14 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

14 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

13 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఈ సంగమయుగమే ఎక్కే కళ యొక్క యుగమని, సత్యయుగం నుండి మొదలుకొని కళలు తగ్గిపోతూ ఉంటాయని మీకు డ్రామాలోని ఈ గుప్త రహస్యం గురించి తెలుసు”

ప్రశ్న: -

అన్నింటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి మరియు ఆ సేవను ఎవరు చేస్తారు?

జవాబు:-

భారత్ ను స్వర్గంగా చేయడము, పేదవారిని ధనవంతులుగా చేయడము, పతితులను పావనంగా చేయడము – ఇది అన్నింటికన్నా ఉత్తమమైన సేవ. ఇటువంటి సేవను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. తండ్రి ఇటువంటి గొప్ప సేవను చేసారు కావుననే పిల్లలు వారి గౌరవాన్ని నిలబెడతారు. మొట్టమొదట సోమనాథ మందిరాన్ని నిర్మించి వారిని పూజిస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది….. (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తంగా ఉంటుంది మరియు శరీరం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము, గుప్తంగా ఉంటుంది. ఆత్మ అనేది ఉండడం తప్పకుండా ఉంటుంది కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంటుంది, అందుకే ఆత్మ గుప్తంగా ఉంటుందని అంటారు. ఆత్మ స్వయంగా చెప్తుంది – నేను నిరాకారి, ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తం అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము. అక్కడ గుప్తము అనే మాటే లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్, ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ అని అంటారు. అన్నింటికంటే అతీతమైన స్థానంలో నివసించేవారు పరమపిత పరమాత్మ. తండ్రి అంటారు – మీరు ఎలాగైతే గుప్తంగా ఉన్నారో, అలా నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భజైలులోకి రాను. నాకు శివ అన్న పేరు ఒకటే కొనసాగుతూ వస్తుంది. నేను వీరిలోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మ ఏ శరీరంలోనైతే ఉందో, దాని పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు, నేను ఆత్మలందరికీ తండ్రిని. కనుక ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. ఆత్మనైన నేను ఈ శరీరంతో కప్పబడి ఉన్నాను అనే జ్ఞానం పిల్లలైన మీకిప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తంగా ఉంటుంది. శరీరం ప్రత్యక్షంగా ఉంటుంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరం ద్వారా వింటారు. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా చేయడానికి తండ్రి వస్తారు. మీరు మా భారత్ పేదది అని అంటారు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడుండేది, ఎలా ఉండేది అనేది వారికి అసలు తెలియదు. మా భారత్ చాలా షావుకారుగా ఉండేదని, దుఃఖమనే మాటే ఉండేది కాదని పిల్లలైన మీకు చాలా నషా ఉంది. సత్యయుగంలో ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు. ఒకే ఒక దేవీ-దేవతా ధర్మముండేది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి ఎవరికీ తెలియదు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేదని ఇప్పుడు మీరు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ షావుకారుగా చేయడానికి తండ్రి వచ్చారు. భారత్ సత్యయుగంలో చాలా షావుకారుగా ఉండేది. అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది. తర్వాత ఆ రాజ్యం ఎక్కడకు వెళ్ళిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అంటారు. తండ్రి అంటారు – సత్యయుగంలో ఈ దేవీ-దేవతలకు రచయిత-రచనల జ్ఞానముండేది కాదు, వారికి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఒకవేళ వారికి – మేము మెట్లు దిగుతూ రసాతలంలోకి (పాతాళంలోకి) వెళ్తామనే జ్ఞానం ఉన్నట్లయితే, రాజ్యాధికారం యొక్క సుఖం కూడా ఉండదు. చింత కలుగుతుంది.

మేము తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి – అని ఇప్పుడు మీకు చింత పట్టుకుంది. ఆత్మలైన మనం నిరాకారీ ప్రపంచంలో ఉండేవారము, మరి అక్కడ నుండి సుఖధామంలోకి ఎలా వచ్చాము – ఇది కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. ఈ 84 జన్మలలో ఏమి జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. సత్యయుగంలోకి అందరూ రారు. డ్రామానుసారంగా ప్రతి పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారంగా వచ్చి పాత్రను అభినయిస్తారు.

పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచం వారికి తెలియదు. చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది….. అని పాటలో కూడా విన్నారు. ఇదంతా భక్తి. భగవంతుడు ఎప్పుడు వచ్చి, భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గం నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. రామ రాజ్యం, రావణ రాజ్యం అనే పేర్లు వేటికి పెట్టారు అనేది కూడా మనుష్యులెవరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు అంటే శివుడు తప్పకుండా వస్తారు. అలాగని, నేను కృష్ణుని తనువులోకి వస్తానని కూడా వారు అనరు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది అని తండ్రి అంటారు. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారు ఇప్పుడు అంతిమంలో ఉన్నారు, తతత్వమ్. నేను సాధారణ తనువులోకే వస్తాను. మీరు 84 జన్మలను ఎలా అనుభవిస్తారు అనేది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. ఈ సమయంలో ఒక్కరు కూడా తమను తాము దేవతా ధర్మం వారిగా భావించరు ఎందుకంటే సత్యయుగాన్ని చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయారు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసేసారు. వాస్తవానికి డ్రామా చరిత్ర చాలా చిన్నది. ఇందులో కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాలు చరిత్ర, కొన్నింటికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. మిగిలిన ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. డ్రామానుసారంగా మళ్ళీ అలాగే కన్వర్ట్ అయిపోతారు. తర్వాత తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు కనుక మేమెందుకు స్వర్గంలో ఉండకూడదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము. కనుక దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు కారో, వారు అసలు రానే రారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలని అంటారు. సత్యయుగ కొత్త ప్రపంచంలో దేవతలకు చాలా సుఖముండేదని, బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారముండేది. ఇటువంటి మందిరం అసలు ఇంకొకటి ఉండదు. అందులో చాలా వజ్ర వైఢూర్యాలుండవని. బౌద్ధులు మొదలైనవారికి వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారుచేసారో, మీరు వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారు. ఎవరైతే మంచి కర్మలు చేసి వెళ్తారో, వారిని గౌరవించడం జరుగుతుంది. అన్నింటికంటే మంచి కర్మ పతితపావనుడైన తండ్రియే చేసి వెళ్తారని మీరిప్పుడు తెలుసుకున్నారు. అన్నింటికంటే ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రియే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారో, వారికి కూడా ఎవరూ గౌరవం ఇవ్వరు. సోమనాథ మందిరం ఉన్నతాతి-ఉన్నతమైన మందిరంగా మహిమ చేయబడిందని మీకు తెలుసు, దానిని దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకొని వెళ్ళలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో వీరు చాలా ధనవంతులుగా ఉంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారుంటారో, వారిని చిన్న పదవి వారు గౌరవిస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది. వారి వద్ద అంత ధనమున్నప్పుడు వారి ఇల్లు కూడా అంత బాగుంటుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపన చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం స్వర్గానికి మహారాజు-మహారాణులుగా అవుతాము, తర్వాత పడిపోతాము, ఆ తర్వాత మొట్టమొదట మనం శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి యజమానులుగా చేసారో, వారిని మనం పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకారుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. ఇంతకుముందు ఇంత నిరుపేదగా ఉండేది కాదు, చాలా సంతోషంగా ఉండేవారు. ఏ భూమినైతే 500 రూపాయలకు కొన్నారో, అది ఈ రోజు 5000 రూపాయలకు కూడా లభించదు. అక్కడ భూమికి ధర ఉండదు. ఎవరికి ఎంత కావాలంటే, అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది. మధురమైన నదీ తీరాలలో మీ మహళ్ళు ఉంటాయి కదా. చాలా తక్కువమంది మనుష్యులుంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది, చాలా మంచి ఫలాలు, పుష్పాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత శ్రమిస్తున్నారు. కానీ కరువు వస్తే భోజనం లభించదు. కనుక పాటను వినడంతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. దాని అర్థం ఇప్పుడు తెలిసింది కదా. వారు షావుకార్లుగా ఎవరిని తయారుచేస్తారు? ఎవరైతే ఇక్కడికి వస్తారో, తప్పకుండా వారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనం పావనం నుండి పతితంగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పట్టిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితం నుండి పావనంగా చేస్తారు. ఉన్నతాతి-ఉన్నతంగా చేస్తారు. ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, మేము మీ వారము అని అంటారు. బాబా అంటారు – పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులు. కొడుకు జన్మించగానే వారసుడిగా అవుతాడు. ఎంత సంతోషం కలుగుతుంది. కానీ కూతురుని చూస్తే ముఖం వాడిపోతుంది. ఇక్కడ ఆత్మలందరూ కొడుకులే. మనం స్వర్గానికి యజమానులుగా అయిపోయాము. మనం 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. తండ్రి అలా తయారుచేసారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేది అనేది అసలేమీ తెలియదు. వాస్తవానికి భారత్ యొక్క జనాభా అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలంటే మరి చాలా భూమి కావాలి. మొత్తం ప్రపంచంలో ఉన్న భూమి అంతా కూడా సరిపోదు. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు! లెక్కలేనంత మంది మనుష్యులు అయిపోతారు. కానీ అంతమంది లేరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులు వీటిని వింటే – ఈ విషయాలను ఎప్పుడూ వినలేదు, ఏ శాస్త్రాలలోనూ చదవలేదు, ఇవి అద్భుతమైన విషయాలు అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు, సతోప్రధానంగా ఉండే వీరే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా వింటున్నప్పుడు శరీరం ఊగుతుంది, ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. తప్పకుండా ఆత్మలైన మనం 84 జన్మలను తీసుకున్నాము. 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు. ఇది కూడా లెక్క కదా. మేము 84 జన్మలు తీసుకుంటాము, ఇంకా తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు అని బుద్ధిలోకి వస్తుంది. మినిమమ్ (అతి తక్కువ) మరియు మ్యాగ్జిమమ్ (అత్యధికం) యొక్క లెక్క ఉంటుంది కదా. శాస్త్రాలలో ఏమేమి రాసేసారు అనేది బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. మీ గురించి అయితే కనీసం 84 జన్మలు అనైనా అంటారు, నా గురించి అయితే లెక్కలేనన్ని జన్మలని అన్నారు. కణకణంలో ఎక్కడ చూసినా నీవే నీవు….. కృష్ణుడే కృష్ణుడని అంటారు. మథురా మరియు బృందావనంలో కృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు. రాధా మార్గం వారు ఎక్కడ చూసినా రాధయే రాధ అని అంటారు. మేము రాధా-స్వాములము అని చెప్పుకుంటారు, కృష్ణ స్వాములు వేరే ఉంటారు. రాధా మార్గం వారు రాధను మాత్రమే నమ్ముతారు. ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు కూడా రాధయే, నేను కూడా రాధయే అని అంటారు.

వాస్తవానికి నేను పేదల పెన్నిధిని కదా అని ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్ యే అన్నింటికంటే షావుకారుగా ఉండేది. ఇప్పుడు అన్నింటికంటే నిరుపేదగా అయింది, అందుకే నేను భారత్ లోనే రావాల్సి ఉంటుంది. ఇది తయారై-తయారవుతున్న డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. ఇది చాలా పెద్ద డ్రామా. షూటింగా అయినటువంటి డ్రామా మళ్ళీ యథావిధిగా రిపీట్ అవుతుంది. డ్రామా గురించి కూడా తెలియాలి. డ్రామా అంటే డ్రామా. అది హద్దు డ్రామా, ఇది అనంతమైన డ్రామా. దీని ఆదిమధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. కనుక పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే నమ్ముతారు, కృష్ణుడిని కాదు. కృష్ణుడు ధనవంతునిగా, సత్యయుగ రాకుమారునిగా అవుతారు. భగవంతునికి తన శరీరమంటూ లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారు. మీకు రాజయోగ శిక్షణను ఇస్తారు. మనుష్యులు కూడా చదువు ద్వారా బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతారు, అప్పుడు సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ జరుగుతుంది కదా. స్వర్గం అనేది సముద్రం నుండేమీ బయటకు రాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయంలో కంసపురి మొదలైనవి ఉండేవి కావు. కృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుంది. అతని తండ్రికి మహిమ లేదు. అతని తండ్రి ఎక్కడున్నారు. కృష్ణుడు తప్పకుండా రాజుకు సంతానమై ఉంటారు కదా. అక్కడ పెద్ద రాజు ఇంట్లో జన్మించడం జరుగుతుంది. కానీ అతను పతిత రాజు అయిన కారణంగా అతనికి పేరు ఉండదు. కృష్ణుడు ఉన్నప్పుడు కొద్దిమంది పతితులు కూడా ఉంటారు. వారు పూర్తిగా సమాప్తమైనప్పుడు కృష్ణుడు సింహాసనంపై కూర్చొంటారు, తమ రాజ్యాన్ని తీసుకుంటారు, అప్పుడే వారి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణులతో శకం ప్రారంభమవుతుంది. వీరి రాజ్యం ఇంత సమయం, తర్వాత వీరిది ఇంత సమయం అని మీరు పూర్తి లెక్కను రాస్తారు. అప్పుడు కల్పం ఆయువు ఎక్కువగా ఉండదు అని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. నేను తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి అనే చింతను మాత్రమే పెట్టుకోవాలి.

2. ఈ అనంతమైన డ్రామాను బుద్ధిలో ఉంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. తండ్రి సమానంగా గౌరవాన్ని పొందేందుకు పతితులను పావనంగా చేసే సేవను చేయాలి.

వరదానము:-

ఎవరైతే ఎవర్రెడీగా ఉంటారో, వారి ప్రాక్టికల్ స్వరూపం ఎవర్-హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి రూపీ పేపర్ వచ్చినా లేక ప్రాకృతిక ఆపద ద్వారా పేపర్ వచ్చినా లేక ఏదైనా శారీరిక కర్మభోగం రూపీ పేపర్ వచ్చినా – అన్ని రకాల పేపర్లలో ఫుల్ పాస్ అయ్యే వారినే ఎవర్రెడీ అని అంటారు. ఎలాగైతే సమయం ఎవరి కోసము ఆగదో, అలా ఎప్పుడూ ఏ విధమైన ఆటంకము ఆపకూడదు, మాయ యొక్క సూక్ష్మ మరియు స్థూల విఘ్నాలు ఒక్క సెకండులో సమాప్తమైపోవాలి, అప్పుడు ఎవర్ హ్యాపీగా ఉండగలరు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top