26 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
25 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మేము మా యోగబలంతో ఈ భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాము, అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి అని మీరు గ్యారంటీ ఇస్తారు”
ప్రశ్న: -
మాయ కలిగించే ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండేవారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు?
జవాబు:-
మాయ కలిగించే అన్నింటికంటే పెద్ద విఘ్నము – దేహాభిమానంలోకి తీసుకువచ్చి ఇతరుల నామ రూపాలలో చిక్కుకునేలా చేయడము. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుండి సురక్షితంగా ఉంటారో, మాయ మోసం నుండి రక్షించబడి ఉంటారో, వారు చాలా అద్భుతం చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సేవ యొక్క కొత్త-కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దేహీ-అభిమానులుగా అయినప్పుడే సేవలో ఉన్నతి జరుగుతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇచ్చేందుకు వచ్చారు. డ్రామా ప్లాను అనుసారంగా ఈ కొంచెం సమయంలోనే మొత్తం కార్యమంతా జరగాల్సి ఉందని పిల్లలకు తెలుసు. మనం రావణపురిని విష్ణుపురిగా చేస్తాము. ఇప్పుడు తండ్రి కూడా గుప్తంగా ఉన్నారు కనుక చదువు కూడా గుప్తమైనది. సెంటర్లు అయితే చాలా ఉన్నాయి. చిన్న-పెద్ద ఊళ్లలో సెంటర్లు ఉన్నాయి మరియు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. రోజు రోజుకు ఇంకా పెరుగుతూ ఉంటారు. మేము ఈ భారత భూమిని స్వర్గంగా తయారుచేసి తీరుతామని లిటరేచర్ లో కూడా వ్రాస్తారు. మీకు ఈ భారత భూమి చాలా ప్రియమైనది ఎందుకంటే ఈ భారత్ యే స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ అలా ఉండేది. భారత్ చాలా వైభవంగా ఉండేది. బ్రహ్మా ముఖవంశావళి పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానముంది. ఈ భారత్ ను శ్రీమతమనుసారంగా స్వర్గంగా తయారుచేయాల్సి ఉంటుంది. అందరికీ మార్గం తెలియజేయాలి, ఇక్కడ ఇంకే గొడవ లేదు. ఈ చిత్రాలను పత్రికలలో కూడా ముద్రించే విధంగా, ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలి అని పరస్పరంలో కూర్చుని చర్చించుకోవాలి. దీని గురించి పరస్పరంలో సెమినార్ చేసుకోవాలి. మేము భారత్ ను ఎలా బాగు చేయాలి, ఈ అభిప్రాయ బేధాలన్నింటినీ ఎలా సరి చేయాలి మరియు భారత్ లో సుఖ-శాంతులు ఎలా స్థాపనవుతాయి – అని ఎలాగైతే ఆ గవర్నమెంట్ వారు పరస్పరంలో కలుసుకొని చర్చించుకుంటారో, అలా మీది కూడా ఆత్మిక పాండవ గవర్నమెంట్. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్. పతితపావనుడైన తండ్రియే పతిత పిల్లలను పావనంగా చేసి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు. ఈ రహస్యం పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యమైనది భారత్ యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివబాబాను అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మేలుకొల్పారు. మీరు మళ్ళీ ఇతరులను మేలుకొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు మేలుకొల్పుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎటువంటి పురుషార్థం చేసారో, కల్పక్రితం కూడా అంతే చేసారు. మీది ఆత్మిక యుద్ధము. ఒక్కోసారి మాయ జోరు పెరుగుతుంది, ఒక్కోసారి ఈశ్వరుని జోరు పెరుగుతుంది. అప్పుడప్పుడు చాలా తీవ్రగతితో సేవ జరుగుతుంది. అప్పుడప్పుడు చాలామంది పిల్లలకు మాయ విఘ్నాలు కలుగుతాయి. మాయ పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. మాయ రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లవకుశల కథ కూడా ఉంది కదా! రామునికి ఇద్దరు కుమారులను చూపించారు. ఇక్కడైతే బాబాకు ఎంతో మంది పిల్లలున్నారు. ఈ సమయంలో మనుష్యులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి పరమపిత పరమాత్మ వచ్చారని కూడా వారికి తెలియదు. తండ్రి భారత్ లోనే వస్తారు. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారతవాసులే స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరమపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే శివ జయంతిని భారత్ లోనే జరుపుకుంటారు. అంటే తప్పకుండా వారు వచ్చి ఏదో చేసి ఉంటారు. తప్పకుండా తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేసి ఉంటారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన చేయరు. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగం నేర్పించడం జరుగుతుంది. స్మృతి యాత్ర నేర్పించడం జరుగుతుంది. ప్రేరణలో ఎటువంటి శబ్దం ఉండదు. శంకరుడు ప్రేరణ ద్వారా వినాశనం చేస్తారని అనుకుంటారు కానీ ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామాలో వారి పాత్రయే ముసలాలను తయారుచేయడం అని మీరు అర్థం చేసుకున్నారు. వారు వినాశనానికి నిమిత్తులై ఉన్నారు. ప్రేరణ అనేది శాస్త్రాలలోని పదము. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. డ్రామానుసారంగా వినాశనమైతే జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో ఈ ముసలాలు మొదలైనవి ఉపయోగించారని అంటూ ఉంటారు. ఏదైతే గడిచిపోయిందో, అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. మేము యోగబలంతో స్వర్గ స్థాపన చేస్తాము, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది – అని మీరు గ్యారెంటీ ఇస్తారు. మరి మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడ ఉంటాయి? తప్పకుండా వినాశనమైపోతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని అంటూ ఉంటారు, ఇది కరక్టే. కానీ శంకరుడిని, శివునితో పాటు కలిపేసారు, ఇది రాంగ్. శివ-శంకర అని అంటారు ఎందుకంటే శంకరుడు ఏ పని చేయరు కనుక శివునితో కలిపేసారు. కానీ శివబాబా అంటారు – నేనైతే చాలా పని చేయాల్సి ఉంటుంది. అందరినీ పావనంగా చేయాల్సి ఉంటుంది. నేను ఈ బ్రహ్మా తనువులో ప్రవేశించి ఈ సాకారుని ద్వారా స్థాపన కార్యాన్ని చేయిస్తాను. శంకరునికి పాత్రేమీ లేదు. శివుడికి పూజ జరుగుతుంది. శివుడే కళ్యాణకారి, జోలిని నింపేవారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా! ఈ బ్రహ్మా కూడా ప్రజాపితయే. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా అవుతారు, ఇవి చాలా గుహ్యమైన విషయాలు. వీటి గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తెలివైన పిల్లల బుద్ధికి జ్ఞానం వెంటనే అర్థమైపోతుంది. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తారు అనేది మనుష్యులకు ఏమీ తెలియదు. ఇప్పుడిది కలియుగాంతము. ఒకవేళ కలియుగాంతమునకు ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని అంటే, ఇప్పుడు ఇంకెంత పతితంగా అవుతారు? ఎంత దుఃఖాన్ని సహిస్తారు? కలియుగంలో సుఖమైతే ఉండదు. ఏమీ తెలియని కారణంగా పాపం ఘోర అంధకారంలో ఉన్నారు.
సేవను ఎలా పెంచాలి అని పిల్లలైన మీరు పరస్పరంలో చర్చించుకోవాలి. తండ్రి ప్లానులను తెలియజేస్తూ ఉంటారు కావున పిల్లలు పరస్పరంలో కలుసుకుని చర్చించుకోవాలి. చిత్రాలపై బాగా అర్థం చేయించాలి. ఈ చిత్రాలు కూడా డ్రామా ప్లాను అనుసారంగా తయారవుతూ ఉన్నాయి. ఏదైతే సమయం గడుస్తూ ఉంటుందో, దాని అనుసారంగా డ్రామా నడుస్తూ ఉంటుందని పిల్లలకు తెలుసు. పిల్లల అవస్థలు అప్పుడప్పుడు పైకి, అప్పుడప్పుడు కిందికి అవుతూ ఉంటాయి, ఇలా నడుస్తూ ఉంటుంది. తండ్రి కూడా సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలపై గ్రహచారం కూర్చొంటుంది, అప్పుడు దానిని తొలగించేందుకు ప్రయత్నం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయండి అని బాబా పదే-పదే చెప్తారు. కానీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు, అందుకే దెబ్బలు తింటూ ఉంటారు, ఇందులో దేహీ-అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. మీరు దేహీ-అభిమానులుగా అయినట్లయితే తండ్రి స్మృతి ఉంటుంది మరియు సేవలో ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఉన్నత పదవి పొందేది ఉంటుందో, వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. ఒకవేళ భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చేయరు. బాబా, మాకు ధారణ జరగడం లేదు, బుద్ధిలో కూర్చోవడం లేదని స్వయంగా చెప్తూ ఉంటారు. ఒకవేళ ధారణ జరగకపోతే, సంతోషం కూడా ఉండదు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సంతోషం కూడా ఉంటుంది. శివబాబా వచ్చి ఉన్నారని వారు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు – పిల్లలూ, మీరు మంచి రీతిగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించండి. కొంతమందైతే సేవలో నిమగ్నమైపోతారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ క్షణమైతే గడుస్తూ ఉంటుందో, అది డ్రామాలో నిశ్చయించబడి ఉందని, మళ్ళీ అలాగే రిపీట్ అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. బయట భాషణ చేసే సమయంలో అనేక రకాల మనుష్యులు వస్తారని పిల్లలకే అర్థం చేయించడం జరుగుతుంది. అందరూ వేద-శాస్త్రాలు, గీత మొదలైనవాటి పైనే భాషణ చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఈశ్వరుడు స్వయం గురించి మరియు ఈ రచన ఆదిమధ్యాంతాల రహస్యం గురించి అర్థం చేయిస్తారని వారికి తెలియదు. పరమాత్మ ఎవరు అనేది చిత్రాలలో ఎంత బాగా చూపించారు. ఈ విషయాలను ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనీలలో చిత్రాలు ఎదురుగా ఉంటాయి. మీరు వాటిపై అర్థం చేయించి ఇలా అడగవచ్చు కూడా – ఇప్పుడు చెప్పండి, గీతా భగవంతుడు ఎవరు? జ్ఞాన సాగరుడు ఎవరు? పవిత్రతా, సుఖ-శాంతుల సాగరుడు ఎవరు? లిబరేటర్ మరియు గైడ్ ఎవరు? కృష్ణుని గురించి అలా అనలేరు. పరమాత్ముని మహిమ వేరు. ముందు వారి చేత వ్రాయించాలి కూడా. ప్రశ్నావళి నింపించాలి, అందరి చేత సంతకాలు కూడా తీసుకోవాలి.
(హాల్లో పక్షులు కొట్లాడుకుంటున్నాయి) ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో కొట్లాటలు-గొడవలే ఉన్నాయి. అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. 5 వికారాలు కూడా మనుష్యుల్లోనివే వర్ణించబడతాయి, ఇది జంతువుల విషయం కాదు. వికారీ ప్రపంచము మరియు నిర్వికారీ ప్రపంచము అని మనుష్యులకు సంబంధించే అంటూ ఉంటారు. కలియుగంలో ఆసురీ సంప్రదాయం వారు ఉంటారు, సత్యయుగంలో దైవీ సంప్రదాయం వారు ఉంటారు. మనుష్యులు ఎంత తమోప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారంటే, మేమే ఆసురీ సంప్రదాయం వారమని ఏ మాత్రం అర్థం చేసుకోరు. దేవతల ఎదురుగా వెళ్ళి – మేమే నీచులము, పాపులము, నిర్గుణులమైన మాలో ఏ గుణము లేదు అని పాడుతారు కూడా. మీరు వారికి నిరూపించి చెప్పవచ్చు. మెట్ల వరుస చిత్రంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కే కళ ఎలా ఉంటుంది, తర్వాత దిగే కళ ఎలా ఉంటుంది అనేది చిత్రంలో చూపించడం జరిగింది. భారతవాసులకు ఈ మెట్ల వరుస చిత్రం ముఖ్యమైనది. ఇది అన్నింటికంటే మంచి చిత్రం. ఈ చిత్రంపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. 84 జన్మలను పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి నంబరు జన్మ తీసుకోవాలి కావున దిగే కళ నుండి ఎక్కే కళలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అందరికీ మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచించకపోతే సేవ ఎలా చేస్తారు. చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సులభంగా ఉంటుంది. సత్యయుగం తర్వాత మెట్లు దిగాల్సిందే. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అవుతున్నామని పిల్లలకు తెలుసు. కానీ డైరెక్టుగా సత్యయుగానికి వెళ్ళరు. ముందు శాంతిధామానికి వెళ్ళాలి. మనం పాత్రధారులమని మీకు తెలుసు. ఇకపోతే, ఈ డ్రామాలో తమను తాము పాత్రధారులుగా భావించేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మేము పాత్రధారులము – అని చెప్పగలిగేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. మనుష్యులు ప్రతి ఒక్కరు ఈ అనంతమైన డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా వారికి ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారుని గురించి, డైరెక్టర్ గురించి మరియు డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అంటే వారు అవివేకులే అని మనం రాస్తాము కూడా. ఇలా వ్రాయడంలో తప్పేమీ లేదు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయకూడదు. సేవ, సేవ మరియు సేవ. పిల్లలపై ఒక్కోసారి గ్రహచారం కూడా కూర్చుంటుందని బాబాకు తెలుసు, గ్రహచారం కూర్చున్నప్పుడు ఎంత నష్టం జరుగుతుంది అనేది బాబాకు తెలుసు. షావుకార్లు పేదవారిగా అవుతారు. కారణమైతే ఉంటుంది కదా. బాబా చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు కూడా – పిల్లలూ! నామ రూపాలలో ఎప్పుడూ చిక్కుకోకండి లేదంటే మాయ ముక్కు పట్టుకొని గోతులో పడేస్తుంది. మాయ చాలా మోసం చేస్తుంది. ప్రేయసీ-ప్రియులుగా ఇక్కడ అవ్వకూడదు. కొందరు వికారాల కోసం ప్రేయసీ-ప్రియులుగా అవుతారు. మరి కొందరు కేవలం రూపంపై బలిహారమవుతారు. సెంటర్లలో కూడా ఇలాంటి మాయా విఘ్నాలు ఎన్నో వస్తాయని మీకు తెలుసు. పరస్పరం ఒకరి నామ రూపాలలో ఒకరు చిక్కుకుంటారు. మాయ ఎంత శక్తివంతమైనదంటే మాత మరొక మాత నామ రూపాలలో, అలాగే కన్య మరొక కన్య నామ రూపాలలో కూడా చిక్కుకుపోతారు. పురుషార్థం చేస్తున్నా కూడా మాయ ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. అందుకే తండ్రి సావధానపరుస్తారు – పిల్లలూ, మాయ బంధించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చిక్కుకోకూడదు. దేహాభిమానంలోకి రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మాయ మోసం నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి. తండ్రి, పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేయడానికి వచ్చారు, మీకు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. ఒకవేళ మనసులో సంశయం వస్తే, సేవను బాగా చేయలేరు. లోలోపల గుటకలు మింగుతూ ఉంటారు. ధైర్యమును ఉంచాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మురళిని వింటే ఉత్సాహంలోకి వస్తారు. ఆత్మప్రకాష్ బచ్చా మంచి రీతిగా చిత్రాలపై అటెన్షన్ పెడుతున్నారు. బొంబాయి వారికి కూడా బుద్ధిలోకి రావాలి. ముఖ్యమైన చిత్రాలను ముందు తయారుచేయాల్సి ఉంటుంది. చిత్రాలను పరిశీలిస్తూ ఉండాలి. చిత్రాలలో ఉన్నతిని ఎలా తీసుకురావాలి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. మెట్ల వరుస చిత్రాన్ని విమానాశ్రయంలో పెట్టే విధంగా ఏదైనా యుక్తిని రచించండి. ఈ చిత్రాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. వీరికి మతమునిచ్చేవారు ఎవరు అనేది చివరికి అర్థం చేసుకుంటారు. కనుక పిల్లలకు చాలా నషా ఎక్కాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పిల్లలైన మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, మాయ రావణునితో మీ యుద్ధం జరుగుతుంది. మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి.
2. ప్రతి ఒక్కరు తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలి, సేవను ఎలా పెంచాలి, మనుష్యులు సహజంగా అర్థం చేసుకునేలా చిత్రాలలో ఏమి ముద్రించాలి అని ఆలోచిస్తూ ఉండాలి.
వరదానము:-
ఎవరైతే తమ శిక్షణా స్వరూపం ద్వారా శిక్షణనిస్తారో, వారిని యోగ్య శిక్షకులు అని అంటారు. వారి స్వరూపమే శిక్షణా సంపన్నంగా ఉంటుంది. వారి చూడడము, నడవడము కూడా ఎవరికైనా శిక్షణనిస్తుంది. ఏ విధంగా సాకార రూపంలో అడుగడుగునా ప్రతి కర్మను శిక్షకుని రూపంలో ప్రాక్టికల్ గా చూసారు, దీనినే వేరే మాటలో చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాణి ద్వారా శిక్షణను ఇవ్వడము సామాన్యమైన విషయము కానీ అందరూ అనుభవాన్ని కోరుకుంటున్నారు. కనుక మీ శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా అనుభవం చేయించండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!