27 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

27 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

26 July 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - యోగబలంతోనే ఆత్మకు పట్టిన తుప్పు వదులుతుంది, అందుకే యోగంలో ఎప్పుడూ పొరపాట్లు చేయకండి”

ప్రశ్న: -

అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి పిల్లలకు ఏ యుక్తిని తెలియజేసారు, అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు వేస్తుంది?

జవాబు:-

తండ్రి తెలియజేసిన యుక్తి ఏమిటంటే – పిల్లలూ, బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరీ-సోదరులు. మీరెప్పుడూ వికారీ కర్మలు చేయలేరు. సోదరీ-సోదరులు వికారాలలోకి వెళ్ళలేరు. మీరు శివబాబా మతాన్ని అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ తక్కువైనదేమీ కాదు, ఇందులోనే నలువైపుల నుండి విఘ్నాలు వేస్తుంది. మేము సోదరీ-సోదరులము, ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనేది మర్చిపోతారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము….. (తుమ్ హే పాకే హమ్నే…..)

ఓంశాంతి. పాటలోని ఒక్క మాట సరిపోతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని, అది కూడా కల్ప-కల్పము లభిస్తుందని పిల్లలకు తెలుసు. భారత్ కు తప్పకుండా అనంతమైన వారసత్వం లభించిందని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఆ వారసత్వం లేదు, అది మళ్ళీ ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడు స్వర్గ వారసత్వం లేదని, రావణుని ద్వారా నరకం యొక్క శాపం లభిస్తుందని మీరు చూస్తున్నారు. శాపం వల్ల మనుష్యులు దుఃఖితులు అవుతారు. వరం అనగా వారసత్వం ద్వారా సుఖపడతారు. వారు అనంతమైన నిరాకార తండ్రి అని మరియు ప్రజాపిత బ్రహ్మా అనంతమైన సాకార తండ్రి అని ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మా తప్ప ఇంకెవరూ అనంతమైన సాకార తండ్రిగా అవ్వలేరు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు కానీ నియమానుసారంగా మొత్తం మనుష్య సృష్టికి వారు బాపూజీ అవ్వలేరు. మొత్తం నిరాకార ప్రపంచానికి బాపూజీ – శివుడు. మనం శివబాబాకు చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వాన్ని ఇచ్చేందుకు శివబాబా వచ్చి మనల్ని తమవారిగా చేసుకున్నారు. మధువనానికి ఎందుకు వస్తారు? శివబాబాను కలుసుకునేందుకు వస్తారు, కానీ వారు నిరాకారుడు. కేవలం శివబాబా అని అంటే అర్థం చేసుకోలేరు, అందుకే బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మా దాదా (అన్నయ్య). దాదా పేరు వేరు, తండ్రి పేరు వేరు. ఆ నిరాకారుడు అందరికీ తండ్రి కూడా మరియు అందరికీ దాదా (తాతయ్య) కూడా. పిల్లలందరికీ బాప్ దాదా నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రియే అందరి దుఃఖహర్త-సుఖకర్త. సత్యయుగంలో మనుష్యులెవ్వరూ దుఃఖితులు అవ్వలేరు. దాని పేరు స్వర్గము, వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్. భారత్ అన్నింటికన్నా పాతది, అంటే తప్పకుండా ఇంతకుముందు అన్నింటికన్నా కొత్తదిగా ఉండేది, అందుకే ఇప్పుడు అన్నింటికన్నా పాతదిగా అయ్యింది. సత్యయుగము, కలియుగము అని భారత్ నే అంటారు. తప్పకుండా భారత్ స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళినప్పుడు వెంటనే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయి – వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది, వీరు పూజ్యులుగా ఎలా అయ్యారు, ఎప్పుడు రాజ్యం చేసారు, ఎవరి ద్వారా రాజ్యాన్ని పొందారు – ఈ విషయాలన్నీ బుద్ధిలోకి వస్తాయి. ఇంతకుముందు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళేవారు, మాలను తిప్పేవారు కానీ వారి కర్తవ్యం గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ విషయం కేవలం మీ బుద్ధిలో ఉంది, అది కూడా నంబరువారుగా ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళి నిలబడితే హర్షితులవుతారు. వారు ఈ ప్రారబ్ధాన్ని ఎలా పొందారు అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సంగమయుగంలోనే పొందారు ఎందుకంటే సంగమంలోనే పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. సంగమంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. అనేక జన్మల అంతిమ జన్మలో తప్పకుండా వీరే బ్రహ్మాగా ఉండేవారని కూడా మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులే మునుపటి జన్మలో బ్రహ్మా-సరస్వతులుగా ఉండేవారు. బ్రహ్మాతో పాటు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు కూడా ఉంటారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది కదా. తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. ఇప్పుడు మనము పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే కల్పక్రితం పురుషార్థం చేసారో, వారిని మనం సాక్షీగా అయి చూస్తాము. ఒకటేమో రాజుల వంశము, రెండవది ప్రజల వంశము. ప్రజల్లో కూడా కొందరు చాలా ధనవంతులుగా ఉంటారు, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. రాజులలో కూడా కొందరు చాలా ధనవంతులుగా, కొందరు తక్కువ ధనవంతులుగా ఉంటారు. మీరు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళి, వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. రాజధాని స్థాపనవుతుంది. ఇది ఎంత సహజము! అంబ ఎవరు అనేది కూడా తెలియదు. వీరు జగదంబ అని మీరు అంటారు. కల్ప క్రితం కూడా జగదంబ, జగత్పిత ఉండేవారు. మనం వారి పిల్లలుగా ఉండేవారము. సంగమయుగంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జగదంబకు అనేకమంది పిల్లలున్నారు. కానీ ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టలేరు.

ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. తండ్రి జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా పిల్లలకు జ్ఞానాన్నే ఇస్తారు. వారిని మనిషి అని గాని, దేవత అని గాని అనరు. వారిని పరమాత్మ అనే అంటారు. మీరు ఎవరి మందిరానికి వెళ్ళినా, వారి జీవితచరిత్రను చెప్పగలరు. రాముని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. చంద్రవంశం ఇప్పుడు స్థాపనవుతుంది. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల ధర్మం కూడా స్థాపనవుతుంది. బ్రహ్మా పేరు ఎంత ప్రసిద్ధమైనది. తండ్రి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వడం వలన, మేము ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరంలో సోదరీ-సోదరులము కనుక మేము వికారీ కర్మలు చేయలేము అని తెలుసుకున్నారు. సోదరీ సోదరులు వికారాలలోకి వెళ్ళలేరు. డ్రామానుసారంగా తండ్రి ఈ యుక్తిని రచించారు – నీవు కూడా బ్రహ్మాకుమార్, నేను కూడా బ్రహ్మాకుమారీ. వాస్తవానికి ప్రపంచంలోని వారందరూ బి.కె.లు. కానీ వారికి ఈ విషయం తెలియదు. మనం శివబాబా మతాన్ని అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. నలువైపుల నుండి విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మేము సోదరీ-సోదరులము, ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అనేది మర్చిపోతారు. సత్యయుగంలో ఒకే ధర్మముంటుందని, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమవ్వనున్నాయని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. ఇది కొత్త విషయమేమీ కాదని కూడా పిల్లలకు తెలుసు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. తిథి-తారీఖులు కూడా రాయబడి ఉన్నాయి. మేము శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటామని కూడా బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే లభించింది కదా. తండ్రిని స్మృతి చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. స్మృతి అనగా యోగబలంతోనే తుప్పు తొలగుతుంది. ఇందులో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అందుకే మురళీలు లభిస్తాయి. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మురళి లభించలేదనుకోండి, అప్పుడు కూడా, నేను బాబాకు చెందినవాడిగా అయ్యాను అని బుద్ధిలో ఉంటుంది కదా. మీ ఆత్మ తమోప్రధానంగా అయిపోయిందని, ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు, ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. మధురాతి-మధురమైన పిల్లలూ, స్మృతిబలంతోనే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలని తండ్రియే చెప్తారు. ఈ పదాలు ఉన్నాయి కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. దేహ ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని, తప్పకుండా తండ్రి కల్పక్రితం కూడా చెప్పారని, మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ దేహ ధర్మాలు కదా. అందరి తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ ఆ తండ్రి ఒక్కరినే పిలుస్తారు. పోప్ కూడా భగవంతుడిని స్మృతి చేస్తారు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, ఈ మనుష్యులు పరస్పరంలో కొట్లాడుకోకుండా క్రోధంతో కూడిన వీరి బుద్ధులను పరివర్తన చేయండి అని అంటారు. స్మృతి అయితే తండ్రినే చేస్తారు కదా. ఇతరులెవ్వరినీ స్మృతి చేయరు. మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి అని శివబాబానే పిలుస్తారు. పావనంగా అయితే ఇక ఈ ఛీ-ఛీ రావణ ప్రపంచంలో ఉండలేరు, అప్పుడు తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. కలియుగం మారి సత్యయుగము వస్తుంది కదా. కానీ ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఒక డాక్టరు వచ్చి, ఇక కలియుగమే కొనసాగుతుందని అన్నారు. అరే, సదా కలియుగమే ఎలా కొనసాగుతుంది. కలియుగం ఏమైనా బాగుందా ఏమిటి! వారు అర్థం చేసుకోరు, కేవలం భావన ఉంటుంది, ఇతరులను తీసుకువస్తారు. వారికి బాణం తగలదు కానీ వారితో వచ్చినవారిలో ఎవరికైనా బాణం తగిలితే, ఆ తీసుకొచ్చినవారికి ఎంతో కొంత కమిషన్ లభిస్తుంది. వారు స్వర్గంలోకి వచ్చేస్తారు. వారు వచ్చి తండ్రి నుండి కొద్దిగా విన్నా కూడా స్వర్గంలోకి తప్పకుండా వెళ్తారు. ఎంతైనా హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు కదా. నేను అందరికీ తండ్రిని కదా అని తండ్రి అర్థం చేయిస్తారు. శివబాబా ఎలా వస్తారు అని అంటూ కొంతమంది నమ్మరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేను ఎందుకు రాలేను. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకదానిలోకి వెళ్ళగలిగినప్పుడు నేను రాలేనా. లేదంటే నేను ఎలా వస్తాను. ఓ పతితపావన బాబా, మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు – నేను భారత్ లోనే వస్తాను, కల్పము యొక్క సంగమంలో ఒక్కసారి మాత్రమే వస్తాను, మీరు 84 జన్మలు పూర్తి చేసుకున్నప్పుడు నేను వస్తాను. తండ్రి మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయముంది. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడమే నా వ్యాపారమని తండ్రి అంటారు. అందుకే, కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం అని అంటూ ఉంటారు, తర్వాత మీరు పాలన చేస్తారు. ప్రకాశం లభించింది కదా. కాళీ మందిరాన్ని చూసినప్పుడు ఇది అసత్యమైన చిత్రమని అర్థం చేసుకుంటారు. వాస్తవానికి కాళీ అంటే జగదంబయే కానీ వారికి అటువంటి భయంకర రూపం లేదు. బెంగాల్ లో కాళీ ఎదురుగా బలి ఇస్తారు కానీ వారికేమీ తెలియదు. జగదంబ మందిరానికి లక్షలాది మంది వస్తారు. సదా మేళా జరుగుతున్నట్లుగా ఉంటుంది. అక్కడ చిన్న మూర్తిని పెట్టారు కదా. ఆ మూర్తికి జగదంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదంబ అనేవారు ఒక్కరే ఉండాలి. సింధ్ లో కాళీ మందిరాన్ని ఎలా నిర్మించారు. ఒకసారి కోటలో బాంబు పేలింది, అప్పుడు ఒక ఫకీరు కాళీ మాతకు కోపం వచ్చిందని చెప్పారు, అంతే, ఇక వాళ్ళు వెళ్ళి అక్కడ కాళీ మందిరాన్ని నిర్మించారు. ఇంతకీ కాళీ అంటే ఎవరు అనేది ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ లభించింది, మీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారని అర్థం చేసుకున్నారు కనుక పూర్తి పురుషార్థం చేయాలి కదా.

కుమార-కుమారీలు వివాహం చేసుకున్నప్పుడు మొదటి నంబరు దుఃఖం మొదలవుతుంది. మీకైతే వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ఈ రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు తండ్రి అంటారు. ఇక్కడున్నది వికారీ గృహస్థ వ్యవహారము. దేవీ దేవతల గురించి పాడుతూ ఉంటారు. ఈ దేవతలను నిర్వికారులుగా చేసేవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగం సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ కూడా వికారాలుండేవని శాస్త్రాలలో చూపించారు కానీ అది నిర్వికారీ ప్రపంచము. వికారీ ప్రపంచానికి మరియు నిర్వికారీ ప్రపంచానికి ఎంత తేడా ఉంది! ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు ఎంత కొద్దిమంది మనుష్యులుండేవారు అనేది మీకు తెలుసు. ఒకే ధర్మముండేది, తర్వాత వృద్ధి జరుగుతుంది. చక్రంలో కూడా పూర్తిగా తిరగవలసి ఉంటుంది. అప్పుడే పృథ్వినంతా చుట్టి వచ్చారని అంటారు. సముద్రాన్ని అయితే చుట్టి రాలేరు. సత్యయుగంలో కొద్దిమందే ఉంటారు కనుక ఎంత తక్కువ చోటులో ఉంటారు. ఇప్పుడు మనుష్య సృష్టి యొక్క హద్దులు పూర్తి కానున్నాయి. పైన ఉన్న ఆ కొద్దిమంది ఆత్మలు కూడా వస్తూ ఉంటారు. మనుష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అక్కడ నుండి ఆత్మలు రావడం పూర్తయినప్పుడు మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. అప్పుడిక ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళాలి. వారు రావడం మరియు మీరు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది చొప్పున వస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. మొట్టమొదటగా మనం అక్కడకు వెళ్ళి ఉంటాము. మనము వెళ్ళేటప్పటికి ఎవరూ ఉండకూడదు. ఇవి విస్తారమైన విషయాలు. తండ్రి పిల్లలకు చెప్తారు – అచ్ఛా, మీ ప్రియమైన బాబుల్ ను (తండ్రి) స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం వలన మీకు లాభముంటుంది. ఈ చరిత్ర-భూగోళాలను మనుష్యులు చాలా చదువుతూ ఉంటారు. చాలా దూర-దూరాలకు వెళ్తారు. చంద్రునిపైకి కూడా వెళ్తారు. ఇది సైన్సు యొక్క గర్వము. అతిలోకి వెళ్తారు. చంద్రునిపైన ఏమీ లేదు. మీరు సూర్య-చంద్రులను కూడా దాటి వెళ్తారు. ఈ నాలెడ్జ్ మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి ఇవన్నీ తెలియజేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రియే అంటారు – నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తాను, ఇది నా పాత్ర, భక్తి మార్గంలో కూడా ఇది నా పాత్రే. ఇది డ్రామా కదా. మీరు ఎలాగైతే పాత్రధారులో, అలా నేను కూడా పాత్రధారిని. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడము నా పని. ఎవరైనా ఏదైనా చేస్తే, వారికి మహిమ జరుగుతుంది కదా. ఈ లక్ష్మీనారాయణులకు ఎంత మహిమ ఉంది. అయితే, వీరిని ఇంత అర్హులుగా చేసిందెవరు? వీరు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు రకరకాల దుఃఖాలు ఎన్ని ఉన్నాయి. ఈ రోజు ఎవరో మరణించవచ్చు, గొడవ జరగవచ్చు. ఎవరి వద్దనైనా పదమాల కోట్లు ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే ఏమి చేస్తారు! బిర్లా వద్ద ఎంత ధనముంది! ఒక జన్మలో ఎంతో ధనము ఉండవచ్చు కానీ దుఃఖమనేదే లేనివారు ఎవ్వరూ లేరు. అందరికీ ఏదో ఒక రకమైన దుఃఖము ఉంటుంది. ఇప్పుడు ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఆత్మలు రావడం ఆగిపోతుందో, అప్పుడే తిరిగి వెళ్తారు. ఈ విస్తారాన్ని బుద్ధిలో ఉంచుకొని ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమగా స్మృతి చేయాలి.

2. జ్ఞాన ప్రకాశము లభించింది కావున నిశ్చయబుద్ధి కలవారిగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా సరే, స్మృతి బలం ద్వారా ఆత్మను తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేసుకునే పురుషార్థం చెయ్యాలి.

వరదానము:-

సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత రచన ఆధారంగా ఉండరు. రచయిత రచనను ఆధీనం చేసుకుంటారు. అందుకే ఎప్పుడూ సమయం దానంతటదే సంపూర్ణంగా చేస్తుందని అనుకోకండి. మీరు సంపూర్ణమై సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఏదైనా విఘ్నము వస్తే, అది తప్పకుండా సమయానుసారంగా దూరమైపోతుంది. కానీ సమయానికన్నా ముందే పరివర్తన శక్తితో దానిని పరివర్తన చేయండి. అప్పుడు ఆ ప్రాప్తి మీకు లభిస్తుంది. సమయం ఆధారంగా పరివర్తన చేస్తే ఆ ప్రాప్తి మీకు లభించదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top