28 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
27 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - చెప్పుడు మాటలను విశ్వసించకండి, ఒకవేళ ఎవరైనా తప్పుడు మాటలను వినిపించినట్లయితే, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయండి”
ప్రశ్న: -
ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క సంతోషంలో ఉంటారో, వారి గుర్తులేమిటి?
జవాబు:-
వారు పాత కర్మ భోగం యొక్క లెక్కాచారాలను ఆ సంతోషంలో మర్జ్ (ఇముడ్చుకుంటూ) చేసుకుంటూ వెళ్తారు. జ్ఞానం యొక్క సంతోషంలో తమ దుఃఖాన్ని, బాధను మరియు దుఃఖపు ప్రపంచాన్నే మర్చిపోతారు. ఇప్పుడు మనం సంతోషమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నామని వారి బుద్ధిలో ఉంటుంది. రావణుడు శపించి దుఃఖితులుగా చేసాడు, ఇప్పుడు ఆ దుఃఖమయమైన, బాధల ప్రపంచం నుండి బయటకు తీసి సంతోషమయమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మిమ్మల్ని పొంది మేము సర్వమునూ పొందాము….. (తుమ్ హే పాకే హమ్ నే…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. తప్పకుండా పిల్లల రోమాలు నిక్కబొడుచుకోవాలి ఎందుకంటే సంతోషానికి మించిన ఔషధం లేదని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీ అందరికీ అనంతమైన తండ్రి లభించారు. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే ఉంటారు. వేరే పిల్లలు తయారైనప్పుడు, వారికి కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయని పిల్లలకు తెలుసు. మన రాజ్యముండేదని, తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకున్నామని, ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. భారతవాసులకు ఇది శుభవార్త కదా! కానీ ఈ విషయాలను బాగా విని, అర్థం చేసుకున్నప్పుడే అది శుభవార్తగా అవుతుంది. నిజంగా ఇది సంతోషం కలిగించే విషయం కదా. కల్ప-కల్పము తండ్రి వస్తారు. తండ్రి జన్మ కూడా ఇక్కడే మహిమ చేయబడుతుంది. పండుగలన్నీ కూడా ఈ సమయానికి చెందినవే. తండ్రి వచ్చి మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేసారు. మనుష్యులకైతే అనేక రకాల బాధలున్నాయి, ఇక్కడ ఈ జ్ఞానం యొక్క సంతోషంలో ఆ బాధ, దుఃఖం మొదలైనవన్నీ మర్జ్ అయిపోతాయి. అనారోగ్యం కలవారు ఎవరికైనా నయమవుతూ ఉంటే, అందరికీ సంతోషం కలుగుతుంది, అనారోగ్యం మొదలైన దుఃఖపు విషయాలన్నింటినీ మర్చిపోతారు. పుట్టింటివారు, మెట్టినింటివారు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ సంతోషపడతారు. మనమంతా విశ్వానికి యజమానులుగా ఉండేవారమని, తర్వాత రావణుడు శపించాడని పిల్లలైన మీకు తెలుసు. ఇది బాధ మరియు దుఃఖం యొక్క ప్రపంచము. రేపు మళ్ళీ సంతోషమయమైన ప్రపంచం ఉంటుంది. సంతోషమయమైన ప్రపంచం గుర్తుంటే, బాధ, దుఃఖం మొదలైనవన్నీ మర్చిపోతారు. ఇది తమోప్రధాన ప్రపంచము. ఇక్కడ రకరకాల కర్మ భోగాలు ఉంటాయి. అబలలపై కూడా ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలు మరియు కర్మభోగపు రోజులు ఇంకా కొంత సమయమే ఉంటాయి. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయని తండ్రి ఓర్పునిస్తారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కర్మభోగపు లెక్కాచారాలు సమాప్తమవ్వాలి. సంతోషంలో వీటన్నింటినీ మర్జ్ చేస్తూ వెళ్ళండి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. తప్పుడు పనులేవీ చేయకండి లేదంటే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది, పదవి భ్రష్టమైపోతుంది. పిల్లల పని ఒక్క తండ్రినే స్మృతి చేయడము. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి, లెక్కాచారాలు సమాప్తమైపోతాయి. ఇంకా కొంత సమయమే ఉంది. లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు అంధులకు చేతికర్ర వంటివారు. మీరు కూడా స్మృతి చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయండి. విఘ్నాలైతే చాలా వస్తాయి. తండ్రిని స్మృతి చేయండి అని ఎంత వీలైతే అంత అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ఈ పదాలు కూడా ప్రసిద్ధి గాంచినవే. మన్మనాభవ అనగా ఓ ఆత్మలు, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ గతం యొక్క వికర్మలు భస్మమైపోతాయి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు. మనం 84 జన్మల చక్రం తిరిగామని మీకు తెలుసు. చక్రం తిరుగుతూ వచ్చారు, అలా తిరుగుతూనే ఉంటారు. ఇది పాత ప్రపంచము, పాత వస్త్రము….. వీటిని మర్చిపోవాలి. ఇది ఆత్మల అనంతమైన సన్యాసము, వారిది హద్దు సన్యాసము. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. డ్రామాలో వారి పాత్ర కూడా ఉంది. మళ్ళీ ఇలానే జరుగుతుంది. ప్రతి సెకండు ఏదైతే గతించిందో, అది డ్రామా, మళ్ళీ అదే డ్రామా రిపీట్ అవుతుంది. శాస్త్రాలన్నీ భక్తి మార్గపు పుస్తకాలు. భక్తి తర్వాత జ్ఞానం ఉంటుంది. ఈ మెట్ల చిత్రంపై ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. ముఖ్యమైన చిత్రాలను మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. త్రిమూర్తి చిత్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. పైన శివుడు కూడా ఉన్నారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా ఉన్నారు, వీరు సూక్ష్మవతన వాసులు. ఆ తర్వాత ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు. తండ్రి నివసించే స్థానమే, ఆత్మలైన మనం కూడా నివసించే స్థానము అని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు, దానిని నిర్వాణధామం అనండి లేక శాంతిధామం అనండి – విషయం ఒక్కటే. శాంతిధామం అనే పేరు సరైనదే. నిర్వాణధామం అనగా వాణి నుండి అతీతమైన ధామము అనగా శాంతిధామం అయినట్లే కదా! అది శాంతిధామము, దాని తర్వాత సుఖం, శాంతి మరియు సంపదల ధామం ఉంటుంది. ఆ తర్వాత దుఃఖం మరియు అశాంతుల ధామం ఉంటుంది. సుఖధామంలోనైతే అపారమైన ఖజానాలు ఉంటాయి. ఈ రోజు ఏముంది, రేపు ఏమవుతుంది. ఈ రోజు కలియుగాంతము, రేపు సత్యయుగం ఆది. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. బ్రహ్మా మరియు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణుల పగలు మరియు రాత్రి అని అంటారు కూడా. పగలులో దేవతలుంటారు. రాత్రిలో శూద్రులుంటారు. మధ్యలో బ్రాహ్మణులైన మీరు ఉంటారు. ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. వారిని అత్యంత ప్రకాశంలోకి తీసుకురావడము పిల్లలైన మీ బాధ్యత. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం ఎదురుగా ఉంది. వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశ కాలే ప్రీతి బుద్ధి విజయంతి అని అంటూ ఉంటారు కూడా. తండ్రి మనకు మళ్ళీ అదే రాజ్యాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. మన ఆ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు. రావణుని ప్రవేశత ద్వాపరం నుండి జరుగుతుంది. రావణుడు మన రాజ్యాన్ని లాక్కున్నాడు. ఇతడిని శత్రువుగానే భావించండి ఎందుకంటే శత్రువు దిష్టి బొమ్మనే తయారుచేసి కాలుస్తారు. ఇతడు చాలా పాత శత్రువు. రావణ రాజ్యము అని అంటారు కూడా, కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. కనుక ఘోర అంధకారమనే అంటారు కదా. అనంతమైన తండ్రి నాలెడ్జ్ ఫుల్. వారిని జ్ఞాన దాత, దివ్య చక్షు విధాత అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞాన సాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు కదా! జ్ఞానమనేది వినిపించకుండా ఎలా ఋజువవుతుంది! తండ్రి జ్ఞానాన్ని వినిపించడాన్ని మీరు చూస్తారు. ఈ జ్ఞానంతో అర్ధకల్పం సద్గతి లభిస్తుంది. భక్తి అర్ధకల్పం నడవనున్నది. జ్ఞానం ద్వారా సంగమంలోనే సద్గతి లభిస్తుంది. పిల్లలకు సంబంధించిన ఏ విషయమైనా ఎప్పుడు దాగి ఉండలేదు. ఏదైనా చెడు కర్మ జరిగితే చెప్పండి అని తండ్రి అంటారు. చాలామంది ద్వారా చెడు కర్మలు జరుగుతూ ఉంటాయని బాబాకు తెలుసు. ఇది రావణ రాజ్యము కదా! మాయ చెంపదెబ్బ కొడుతుంది. కానీ చాలామంది దాచిపెడతారు. బాబా అంటారు – ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే చెప్తే భవిష్యత్తు కోసం యుక్తి లభిస్తుంది. లేకపోతే వృద్ధి జరుగుతూ ఉంటుంది. కామము మహాశత్రువు. బాబా, మాయ నుండి చాలా అపోజిషన్ ఉంటుందని బాబాకు వ్రాస్తారు. మాయ నుండి రక్షించబడేలా ఎవ్వరికీ యోగమైతే సదా ఉండడం లేదు. దేహాభిమానం చాలా వస్తుంది. చాలామంది మాయతో చెంపదెబ్బను తింటారు. బాబా వద్దకు అన్ని వైపుల నుండి సమాచారాలైతే వస్తూ ఉంటాయి కదా! వార్తాపత్రికలు మొదలైనవాటిలోనైతే ఎంత తప్పుగా వ్రాస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనుష్యులు ఎన్ని విషయాలనైనా కల్పించగలరు, తమోప్రధానంగా ఉన్నారు కదా. వ్యాసుని బుద్ధి రజోగా ఉన్నప్పుడు ఏవేవో విషయాలను వ్రాసేశారు. ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించి డిస్టర్బ్ అవ్వకండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఫలానావారు ఇలా అన్నారు, ఇలా చేసారు….. వీటితో తల తిరిగిపోతుంది. ఇది తమోప్రధాన ప్రపంచమని అర్థం చేసుకోరు. మాయ పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా అసత్యమైన విషయాలను వినిపించినట్లయితే, వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. ఇతరులకు కూడా ఇదే సందేశాన్ని ఇస్తూ ఉండండి. నేను సందేశాన్ని తీసుకొస్తాను అని తండ్రి అంటారు. ఓ ఆత్మలూ, ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించండి, నా సందేశాన్ని వినండి, కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి. ఎవరైతే స్మృతి చేస్తారో, వారు తమ కళ్యాణాన్నే చేసుకుంటారు. ఆత్మయే స్మృతి చేయాలి, మర్చిపోయింది కూడా ఆత్మనే. ఇప్పుడు తండ్రి శ్రీమతం లభిస్తుంది. ఇందులో ఆశీర్వాదాలు లేక దయ మొదలైనవేవీ అడగకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇంకే విషయాన్ని అడగాల్సిన అవసరం లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది విన్నారు. ఇందులో వివాదమేమీ లేదు. ఘోర అంధకారంలోనే తండ్రి వస్తారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కృష్ణుని జన్మను కూడా రాత్రి వేళ జరుపుకుంటారు. ఆ రోజు మందిరాలలో ఖీర్-పూరీలు మొదలైనవి రాత్రి వేళ తయారుచేస్తారు. ఇప్పుడు శివుని కోసం ఏం తయారుచేస్తారు? వారు నిరాకారుడు. బాబా ఏ ఘడియన వస్తారు మరియు ఎలా వెళ్ళిపోతారు అనేది ఎవరికీ తెలియదు కూడా. వీరిపై సదా సవారీ చేయరు. వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనం శివబాబాకు మనమళ్ళమని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వం వారి నుండి లభిస్తుంది. బ్రహ్మాకు కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది. వీరు మానవుడే కదా! సద్గతిలో మొదటి నంబరువారు ఈ శ్రీకృష్ణుడు. వీరు అందరికీ ప్రియమైనవారు ఎందుకంటే సతోప్రధాన బాల్యావస్థలో ఉన్నారు కదా! కొంచెం పెద్దవారైతే వారిని సతో అని అంటారు. తర్వాత రజో, తమో స్థితులు ఉంటాయి. శ్రీకృష్ణుడు, రాధలే తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. తండ్రి ఎవరికైతే జ్ఞానాన్ని ఇచ్చారో, వారికే మళ్ళీ ఇస్తారు. భారత్ లోనే దేవీ దేవతలు ఉండి వెళ్ళారు కనుక మందిరాలు కూడా భారత్ లోనే చాలా ఉన్నాయి. క్రిస్టియన్ల చర్చిలలో ఎక్కడ చూసినా క్రీస్తే కనిపిస్తూ ఉంటారు. దేవతలకు ఎన్ని మందిరాలున్నాయి. తండ్రి మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి మరియు భారత్ ను స్వర్గంగా చేయడానికి వచ్చారు. మనం తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవుతున్నాము. తండ్రితో పాటు మనం కూడా భారత్ ను స్వర్గంగా చేస్తున్నాము. మనం తండ్రితో పాటు వచ్చినట్లుగా ఉంది. భక్తి మార్గంలో దేవతల మందిరాలు, మూర్తులు మొదలైనవాటిని ఎంత ఖర్చుపెట్టి తయారుచేస్తారు. వాటిని ఉత్పత్తి చేసి, పాలన చేసి, తర్వాత వినాశనం చేసేస్తారు. 9 రోజుల్లోపే ముంచేస్తారు. వాటి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. కలకత్తాలో నవరాత్రులను చాలా బాగా జరుపుకుంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తాయి. ఇంతకుముందు మనం కూడా ఆ పాత్రను అభినయించాము. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తారు. ఇది ఎంతటి అంధశ్రద్ధ! రామాయణం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఆ విషయాలను వింటూ కళ్ళ నుండి కన్నీరు వచ్చేస్తుంది. ఇదంతా భక్తి మార్గము. వీటి వలన లాభమేమీ ఉండదు. బాబా ఇప్పుడు మనల్ని ఎంత తెలివైనవారిగా తయారుచేస్తారు. అయితే, వీటన్నింటినీ విని ఇక్కడి విషయాలను ఇక్కడే మర్చిపోకండి, అన్ని విషయాలను గుర్తుంచుకోండి. పూర్తిగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో, అంతా మర్చిపోండి. ఇదంతా శ్మశానవాటికగా ఉంది. ఢిల్లీలోని బిర్లా మందిరంలో – భారత్ పరిస్తాన్ గా ఉండేది, దానిని ధర్మరాజు స్థాపన చేసారు అని వ్రాసి ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం శ్మశానవాటికగా అవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు.
అందరూ కామ చితిపై కూర్చుని పూర్తిగా కాలి మరణించారని తండ్రి అంటారు. క్రోధ చితి అని అనరు. కామ చితి అని అంటారు. అందులో కూడా తేలికపాటి నషా, సెమీ నషా అని ఉంటాయి. తండ్రి కూర్చుని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇంట్లో ఒకవేళ ఎవరైనా కుపుత్రుడు ఉంటే – తండ్రి పరువును ఎందుకు పోగొడుతున్నావు అని అతడిని ప్రశ్నిస్తారు కదా. తండ్రి పరువు పోతుంది కదా! అనంతమైన తండ్రి కూడా అంటారు – మీరు నల్ల ముఖం చేసుకుంటే దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కుల భూషణుల పేరును పాడు చేసేస్తారు. మనం పవిత్రతా శక్తితోనే భారత్ ను మళ్ళీ శేష్ఠాచారీ దేవతగా తయారుచేస్తామని పిల్లలైన మీకు తెలుసు. మీకైతే ఇది సామాన్యమైన విషయము. మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉండడాన్ని మీరు చూస్తారు, దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. శాస్త్రాలలో మహాభారత యుద్ధాన్ని అయితే చూపించారు కానీ దాని తర్వాత ఏమి జరిగింది అనేది చూపించలేదు. ప్రళయం జరిగిందని అనేస్తారు. ఇప్పుడు కృష్ణుని గురించి ఒకవైపు తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకున్నట్లుగా చూపించారు, మరోవైపు రావి ఆకుపై బొటన వేలు నోట్లో పెట్టుకుని వచ్చారని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. అక్కడ గర్భ మహలులో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇకపోతే, సాగరంలో ఆకుపై ఉండడమనేది జరగదు. ఇది అసంభవము. ఇదంతా డ్రామాలో ఈ విధంగా తయారుచేయబడింది. దీని గురించి మీకు తెలుసు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తమ కళ్యాణము చేసుకోవాలి మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. ఇదే ముఖ్యమైన విషయము. తండ్రి అయితే స్వర్గ రచయిత. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కనుక పిల్లలైన మనము స్వర్గానికి యజమానులుగా ఉండాలి కదా! శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు, అంటే వారు తప్పకుండా భారత్ కు ఏదో ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు కదా! తండ్రి సద్గతిదాత, జ్ఞానసాగరుడు, తండ్రియే వచ్చి జ్ఞానాన్నిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. ఎవరైతే ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉంటారో, వారు వస్తూ ఉంటారని పిల్లలకు నిశ్చయముంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. ఎవరైనా ఏవైనా అసత్యమైన విషయాలను వినిపిస్తే, విని విననట్లుగా వదిలేయాలి. వాటి వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు.
2. ఎప్పుడూ దేవతలుగా అయ్యే బ్రాహ్మణ కుల భూషణుల పేరు పాడవ్వకూడదు – దీని పట్ల అటెన్షన్ పెట్టాలి. ఎటువంటి తప్పుడు కర్మలను ఎప్పుడూ చేయకూడదు. పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి.
వరదానము:-
ఎప్పుడైతే ఆత్మ యొక్క స్థితి సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవుతుందో, అప్పుడు నింద-స్తుతి, జయాపజయాలు, సుఖ-దుఃఖాలు అన్నింటిలోనూ సమానత ఉంటుంది. దుఃఖంలో కూడా ముఖం లేక మస్తకంపై దుఃఖపు అలలకు బదులుగా సుఖము లేక సంతోషపు అలలు కనిపిస్తాయి. నిందను వింటూ కూడా – ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వంగా చేసేందుకు ఇవి మహిమా యోగ్యమైన పదాలు అని అనుభవమవ్వాలి – ఇటువంటి సమానత ఉండాలి, అప్పుడే తండ్రి సమానమైనవారని అంటారు. కొద్దిగా కూడా వృత్తిలో – వీరు శత్రువులు, నిందించేవారు మరియు వీరు మహిమ చేసేవారు అన్నది రాకూడదు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!