలో ఎంత ధనముండి ఉంటుంది. మహమ్మద్ గజనీ ఎన్ని ఒంటెలను నింపుకొని తీసుకువెళ్ళారు. భారత్ లో ఎంత అపారమైన ధనముండేది. ఇప్పుడు మీరు యథార్థ రీతిగా అర్థం చేసుకుంటారు. మన భారత్ ఎలా ఉండేది. మన భారత్ లో కుబేర ఖజానా ఉండేది. వజ్ర వైఢూర్యాలతో కూడిన మందిరాలను తయారుచేసేవారు. ఇప్పుడు ఆ వస్తువులేవీ లేవు. అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది.
మీరే పూజ్యులైన రాజులుగా ఉండేవారు, తర్వాత మీరే 84 జన్మలు తీసుకొని పూర్తిగా పేదవారిగా అయ్యారు. ఇటువంటి విషయాలను పదే-పదే స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడిక మీరు ఎప్పుడూ తమను తాము దుఃఖితులుగా భావించరు. మేము బాబా నుండి ఏం తీసుకుంటున్నాము అని మనసులో స్మరించుకుంటూ ఉంటారు. తండ్రి వచ్చి మనకు మొత్తం విశ్వమంతటి సమాచారాన్ని వినిపిస్తారు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలను గురించి ఎవ్వరికీ తెలియదు. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే భాష ఉండేవని మీకు తెలుసు. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత వీరు పరస్పరంలో కొట్లాడుకోవడం-గొడవపడడం మొదలుపెట్టారు మరియు భారత్ ముక్కలు-ముక్కలుగా అయిపోవడం మొదలయ్యింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండేది కాదు. అనారోగ్యం యొక్క నామ రూపాలే ఉండేవి కావు. దాని పేరే స్వర్గము. ఇప్పుడు మీకు స్వయం యొక్క స్మృతి కలిగింది. తప్పకుండా కల్ప-కల్పము మనకు విస్మృతి కలుగుతుంది, తర్వాత స్మృతిలోకి వస్తుంది. ముందు ఒకే ఒక పొరపాటు జరిగింది, అదేమిటంటే రచయిత మరియు రచనలను మర్చిపోయారు. ఇప్పుడు మీకు ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. సత్యయుగంలో కూడా ఈ జ్ఞానముండదు అన్నప్పుడు అది పరంపరగా ఎలా నడుస్తుంది. ఆ సమయంలో రాజులే ముఖ్యులుగా ఉండేవారు. ఋషులు, మునులు ఉండేవారు కాదు. వారు ద్వాపరం నుండి వస్తారు. ఋషులు, మునులు మొదలైనవారికి ఆహార పానీయాలు కూడా రాజుల నుండే లభిస్తాయి. వారిని రాజులే చూసుకుంటారు ఎందుకంటే ఎంతైనా సన్యాసం చేస్తున్నారు కదా. ప్రాచీన భారత్ యొక్క ప్రాచీన రాజయోగం అని అంటూ ఉంటారు. ప్రాచీన ఋషులు, మునులు అని అనరు. వారు ద్వాపరంలోనే వస్తారు. వారు రాజుల ఆధారంపై నడుస్తారు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అంటారు. ఇది స్వయంగా రాజులకు కూడా తెలియదని తండ్రి అంటారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ జ్ఞానం గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలివైనవారిగా అయ్యారు. ఎవరైతే లక్ష్మీనారాయణుల మందిరాలను తయారుచేస్తారో, వారికి మీరు ఇలా రాయవచ్చు – ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలను నిర్మించారు కానీ వీరి జీవిత కథ గురించి మీకు తెలుసా? వీరు రాజ్యాన్ని ఎలా పొందారు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నారు, మేము మీకు అన్ని రహస్యాలను తెలుపగలమని వారికి మీరు వ్రాయవచ్చు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జీవిత కథ గురించి తెలుసుకున్నారు కనుక ఎందుకు వ్రాయకూడదు. మాకు సమయమిస్తే ఒక్కొక్కరి జీవిత కథ గురించి తెలియజేస్తాము. ఇలా శివుని మందిరాలను తయారుచేసేవారికి కూడా మీరు వ్రాయవచ్చు. బనారస్ లో శివుని మందిరం ఎంత పెద్దది. అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. పెద్ద-పెద్దవారికి అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. పెద్ద వ్యక్తులు అర్థం చేసుకుంటే వారి ద్వారా వచ్చే శబ్దం బాగా వ్యాపిస్తుంది. పేదవారు వెంటనే వింటారు. పెద్దవారి సహాయం తీసుకోవాలి. అభిప్రాయాలు కూడా పెద్దవారి చేత వ్రాయించాలి ఎందుకంటే వారి మాట కూడా సహాయం చేస్తుంది. నిజానికి వారు ఎంత శబ్దాన్ని వ్యాపింపజేయాలో, అంత చేయడం లేదు. మీరు ప్రెసిడెంటుకు కూడా అర్థం చేయిస్తారు. చాలా బాగుంది అని కూడా అంటారు. చీఫ్ మినిస్టర్, గవర్నర్ మొదలైనవారు ప్రారంభోత్సవం చేసినప్పుడు – ఈ బి.కె.లు ఈశ్వరుడిని కలుసుకునేందుకు చాలా మంచి సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని వ్రాస్తారు. కానీ ఈశ్వరుడు ఎవరు అనేది ఏమీ అర్థం చేసుకోరు. కేవలం ఆ సమయంలో, ఇది చాలా మంచి మార్గమని, శాంతి పొందడానికి ఇది మంచి మార్గమని అంటారు. కానీ స్వయం అర్థం చేసుకోరు.
బాబా పెద్ద-పెద్దవారికి అర్థం చేయించమని కూడా చెప్తారు. పెద్ద-పెద్ద వ్యక్తుల నుండి ప్రసిద్ధి గాంచిన పెద్ద-పెద్ద హాళ్లు తీసుకోండి. మేము మనుష్యులందరి కళ్యాణం కోసం ఈ ప్రదర్శినీని సదా కోసం పెట్టాలనుకుంటున్నామని వారికి చెప్పండి. కేవలం అడ్వర్టైజ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 50-100 హాళ్లు తీసుకోవాలి. భారత్ అయితే చాలా పెద్దది కదా. ఒక్కొక్క పట్టణంలో 10-12 హాళ్లు తీసుకోండి. ఇన్ని హాళ్లలో ప్రదర్శనీలు జరుగుతున్నాయి, తెలుసుకోవాలనుకునే వారు వచ్చి తెలుసుకోండి అని పత్రికలలో ముద్రించాలి. అప్పుడు ఎంతమంది కళ్యాణం జరుగుతుంది. పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. పిల్లలు సేవ చేయాలి కదా. ప్రదర్శినీలను చాలా జోరుగా చేయండి అని తండ్రి పిల్లలందరికీ చెప్తారు. బాబా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పిల్లలు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా ప్రజలు అనే రచనను రచిస్తారు కనుక తప్పకుండా ఎంతమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఎంతమంది బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఉన్నారు. బాబా ఈ బ్రాహ్మణ ధర్మాన్ని సంగమంలో రచిస్తారు. మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పతిత ప్రపంచం పావనంగా అవ్వాల్సి ఉన్నప్పుడే బాబా వస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారానే రచనను రచిస్తారని కూడా మీకు తెలుసు. కానీ ఎప్పుడు రచిస్తారు అనేది అర్థం చేసుకోరు. ఏదో కొత్త రచనను రచిస్తూ ఉండవచ్చని వారు భావిస్తారు. బ్రహ్మా గురించి, వారు సూక్ష్మవతనంలో ఉంటారన్నట్లుగా భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు. పవిత్రంగా అయి, ఫరిశ్తాలుగా అయిపోతారు. సాక్షాత్కారాలు పొందుతారు. అక్కడ మూవీ నడుస్తుందని పిల్లలు వచ్చి వినిపిస్తారు. అది మూవీ ప్రపంచము, మీరు మూవీ బయోస్కోప్ ను (సినిమా) కూడా చూసి ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అన్ని విషయాలను తెలుసుకున్నారు. మూలవతనము సైలెన్స్ ప్రపంచము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాలు కూడా ఉంటాయి కనుక తప్పకుండా అక్కడ ఏదో ఒక భాష కూడా ఉంటుంది. ఆత్మలైన మన స్థానం శాంతిధామమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తర్వాత సూక్ష్మవతనం ఉంటుంది. అక్కడ బ్రహ్మా-విష్ణు-శంకరులుంటారు. ఇది కలియుగం మరియు సత్యయుగం యొక్క సంగమము. ఇక్కడికి తండ్రి వస్తారు, ఇక్కడ నుండి బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్టినిల్లు మరియు అత్తవారిల్లు ఉంటాయి కదా! ఇక్కడ వీరివురూ మీ తండ్రులే. పిల్లలను పుష్పాలుగా తయారుచేసేందుకు బాప్ దాదాలు, ఇరువురు శ్రమిస్తారు. గార్డెన్ ఆఫ్ అల్లాహ్ అని ముస్లింలు కూడా అంటారు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవారు – అతను ఎదురుగా నిలబడేవారు – బాబాను చూస్తూ-చూస్తూ క్రింద పడిపోయేవారు. అతడిని అడిగితే, నేను ఖుదా పూలతోటలోకి వెళ్ళాను, ఖుదా నాకు పుష్పమిచ్చారు అని చెప్పేవారు. అతనికి జ్ఞానమైతే లేదు. పూలతోట అని దేనినంటారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది ముళ్ళ అడవి మరియు అది పూలతోట. సత్యయుగమంటే ఏమిటి, కలియుగమంటే ఏమిటి, ఈ రహస్యాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మీకు చాలా సంతోషం కలగాలి. చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తారం చాలా ఉంది. మీ బుద్ధిలో ఎంత క్లుప్తంగా కూర్చొని ఉంది. పిల్లలైన మీరు రచయిత అయిన తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు. బ్రహ్మాను రచయిత అని అనరు. రచయిత ఒక్కరే, బలిహారము కూడా ఆ ఒక్కరిదే. మొట్టమొదటి రచన బ్రహ్మాది, ఆ తర్వాత కృష్ణునిది. బ్రహ్మా అయితే ఉన్నారు, బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. పాండవులను బ్రాహ్మణులుగా భావించరు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు కావాలి. ఇది ఆత్మిక యజ్ఞము, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మకు ఆ తండ్రియే జ్ఞానాన్ని ఇస్తారు. మనల్ని మనుష్యులు చదివించడం లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రి చదివిస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కూడా. కృష్ణుని ద్వారా స్థాపన అని అనరు. అలా జరగదు కూడా. బ్రహ్మా ద్వారా ఎవరు స్థాపన చేయిస్తారు? కృష్ణుడు చేయిస్తారా? కాదు. పరమపిత పరమాత్మ చేయిస్తారు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. బ్రహ్మా మరియు విష్ణువులకు ఎంత పాత్ర ఉంది. బ్రహ్మా ముఖ వంశావళి అయినవారే తర్వాత వెళ్ళి విష్ణుపురిలోని దేవతలుగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు. ఈ విషయం కూడా పిల్లలకు అర్థం చేయించారు – బ్రహ్మా నుండి విష్ణువుగా అవ్వడానికి ఒక్క సెకండు పడుతుంది, విష్ణువు నుండి బ్రహ్మాగా అవ్వడానికి 84 జన్మలు పడతాయి. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకొని, అనంతమైన రాజ్యాన్ని తీసుకోవాలి. సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. ఆత్మయే శరీరం ద్వారా తెలుసుకుంటుంది. అంతేకానీ, ఆత్మ ద్వారా శరీరం జ్ఞానం తీసుకుంటుందని కాదు. ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది. మీకు ఎంత సంతోషం ఉంది. ఈ ఆంతరిక గుప్తమైన సంతోషముండాలి. చదువు యొక్క సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. దుఃఖం కూడా ఆత్మకే కలుగుతుంది. నా ఆత్మను దుఃఖితంగా చేయకండి అని అంటారు. పిల్లలకు ఇప్పుడు ఎంతటి ప్రకాశం లభిస్తుంది. మీకు సంతోషముంటుంది. సాగరుని ద్వారా రిఫ్రెష్ అయి మేఘాలన్నీ కలిసి వర్షాన్ని కురిపించాలి. పరస్పరంలో కలుసుకొని ప్రదర్శినీలు మొదలైనవి తయారుచేయడంలో సహాయం చేయండి, అభిరుచి ఉండాలి. సేవ, సేవ మరియు సేవ. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారిగా అయి చాలా జోరుగా సేవ చేయాలి.
2. తండ్రి ద్వారా లభించిన స్మృతులను విస్మృతి కానివ్వకూడదు. పవిత్రంగా ఉంటామని తండ్రికి చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా నిర్వర్తించాలి.
వరదానము:-
మొత్తం బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మతోనే కిరీటం, సింహాసనం మరియు తిలకం జన్మ సిద్ధ అధికారం రూపంలో ప్రాప్తిస్తాయి. కనుక ప్రకాశించే ఈ భాగ్యపు సితారను చూస్తూ తమ భాగ్యం మరియు భాగ్య విధాత గుణాలను గానం చేస్తూ ఉండండి, అప్పుడు గుణ సంపన్నులుగా అయిపోతారు. తమ బలహీనతల గుణాలను గానం చేయకండి, భాగ్యపు గుణగానం చేస్తూ ఉండండి, ప్రశ్నలకు దూరంగా ఉండండి. అప్పుడు సదా ప్రసన్నచిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది. ఆపై ఇతరులను కూడా సహజంగానే ప్రసన్నం చేయగలరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!