28 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

28 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

27 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇది పురుషోత్తములుగా తయారయ్యేటువంటి సంగమయుగము, ఈ యుగంలో ఎటువంటి పాప కర్మలు చేయకూడదు”

ప్రశ్న: -

సంగమంలో పిల్లలైన మీరు అన్నింటికన్నా గొప్ప పుణ్యం ఏమి చేస్తారు?

జవాబు:-

స్వయాన్ని తండ్రికి అర్పించడము అనగా సంపూర్ణంగా స్వాహా అవ్వడము, ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్యము. ఇప్పుడు మీరు మమకారాన్ని తొలగించుకుంటారు. పిల్లలు, ఇళ్ళు-వాకిళ్ళు అన్నింటినీ మర్చిపోతారు, ఇదే మీ వ్రతము. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

దీపం పురుగులు ఎందుకు కాలిపోవు….. (జలే న క్యూ పర్వానా…..)

ఓంశాంతి. భక్తి మార్గంలో తండ్రికి ఈ విధంగా మహిమ చేస్తారు. ఇది దీపం కోసం దీపం పురుగులు చేసే మహిమ, తండ్రి వచ్చినప్పుడు జీవించి ఉండగానే వారికి చెందినవారిగా ఎందుకు అవ్వకూడదు. జీవిస్తూ మరణించడమంటే దత్తత తీసుకోబడడమని అర్థము. ఇంతకుముందు మీరు ఆసురీ పరివారానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా అయ్యారు. జీవించి ఉండగానే ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, దీనినే శరణాగతి అని అనడం జరుగుతుంది. నేను మీ శరణులోకి వచ్చాను… అని పాడుతారు కదా. ఎప్పుడైతే ప్రభు వచ్చి, వారి శక్తిని చూపిస్తారో, సత్తాను చూపిస్తారో, అప్పుడే వారి శరణు లభిస్తుంది. వారే సర్వశక్తివంతుడు కదా. వారిలో ఆకర్షణ కూడా తప్పకుండా ఉంది కదా. అన్నింటినీ విడిపిస్తారు. ఎవరైతే నిజంగా తండ్రికి పుత్రులు మరియు పుత్రికలుగా అవుతారో, వారు ఆసురీ సంప్రదాయ సంబంధాలతో విసిగిపోతారు. బాబా, ఈ సంబంధాలు ఎప్పుడు దూరమవుతాయి అని అడుగుతారు. ఇక్కడ ఈ పాత సంబంధాలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఆత్మ దేహం నుండి వేరైనప్పుడు బంధనాలు సమాప్తమవుతాయి. అందరికీ మృత్యువు ఉంటుందని మరియు ఇవన్నీ వికారీ బంధనాలన్నీ ఈ సమయంలో మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలు నిర్వికారీ సంబంధాలను కోరుకుంటున్నారు. ముందు నిర్వికారీ సంబంధాలలో ఉండేవారు, తర్వాత వికారీ సంబంధాలలోకి వచ్చారు, మళ్ళీ మనకు నిర్వికారీ సంబంధాలు ఉంటాయి. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. మనం ఆసురీ బంధనాల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఒక్క తండ్రితో యోగం జోడించడం జరుగుతుంది. అటు వైపు ఒక రావణుడు ఉన్నాడు, ఇటు వైపు ఒక రాముడు ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. రామరాజ్యం కావాలని అంటారు కూడా, కానీ ప్రపంచమంతా రావణ రాజ్యంలో ఉందని ఎవరూ అర్థం చేసుకోరు. రామరాజ్యంలో పవిత్రత, సుఖ-శాంతులు ఉండేవి. అవి ఇప్పుడు లేవు. వారు ఏదైతే చెప్తారో, దానిని అనుభూతి చేయరు. ఈ ఆత్మలందరూ సీతలని అంటూ ఉంటారు. ఇది ఒక్క సీత విషయం కాదు, అలాగే ఒక్క అర్జునుడు లేక ఒక్క ద్రౌపది విషయం కాదు. ఇది అనేకుల విషయము. ఉదాహరణగా ఒక్కరిని చూపిస్తారు. మీరంతా అర్జునుడి వలె ఉన్నారని మీకు కూడా చెప్పడం జరుగుతుంది. అర్జునుడే, ఈ భగీరథుడయ్యారని మీరంటారు. తండ్రి అంటారు – నేను ఈ సాధారణ వృద్ధ తనువును రథముగా తీసుకుంటాను. వారేమో చిత్రాలలో గుర్రాల రథాన్ని చూపించారు, దీనిని అజ్ఞానమని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని పిల్లలు అర్థం చేసుకుంటారు. 7 రోజులు కోర్సు తీసుకోనంతవరకు ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. భక్తి వేరు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని అంటారు. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యం సత్యమైనదేమీ కాదు, వారు అడవులకు వెళ్ళి, తర్వాత వచ్చి పట్టణాలలో నివసిస్తూ పెద్ద-పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు. మేము ఇళ్ళు-వాకిళ్ళను వదిలేశామని కేవలం మాట వరుసకు అంటారు. మీది మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యము. ఇది యథార్థమైన విషయము, అది హద్దు విషయము కావున దానిని హఠయోగమని, హద్దు వైరాగ్యమని అంటారు.

ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు, కావున తప్పకుండా దీని పట్ల వైరాగ్యం కలగాలి. కొత్త ఇల్లు తయారైతే పాత ఇంటిని పడగొట్టడం జరుగుతుందని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా వస్తుంది. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. మీది పురుషోత్తమ యుగము. పురుషోత్తమ మాసంలో దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వాన్ని స్వాహా చేస్తారు. ఈ ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నదని మీకు తెలుసు. కావున ప్రపంచంలోని సర్వస్వము స్వాహా అయ్యే కన్నా ముందే మనం స్వయాన్ని ఎందుకు స్వాహా చేసుకోకూడదు. ఇలా చేస్తే మీకు ఎంత పుణ్యం లభిస్తుంది. అది హద్దులోని పురుషోత్తమ మాసం కానీ ఇది అనంతమైన విషయము. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటారు, వ్రతాలు-నియమాలు ఆచరిస్తారు. మీదైతే చాలా భారీ వ్రతము. మీకు పిల్లలు, ఇళ్ళు-వాకిళ్ళు మొదలైనవి ఉన్నాయి కానీ మనసులో నుండి మమకారం తొలగిపోయింది. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే. ఇదంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. మనం పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రికి చెందినవారిగా అయ్యాము. సర్వ పురుషులలో అనగా మనుష్యులందరిలో ఉత్తమ పురుషులైన ఈ లక్ష్మీ-నారాయణులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరి కన్నా ఉత్తమమైన మనుష్యులు ఇంకెవరూ ఉండరు. లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మీరు వీరి వలె పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. మనుష్యమాత్రులందరూ సద్గతిని పొందుతారు. మనుష్యాత్మలు పురుషోత్తమంగా అయినప్పుడు వారు నివసించే స్థానం కూడా ఉత్తమంగా ఉండాలి. ఉదాహరణకు ప్రెసిడెంట్ అందరికన్నా ఉన్నత పదవిలో ఉన్నారు కావున వారు నివసించేందుకు రాష్ట్రపతి భవన్ లభించింది. అక్కడ ఎంత పెద్ద మహల్, ఉద్యానవనం మొదలైనవి ఉన్నాయి. ఇది ఇక్కడి విషయము. రామరాజ్యం గురించి మీకు తెలుసు. మీరు సత్యయుగీ పురుషోత్తములుగా అవుతారు, అప్పుడిక ఈ కలియుగీ పురుషోత్తములు ఉండరు. మీరు సత్యయుగీ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మన మహళ్ళు ఎలా తయారై ఉంటాయి అనేది మీకు తెలుసు. రేపు రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యంలో మీరు పురుషోత్తములుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని పరివర్తన చేసి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తామని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసారు కావున ఒకరినొకరు – భవిష్య 21 జన్మలకు పురుషోత్తములుగా తయారుచేయాలి. సర్వగుణ సంపన్నులు….. అహింస పరమో దేవీ-దేవతా ధర్మము అని దేవతల మహిమను పాడుతారు. ఇది మీకు తెలుసు, ఇతర మనుష్యులెవరికీ తెలియదు. మీరు మరుసటి జన్మలో పురుషోత్తములుగా అవుతారు, అప్పుడిక ఈ రావణ రాజ్యానికి చెందినవారెవరూ ఉండరు. ఇప్పుడు మీకు జ్ఞానమంతా ఉంది. ఇప్పుడిక రావణ రాజ్యం సమప్తమవ్వనున్నది. ఈ రోజుల్లో సమయంపై ఎటువంటి నమ్మకం లేదు, అకాల మృత్యువు జరుగుతుంది లేదా ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడితే వారిని అంతం చేస్తారు. మిమ్మల్ని ఎవరూ అంతం చేయలేరు, మీరు అవినాశీ పురుషోత్తములు, ఇక్కడ రావణ రాజ్యంలో ఉన్నవారు వినాశీ. వీరికి మీ దైవీ-రాజ్యం గురించి తెలియదు. మనం శ్రీమతం అనుసారంగా మన దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరికైతే పూజ జరుగుతుందో, వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారని మీకు తెలుసు. జగదంబకు ఎంతగా పూజ జరుగుతుందో చూడండి. ఇప్పుడు వీరు జ్ఞాన-జ్ఞానేశ్వరి. మీరు జగదంబకు కుమార్తెలు, మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరి మరియు రాజ-రాజేశ్వరి. ఇరువురిలో ఉత్తములు ఎవరు? జ్ఞాన-జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలను వినిపిస్తారు. అనేక వస్తువులను అడుగుతారు. జగదంబ మందిరానికి మరియు లక్ష్మీ-నారాయణుల మందిరానికి చాలా తేడా ఉంది. జగదంబ మందిరం చాలా చిన్నది. చిన్న స్థలంలో మనుష్యులు గుంపును ఇష్టపడతారు. శ్రీనాథ మందిరంలో కూడా చాలా గుంపు ఉంటుంది. వారిని తప్పించేందుకు వస్త్రం యొక్క కర్రతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరం ఎంత చిన్నది, లోపల చాలా నూనె మరియు నీళ్ళు ఉంటాయి. లోపలకు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా గుంపు ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరం చాలా పెద్దగా ఉంటుంది. జగదంబ మందిరం చిన్నదిగా ఎందుకుంటుంది? ఆమె పేదవారు కదా. కావున మందిరం కూడా పేదగానే ఉంటుంది. వారు (లక్ష్మీ-నారాయణులు) షావుకార్లు కావున మందిరంలో ఎప్పుడూ మేళాలు జరగవు. జగదంబ మందిరం వద్దన చాలా మేళాలు జరుగుతాయి. బయట నుండి చాలా మంది వస్తారు. మహాలక్ష్మి మందిరం కూడా ఉంది, ఇందులో లక్ష్మీ మరియు నారాయణుడు, ఇరువురూ ఉన్నారని మీకు తెలుసు. వీరిని కేవలం ధనం మాత్రమే అడుగుతారు ఎందుకంటే వీరు ధనవంతురాలిగా అయ్యారు కదా. ఇక్కడ అవినాశీ జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ధనం కోసం లక్ష్మి వద్దకు వెళ్తారు, మిగిలిన కోరికలు ఎన్నో పెట్టుకొని జగదంబ వద్దకు వెళ్తారు. మీరు జగదంబకు పిల్లలు. మీరు 21 జన్మల కోసం అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. ఒకే మహా మంత్రంతో మనోకామనలన్నీ 21 జన్మల కోసం పూర్తవుతున్నాయి. ఇతరులు మంత్రాలు మొదలైనవి ఏవైతే ఇస్తారో, వాటిలో ఎటువంటి అర్థము లేదు. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ మంత్రాన్ని కూడా మీకు ఎందుకిస్తానంటే మీరు పతితులుగా ఉన్నారు కదా. నన్నొక్కరిని స్మృతి చేసినప్పుడే మీరు పావనంగా అవుతారు. తండ్రి తప్ప ఆత్మలకు ఈ విధంగా ఇంకెవరూ చెప్పలేరు. దీని బట్టి ఈ సహజ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారని నిరూపించబడుతుంది. మంత్రాన్ని కూడా వారే ఇస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మంత్రం ఇచ్చారని స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. క్రీస్తు వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత వారి బైబిల్ ను చదువుకుంటూ ఉంటారు. వారు ఏమి చేసి వెళ్ళారు? ధర్మ స్థాపన చేసి వెళ్ళారు. శివబాబా ఏమి చేసి వెళ్ళారు, కృష్ణుడు ఏమి చేసి వెళ్ళారు అనేది మీకు తెలుసు! కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు, అతడే తర్వాత నారాయణుడిగా అయ్యి పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు కావుననే వారికి ఇంతగా పూజలు మొదలైనవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు తెలుసు – వారు రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారు, భారత్ ను స్వర్గంగా తయారుచేసి వెళ్ళారు, ఆ స్వర్గానికి మొదటి నంబరు యజమానిగా వారు స్వయం అవ్వలేదు, శ్రీకృష్ణుడు అయ్యారు. తప్పకుండా కృష్ణుని ఆత్మను చదివించారని మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని వంశావళి అయిన మీరు కూర్చొని ఉన్నారు. రాజు-రాణులను మాత-పిత అని, అన్నదాత అని అంటారు. రాజస్థాన్ లో కూడా రాజును అన్నదాత అని అంటారు. రాజులకు ఎంత గౌరవం ఉంటుంది. ఇంతకుముందు ఫిర్యాదులన్నీ రాజు వద్దకు వచ్చేవి, దర్బారు ఏర్పాటు అయ్యేది. ఎవరైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాప పడేవారు. ఈ రోజుల్లోనైతే జైలు పక్షులు చాలా మంది ఉన్నారు. పదే-పదే జైలుకు వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు గర్భ జైలులోకి వెళ్ళకూడదు, మీరు గర్భ మహల్ లోకి రావాలి, అందుకే తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, ఇంకెప్పుడూ గర్భ జైలులోకి వెళ్ళరు. అక్కడ పాపం ఉండదు. అందరూ గర్భ మహల్ లో ఉంటారు, కేవలం తక్కువ పురుషార్థం చేసిన కారణంగా తక్కువ పదవిని పొందుతారు. ఉన్నత పదవిలో ఉన్నవారికి సుఖం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ కేవలం 5 సంవత్సరాల కోసం గవర్నర్ ను, ప్రెసిడెంట్ ను నియమిస్తారు. భారత్ యే దైవీ రాజస్థాన్ గా అయిందని మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడైతే రాజస్థాన్ లేదు, రాజు-రాణి కూడా లేరు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంట్ కు ధనమిస్తే మహారాజా, మహారాణి అనే టైటిల్ లభించేది. ఇక్కడ మీది చదువు. చదువు ద్వారా ఎప్పుడూ రాజు-రాణిగా తయారవ్వరు. ఈ చదువు ద్వారా మీరు రాజు-రాణిగా కూడా కాదు, విశ్వానికి మహారాజు-మహారాణిగా అవుతారు, ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. రాజు-రాణి అనే టైటిల్ త్రేతా నుండి మొదలవుతుంది.

ఇప్పుడు మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరిగా అవుతారు, తర్వాత రాజ-రాజేశ్వరిగా అవుతారు. అలా ఎవరు తయారుచేస్తారు? ఈశ్వరుడు. ఎలా తయారుచేస్తారు? రాజయోగం మరియు జ్ఞానం ద్వారా. రాజ్యం కోసం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు, ఇది చాలా సహజం కదా. స్వర్గాన్ని స్థాపన చేసేవారు గాడ్ ఫాదర్. స్వర్గంలో స్వర్గాన్ని స్థాపన చేయరు. తప్పకుండా వారికి సంగమయుగంలో పదవి లభిస్తుంది, అందుకే దీనిని మనోహరమైన కళ్యాణకారీ సంగమయుగం అని అంటారు. తండ్రి పిల్లల కళ్యాణాన్ని ఎంతగా చేస్తారంటే, వారిని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. పరమపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారని అంటారు కూడా కానీ అందులో ఎవరు రాజ్యం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. రామరాజ్యమని దేనినంటారు అనేది మీకు తెలుసు. వారైతే రామరాజ్యానికి లక్షల సంవత్సరాలు చూపించారు. కలియుగానికి 40 వేల సంవత్సరాలు చూపించారు. తండ్రి అంటారు – నేను సంగమయుగంలోనే వస్తాను, వచ్చి బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తాను. సత్యనారాయణుని కథ కూడా ఇదే. సత్యయుగంలో మీరు లక్ష్మీ-నారాయణులుగా, సర్వగుణ సంపన్నులుగా….. అవుతారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో, అప్పుడు దానిని కొత్త వృక్షమని అంటారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు కొత్తది అని అంటారు. మీరు కూడా సత్యయుగంలోకి వచ్చినప్పుడు కొత్త రాజధాని ఉంటుంది, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. స్థాపన ఇక్కడ జరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. కావున, ఈ యుగం పురుషోత్తములుగా అయ్యే యుగమని తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయించారు. జీవన్ముక్తిని పురుషోత్తమమని అంటారు. జీవన బంధనాన్ని పురుషోత్తమమని అనరు. ఈ సమయంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా చేస్తారు. మీరు అర్థ కల్పం జీవన్ముక్తులుగా ఉంటారు, తర్వాత జీవన బంధనంలోకి వస్తారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. మీ వ్రతము, నియమము ఏమిటి? బాబా వచ్చి వ్రతం చేపట్టేలా చేసారు. ఇది ఆహార-పానీయాల విషయం కాదు. అన్నీ చేయండి కానీ ఒకటి తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో చాలా వరకు పవిత్రంగా కూడా ఉంటారు. వాస్తవానికి ఈ పురుషోత్తమ యుగానికి గౌరవం ఉంది కనుక మీకు ఎంత సంతోషం, ఎంత నషా ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఎటువంటి పాప కర్మ జరగకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్య కర్మలు చెయ్యాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇళ్ళు-వాకిళ్ళు మొదలైనవి అన్నీ ఉన్నప్పటికీ మనసులో నుండి మమకారాన్ని తొలగించాలి.

2. శ్రీమతం అనుసారంగా తమ తనువు-మనసు-ధనంతో దైవీ రాజ్యాన్ని స్థాపన చెయ్యాలి. పురుషోత్తములుగా తయారుచేసే సేవను చెయ్యాలి.

వరదానము:-

మేము అందరికన్నా శ్రేష్ఠమైన ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యాలను చేసేవారము – ఈ అచంచల నిశ్చయం ఎంతగా ఉండాలంటే ఎవరూ మిమ్మల్ని కదిలించలేకపోవాలి. దీని వలన ఎవరు ఎంత పెద్ద కార్యం చేస్తున్నా సరే, అది అతి సులభంగా అనుభవం చేస్తారు. ఈ రోజుల్లో సైన్సు ఎలాంటి మెషినరీని తయారు చేసిందంటే, దాని ద్వారా ఏ ప్రశ్నకైనా సరే సహజంగా సమాధానం లభిస్తుంది, బుద్ధిని నడిపించడం నుండి ఫ్రీ అయిపోతారు. ఈ విధంగా ఆల్మైటీ అథారిటీని ఎదురుగా పెట్టుకున్నట్లయితే, అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానాలు లభిస్తాయి మరియు సహజ మార్గం యొక్క అనుభూతి కలుగుతుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top