05 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

05 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

4 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - బాబా మీ భాగ్యాన్ని మేల్కొల్పేందుకు వచ్చారు, పావనంగా అవ్వడం ద్వారానే భాగ్యం మేల్కొంటుంది”

ప్రశ్న: -

ఏ పిల్లల భాగ్యమైతే మేల్కొని ఉందో, వారి గుర్తులేమిటి?

జవాబు:-

వారు సుఖ దేవతలుగా ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకొని అందరికీ సుఖాన్నిస్తారు. ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వలేరు. వారు వ్యాసుని పిల్లలు, సత్యాతి-సత్యమైన సుఖదేవులు. 2. వారు 5 వికారాలను సన్యసించి సత్యాతి-సత్యమైన రాజయోగులుగా, రాజఋషులుగా పిలవబడతారు. 3. వారి అవస్థ ఏకరసంగా ఉంటుంది, వారికి ఏ విషయంలోనూ ఏడుపు రాదు. వారినే మోహజీతులని అంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను….. (తక్దీర్ జగాకర్ ఆయీ హూ…..)

ఓంశాంతి. పాటలోని ఒక్క లైను విన్నా కూడా మధురాతి-మధురమైన పిల్లల రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఇది మామూలు పాటే కానీ దీని సారం ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని పాటలు మరియు అన్ని శాస్త్రాల అర్థాన్ని తెలియజేస్తారు. కలియుగంలో అందరి భాగ్యం నిద్రించి ఉందని కూడా మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో భాగ్యం మేల్కొని ఉంటుంది. నిద్రిస్తున్న భాగ్యాన్ని మేల్కొల్పేవారు మరియు మతాన్నిచ్చేవారు లేక భాగ్యాన్ని తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతారు. పిల్లలు జన్మించగానే వారి భాగ్యం మేల్కొంటుంది. కొడుకు జన్మించగానే నేను వారసుడిని అని అతనికి తెలుస్తుంది. అదే విధంగా ఇది అనంతమైన విషయము. కల్ప-కల్పము మన భాగ్యం మేల్కొంటుంది, మళ్ళీ నిదురిస్తుందని పిల్లలకు తెలుసు. పావనంగా అయినట్లయితే భాగ్యం మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమమని అంటారు. ఆశ్రమము అనే పదం పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉంటుంది, దానికి వ్యతిరేకంగా అపవిత్ర పతిత ధర్మము ఉంటుంది, దీనిని ఆశ్రమము అని అనరు. గృహస్థ ధర్మమైతే అందరికీ ఉంటుంది. జంతువులకు కూడా ఉంటుంది. అందరూ పిల్లలకు జన్మనిస్తారు. గృహస్థ ధర్మంలో ఉన్నాయని జంతువుల గురించి కూడా అంటారు. మనం స్వర్గంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారమని, దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు….. అని వారి మహిమను కూడా పాడుతారు. స్వయం మీరు కూడా పాడేవారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా మళ్ళీ అవుతున్నామని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దేవీ-దేవతల ధర్మం ఉంటుంది. ఇంకా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః….. శివుని గురించి శివ పరమాత్మాయ నమః అని అంటారు, అంటే తేడా ఉన్నట్లే కదా. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని అనలేము. రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. దేవతలను రాతిబుద్ధి కలవారని అనరు. తర్వాత డ్రామా ప్లాను అనుసారంగా రావణ రాజ్యం తయారైనప్పుడు వారు కూడా మెట్లు దిగాల్సి ఉంటుంది, పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అవ్వాల్సి ఉంటుంది. అందరికంటే బుద్ధివంతులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తారు. మీరు ఇక్కడకు పారసబుద్ధి కలవారిగా అవ్వడానికి వస్తారు. పారసనాథుని మందిరం కూడా ఉంది. అక్కడ మేళా జరుగుతుంది. కానీ పారసనాథుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వాస్తవానికి పారసంగా చేసేవారు తండ్రి మాత్రమే. వారు బుద్ధివంతుల బుద్ధి వంటి వారు. ఇది పిల్లలైన మీ బుద్ధి కొరకు ఔషధము. బుద్ధి ఎంతగా మారుతుంది. చెడు చూడకండి… అని అంటూ ఉంటారు. ఇది కోతుల విషయమేమీ కాదు. మనుష్యులే కోతుల వలె తయారవుతారు. ఏప్స్ ను (తోక లేని కోతులను) మనుష్యులతో పోలుస్తారు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఒకరికొకరు ఎంతగా దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి ఔషధం లభిస్తుంది. అనంతమైన తండ్రి ఔషధాన్ని ఇస్తున్నారు. ఇది చదువు, దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. ఇది నీరు కాదు. ఈ రోజుల్లో అన్నింటినీ అమృతమని అనేస్తారు. గంగా జలాన్ని కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలు కడిగి, ఆ నీటిని తాగుతారు. ఆ నీటిని ఉంచుకుంటారు, దానిని కూడా అమృతం యొక్క దానంగా భావిస్తారు. దానము తీసుకునేవారిని పతితులను పావనంగా చేసేవారు అని అనరు. గంగా జలాన్ని పతితపావని అని అంటారు. మనుష్యులు మరణించేటప్పుడు గంగా జలం నోటిలో ఉండాలని కూడా అంటారు. అర్జునుడు బాణం వేసి, అమృత జలాన్ని తాగించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ ఉపయోగించలేదు. బాణాలతో యుద్ధం చేసుకునే గ్రామం ఒకటుంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారమని అంటారు. బాబా అంటారు – వీరంతా భక్తి మార్గంలోని గురువులు. సత్యాతి-సత్యమైన సద్గురువు ఒక్కరే. సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారే అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. బ్రహ్మములో లీనమయ్యే విషయమేమీ లేదు. ఈ నాటకం తయారై ఉంది, ఈ చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయనేది ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యులకు అనగా ఆత్మలకు రచయిత అయిన తమ తండ్రి గురించి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని అంటూ స్మృతి చేసుకుంటారో, వారి గురించి తెలియదు. హద్దు తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదాన్ని చాలా గౌరవంగా పలుకుతారు. వారినే పతిత పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. ఒకవైపు వారు దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, మరోవైపు ఏదైనా దుఃఖము కలిగినప్పుడు లేదా కొడుకు మొదలైన వారెవరైనా మరణించినప్పుడు, ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అనేస్తారు. ఈశ్వరుడు మా కొడుకును తీసుకువెళ్ళిపోయారు, ఇలా ఎందుకు చేసారు! ఇక ఈశ్వరుడిని నిందిస్తారు. ఈశ్వరుడే కొడుకును ఇచ్చారని అంటారు, మరి వారు తిరిగి తీసుకున్నప్పుడు మీరెందుకు ఏడుస్తారు. ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యయుగంలో ఎప్పుడూ ఎవరూ ఏడ్వరు. ఏడ్చే అవసరమేమీ లేదని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ తన లెక్కాచారం అనుసారంగా వెళ్ళి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. జ్ఞానం లేని కారణంగా మనుష్యులు ఎంతగా ఏడుస్తారు. పిచ్చివారిలా అయిపోతారు, ఇక్కడ – తల్లి మరణించినా కానీ హల్వా తినాలి….. తండ్రి మరణించినా కానీ హల్వా తినాలి….. నష్టోమోహులుగా అవ్వాలని బాబా అర్థం చేయిస్తారు. మనకు ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లల అవస్థ ఈ విధంగా ఉండాలి. మోహజీత్ రాజు కథను కూడా విన్నారు కదా. సత్యయుగంలో ఎప్పుడూ దుఃఖపు విషయము ఉండదు, ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. మనం కాలుడిపై విజయం పొందుతామని పిల్లలకు తెలుసు. తండ్రిని మహాకాలుడని కూడా అంటారు, వారు కాలుడికే కాలుడు. మీరు కాలుడిపై విజయం పొందాలి అనగా అక్కడ మిమ్మల్ని మృత్యువు ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మను కానీ, శరీరాన్ని కానీ కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. దీనినే మృత్యువు కబళించడము అని అంటారు, అంతేకానీ మృత్యువనేది వస్తువేమీ కాదు. మనుష్యులు అచ్యుతమ్, కేశవమ్….. అని మహిమను పాడుతూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఈ 5 వికారాలు మీ బుద్ధిని ఎంతగా పాడు చేస్తాయి అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో తండ్రి గురించి ఎవరికీ తెలియదు, అందుకే దీనిని అనాథల ప్రపంచమని అంటారు. పరస్పరంలో ఎంతగా కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లు కదా. తండ్రి ప్రపంచంలోని పిల్లలందరినీ పతితుల నుండి పావనంగా చేసేందుకు వస్తారు. తప్పకుండా అర్ధకల్పం పావన ప్రపంచముండేది కదా. రామ్ రాజా రామ్ ప్రజా (రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే)… అని అంటారు. కావున అక్కడ అధర్మమనే మాట ఎలా ఉండగలదు. అక్కడ పులి-మేక కలిసి నీరు తాగుతాయని అంటారు, కావున అక్కడకు రావణుడు మొదలైనవారు ఎక్కడ నుండి వస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. బయటి వారు ఇటువంటి మాటలను విని నవ్వుకుంటారు. తండ్రి వచ్చి జ్ఞానాన్నిస్తారు, ఇది పతిత ప్రపంచం కదా. ఇప్పుడు ప్రేరణతో పతితులను పావనంగా చేస్తారా ఏమిటి! పతిత పావనా రండి అని పిలిచారు కనుక వారు తప్పకుండా భారత్ లోనే వచ్చారు. జ్ఞానసాగరుడైన నేను మిమ్మల్ని నా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారుచేసేందుకు వచ్చానని ఇప్పుడు అంటారు. తండ్రినే సత్యాతి-సత్యమైన వ్యాసుడని అంటారు. కనుక వీరు వ్యాసదేవుడు, వారి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖ దేవతలుగా అవుతారు. సుఖ వారసత్వాన్ని వ్యాసుడైన శివాచార్యుడి నుండి తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుష్యులు తికమకపడకుండా ఉండడానికి శివుని పిల్లలని అనడం జరుగుతుంది. వారి అసలు పేరు శివ. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వారే వచ్చి పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని అంటారు. అంగుష్టం వలె ఉంటారని అంటారు. అంత పెద్దగా ఉంటే ఇక్కడ (భ్రుకుటి మధ్యలో) నిలవలేరు. వారు చాలా సూక్ష్మమైనవారు. డాక్టర్లు కూడా ఆత్మను చూడడానికి చాలా తల కొట్టుకుంటారు, కానీ చూడలేరు. ఆత్మను రియలైజ్ అవ్వవచ్చు. మీరు ఆత్మను రియలైజ్ అయ్యారా అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఒక రికార్డులో నిండినట్లుగా అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. ఆత్మలైన మనం 84 జన్మలు ఎలా తీసుకుంటూ ఉంటాము అనేది మీకు తెలుసు. దీనికి అంతం లేదు. ఈ డ్రామా ఎప్పటి నుండి మొదలైందని కొందరు అడుగుతారు. కానీ ఇది అనాది డ్రామా, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. దీనిని తయారుచేయబడిన అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. ప్రపంచం గురించి కూడా మీకు తెలుసు. ఎలాగైతే చదువురాని పిల్లలను చదివిస్తారో, అలా పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఆత్మనే శరీరం ద్వారా చదువుకుంటుంది. ఇది రాతిబుద్ధి కలవారికి ఆహారము. బుద్ధికి వివేకం లభిస్తుంది. పిల్లలైన మీ కోసమే బాబా చిత్రాలను తయారుచేయించారు. ఇది చాలా సులభము. త్రిమూర్తి బ్రహ్మా, విష్ణు, శంకరుడు, ఇప్పుడు బ్రహ్మాను త్రిమూర్తి అని ఎందుకంటారు! దేవ-దేవ మహాదేవ….. అని అంటారు. ఒకరి కన్నా ఒకరు పైనున్నట్లుగా చూపిస్తారు కానీ అర్థమేమీ తెలియదు. ఇప్పుడు బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు, అటువంటప్పుడు వారు సూక్ష్మవతనంలోని దేవతగా ఎలా అవ్వగలరు. ప్రజాపిత బ్రహ్మా ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి అంటారు – నేను ఈ శరీరంలోకి ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తాను, ఇతడిని నా రథంగా చేసుకుంటాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను. ఇతను కూడా 5 వికారాలను సన్యసిస్తారు. సన్యసించే వారిని యోగులు, ఋషులు అని అంటారు. ఇప్పుడు మీరు రాజఋషులు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్త్రీ-పురుషులు కలిసి ఉంటారు. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని అంటారు. ముఖ్యమైన విషయం వికారాలకు సంబంధించినదే.

శివబాబా రచయిత అని మీకు తెలుసు. వారు కొత్త రచనను రచిస్తారు. వారు బీజరూపుడు, సత్, చిత్, ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, పాలన, వినాశనం ఎలా చేస్తారు అనేది తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలన్నింటి గురించి తెలుసు, అందుకే అందరికీ అర్థం చేయించగలరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మలు ప్రతి ఒక్కరి లెక్కాచారం ఎవరిది వారిదే, అందుకే, ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే ఏడ్వకూడదు. పూర్తి నష్టోమోహులుగా అవ్వాలి. ఒక్క అనంతమైన తండ్రి తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి.

2. బుద్ధిని పాడు చేసే 5 వికారాలను త్యాగం చేయాలి. సుఖ దేవతలుగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి. ఎవ్వరికీ దుఃఖమివ్వకూడదు.

వరదానము:-

ఏ పిల్లలైతే ఒకరి సంస్కారాలను ఒకరు తెలుసుకొని సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనే తపనతో ఉంటారో, ఎప్పుడూ కూడా ‘వీరు ఇలాగే ఉంటారు’ అని అనుకోరో, వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటూ నిర్విఘ్నంగా ఉంటారు. వారి సంస్కారాలు తండ్రి సమానంగా దయా హృదయం కలవిగా ఉంటాయి. దయా దృష్టి, ద్వేష దృష్టిని సమాప్తం చేస్తుంది. ఇటువంటి దయా హృదయం కల పిల్లలు ఎప్పుడూ పరస్పరంలో గొడవపడరు. వారు సుపుత్రులుగా అయి ఋజువునిస్తారు.

స్లోగన్:-

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు:- అఖండ జ్యోతి తత్వము సైలెన్స్ లాడ్జి మరియు సాకార ప్రపంచము ప్లే గ్రౌండ్’

ఆత్మల నివాస స్థానము అఖండ జ్యోతి మహాతత్వము, అక్కడ ఆత్మ ఈ శరీరం యొక్క పాత్ర నుండి ముక్తిగా ఉంటుంది అనగా సుఖ-దుఃఖాలకు అతీతమైన అవస్థలో ఉంటుంది, దానిని సైలెన్స్ లాడ్జి అని కూడా అంటారు మరియు ఆత్మలు శరీర సహితంగా పాత్రను అభినయించే స్థానము ప్లే గ్రౌండ్ – ఈ సాకార ప్రపంచము. కనుక ముఖ్యమైనవి రెండు ప్రపంచాలు, ఒకటేమో – నిరాకార ప్రపంచము, రెండవది – సాకార ప్రపంచము. ప్రపంచంలోని వారు కేవలం మాట వరుసకు – పరమాత్మ రచయిత, వారు పాలన చేస్తారు, సంహరిస్తారు, తినిపిస్తారు, హతమారుస్తారు, కాల్చేది కూడా వారేనని అంటారు. కనుక సుఖ-దుఃఖాలు ఇచ్చేవారు కూడా వారేనని అంటారు, ఎవరికైనా దుఃఖం కలిగినప్పుడు – ప్రభూ, మీ దయ కారణంగానే మీరు చేసే కర్మలు మధురంగా అనిపిస్తాయని అంటారు. ఇప్పుడు ఇది అయథార్థ జ్ఞానము, ఎందుకంటే ఇది పరమాత్ముని పని కాదు. పరమాత్మ దుఃఖహర్త, అంతేకానీ దుఃఖకర్త కాదు. జన్మ తీసుకోవడం, జన్మ విడిచిపెట్టడం, సుఖ-దుఃఖాలను అనుభవించడం అనేది మనుష్యాత్మలందరి సంస్కారము. శారీరిక జన్మనిచ్చేవారు తల్లిదండ్రులు, కర్మబంధనాల అనుసారంగా తండ్రి కొడుకుల సంబంధంలోకి వస్తారు. ఇదే విధంగా ఆత్మల తండ్రి పరమాత్మ, వారు అనంతమైన రచనను ఏ విధంగా స్థాపన మరియు పాలన చేస్తారు! వారు ఆ 3 రూపాలైన బ్రహ్మా, విష్ణు, శంకరుల రచయిత, తర్వాత ఈ ఆకారీ రూపాల ద్వారా దైవీ సృష్టి యొక్క స్థాపన, ఆసురీ ప్రపంచ వినాశనము మరియు దైవీ ప్రపంచ పాలనను చేయిస్తారు. పరమాత్ముని ఈ 3 కర్తవ్యాలు అనంతమైనవి. ఇకపోతే ఈ సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు అనేవి కర్మల అనుసారంగా జరుగుతాయి. పరమాత్మ సుఖదాత, వారు తమ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. అచ్ఛా – ఓంశాంతి.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top