09 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

09 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

8 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - బాప్ (తండ్రి) మరియు దాదా (పెద్ద అన్నయ్య) ల కథ కూడా అద్భుతమైనది, తండ్రి దాదాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు”

ప్రశ్న: -

డ్రామా నిశ్చితమైనదని తెలిసి కూడా పిల్లలైన మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి?

జవాబు:-

పురుషార్థం చేసి గ్యాలప్ చేసే (త్వరత్వరగా ముందుకు వెళ్ళే) లక్ష్యాన్ని అనగా వినాశనం కన్నా ముందే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యే లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. కర్మాతీతము అనగా ఇనుప యుగము వారి నుండి బంగారు యుగము వారిగా అవ్వడము. పురుషార్థం చేయడానికి ఈ కొద్ది సమయమే ఉంది కావున వినాశనానికి ముందే మీ అవస్థను అచలంగా-స్థిరంగా తయారుచేసుకోవాలి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఓంశాంతి. ఈ విధంగా ఏ ఇద్దరు అంటున్నారు? ఒకరు బాబా, మరొకరు దాదా. ఒక రాజు ఉండేవారు, ఒక రాణి ఉండేవారని కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. ఒకరు బాబా, ఒకరు దాదా. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఒక శివబాబా, ఒక బ్రహ్మా దాదా ఉండేవారని మీరంటారు. ఇప్పుడు అందరూ శివుని పిల్లలే. ఆత్మలందరూ ఒక తండ్రి సంతానము. ఆత్మలందరూ ఎలాగూ తండ్రి సంతానమే. బ్రహ్మాకు పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉండేవారు, ప్రజాపిత బ్రహ్మా సంతానమైన బ్రహ్మాకుమార-కుమారీలు ఉండేవారు. వారిని ఎవరు చదివించేవారు? శివబాబా. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలైన ఈ బ్రహ్మాకుమార-కుమారీలు అనేకమంది ఉన్నారు కదా. తప్పకుండా మేము శివబాబాకు పిల్లలము కూడా, మనువలము కూడా అని బ్రహ్మాకుమార-కుమారీలు భావిస్తారు. మీరు బాబాకు ఎలాగూ పిల్లలే, బ్రహ్మా ద్వారా తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి ఇప్పుడు మనవలుగా అయ్యారు. ఇప్పుడు మీకు తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది, వారిని శివబాబా అని అంటారు. కానీ బ్రహ్మాకుమార-కుమారీలు అయిన కారణంగా వీరిని (బ్రహ్మాను) మనం దాదా అని అంటాము. వారసత్వము తాతగారిది. బ్రహ్మా దాదాది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వం ఆ తండ్రి నుండి లభిస్తుంది. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుతారు, తర్వాత మీకు రావణుడి నుండి శాపం లభిస్తుంది. కిందకు దిగుతూ వస్తారు. కిందకు దిగే గ్రహచారం కూర్చొన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మా గ్రహచారము, రాహు దశ పూర్తి అయ్యింది – అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. రాహు దశ అన్నింటికంటే చెడ్డది. ఉన్నతోన్నతమైనది బృహస్పతి దశ, తర్వాత రాహు దశ కూర్చోవడంతో 5 వికారాల కారణంగా మనం నల్లగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి అంటారు – దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇది మీకు సంబంధించిన విషయమే. దీనినే వారు సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అని అనుకున్నారు. గ్రహణం పట్టినప్పుడు దానమివ్వండి అని అక్కడ వారు అడుగుతారు, కానీ 5 వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహచారం తొలగిపోతుందని ఇక్కడ తండ్రి మీకు చెప్తారు. ఈ వికారాల కారణంగానే మీరు పాపాత్ములుగా అయ్యారు. ముఖ్యమైనది దేహాభిమానము. ముందు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోగా అయ్యారు, 84 జన్మలను తీసుకున్నారు. తప్పకుండా దేవతలే 84 జన్మలు తీసుకుంటారని పక్కా నిశ్చయముంది. ముందు వారే తండ్రిని కలుసుకోవాలి. ఆత్మలు పరమాత్మ చాలాకాలం వేరుగా ఉన్నారు….. అని అంటూ ఉంటారు. తండ్రి అంటారు – మొట్టమొదట మిమ్మల్ని సత్యయుగంలోకి పంపించాను, మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. ఇంతకుముందు కేవలం పాడుతూ ఉండేవారు, కానీ దాని యథార్థ అర్థాన్ని ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వేదశాస్త్రాలు, జప-తపాలు, స్లోగన్లు మొదలైనవాటన్నింటి సారాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చక్రమును చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలియుగం మరియు సత్యయుగం యొక్క సంగమము. యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగం స్థాపనవుతుందని కూడా మీకు నిశ్చయముంది. కలియుగంలో ఉన్నవారందరి శరీరాలు సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలు పవిత్రంగా అయి, లెక్కాచారాలను పూర్తి చేసుకొని వెళ్తాయి. ఇది అందరి వినాశన సమయము. ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళిపోతాయి. ఇప్పుడిది మీ బుద్ధిలో ఉంది. మీరు కర్మాతీత అవస్థను పొందేంత వరకు సంగమంలో ఉంటారు. ఒకవైపు కోట్లాది మంది మనుష్యులున్నారు, ఇంకొకవైపు కేవలం మీ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మీలో కూడా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతూ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. నిశ్చయబుద్ధి కలవారు విజయం పొంది విష్ణు మెడలో హారంగా అవుతారు. ఒకటి రుద్రాక్ష మాల, రెండవది రుండ మాల. ఆ రుండ మాలలో చిన్న-చిన్న ముఖాలుంటాయి. ఇది దేనికి గుర్తు అంటే – ఆత్మలమైన మనము వచ్చి తండ్రి మెడలోని హారంలో పూసలుగా అయి, మళ్ళీ ఇక్కడకు నంబరువారుగా వస్తాము. 8 మాల కూడా ఉంది, 108 మాల కూడా ఉంది, 16,108 మాల కూడా ఉంది. ఇప్పుడు 16,000 మంది ఉన్నారా లేక 5-10 వేల మంది ఉన్నారా అన్న లెక్కను ఏమీ తీయరు. ఈ మాలలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు – ఇదంతా మీరెందుకు ఆలోచిస్తారు. కల్పక్రితం ఎంతమంది సత్య-త్రేతా యుగాలలో రాజులుగా అయ్యారో, ఇప్పుడు కూడా అంతమందే అవుతారు. 100 మంది అయ్యారా లేక 2-3 వందల మంది అయ్యారా అని అడగకూడదు.

తండ్రి అంటారు – మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము, రేపు వినాశనమవుతుంది, తర్వాత సత్యయుగంలో కొద్దిమంది దేవీ-దేవతలు ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతుంది. సత్యయుగపు గుర్తులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే, లక్షల మంది వెళ్ళి ఉంటారా, లక్ష మంది ఉంటారా లేక 9-10 లక్షల మంది ఉంటారా అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా సంపూర్ణం అయ్యేందుకు యోగ్యులుగా అవుతారో, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడు ఇంకా చాలా అర్థం చేసుకునేందుకు సమయం ఉంది. చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధం కోసం ఏర్పాట్లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అన్ని వస్తువులు ఖరీదైనవిగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు విదేశాలలో కూడా పన్నులు మొదలైనవి ఎక్కువ వేస్తారు. ధరలు బాగా పెరుగుతూ-పెరుగుతూ ఒక్కసారిగా చౌకగా అయిపోతాయి. సత్యయుగంలో ఏ వస్తువు పైనా ఖర్చు అవ్వదు. గనులు మొదలైనవన్నీ నిండుగా అవుతాయి. కొత్త ప్రపంచంలో వైభవాలు చాలా ఉంటాయి. లక్ష్మీనారాయణుల వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. శ్రీనాథ ద్వారములో విగ్రహాల ముందు ఎన్ని రకాల భోగ్ లను పెడతారు. అక్కడ చాలా రకాల పదార్థాలు తయారుచేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకు భోగ్ పెడుతున్నాము, దేవతలకు భోగ్ పెట్టకపోతే వారు కోపగించుకుంటారు – అని అంటారు. ఇందులో కోపగించుకునే విషయమే లేదు. మీరు ఎవ్వరి పైనా కోపగించుకోరు. డ్రామానుసారంగా ఈ వినాశనం జరగాల్సిందేనని మీకు తెలుసు. కలియుగం మారి సత్యయుగంగా అవుతుంది. డ్రామానుసారంగా ఇప్పుడు కొత్త చక్రం మొదలవ్వనున్నదని మీకు డ్రామా గురించి తెలుసు. మీరు కూడా డ్రామాకు వశమై ఉన్నారు. డ్రామానుసారంగా తండ్రి కూడా వచ్చి ఉన్నారు. డ్రామాలోని ఒక్క నిమిషం కూడా కింద-మీద అవ్వదు. ఎలాగైతే బాబా వచ్చారు, మీరు చూసారు, కల్పం తర్వాత కూడా అచ్చంగా ఇలాగే జరుగుతుంది. శాస్త్రాలలో కల్పం ఆయువును చాలా పెద్దగా రాసేసారు. తప్పకుండా వినాశనం ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు గ్యాలప్ చేస్తున్నారు (త్వరత్వరగా ముందుకు వెళ్తున్నారు). మేము తండ్రిని స్మృతి చేసి కర్మాతీత అవస్థను తప్పకుండా పొందాలని అనగా ఇనుప యుగము వారి నుండి బంగారు యుగము వారిగా అవ్వాలని మీకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ పురుషార్థం చేయకపోతే పదవి భ్రష్టమైపోతుంది. హే ఆత్మలు, ఇప్పుడు మీరు పతితులుగా అయిపోయారు. చాలా రకాల వారు వస్తారు, ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయినవారు అక్కడ నుండి బయటకు వచ్చి ఇక్కడకు వస్తూ ఉంటారు. వారు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు తమ పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చి తర్వాత దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకపోతే దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు. బ్రాహ్మణులు రోజు-రోజుకు వృద్ధి చెందుతూ ఉంటారు. వినాశనం ఎదురుగా రావడాన్ని చూసినప్పుడు, వీరు కరక్టే చెప్తున్నారని అనుకుంటారు, అప్పుడిక వృద్ధి జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెంది ఫుల్ అయినప్పుడు, అందరూ తిరిగి వెళ్తారు. దేవతల వృక్షం పెరుగుతుంది.

ఇప్పుడు మీరు సంగమంలో రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ సంగమాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. సంగమానికే మహిమ ఉంది – గంగా సాగరం యొక్క మేళాను చూపిస్తారు. అదంతా భక్తి మార్గానికి చెందినది. ఇక్కడున్నది జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన సాగరుని నుండి వెలువడిన జ్ఞాన గంగలు. జ్ఞానసాగరుడు అన్న పదానికి పతితపావనుడు అనే పదం సరిపోతుంది. వారు గంగను పతితపావనిగా భావిస్తూ, గంగలో స్నానాలు చేస్తూ వచ్చారు. ఈ నదులు సత్యయుగం నుండి ప్రవహిస్తూ ఉన్నాయి, ఈ రోజుల్లో నదులు కూడా అక్కడక్కడ ముంచేస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా తమోప్రధానంగా అయిపోయింది, సాగరం కూడా తమోప్రధానంగా అయిపోయింది. సాగరం కొద్దిగా పొంగినా సరే అంతా సమాప్తం చేసేస్తుంది. సత్యయుగంలో యమునా నది ఒడ్డున కేవలం మనం కొద్దిమంది మాత్రమే ఉంటాము. ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేది, మళ్ళీ అలా తయారవ్వనున్నది. సత్యయుగంలో కొంతమంది జీవాత్మలే ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇప్పుడిది కలియుగ అంతిమము. మనుష్యుల సంఖ్య ఎంతగా పెరిగిపోయింది, ఇది అనంతమైన నాటకము, దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. కొంతమంది స్వయాన్ని పాత్రధారులుగా భావిస్తారు కానీ కల్పము 5 వేల సంవత్సరాలదని ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలు ఎక్కడ, 84 లక్షల జన్మలు ఎక్కడ. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయాలి. శివ భగవానువాచ – కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు. భగవంతుని మహిమకు మరియు దేవతల మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి రచించే కొత్త రచనకు గల మహిమ – సర్వగుణ సంపన్నులు… ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు. తండ్రి మహిమకు మరియు వీరి (దేవతలు) మహిమకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది రాజయోగము కదా. భగవంతుడు రాజయోగం నేర్పిస్తారని అంటూ ఉంటారు. వారు నిరాకారుడు, అందుకే నిరాకార లోకం నుండి సాకార లోకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. భగవంతునికి ఇంత మహిమ ఉంది కావున వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారిది దివ్య అలౌకిక జన్మ, ఇంకెవరి జన్మను దివ్య జన్మ అని అనరు. పిల్లలకు అర్థం చేయించడం జరిగింది – ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, ఆ పారలౌకిక తండ్రినే భగవంతుడు అని అంటూ స్మృతి చేస్తారు మరియు మూడవవారు అలౌకిక తండ్రి, వీరు అద్భుతమైన తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు మధ్యలో ఈ అలౌకిక తండ్రి వస్తారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలున్నారు. శివబాబా వచ్చి బ్రహ్మా ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. లౌకిక తండ్రికి మహా అయితే 8-10 మంది పిల్లలు ఉంటారు. అచ్ఛా, పారలౌకిక తండ్రి అయిన శివబాబా కూడా ఉన్నారు. వారికైతే చాలా మంది పిల్లలున్నారు. ఆత్మలందరూ మేము సోదరులమని అంటారు. ఇప్పుడు, ఈ సంగమయుగంలో అలౌకిక తండ్రి లభిస్తారు. అక్కడ మీకు ఈ జ్ఞానం ఉండదు. తండ్రి వచ్చి కొత్త సృష్టిని రచించినప్పుడే ప్రజాపిత బ్రహ్మా బాబా లభిస్తారు. కావున ఇది అలౌకిక జన్మ అయినట్లు కదా, దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. అతను లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి మరియు వీరు సంగమయుగీ అలౌకిక తండ్రి. లౌకిక తండ్రి అయితే సత్యయుగం నుండి మొదలుకొని ఉండనే ఉన్నారు. అక్కడ పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. అక్కడ ఉండేది ఒక్క తండ్రి మాత్రమే. హే భగవంతుడా, హే పరమాత్మ అని పిలుస్తూ స్మృతి చేయరు, తర్వాత ద్వాపరయుగంలో భక్తి మార్గం మొదలైనప్పుడు ఇద్దరు తండ్రులు ఉంటారు. సంగమయుగంలో ముగ్గురు తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇప్పుడే లభిస్తారు, ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అయ్యారు. వీరు అలౌకిక తండ్రి అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాలను మీరు మంచి రీతిలో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. సత్యయుగంలో స్మృతి చేసే అవసరమే లేదు. దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఇది చాలా సహజమైన విషయము. సత్య-త్రేతాయుగాలలో ఒక్క తండ్రి ఉంటారు, ద్వాపరయుగంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. ఈ సమయంలో మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు, వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీరే బ్రాహ్మణులుగా అవుతారు, మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. వినాశనం కూడా మీరే చూడాల్సి ఉంటుంది, దానిని మీరు ఈ స్థూల నేత్రాలతో చూస్తారు. బాంబులు వేస్తారు, అప్పుడు మనుష్యులు మరణిస్తారు కదా. జపాన్ లో కూడా బాంబు వేసినప్పుడు మనుష్యులు ఎలా మరణించారో చూసారు కదా. ఇప్పుడిక ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోతున్నామని స్వయం కూడా అంటారు. 10-10 సంవత్సరాల వరకు కూడా యుద్ధం నడుస్తూ ఉంటుంది. బాంబులతోనైతే క్షణంలో అంతా సమాప్తమైపోతుంది. నిప్పురవ్వ అంటుకుందంటే, పట్టణాలకు పట్టణాలే సమాప్తమైపోతాయి. ఇవేమో బాంబులు. నిప్పు కూడా అంటుకోనున్నది.

స్థాపన మరియు వినాశనం చేయించేందుకే తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. కావున ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. పురుషార్థం చేసే సమయము ఇదే. మాయ మీ బుద్ధియోగాన్ని పదే-పదే తెంచి వేస్తుంది. ఇప్పుడింకా మీరు చలించనివారిగా, స్థిరమైనవారిగా ఎక్కడయ్యారు. బాబా, మాయ తుఫానులు చాలా వస్తాయని అంటారు. కొందరైతే రోజంతటిలో గంట, అర గంట కూడా స్మృతి చేయరు. తండ్రి అంటారు – మీరు కర్మయోగులు, 8 గంటలు ఈ సేవ చేస్తారు, 8 గంటలు స్మృతి చేయగలిగేంత పురుషార్థం చేయాలి. స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి, దీనినే యోగాన్ని అని అంటారు. ఇందులో శ్రమ ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం స్మృతి చేయాలి. ఇది కూడా బాబా చెప్తారు – గృహస్థాన్ని విడిచిపెట్టి పిల్లలుగా అయినవారు కూడా అంతగా స్మృతి చేయరు. ఇంట్లో ఉండేవారు ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుని ఉదాహరణ చెప్తారు కదా. తండ్రిని స్మృతి చేయడము మరియు చక్రాన్ని అర్థం చేసుకోవడంలోనే శ్రమ ఉంది. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. అది సత్యయుగంలో జరగదు. పిల్లలైన మీరు అంధులకు చేతికర్రగా కూడా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి అని అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. తమ అవస్థను అచలంగా-స్థిరంగా ఉంచుకునేందుకు స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయకూడదు.

2. ఈ డ్రామా పూర్తిగా ఏక్యురేట్ గా తయారైంది, అందుకే ఎవరి పైనా కోపగించుకోకూడదు. నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి.

వరదానము:-

హనుమంతుడు సదా సేవాధారిగా ఉన్నారని, అతను మహావీరుడని, అందుకే స్వయం కాలిపోకుండా వారి తోకతో లంకను కాల్చారని వారి విశేషతను చూపిస్తారు. అలాగే, ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారులుగా ఉంటారో, వారే మాయ అధికారాన్ని సమాప్తం చేయగలరు, సేవాధారులు కాని వారు మాయ రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవారు, కనుక తండ్రి తప్ప హృదయంలో ఇంకెవ్వరూ ఉండకూడదు. తమ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడు మాయాజీతులుగా, విజయులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top