28 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
27 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఆలస్యంగా వచ్చినా, వేగముగా పురుషార్థం చేసినట్లయితే చాలా ముందుకు వెళ్ళగలరు. ఇతరుల చింతను వదిలి మీ పురుషార్థంలో నిమగ్నమవ్వండి”
ప్రశ్న: -
మనుష్యమాత్రులెవ్వరూ చేయలేని ఏ కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేయగలరు?
జవాబు:-
మనుష్యులను దేవతలుగా తయారుచేయడము, వారిని శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా చేయడము, ఈ కర్తవ్యము ఒక్క తండ్రిది మాత్రమే. ఇది మనుష్యులెవ్వరూ చేయలేరు. మేము సంగమంలోనే భగవానువాచ వింటాము – అని మీకు నిశ్చయముంది. ఇప్పుడు స్వయంగా భగవంతుడే కల్పం క్రితం వలె రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు – ఈ ఒక్కొక్క అక్షరము లేక జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువైనది. పరమాత్మను రూప్-బసంత్ అని కూడా అంటారని తండ్రి అర్థం చేయించారు. వారికి రూపము కూడా ఉంది. వారి నామము శివబాబా. వారు జ్ఞానసాగరుడు. ఆ జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. జ్ఞానము ధనము, అలానే జ్ఞానము చదువు కూడా. ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇస్తారు. ఆత్మను – స్పిరిచ్యుల్ రూహ్ అని అంటారు. భక్తి మార్గంలో ఆత్మలు తండ్రిని కలుసుకునేందుకు ఎంతగానో భ్రమిస్తారు. వారి కోసం వెతుకుతారు. భగవంతుడు ఒక్క శివుడేనని భావిస్తారు కానీ ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – ఆత్మిక పిల్లలూ, మీరు అవినాశీ, పరంధామ నివాసులు, అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. మీరు దూరదేశ నివాసులు. ఇది డ్రామా. దీని పేరు గెలుపు-ఓటముల ఆట, సుఖ-దుఃఖాల ఆట. తండ్రి అర్థం చేయిస్తారు – నేను, మీరు అందరము శాంతిధామ నివాసులము. దానిని నిర్వాణధామమని కూడా అంటారు. ముందుగా – మేము అక్కడి నివాసులము అని నిశ్చయం ఏర్పరచుకోవాలి. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. బిందువైన ఆత్మలో మొత్తం అవినాశీ పాత్ర నిండి ఉంది. తండ్రి మిమ్మల్ని మాత్రమే చదివిస్తారు. మీరు ప్రపంచంలోని మనుష్యుల గురించి చింతిస్తూ ఉంటారు. భగవానువాచ సంగమంలోనే ఉంటుందని, ఇంకెప్పుడూ ఉండదని మీకు నిశ్చయముంది కదా. మనుష్యులను దేవతలుగా ఎవ్వరూ తయారుచేయలేరు. శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా ఎవ్వరూ చేయలేరు. కల్పక్రితం కూడా తండ్రియే తయారుచేసారు. ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంటుగా అయ్యారో, 5000 సంవత్సరాల తర్వాత కూడా వారే అవుతారు. మొత్తం ప్రపంచంలోని దృశ్యాలన్నీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి. వృద్ధ మాతలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేయలేరు కనుక వారికి కేవలం 3 విషయాలను స్మృతి చేయమని చెప్తారు – ఆత్మనైన నేను శాంతిధామ నివాసిని, తర్వాత సుఖధామంలోకి వస్తాను, మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో, అప్పుడు వికారులుగా అవుతాము. దీనిని దుఃఖధామమని అంటారు. ఎప్పుడైతే దుఃఖధామము పూర్తి అవుతుందో, అప్పుడు – నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు నేను రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వచ్చి తండ్రికి చెందినవారిగా అయ్యారో, వారే వారసత్వాన్ని పొందుతారు. ఈ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది. కోట్లాది మంది మనుష్యులు వచ్చి తండ్రి నుండి ఎంతో కొంత వింటారు, అర్థం చేసుకుంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరు అన్ని వైపులకు వెళ్ళి అర్థం చేయించాల్సి ఉంటుంది. వార్తాపత్రికల ద్వారా కూడా చాలా మంది వింటారు. పాకిస్థాన్ లో కూడా వార్తాపత్రికల ద్వారా చదువుతారు. అక్కడ కూర్చొని కూడా ఈ జ్ఞానాన్ని వింటారు. మొత్తం ప్రపంచంలో గీతకు చాలా ప్రచారముంది. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ విధంగా రాయబడిన విషయాలను వార్తాపత్రికల్లో చదువుతారు. అలా కూడా చాలా మంది బ్రాహ్మణులుగా అవుతారు. ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందో, వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. ఇప్పుడింకా కొద్ది సమయమే ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆలస్యంగా వచ్చినట్లయితే వేగంగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. కల్ప క్రితము ఎంతమంది స్వర్గవాసులుగా అయ్యారో, ఇప్పుడు కూడా అంతమంది తప్పకుండా అవుతారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. శాంతిధామము వారు శాంతిధామానికి వెళ్తారు. మళ్ళీ తమ-తమ సమయాలలో పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇంటికి చేరుకుంటారు. సన్యాసులు ముక్తి కోసం తల బాదుకుంటూ ఉంటారు కావున ముక్తియే మంచిదని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. సుఖాన్ని కాకి రెట్టతో సమానమని అంటారు. సత్యయుగంలో కూడా దుఃఖపు విషయాలున్నట్లుగా శాస్త్రాలలో రాసేసారు. ఏమీ అర్థము చేసుకోరు. పరమాత్మకు రావాల్సి ఉంటుందని అంటారు. పతితపావన పరమాత్మ రండి, వచ్చి మాకు మార్గాన్ని తెలియపరచండి అని పిలుస్తారు. మరొకవైపు పతిత పావని గంగ అని, గంగా స్నానాలు, యజ్ఞతపాదులు, యాత్రలు, ఇవన్నీ భగవంతుడిని చేరుకునేందుకు మార్గాలని చెప్తారు. పరమాత్ముడిని పిలుస్తున్నప్పుడు ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు! ఇదంతా భక్తి మార్గంలో నిశ్చయించబడింది. మనుష్యులకు ఏది తోస్తే, అది మాట్లాడుతూ ఉంటారు. పరమాత్మను కలుసుకునేందుకు ఎంతగా శ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడిని కలుసుకునేందుకు భక్తులు వెళ్తారా లేక భగవంతుడికి ఇక్కడికి రావాల్సి ఉంటుందా? పతిత ఆత్మలు వెళ్ళలేరు. తండ్రియే మనల్ని తీసుకువెళ్ళేందుకు వస్తారు. సర్వాత్మలకు పండా (మార్గదర్శకుడు) ఒక్కరే. మీరు కూడా పవిత్రమై వారి వెనుక వెళ్తారు. ప్రియతముడు మిమ్మల్ని మహరాజు-మహారాణులుగా తయారుచేసేందుకు జ్ఞాన రత్నాలతో అలంకరిస్తారు. కృష్ణుడి గురించి – వారు ఫలానా వారిని ఎత్తుకుపోయారని, పట్టపు రాణులుగా చేసుకున్నారని చూపిస్తారు. ఈ విషయాలు కృష్ణునికి అన్వయించవు. మనము స్వర్గానికి మహారాణులుగా అవుతామని మీకు తెలుసు. మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి అలా తయారుచేసేందుకు వచ్చారు. ఇది 84 జన్మల విషయము. 84 లక్షల జన్మలనైతే ఎవరూ గుర్తు చేసుకోలేరు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు, త్రేతాయుగానికి తక్కువగా చూపించారు. ఇలా అయితే లెక్క సరిపోదు. తండ్రి ఎంతో సహజం చేసి అర్థం చేయిస్తారు. కేవలం రెండు విషయాలను గుర్తుంచుకోవాలి – అల్ఫ్ (భగవంతుడు), బే (రాజ్యాధికారం). అప్పుడు మీరు పవిత్రంగా కూడా అవుతారు, ఎగురగలుగుతారు, అంతేకాక ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఎలాగైనా సరే తండ్రిని స్మృతి చేయాలి అనే చింతను పెట్టుకోవాలి. మాయా తుఫాన్లు కూడా వస్తాయి కానీ ఓడిపోకూడదు. ఎవరైనా క్రోధం చేసినా కానీ, మీరు ఏమీ మాట్లాడకండి. సన్యాసులు కూడా – నోటిలో తాయత్తును వేసుకోండి, అప్పుడు వారు మాట్లాడి-మాట్లాడి ఆగిపోతారు అని అంటారు. తండ్రి కూడా అంటారు – ఎవరైనా క్రోధంతో మాట్లాడితే, మీరు శాంతిగా ఉంటూ చూస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు శివబాబాను స్మృతి చేయాలి. శివబాబా స్మృతితోనే వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. మీ అతీంద్రియ సుఖము గురించి గాయనముంది – మేము 21 జన్మల కోసం స్వర్గంలో రాకుమార్తెలుగా అవుతాము అని. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. మీరు 50-60 జన్మలు సుఖాన్ని అనుభవిస్తారు. సుఖము లెక్క ఎక్కువ ఉంటుంది. సుఖ-దుఃఖాలు సమానంగా ఉంటే లాభమేముంది? మీ వద్ద ధనము కూడా చాలా ఉంటుంది. ఇక్కడ కూడా కొంత కాలం క్రితం ధాన్యము చాలా చవకగా ఉండేది. రాజులకు ఎంతో పెద్ద రాజ్యాలుండేవి. బాబా పది అణాలకు ఒక మణుగు జొన్నలను అమ్మారు. మరి దానికంటే ముందు ఇంకెంత చౌకగా ఉండి ఉంటుంది. మనుష్యులు చాలా తక్కువ మంది ఉంటారు. భోజనం గురించిన చింత ఉండదు. మనము ముందు ఇంటికి వెళ్ళి, ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి కొత్త పాత్రను అభినయిస్తాము అనే స్మృతి ఇప్పుడు ఉండాలి. అక్కడ మన శరీరం కూడా సతోప్రధాన తత్వాలతో తయారవుతుంది. ఇప్పుడు 5 తత్వాలు పూర్తిగా తమోప్రధానంగా, పతితంగా అయ్యాయి. ఆత్మ మరియు శరీరం, రెండూ పతితముగా ఉన్నాయి. అక్కడ శరీరం రోగగ్రస్థమవ్వదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలకు ఇక్కడ బాగా అర్థం చేయిస్తారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఇక్కడ మేఘాలను నింపుకొని ఎంతో సంతోషిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళి అంతా మర్చిపోతారు. ఇంతకుముందు రాస-విలాసాలు చాలా జరుగుతూ ఉండేవి. తర్వాత అవన్నీ ఆపివేసారు. మనుష్యులు, ఇదొక ఇంద్రజాలమని భావించేవారు. భక్తిలో నవ విధ భక్తి చేసినప్పుడు, వారికి అతి కష్టం మీద సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ భక్తి విషయమే లేదు. కూర్చుని-కూర్చునే సాక్షాత్కారాలలోకి వెళ్ళిపోయేవారు, కావుననే దీనిని ఒక ఇంద్రజాలముగా భావించేవారు.
ఈ రోజుల్లో ప్రపంచంలో ఎంత మంది భగవంతులుగా పిలవబడుతున్నారు. సీతారామ్, రాధాకృష్ణ మొదలైన పేర్లు పెట్టుకుంటారు. ఆ స్వర్గాధిపతులు ఎక్కడ, ఈ నరకవాసులు ఎక్కడ. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మెట్ల చిత్రంలో స్పష్టంగా చూపించారు. మెట్ల చిత్రాన్ని పిల్లలు తమ విచార సాగర మథనంతో తయారుచేసారు. బాబా దానిని చూసి సంతోషించారు. మెట్ల చిత్రంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ద్వాపరం నుండి వికారీ రాజులు ఏ విధంగా భక్తి చేస్తూ-చేస్తూ కిందికి వచ్చేసారో, అది అందులో చూపించబడింది. ఇప్పుడైతే ఏ కిరీటము లేదు. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజము. 84 జన్మలలో దిగే కళ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎక్కే కళ ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రం ద్వారా అర్థం చేయించవచ్చు. మీ ఎక్కే కళ ద్వారా సర్వుల మేలు జరుగుతుందని అంటూ ఉంటారు కూడా. తండ్రి వచ్చి అందరికీ సుఖాన్నిస్తారు. ఓ బాబా, మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని అందరూ పిలుస్తారు కానీ దుఃఖాన్ని ఎలా హరిస్తారు, సుఖము ఎలా లభిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు.
ఈ రోజుల్లో మనుష్యులు గీతను కంఠస్థం చేసి వినిపిస్తారు. దాని అర్థాన్ని సార రూపంలో తెలియజేస్తారు. సంస్కృతంలో శ్లోకాలను కంఠస్థం చేసి వినిపిస్తారు, అప్పుడు ఫలానా మహాత్మ చాలా మంచివారని అంటారు. లక్షలాది మంది మనుష్యులు వెళ్ళి వారి పాదాలకు నమస్కరిస్తారు. ఆ చదువులో (లౌకిక చదువులో) 15-20 సంవత్సరాలు పడుతుంది. వారిలో ఎవరైనా వివేకవంతులు ఉన్నట్లయితే వెంటనే కంఠస్థం చేసి వినిపించడం మొదలుపెడతారు. అప్పుడు వారి వద్ద చాలా ధనం పొగవుతుంది. ఇవన్నీ సంపాదనకు మార్గాలు. ఎవరైనా దివాలా తీసినప్పుడు, వెళ్ళి సన్యాసాన్ని ధారణ చేస్తారు. అప్పుడు అన్ని చింతలు దూరమైపోతాయి. తర్వాత ఏవో కొన్ని మంత్ర-తంత్రాలను కంఠస్థం చేస్తారు, ఇక తిరుగుతూ ఉంటారు. రైలులో కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి మరియు ఆత్మలు, అందరూ నిరాకార ప్రపంచంలో ఉంటారు. అక్కడి నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు నాటకం పూర్తి అవ్వనున్నది. మీరు తమోప్రధానంగా అయిన కారణంగా తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సతోప్రధానంగా చేసేందుకు వచ్చారు. అందరూ తమ ఇంటికి వెళ్తారు. ఇకపోతే, స్వర్గంలో కేవలం దేవీ-దేవతల రాజ్యముంటుంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము… ఇవి ఎప్పుడెప్పుడు ఉండేవి అనేది కూడా ఎవరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే గాఢాంధకారంలో ఉన్నారు. కలియుగాంతము దాదాపు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతుందని భావిస్తారు. ఎటువంటి లెక్క ఉండదు. మనుష్యులు పెరుగుతూ ఉంటారు. భోజనము లభించదు. ఇంకా 40 వేల సంవత్సరాలుంటే, ఇక ఎలా ఉంటుందో తెలియదు. వారు మాట్లాడేదంతా పూర్తిగా అసత్యము. సత్యమనేది ఇసుమంత కూడా లేదు. ఇప్పుడు రావణునిపై ఎలా విజయాన్ని పొందాలి అన్నదానిని తండ్రి నేర్పిస్తారు. మీరే రావణునిపై విజయం పొందుతారు. మొత్తం ప్రపంచాన్ని రావణుని నుండి విడిపిస్తారు. మీది శక్తి సైన్యము. మీరు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు. ఎంత మంచి-మంచి విషయాలను అర్థం చేయిస్తారు! కనుక మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉండాలి. జ్ఞాన మార్గంలో చాలా సంతోషముంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచం నుండి ఇక వెళ్ళిపోయినట్లే. బాబాను స్మృతి చేయడం ద్వారా సతోప్రధానంగా అవుతారు. లేకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రొట్టెముక్క లభించవచ్చు. దీని వలన లాభమేముంటుంది? ఎంత వీలైతే అంత, మీ పురుషార్థాన్ని చేయాలి. శ్రీమతాన్ని అనుసరించాలి. అడుగడుగులో బాబా నుండి సలహా తీసుకోవాలి. బాబా, వ్యాపారంలో అసత్యము చెప్పాల్సి వస్తుందని కొందరు అంటారు. బాబా అంటారు – వ్యాపారంలోనైతే అసత్యము ఉండనే ఉంటుంది, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికారాలలోకి వెళ్ళి, నేను తండ్రి స్మృతిలో ఉన్నానని చెప్పటం కాదు. వికారాలలోకి వెళ్ళారు అంటే చనిపోయినట్లే. తండ్రితో ప్రతిజ్ఞ చేసారు కదా. పవిత్రత కోసమే రాఖీ కట్టడం జరుగుతుంది. క్రోధము కోసమెప్పుడూ రాఖీ కట్టడం జరగదు. రాఖీ బంధనము యొక్క అర్థమే – వికారాలలోకి వెళ్ళకూడదు అని. మనుష్యులు, పతితపావనా రండి అని పిలుస్తారు.
పిల్లలైన మీలో చాలా సంతోషముండాలి – తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, తర్వాత వారితో పాటు తీసుకువెళ్తారు. అక్కడి నుండి స్వర్గంలోకి వెళ్తాము. ఎంత వీలైతే అంత ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేయడం అనగా సంపాదన చేసుకోవడం. ఇందులో ఆశీర్వదించేది ఏముంది. మీరు ఆశీర్వదించినట్లయితే మేము స్మృతి చేస్తామని అనకూడదు. అందరినీ ఆశీర్వదిస్తే అందరూ స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడైతే శ్రమ చేయాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అనగా వారసత్వము. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా రాజ్యము లభిస్తుంది. స్మృతితో చాలా లాభముంటుంది. ఇది సులువైన వ్యాపారము. ఇలాంటి సులువైన వ్యాపారాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. దీనిని కూడా ఎవరో అరుదుగానే తీసుకుంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడైనా, ఎవరైనా క్రోధం చేస్తే చాలా-చాలా శాంతంగా ఉండాలి. క్రోధం చేసేవారితో పాటు మీరు కూడా క్రోధం చేసేవారిగా అవ్వకూడదు. మాయ యొక్క ఏ తుఫానుతోనూ ఓడిపోకూడదు.
2. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. తమ సంపాదనను జమ చేసుకోవాలి. పవిత్రత యొక్క పక్కా రాఖీని కట్టుకోవాలి.
వరదానము:-
నిరంతరం యోగయుక్తంగా ఉండేందుకు కమలపుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండండి. కానీ ఎవరైతే లైట్ గా ఉంటారో, వారే కమల ఆసనంపై సదా స్థితులై ఉండగలరు. ఏ విధమైన భారము అనగా బంధనము ఉండకూడదు. మనసులోని సంకల్పాల భారము, సంస్కారాల భారము, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ వలన కలిగే భారము, లౌకిక సంబంధీకుల మమకారం వలన కలిగే భారము మొదలైనవి ఉండకూడదు. ఎప్పుడైతే ఈ భారాలన్నీ సమాప్తమవుతాయో, అప్పుడు కమల ఆసనంపై విరాజమానమయ్యే నిరంతర యోగులుగా అవ్వగలరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!