20 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

20 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

19 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తండ్రికి రైట్ హ్యాండా (కుడి భుజం) గా అవ్వాలంటే ప్రతి విషయంలోనూ రైటియస్ గా (ధర్మయుక్తమైనవారిగా) అవ్వండి, సదా శ్రేష్ఠ కర్మలనే చేయండి”

ప్రశ్న: -

ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాన్ని కలిగిస్తుంది?

జవాబు:-

భావ-స్వభావాల కారణంగా పరస్పరంలో ద్వైత మతం యొక్క సంస్కారం ఏదైతే ఏర్పడుతుందో, అది సేవలో చాలా విఘ్నాన్ని కలిగిస్తుంది. రెండు మతాల వలన చాలా నష్టం కలుగుతుంది. క్రోధమనే భూతం ఎటువంటిదంటే, దాని వలన భగవంతుడిని ఎదిరించడానికి కూడా సమయం పట్టదు. అందుకే బాబా అంటారు – మధురమైన పిల్లలూ, ఇలాంటి సంస్కారం ఏదైనా ఉన్నట్లయితే దానిని తొలగించివేయండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను… (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా సుప్రీమ్ ఆత్మ అయిన శివబాబా పిల్లలైన ఆత్మలు, శరీర కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇది గుప్తమైన శ్రమ. తండ్రి కూడా గుప్తమైనవారు కనుక శ్రమను కూడా గుప్తంగానే చేయిస్తారు. తండ్రి స్వయంగా వచ్చి అంటారు – పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే 5000 సంవత్సరాల కల్ప క్రితం వలె మళ్ళీ సతోప్రధానంగా అవుతారు. పిల్లలు అర్థం చేసుకుంటారు – ఇంతకుముందు మేమే సతోప్రధానంగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మేమే తమోప్రధానంగా అయ్యాము, ఇప్పుడు తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. పాటలో కూడా ఇలా అంటారు – పోగొట్టుకున్న అదృష్టాన్ని మళ్ళీ పొందడానికి పురుషార్థం చేయించేవారు సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే, ఎందుకంటే వారు అందరినీ పావనంగా చేస్తారు కదా. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – హే ఆత్మిక పిల్లలూ, ఇప్పుడు మీరు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. విద్యార్థులు స్కూలుకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు కదా. వారు చిన్న పిల్లలు. మీరు చిన్నవారు కాదు, మీరు పెద్దవారు, వృద్ధులు. అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు. అవును, కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధాప్యంలో కన్నా యువావస్థలో చదువుకోవడం మంచిది, యువత బుద్ధి బాగుటుంది. ఇదైతే అందరికీ చాలా సులభము. మీ శరీరమైతే పెద్దది కద. ఇక్కడ బేబీ ఉంది, అంతగా అర్థం చేసుకోలేదు ఎందుకంటే కర్మేంద్రియాలు చిన్నగా ఉన్నాయి. నింద-స్తుతి, సుఖ-దుఃఖాలు – ఈ విషయాలను మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ బిందువు. శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే ఏకరసంగానే ఉంటుంది. ఎప్పుడూ తరగదు-పెరగదు. ఆత్మ బుద్ధి కోసం తండ్రి కస్తూరి వంటి కానుకను ఇస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తిగా తమోప్రధానంగా అయిపోయింది. అదే ఇప్పుడు స్వచ్ఛంగా అవుతుంది. మీరు అర్థం చేయించడం కోసం ఈ చిత్రాలు చాలా ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచుతారు, పూజ చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా అంధవిశ్వాసంతో వెళ్ళేవారు. శివుని మందిరాలకు వెళ్ళేవారు కానీ వీరే శివబాబా అని అప్పుడు మీకు తెలియదు. బాబా నుండి తప్పకుండా వారసత్వం లభించింది, అందుకే వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే, వారి మహిమ గాయనం చేయబడుతుంది. శివబాబా స్టాంపును తయారుచేయాలి. శివబాబా గీత సెర్మోనైజర్ (శివబాబా గీత జ్ఞానదాత)… అనే స్టాంపును సహజంగా తయారుచేయవచ్చు. ఆ తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేవాడిని. వృద్ధ మాతలు కూడా – మేము విచిత్రుడైన శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ చిత్రంలోకి (తనువులోకి) ప్రవేశించారని భావిస్తూ ఉండవచ్చు. నిరాకారుడిని విచిత్రుడు అని అంటారు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని, వారు ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ధరించారని వారి బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనంగా చేసి ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు అనగా శాంతిధామ, సుఖధామ నివాసులుగా తయారుచేస్తారు. మనుష్యులు శాంతి కోసమే ప్రయత్నిస్తారు. భగవంతుడు లభిస్తే శాంతి లభిస్తుందని అనుకుంటారు, సుఖం కోసం పురుషార్థం చేయరు. తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని అనుకుంటారు. ఈ సమయంలో అందరూ ముక్తి పొందాలన్న కోరికను పెట్టుకునేవారే. జీవన్ముక్తిని పొందేవారు కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే. మిగిలినవారంతా ముక్తిని పొందాలన్న కోరికను పెట్టుకునేవారే. జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపించేవారు ఎవరూ లేరు. సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. మార్గం చూపించేవారంతా ముక్తిలోకి వెళ్ళేవారే. మోక్షమంటే ఏమిటి అనేది కూడా వారి బుద్ధిలోకి రాదు. ఇక విసుగు చెంది, ముక్తిలోకి వెళ్ళడమే మంచిదని అంటారు. నిజానికి ముక్తిధామము – ఆత్మలు నివసించే స్థానము. ఇన్ని సెంటర్లలో పిల్లలు ఉన్నారు, అందరికీ – తాము కొత్త ప్రపంచం కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారని, బాబా వారికి కొత్త ప్రపంచ రాజ్యాన్ని ఇస్తారని తెలుసు. ఎక్కడ ఇస్తారు? కొత్త ప్రపంచంలో ఇస్తారా లేక పాత ప్రపంచంలో ఇస్తారా? తండ్రి అంటారు – నేను సంగమంలో వస్తాను, కలియుగంలో గాని, సత్యయుగంలో గాని రాను, ఈ రెండింటి మధ్యలో వస్తాను. తండ్రి అందరికీ సద్గతిని ఇస్తారు కదా. అంతేకానీ, దుర్గతిలో వదిలేస్తారని కాదు. సద్గతి మరియు దుర్గతి, రెండూ కలిసి ఉండవు. ఈ పాత ప్రపంచం వినాశనమవ్వనున్నదని పిల్లలకు తెలుసు, అందుకే దీని పట్ల ప్రేమను పెట్టుకోకూడదు. తప్పకుండా ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నామని, ఈ ప్రపంచం మారనున్నదని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము సంగమంలో వస్తాను, మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి హరి ద్వారానికి తీసుకువెళ్తాను. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. హరి ద్వారము, కృష్ణుని ద్వారము అని కృష్ణపురిని అంటారు. అచ్ఛా, దాని వెనుక మళ్ళీ లక్ష్మణ ఝూలాను కూడా పెట్టారు. ముందు హరిద్వార్ వస్తుంది. సత్యయుగాన్ని హరి-ద్వారము అని అంటారు. తర్వాత రామ-లక్ష్మణులు మొదలైనవారిని చూపిస్తారు. అలాంటి విషయమేమీ లేదు. అవి కల్పించిన విషయాలు. రామునికి ఎంతమంది సోదరులను చూపించారు! నలుగురు సోదరులు అయితే ఉండరు. 4-8 మంది సోదరులు ఇక్కడ ఉంటారు. ఒక వైపు ఈశ్వరీయ సంతానం ఉన్నారు, మరో వైపు ఆసురీ సంతానం ఉన్నారు.

శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. శివుడు తండ్రి, బ్రహ్మా ఏమో దాదా (పెద్దన్నయ్య), వారు ప్రజాపిత. వారు (శివుడు) ఆత్మల తండ్రి, అనాదిగా ఉన్నారు, ఈ సమయంలో వారు బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా సాలిగ్రామాలను రచిస్తారని కాదు. సాలిగ్రామాలైతే అవినాశీగా ఉండనే ఉంటారు. తండ్రి వచ్చి కేవలం పవిత్రంగా తయారుచేస్తారు. ఆత్మ పవిత్రంగా అవ్వనంతవరకు శరీరం ఎలా పవిత్రంగా అవుతుంది. ఆత్మలమైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు అపవిత్రంగా, తమోప్రధానంగా ఉన్నాము, మళ్ళీ సతోప్రధానంగా ఎలా అవ్వాలి – ఇది సహజంగా అర్థం చేసుకునే విషయము. ఈ సమయంలో మీలో మాలిన్యం చేరడంతో పతితులుగా, తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని, శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్తారు. ఆత్మలు నిరాకారి ఇంటి నుండి ఎలా వస్తాయి అనే దానికి స్మృతి చిహ్నముగా – క్రైస్తవులు వృక్షంలో బల్బులు పెట్టి జరుపుకుంటారు. ఇవి అన్ని ధర్మాలకు సంబంధించిన రకరకాల శాఖలని మీకు తెలుసు. అక్కడి నుండి ఆత్మలు నంబరువారుగా ఎలా కిందకు వస్తారు అనే జ్ఞానం మీకు లభించింది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామము. ఇప్పుడు ఇది సంగమము. అక్కడి నుండి ఆత్మలందరూ వచ్చేస్తారు, తర్వాత అందరూ వెళ్తారు. ప్రళయమైతే జరగదు. మనం బాబా ద్వారా అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు, స్వరాజ్యాన్ని మళ్ళీ తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఇది కేవలం నామమాత్రమైన విషయము కాదు. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – దేహ సహితంగా దేహానికి సంబంధించిన మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, అందరినీ మర్చిపోండి. చిత్రుడు మరియు విచిత్రుడు ఉన్నారు కదా. ఎవరినైతే చూడలేమో, వారిని విచిత్రుడు అని అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంత చిన్నది. ఆత్మ ఘడియ-ఘడియ పాత్రను అభినయించవలసి ఉంటుంది, ఇంకెవరి బుద్ధిలోనూ ఇలాంటి విషయాలు లేవు. మొట్టమొదట బుద్ధిలో ఇది కూర్చోబెట్టుకోవాలి – మనం ఆత్మలము, వారు మన తండ్రి. వారినే పతితపావనా, హే భగవంతుడా అని అంటూ స్మృతి చేస్తారు. ఇక వేరే చోటుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కావున, స్మృతి కూడా ఒక్కరినే చేయాలి కదా. భగవంతుడిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారి నుండి ఏదో లభిస్తుందని అర్థము. మరి ప్రతి చోట ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు! భగవంతుడికి పరంధామం నుండి రావాల్సి ఉంటుంది కదా. మనమైతే అక్కడకు వెళ్ళలేము ఎందుకంటే పతితంగా ఉన్నాము. పతితులు అక్కడకు వెళ్ళలేరు. ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. భక్తి మార్గపు పాత్ర ఎంత అద్భుతమైనదో కదా. హే ఈశ్వరా, హే పరమపితా, ఓ గాడ్ ఫాదర్ అని ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. వారు ఒక్కరే అన్నప్పుడు ఇక వేరే వైపుకు వెళ్ళి ఎందుకు ఎదురుదెబ్బలు తింటారు! వారొక్కరూ పైన ఉంటారు. కానీ ఇదంతా నిశ్చితమై ఉంది, డ్రామానుసారంగా అనంతమైన అవివేకంతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన వివేకవంతులుగా అవుతారు. శ్రీమతంపై నడుచుకునేవారే వివేకవంతులుగా అవుతారు. వారు దాగి ఉండరు, వారు సదా శ్రేష్ఠాచారీ కర్మలనే చేస్తారు. తండ్రి అంటారు – నేను దుఃఖహర్త-సుఖకర్తను కావున పిల్లలు కూడా ఎంత మధురంగా తయారవ్వాలి. తండ్రికి రైట్ హ్యాండ్ గా (కుడి భుజంగా) అవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. వారు రైట్ హ్యాండ్ కదా. ఎడమ చేతితో అంతగా పని చేయలేరని మీకు తెలుసు, ఎందుకంటే కుడి చేయి ధర్మయుక్తమైన పనులు చేస్తుంది. అందుకే, ఈ కుడి చేతినే శుభకార్యాలలో ఉపయోగిస్తారు. పూజ సదా కుడి చేతితోనే చేస్తారు. ప్రతి విషయంలోనూ ధర్మయుక్తమైనవారిగా అవ్వండి అని తండ్రి అంటారు. తండ్రి లభించారంటే సంతోషం ఉండాలి కదా.

తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే, అంత మతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). మతము మరియు గతి ఒక్కటే లేదా గతిని ప్రాప్తింపజేసే మతం ఒక్కటే. ఈశ్వరుని గతి-మతము ఈశ్వరునికే తెలుసు అని అంటూ ఉంటారు. వారే పతితపావనుడు. మనుష్యులను పావనంగా చేసి, దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు అనేది వారికి తెలుసు. భక్తి మార్గంలో ఎంత శ్రమ చేస్తారు కానీ సద్గతి కలగదు, ఫలం ఏమీ లభించదు, సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. భక్తిలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తారో, వారికి ఆ ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే. అది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. వారంతట వారికే పురుషార్థం అనుసారంగా ఫలం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు తమ పురుషార్థంతోనే పవిత్రంగా అవ్వాలి. తండ్రి అంటారు – మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేయండి, వారే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ, ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు. మీరు అంతా తెలుసుకున్నారు మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇంతకుముందు మీలో ఈ జ్ఞానం లేదని మీకు తెలుసు. యజ్ఞ-తపాలు మొదలైనవి చేయడం, శాస్త్రాలు మొదలైనవి వినడం – ఇది శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానము. దానిని భక్తి అని అంటారు. అందులో లక్ష్యం-ఉద్దేశ్యం ఏమీ లేవు. చదువులో లక్ష్యం-ఉద్దేశ్యం ఉంటుంది. ఏదో ఒక రకమైన జ్ఞానముంటుంది. పతితుల నుండి పావనంగా అయ్యేటువంటి జ్ఞానాన్ని మనకు పతితపావనుడైన తండ్రి ఇచ్చారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం తండ్రి ఇచ్చారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఇందులో యాక్టర్లు అందరూ పాత్రధారులే. ఈ నాటకం అనాదిగా తయారై ఉంది. ఈ అనంతమైన జ్ఞానమైతే తప్పకుండా ఉండాలి.

పిల్లలైన మీకు తెలుసు – ఇప్పుడు మనం ఘోరమైన అంధకారం నుండి బయటకు వచ్చి అత్యంత ప్రకాశంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. ఆది సనాతన ధర్మము దేవీ-దేవతా ధర్మము, దానిని హిందు ధర్మమని అనేసారని మీరు అర్థం చేయించాలి. నెమ్మది-నెమ్మదిగా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. పిల్లలు లేచి నిలబడాలి. ఇందులో చాలామంది పిల్లలు కావాలి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేయాలి. పరిస్తాన్ అని కూడా ఢిల్లీనే అంటారు. ఇదే యమునా నది తీరముండేది, ఢిల్లీ రాజధాని. ఎంతోమంది చేతుల్లోకి వచ్చింది. దేవతల రాజధాని కూడా ఇదే. ఢిల్లీలో చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరగాలి, కానీ మాయ ఎలాంటిదంటే, అలా జరగనివ్వదు. చాలా విఘ్నాలు వేస్తుంది. ఈ రోజుల్లో భావ-స్వభావాలు కూడా అనేకమైపోయాయి కదా. పిల్లలు పరస్పరంలో కలుసుకుని సేవలో నిమగ్నమవ్వాలి. ఆ మనుష్యులు కూడా పరస్పరంలో కలుసుకోకపోతే, రాజ్యాలే పోతాయి. రెండు పార్టీలుగా అయిపోతే, రాష్ట్రపతిని కూడా తొలగించేస్తారు. ద్వైత మతము చాలా నష్టం కలిగిస్తుంది. అప్పుడిక భగవంతుడిని ఎదిరించడానికి కూడా ఆలస్యం చేయరు. చాలా నష్టపోతారు. క్రోధమనే భూతం వచ్చిందంటే, ఇక అడగకండి, అందుకే బాబా అంటారు – బెల్లం గురించి బెల్లానికి మరియు బెల్లం సంచికే తెలుసు అని. తండ్రి పిల్లలకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడిక ఎవరైనా ధారణ చేయడం, చేయకపోవడం అనేది వారి పురుషార్థంపైన ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, బాబా ఆశీర్వాదాలు ఇస్తారని లేక కృప చూపిస్తారని కాదు, ఇందులో కృప మొదలైనవి అడిగే విషయమేమీ లేదు. ఒకవేళ ప్రేరణతో యోగము మరియు జ్ఞానము నేర్పించేది ఉంటే, ఇక నేను ఈ అశుద్ధమైన ప్రపంచంలోకి ఎందుకొస్తానని తండ్రి అంటారు. ప్రేరణ, ఆశీర్వాదము – ఇవన్నీ భక్తి మార్గం యొక్క పదాలు. ఇక్కడ పురుషార్థం చేయాల్సి ఉంటుంది, ప్రేరణ యొక్క విషయం లేదు. మీకు 3 ఇంజన్లు ఒకేసారి లభించాయి. అక్కడైతే తండ్రి వేరుగా, టీచరు వేరుగా లభిస్తారు, గురువు చివర్లో లభిస్తారు. ఇక్కడైతే ఈ ముగ్గురూ కలిసి ఉన్నారు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని పూజ్యులుగా చేస్తాను, మీరు తర్వాత పూజారులుగా అయిపోతారు. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అంతేకానీ, ఇతరులు మూర్ఛితులైపోయేలా చెప్పకూడదు. ముందుగా ఇద్దరు తండ్రుల విషయము ముఖ్యమైనది. భగవంతుడు తండ్రి, వారి జన్మను, శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. వారు తప్పకుండా స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తూ ఉండవచ్చు. భారత్ లోనే స్వర్గముండేది. ఇప్పుడు నరకం యొక్క వినాశనం కోసం మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది. తప్పకుండా తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేయించేవారు కూడా. మేము భారత్ ను పావనంగా తయారుచేసి తీరుతామని తండ్రి శ్రీమతం అనుసారంగానే మనం చెప్తాము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలాగైతే తండ్రి దుఃఖహర్త-సుఖకర్తగా ఉన్నారో, అలా తండ్రి సమానంగా అవ్వాలి. చాలా మధురంగా తయారవ్వాలి. సదా శుభమైన కార్యాలను చేసి రైట్ హ్యాండ్ (కుడి భుజం) గా అవ్వాలి.

2. ఎప్పుడూ రెండు మతాలు ఉండకూడదు. భావ-స్వభావాలలోకి వచ్చి ఒకరినొకరు ఎదిరించుకోకూడదు. క్రోధమనే భూతాన్ని తొలగించివేయాలి.

వరదానము:-

సంగమయుగ విశేషత ఏమిటంటే – ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తు యొక్క గ్యారెంటీ అయితే ఉండనే ఉంది కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యము ఇప్పటిదే. ఈ భాగ్యపు నషాలో ఉన్నట్లయితే స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో, అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇది జరగడం లేదు, కాస్త సహాయం చేయండి – ఇవన్నీ ఫిర్యాదులు. కనుక ఫిర్యాదులను వదిలి స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top