30 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
29 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఆత్మలందరూ అనంతమైన తండ్రి వద్ద చదువుకోరని, కానీ తప్పకుండా వారితో పాటు వెళ్తారని మీకు తెలుసు”
ప్రశ్న: -
చక్రవర్తి రాజులుగా అయ్యే పిల్లలకు ఏ విషయం పట్ల చాలా-చాలా గౌరవముంటుంది?
జవాబు:-
వారికి చదువు పట్ల చాలా గౌరవముంటుంది. ఎక్కడ ఉన్నా వారు తప్పకుండా చదువుకుంటారు. చదువుతో పాటు మిత్ర-సంబంధీకులతో యుక్తియుక్తంగా సంబంధాన్ని నిర్వర్తిస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తారు మరియు అందరికీ – తండ్రిని స్మృతి చేసినట్లయితే శాంతిధామ-సుఖధామాలకు వెళ్తారనే సందేశాన్ని ఇస్తారు. ఈ శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించే పిల్లలే చక్రవర్తులుగా అవుతారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. తండ్రి, ఆత్మిక పిల్లలందరితో పాటు సృష్టిలో ఉన్న జీవాత్మలందరినీ తిరిగి తీసుకునే వెళ్ళాలి, ఎందుకంటే ఈ అంధకార రాత్రి ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. పాత ప్రపంచం పూర్తి అయి, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ప్రపంచమైతే ఉంది కానీ పాతది నుండి కొత్తదిగా అవుతుంది. సత్యయుగ ఆదిలో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు లేరు. తండ్రి అర్థం చేయిస్తారు – వారు పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశారు, ఈ సమయంలో పాత్రధారులందరూ తమోప్రధానంగా అయిపోయారు అని. రామ రాజ్యం, కొత్త ప్రపంచం కొత్త ఢిల్లీ కావాలని కోరుకుంటారు కూడా. ఎలాగైతే పిల్లలు అంటారు కదా – మాకు కొత్త వస్తువులు కావాలని, అలా ఇక్కడ కూడా – బాబా, కొత్త ప్రపంచం కోసం మాకు కొత్త వస్త్రాలు కావాలని అంటారు. దీపావళి నాడు మనుష్యులు కొత్త వస్త్రాలను ధరిస్తారు. కృష్ణ జయంతి నాడు కొత్త వస్త్రాలను ధరించాలని లేదు. ముఖ్యంగా దీపావళి నాడు కొత్త వస్త్రాలను ధరించేందుకు కొనడం మొదలైనవి చేస్తూ ఉంటారు. దీపావళి రోజున జ్యోతి వెలిగిస్తారు. ఇప్పుడు మీ జ్యోతి వెలిగి ఉంది, మీరు ఇతరుల జ్యోతిని కూడా వెలిగించాలి. వారిది భక్తి మార్గానికి సంబంధించిన దీపావళి, మీది జ్ఞానానికి సంబంధించిన దీపావళి. మీరు వస్త్రాలు మొదలైనవి మార్చాల్సిన అవసరం లేదు. మీ జ్యోతి పూర్తిగా వెలిగినప్పుడు, కొత్త ప్రపంచంలో కొత్త వస్త్రాలు లభిస్తాయి. తండ్రి అంటారు – ఎవరు వెళ్ళాలని అనుకున్నా, అనుకోకపోయినా, నేను అందరినీ తీసుకువెళ్తాను. ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. ముక్తిదాత రండి అని కూడా వారు పిలుస్తారు. కొందరు ఒక భాషలో పిలుస్తారు, కొందరు ఇంకొక భాషలో పిలుస్తారు. నేను కల్ప-కల్పం వచ్చి అందరినీ తీసుకువెళ్తాను. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. వీరంతా జీవాత్మలు. శరీరాన్ని ‘జీవం’ అని అంటారు. అలాగని – నేను ఒక ఆత్మను వదిలి మరో ఆత్మను తీసుకుంటానని జీవం అంటుందని కాదు. ఆత్మ అంటుంది – నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటాను అని. కానీ, మనం 84 జన్మలు తీసుకుంటామని కూడా ఎవ్వరికీ తెలియదు. అలాగని, అందరికీ 84 జన్మలు లభిస్తాయని కాదు. ప్రతి ఒక్కరి లెక్కలు ఎవరివి వారివి. ఎవరైతే మొదట్లో వస్తారో, వారు తప్పకుండా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ కూడా ఉంటుంది. ఈ విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు – అందరినీ అయితే చదివించను, కానీ అందరినీ తప్పకుండా తోడుగా తీసుకువెళ్తాను. డ్రామా ప్లాన్ అనుసారంగా తీసుకువెళ్ళేందుకు నేను కట్టుబడి ఉన్నాను. పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని ప్రపంచానికి తెలియదు. తండ్రి వచ్చి తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మనుష్యులకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానం కొద్దిగా కూడా లేదు. వారికి భక్తి మార్గం గురించి తెలుసు. భక్తి మార్గం యొక్క ఆచార-పద్ధతులు వేరు, జ్ఞాన మార్గం యొక్క ఆచార-పద్ధతులు పూర్తిగా వేరు. సత్యయుగం నుండి కలియుగం వరకు భక్తి మాత్రమే ఉంటుందని కాదు. జ్ఞానమంటే పగలు అని, భక్తి అంటే రాత్రి అన్న గాయనం కూడా ఉంది. అంధకార రాత్రిలో మనుష్యులు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. తండ్రి అంటారు – రాళ్ళు, రప్పల్లో కూడా వెళ్ళి నన్ను వెతుకుతారు. కొందరికి హనుమంతుని సాక్షాత్కారం జరుగుతుంది, కొందరికి గణేశుని సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు వారేమీ భగవంతుడు కాదు. నాకు నా శరీరమంటూ ఏదీ లేదు. మాయా రావణుడు అందరినీ బుద్ధూ (తెలివిహీనులు) గా తయారు చేసేసాడు. రామ రాజ్యమని దేనినంటారో కూడా భారతవాసులకు తెలియదు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఈ ప్రపంచంలో ఉండేదని కూడా తెలుసు. కేవలం రామరాజ్యం కావాలని అంటారు. రాముడంటే రఘుపతి రాముడు కాదు, వారి గురించి శాస్త్రాలలో చాలా తప్పుడు విషయాలు రాసేసారు. మనుష్యులు మృత్యువుకి ఎంతగా భయపడతారు. జీవితాన్ని రక్షించుకునేందుకు ఆశీర్వాదాలను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మరణించనున్నారు. మరి వారి గురించి ఏమంటారు! బాబా, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి – అన్న దాని కోసమే తండ్రిని పిలిచారు. శాంతిధామంలోకి శరీరాలనైతే తీసుకువెళ్ళను. అక్కడకు ఆత్మలు వెళ్తాయి. ఇది పాత ఛీ-ఛీ శరీరము. అడవికి నిప్పు అంటుకోనున్నది, అందుకే అగ్ని గోళాలను (బాంబులను) తయారుచేస్తున్నారు. ఇప్పుడు వారు – బాంబులు తయారు చేయవద్దని అంటారు. కానీ ఎవరి వద్ద అయితే ఎక్కువ బాంబులుంటాయో, వారు తప్పకుండా శక్తిశాలిగా అవుతారన్న తెలివి కూడా లేదు. బాంబులను తయారుచేయకపోతే ఇతరులు తమను తాము ఎలా రక్షించుకోగలరు? ఇప్పుడు ఉన్నవన్నీ సముద్రంలో పడేస్తే, ఇక వేరేవి కూడా తయారు చేయడం ఆపేస్తారు. కానీ సముద్రం నుండి కూడా మేఘాలు నీటిని పీల్చుకుంటాయి, ఇక వర్షం పడితే మొత్తం నష్టమైపోతుంది. పొలాలు మొదలైనవన్నీ కాలిపోతాయి, అందుకే డ్రామాలో యుక్తి రచించబడి ఉంది. ఇంతకుముందు ఈ బాంబులు ఉండేవి కావు, ఇప్పుడు వెలువడ్డాయి కనుక ఈ రాధ్ధాతాలన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నిశ్చయించబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. మీలో కూడా చాలా మందికి వినాశనం జరుగుతుందన్న దానిపై నిశ్చయం లేదు. ఒకవేళ నిశ్చయముంటే యోగం చాలా బాగా చేసేవారు. యోగబలంతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. మీదంతా గుప్తము, నేర్పించేవారు కూడా గుప్తము. ఈ కంటికి కనిపించరు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉందని ఇప్పుడు మీరు రియలైజ్ చేసుకున్నారు. ఆత్మనైన నేను అవినాశీ. ఇది అతి గుహ్యమైన విషయము. వార్తాపత్రికలలో కూడా రాసారు – శరీరంలో ఉండే ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, ఇది ఎవరైనా చెప్తే వారికి లక్షల రూపాయలు లభిస్తాయి అని. ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడ నుండి వచ్చింది? పాత్రను ఎలా అభినయిస్తుంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొందరు నీటి బుడగ వంటిదని అంటారు, కొందరు బ్రహ్మతత్వం పెద్ద జ్యోతి అని, అందులో ఆత్మలు లీనమవుతాయని అంటారు. అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ బిందు సమానమైనది అని మీకు తెలుసు. ఆత్మ పాత్రను అభినయించాలని నిర్ణయించబడి ఉంది. ఇది అనాదిగా తయారా, తయారవుతున్న డ్రామా. అది ఎప్పటికీ వినాశనమవ్వదు. ఆత్మ కూడా అవినాశీ. ఆత్మ ఆ పాత్రనే అభినయించాలి. తేడా ఉండడం అనేది జరగదు. కల్పక్రితం ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలు కూర్చొన్నాయో, వారి బుద్ధిలోనే కూర్చొంటాయి.
బాబా అంటారు – ఇంతమంది మనుష్యులను నేను ఎలా చదివిస్తాను. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకుంటారు. అందరికీ సందేశం లభిస్తుంది, తండ్రి ఈ మంత్రాన్ని అందరి కోసం ఇస్తారు. బాబా అర్థం చేయిస్తారు – పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, అవగుణాలను వదలాలి, దేహాభిమానాన్ని వదలండి అని. అయినా కూడా వదలరు. పాపం వారికి ఏమి లభిస్తుంది? పరస్పరం ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరించరు. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. తండ్రి ప్రేమసాగరుడు. మీరు కూడా వారి పిల్లలు కనుక మీరు కూడా చాలా ప్రియంగా తయారవ్వాలి. ఎప్పుడైనా, ఎవరైనా, ఎంతైనా కోపగించుకున్నా కానీ, నింద-స్తుతి మొదలైన వాటన్నింటినీ సహనం చేయాలి. ఎవరైనా దివాలా తీసినప్పుడు, బాబా వారికి సహాయం చేస్తే బాగుంటుందని పిల్లలు భావిస్తారు. అరే, ఇది మీ కర్మభోగము, దానిని మీరు సహనం చేయాలి. తండ్రి ఇందులో ఏం చేయగలరు. తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వారంతా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. భక్తి మార్గంలో భక్తులను తప్పకుండా గౌరవించాలి. శంకరాచార్యులు మొదలైనవారంతా భక్తులు. వారిని పవిత్రమైన భక్తులని అంటారు. భక్తి సంప్రదాయం ఉంది కదా. ఎవరు పవిత్రంగా ఉంటారో, వారికి పెద్ద-పెద్ద మఠాలు తయారై ఉన్నాయి. వారికి ఎంత గౌరవముంది. ధార్మిక పుస్తకాలకు కూడా చాలా మాన్యత ఉంది. వాటికి పెద్ద-పెద్ద ఉరేగింపులు చేస్తారు. భక్తికి చాలా గౌరవముంది. జ్ఞానం గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. మీరు దేవతలుగా అయినప్పుడు మీకు ఎంత మహిమ ఉంటుంది. ఏ మందిరము మొదలైన వాటికి వెళ్ళని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. ఏవో ఒక భక్తి చిహ్నాలు ఇళ్ళల్లో తప్పకుండా ఉంటాయి. ఓ భగవంతుడా – అని అనడం కూడా భక్తి మార్గమే. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు. వీరు తండ్రి, వారు దాదా – కనుక త్రిమూర్తి చిత్రం గురించి అర్థం చేయించడం చాలా మంచిది. దాదాను ఎందుకు చూపించారు అని ఎవరైనా అడిగితే, అరే, ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా అని వారికి చెప్పాలి. ఇతను వృక్షంలో క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ముఖ్యమైన వారు సదా స్థిరంగా ఉంటారు, మిగిలినవారు మారుతూ ఉంటారు. ఇందులో పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. నడవడిక చాలా రాయల్ గా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎక్కువగా మాట్లాడడం వ్యర్థము. చాలా తక్కువగా మాట్లాడండి. మీరు కూడా భక్తి మార్గంలో చాలా మాట్లాడారు, ఆర్తనాదాలు చేసారు. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థం చేయిస్తారు – కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే యోగ బలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు. నంబరువారుగా ఎవరెవరు ఏమవుతారు అనేది మున్ముందు తెలుస్తుంది. ప్రజల లెక్కను తీయరు. వారు లక్షల్లో, కోట్లలో ఉంటారు. ఎవరు బ్రాహ్మణులుగా అవుతారో, వారే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. మున్ముందు చాలా స్మృతి చేయడం మొదలుపెడతారు. ఎప్పుడైతే మృత్యువు ఎదురుగా వస్తుందో, అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. ఆత్మలందరూ లెక్కలను సమాప్తం చేసుకుని వెళ్తారు. దీనినే వినాశన సమయమని అంటారు. ఈ శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగనున్నాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడింది. ఇది కొత్త విషయమేమీ కాదు. కరువు కారణంగా మనుష్యులు ఆకలితో మరణిస్తారు.
నా పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారని తండ్రికి తెలుసు. అందరినీ దుఃఖం నుండి విడిపించి తిరిగి తీసుకువెళ్తాను. తండ్రి అంటారు – వీరంతా పరస్పరం గొడవపడతారు, తర్వాత వెన్న మీకు లభిస్తుంది. పూర్తి విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. నోట్లో చంద్రుని సాక్షాత్కారం చేసుకునేవారు కదా! నోటిలో ఈ విశ్వ గోళమంతా వచ్చేస్తుంది. మీరు రాకుమార- రాకుమారీలుగా అవుతారు. పూర్తి సృష్టి అంతా మీ గుప్పిట్లో ఉన్నట్లుగా ఉంది. నోట్లో మరియు గుప్పిట్లో కూడా ఉన్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు స్వర్గ గోళం మీ నోట్లో ఉంది. మీకు తెలుసు – యోగబలంతో మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా సంపద లభిస్తుంది. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. కానీ పిల్లలకు చదువు పట్ల అంత గౌరవం లేదు. ట్రాన్స్ ఫర్ అయినా కానీ, తండ్రి అంటారు – ఎక్కడ ఉన్నా తప్పకుండా చదువుకోండి. పవిత్రంగా ఉండండి, ఆహార-పానీయాలను శుద్ధంగా ఉంచుకోండి. అందరితో సంబంధాలను యుక్తియుక్తంగా కూడా నిర్వర్తించాలి. ఈ ప్రపంచం దుఃఖమిచ్చేది. ముఖ్యమైనది కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. దానిని కూడా అతి కష్టంగా విడిచిపెడతారు. ఏదైనా అంటే ద్రోహులుగా అయిపోతారు. అబలలపై ఎన్ని విఘ్నాలు ఏర్పడతాయి. ఈ ఆర్య సమాజం వారు ఇప్పుడు వచ్చారు. ఇది చివర్లో వచ్చే రెమ్మ. వారు దేవతలను ఒప్పుకునేవారు కాదు. మహావీర్ అనేది హనుమంతుని పేరు, వారు ధైర్యాన్ని చూపించారు. జైనులు కూడా మహావీర్ అన్న పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు దాని అర్థాన్ని మీరు తెలుసుకున్నారు. పిల్లలైన మీరు కూడా మహావీరులే, మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు. ఇది పూర్తిగా యోగ బలానికి సంబంధించిన విషయము. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. దాని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత మళ్ళీ శాంతి, సుఖంలోకి వెళ్తారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఈ స్థాపన చాలా అద్భుతమైనది. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. లోలోపల ఏ వికారాలు ఉండకూడదు. తండ్రి ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మనే వికారీగా అవుతుంది. అన్నీ ఆత్మనే చేస్తుంది. కనుక ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించాలి. సద్గురువు సమ్ముఖంలో ఉంటూ, వారిని నిందించినట్లయితే, నిలవడానికి నీడ కూడా లభించదు. ఏదైనా పాపం చేయడం కూడా నింద చేసినట్లే. టీచర్ మతం అనుసారంగా నడుచుకోకపోతే, నిలవడానికి నీడ లభించదు, ఫెయిల్ అయిపోతారు. టీచర్ యొక్క శిక్షణలను తీసుకుంటూ ఉంటే పాస్ విత్ ఆనర్ గా (గౌరవయుక్తంగా పాస్) అవుతారు. అవి హద్దు విషయాలు. ఇవి అనంతమైన విషయాలు. భగవంతుడు ఎవరు అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మాయ కూడా సతో, రజో, తమోగా ఉంటుంది. ఇప్పుడు మాయ కూడా తమోప్రధానంగా అయిపోయింది. ఏమేం చేస్తూ ఉన్నారో చూడండి. మనం ఎవరిని కాలుస్తాము అనేది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఏమి జరిగినా డ్రామానుసారంగానే జరుగుతుంది. యాదవుల ప్లాన్, కౌరవుల ప్లాన్ మరియు పాండవుల ప్లాన్…. వారు ఏమేమి చేస్తున్నారు. పాండవులకు ఉన్నతోన్నతమైన ప్లాన్ తెలిపేవారు తండ్రి. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం జరగనున్నది. అతి ప్రియమైన తండ్రి నుండి అతి ప్రియమైన పిల్లలైన మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తానని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. అందరూ పరమాత్మలేనని వారంటారు. అటువంటప్పుడు, ఇలా ఎలా అనగలరు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవరికీ తెలియదు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వినాశనం జరగనున్నది అని తెలుసుకొని పూర్తిగా శ్రీమతాన్ని అనుసరించాలి. స్మృతి బలంతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునే పురుషార్థం చేయాలి, తమ వెలిగి ఉన్న జ్యోతితో అందరి జ్యోతిని వెలిగించి సత్యమైన దీపావళిని జరుపుకోవాలి.
2. నింద-స్తుతి అన్నింటినీ సహనం చేస్తూ తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. చాలా తక్కువగా మాట్లాడాలి.
వరదానము:-
ఏ కార్యంలోనైనా సఫలతను ప్రాప్తించుకోవాలంటే, ముందు స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. సమర్థత వచ్చిందంటే మాయను ఎదుర్కోవడం సహజమైపోతుంది. ఎలాంటి స్మృతి ఉంటే, అలాంటి స్వరూపం తయారవుతుంది, అందుకే – ఈ ఈశ్వరీయ జన్మలో ఉన్నంత వరకు ప్రతి సెకెండు, ప్రతి సంకల్పం, ప్రతి కార్యం చేస్తూ ఈశ్వరీయ సేవలో ఉన్నాను అనే శక్తిశాలి స్మృతి సదా ఉండాలి. ఇది మన ఈశ్వరీయ కులము, ఈ స్మృతి అనే సీటు అన్ని బలహీనతలను సమాప్తం చేస్తుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!