26 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
25 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - స్వయాన్ని రాజయోగిగా భావిస్తూ వికారీ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించండి, కేవలం బాధ్యతలను నిర్వర్తించేందుకు వారితో పాటు ఉండండి”
ప్రశ్న: -
పిల్లలైన మీరు దేహ-భానాన్ని మర్చిపోయారు, దీని స్మృతిచిహ్నాన్ని శాస్త్రాలలో ఏ రూపంలో చూపించారు?
జవాబు:-
పాండవులు పర్వతాలపై కరిగిపోయారని చూపిస్తారు కానీ వారికి పర్వతాల పైకి వెళ్ళి మంచులో శరీరాలను వదలాల్సిన అవసరం ఏం వచ్చింది. హిమాలయ పర్వతాలపై ఎవరూ శరీరాలను వదలరని లా చెప్తుంది. ఇకపోతే, మీరు యోగబలంతో శరీరాలను వదిలేస్తారు, దేహ-భానాన్ని మరచి అశరీరిగా అయ్యే అభ్యాసం చేస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్థం చేయించడమైతే ప్రతి రోజు అర్థం చేయిస్తారు, అయినా చాలా విషయాలను మర్చిపోతారు. ఇది సంగమయుగమని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. మనం సంగమయుగంలో ఉన్నాము. తండ్రి రావడం కూడా సంగమంలో వస్తారు. కలియుగ అంతిమము మరియు సత్యయుగం ఆది యొక్క సంగమము అని అంటూ ఉంటారు. పిలవడం కూడా ఈ సమయంలోనే పిలుస్తారు. పతిత ప్రపంచం అని కలియుగ అంతిమాన్ని అంటారు. అందుకే ఇంకే సమయంలోనూ పిలవరు. తండ్రి రారు కూడా. ఎప్పుడైతే కలియుగ అంతిమం వస్తుందో, అప్పుడే నన్ను పిలుస్తారు – బాబా, పతితులైన మమ్మల్ని పావనంగా చేసేందుకు రండి, కలియుగ అంతిమము మరియు సత్యయుగం ఆదిలో రండి. పిలుస్తారు, కానీ కల్పం ఆయువు ఎంతో వారికి తెలియదు. భక్తి చేస్తూ-చేస్తూ, ఎదురు దెబ్బలు తింటూ-తింటూ చివరికి భగవంతుడు లభిస్తారని భావిస్తారు. కల్పం యొక్క అంతిమం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. స్మృతి చేయడం కూడా కలియుగ అంతిమం వచ్చినప్పుడే చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో సుఖమే ఉంటుంది, ద్వాపరంలో కూడా అంత దుఃఖముండదు. కలియుగంలో మనుష్యులు చాలా దుఃఖితులుగా అయినప్పుడు, తండ్రిని పిలవడం మొదలుపెడతారు. తమోప్రధానం అనగా దుఃఖితులు, అప్పుడే పిలుస్తారు కదా – ఓ దుఃఖహర్త, సుఖకర్త రండి అని. దుఃఖం యొక్క బంధనాలైతే చాలా ఉన్నాయి. దుఃఖం సమయంలోనే భగవంతుడిని పిలుస్తారు – ఈ బంధనం నుండి విడిపించండి అని. ఎప్పుడైతే ఏ మార్గము లభించదో, అప్పుడు చాలా గట్టిగా పిలుస్తారు. అయినా కూడా పొందలేరు. భూల్ భులయ్యా ఆట (తికమక దారుల ఆట) ఉంటుంది కదా, ఎటు వైపు నుండి వెళ్ళినా మార్గం లభించదు. ఇక అలసిపోయినప్పుడు గట్టిగా పిలుస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుష్యులు చాలా దుఃఖితులుగా అయినప్పుడు – ఓ దుఃఖహర్త-సుఖకర్త, ఓ అంధులకు చేతి కర్ర వంటి వారా, అని గట్టిగా పిలుస్తారు. ఈ సమయంలోనే, ఓ అంధులకు చేతి కర్ర, అని పిలుస్తారు.
ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఒక వైపు పాండవులు, మరొక వైపు కౌరవులు ఉన్నారు. ఎవరికైతే రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదో, వారిని అంధులని అంటారు. ఎవరైతే తండ్రి ద్వారా రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారో, వారిని నేత్రాలు ఉన్నవారు అని అంటారు. మాకు రాజ్య-భాగ్యం లభించింది కావుననే చిత్రాలను చూపిస్తున్నామని మీరు అర్థం చేయిస్తారు. సత్యయుగము శివబాబా ద్వారా స్థాపన చేయబడినటువంటిది, అందుకే దానికి శివాలయమనే పేరు వచ్చింది. తర్వాత వికారీలుగా అయినప్పుడు వామ మార్గం స్థాపన అవుతుంది, అందుకే దీనిని వేశ్యాలయమని అంటారు. సత్యయుగం శివాలయము, కలియుగం వేశ్యాలయము. ఇప్పుడు మనం వేశ్యాలయంలోనూ లేము, అలాగని శివాలయంలోనూ లేము అని సంగమయుగ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మనం శివాలయంలోకి వెళ్తున్నాము. ఇప్పుడిది వేశ్యాలయము, మనకు వికారీ సంబంధాల పట్ల మమకారం తొలగిపోయింది. ఇప్పుడు మనకు భవిష్య సంబంధాలతో మమకారముంది. ఇప్పుడు మనం రాజయోగులము, వారు యోగులు. వారితో మనకు కనెక్షన్ ఏముంది. కానీ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఉండడమైతే మీ ఇంట్లోనే ఉండాలి. అయినా బ్రాహ్మణులతో చాలా కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణులు అంతటి ఉన్నతమైన సేవను ఇంకెవ్వరూ చేయలేరు. ఆత్మిక సేవ చేసేందుకు తండ్రియే నిమిత్తంగా అవుతారు. వారు తండ్రి కూడా, టీచరు కూడా, అంతేకాక గురువు కూడా. వారు సత్యమైన బాబా, సత్యమైన టీచరు, సద్గురువు కూడా. సత్యమైనవారిని సుప్రీమ్ అని అంటారు. వారి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది – ఈ విషయం గుర్తుంటే ప్రతి క్షణం ఎంతటి సంతోషముండాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించడానికి పురుషార్థం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి విషయం – వారు పారలౌకిక తండ్రి. వారే సత్యమైన శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. సృష్టి చక్ర ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు, అందుకే వారిని జ్ఞాన సాగరుడని అంటారు. మొట్టమొదట వారి మహిమ చేయాలి. వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు. సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఒకే రాజ్యం ఉండాలని అడుగుతారు కదా. అది సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడైతే ఉండదు. ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వాలి, ఐక్యత ఏర్పడాలి అని మనుష్యులు అంటారు. ప్రపంచమైతే ఒకటే ఉంటుంది. కేవలం ప్రపంచంలో ఒకే రాజ్యముండడమనేది జరగవచ్చు. దేవతల రాజ్యముండేది, అక్కడ హంగామాలకు సంబంధించిన విషయాలేవీ ఉండేవి కావు. అనంతమైన తండ్రియే వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు, శ్రీకృష్ణుడు కాదు. వారు కృష్ణుడని అనుకున్నారు. రాజధానిని స్థాపన చేయాల్సి వచ్చినప్పుడు రాజయోగాన్ని నేర్పించారు. ఇకపోతే, శాస్త్రాలలో మహిమ మాత్రమే ఉంది. ఎవరైనా కేవలం మహిమ చేయడంతో రాజయోగాన్ని నేర్పిస్తారా? గీత మొదలైనవాటిని ఎవరైతే వినిపిస్తారో, వారేమైనా రాజయోగాన్ని నేర్పిస్తారా? వారు గీతను వినిపిస్తారు, ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, కేవలం వారి మహిమ చేస్తారు. భగవంతుడు ఎవరికైతే వినిపించారో, వారే రాజ్య పదవిని పొందారు. ఇకపోతే, ఈ పండుగలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. సంగమయుగ విషయమే ముఖ్యమైనది. శివబాబా వస్తారు, శివజయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శివబాబా వచ్చిన తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. కృష్ణుడు సత్యయుగానికి యజమాని. శివబాబా వచ్చి కృష్ణుడిని ఆ విధంగా తయారుచేసారు. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చి ఉండరు. కృష్ణపురిని స్థాపన చేసి ఉంటారు. ఆత్మను తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారుచేసేందుకు యోగాన్ని నేర్పించారు. మీరే తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు కదా. అలాగని మీరు సత్యయుగంలోనే కూర్చుండిపోతారని కాదు. 84 జన్మల లెక్క కూడా ఉంది. సత్యయుగం తర్వాత త్రేతా….. తప్పకుండా రావాల్సిందే. పగలు తర్వాత రాత్రి అవ్వాల్సిందే. సత్యయుగ స్థాపనను ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? ఎందుకంటే సత్యయుగం ఉన్నదే కొత్త ప్రపంచము. నేను పాత ప్రపంచాన్ని మారుస్తానని తండ్రి అంటారు. ఇది మిసైల్స్ తో జరిగే అదే మహాభారీ, మహాభారత యుద్ధము. పాండవులు కూడా ఉండేవారు, పాండవుల విజయం పొందారు అని అంటారు. తప్పకుండా స్వరాజ్యం లభించింది కనుక స్వరాజ్యంలోకి వస్తారు కదా. శరీరాన్ని ఎక్కడ వదిలినా సరే, రాజ్యంలోకైతే రావాలి. హిమాలయ పర్వతాలపై ఎవరూ శరీరాన్ని వదలరని లా చెప్తుంది. యోగమైతే ఇక్కడే నేర్చుకుంటారు. యోగబలంతోనే శరీరాన్ని వదలాలి. పర్వతాలపైకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం వారికేముంది. ఇవి కూడా వ్యర్థ ప్రలాపాలు. ఎలాగైతే సర్పం పాత కుబుసాన్ని వదిలి కొత్తది తీసుకుంటుందో, అలా ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. శాంతిధామానికి వెళ్ళి తర్వాత సత్యయుగంలోకి వస్తారు. బాబా అర్థం చేయించారు – సత్యయుగంలో శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, తమంతట తామే, ఆ సమయం వచ్చినప్పుడు, శరీరం వృద్ధాప్యానికి చెరుకున్నప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడైతే తిరిగి శాంతిధామానికి వెళ్ళరు. శాంతిధామానికి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఆ అభ్యాసం చేయడం జరుగుతుంది, తర్వాత మీ ఈ అభ్యాసం అవినాశీగా అయిపోతుంది. ఇక్కడ అభ్యాసాన్ని ఎందుకు చేయిస్తారంటే, పాత ప్రపంచాన్నే వదిలేయాలి. అక్కడైతే కొత్త ప్రపంచం ఉంటుంది. స్వర్గవాసులు శరీరాన్ని విడిచిపెడితే స్వర్గంలోకే వస్తారు. నరకవాసులు శరీరాన్ని విడిచిపెడితే నరకంలోనే ఉంటారు, స్వర్గంలోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారో, అప్పుడే సత్యయుగంలోకి వెళ్తారు, అప్పుడే దైవీ రాజధానిలోకి అనగా సత్యయుగంలోకి వెళ్ళగలరు. రాజా-మహారాజా అనే బిరుదు ఇక్కడ కూడా లభిస్తుంది. పదవి వేరేది లభించినా కానీ పేరు అదే కొనసాగుతూ ఉంటుంది. మారదు. కొంతమంది బిరుదులను స్థిరపరుస్తారు, ధనమిచ్చి బిరుదులు తీసుకుంటారు. ఇంతకుముందు లక్ష, రెండు లక్షలిస్తే బిరుదులు లభించేవి. ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. వారిని స్పిరిచ్యుల్ ఫాదర్, ఆత్మల తండ్రి….. అని అంటారు. వారిని పిలుస్తారు – ఓ బాబా రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేయండి, ఇక్కడ చాలా దుఃఖముంది, మమ్మల్ని రామరాజ్యంలోకి తీసుకువెళ్ళండి అని. డ్రామానుసారంగా 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఇలా పిలిచారు. పరమపిత పరమాత్మ రావాల్సిందే. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. ఈ పదాలను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారంగా వస్తాను. డ్రామా అనే పదాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. అప్పుడు, ఇది 5 వేల సంవత్సరాల డ్రామా అని మనుష్యులకు తెలుస్తుంది.
ఇప్పుడు మనుష్యమాత్రులందరూ పతితంగా ఉన్నారు, అందుకే, మేము పాపులము, నీచులము అని స్వయంగా చెప్పుకుంటారు. వాస్తవానికి ఇది వేశ్యాలయం కూడా, విషయ సాగరం కదా. విష్ణుపురి క్షీర సాగరంగా ఉండేది, అక్కడ లక్ష్మీ-నారాయణులు ఇరువురూ ఉండేవారు. క్షీరసాగరం అని పోల్చడానికి అంటారు. ఇకపోతే క్షీరసాగరమంటూ ఏదీ ఉండదు. సాగరమైతే సత్యయుగంలో కూడా ఇదే ఉంటుంది, కలియుగంలో కూడా ఇదే ఉంటుంది. సత్యయుగంలో సాగరమంతటికీ మీరు యజమానులు. మొత్తం పృథ్వికి, ఆకాశానికి మీరు యజమానులు. ఇప్పుడు ముక్కలు-ముక్కలుగా అయిపోయింది. ఇప్పుడిది సంగమయుగము. సంగమయుగం గుర్తుకొచ్చినప్పుడు, ఇప్పుడు సత్యయుగంలోకి వెళ్తామని భావిస్తారు. సంగమం ఉంది అంటే బాబా కూడా తప్పకుండా ఉంటారు. వారు ఈ ప్రపంచాన్ని మార్చేవారు. స్థాపన అయితే బ్రహ్మా ద్వారా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీరు చిత్రాలను తయారుచేస్తారు. బాబా అయితే లైట్-మైట్ యొక్క బిందువు. మీ ఆత్మ కూడా ఒక లైట్. ఇప్పుడు మీకు లైట్ ఎలా చూపించాలి, అందుకే మీ తలపై బిందువును చూపించారు. ఆత్మకు లైట్ ఎలా చూపించాలి. లైట్ ను చూపిస్తే అది పెద్దగా అయిపోతుంది. వారు పెద్ద లైట్ నే పూజిస్తారు, అందుకే మనుష్యులు పరమాత్మను జ్యోతి స్వరూపమని అంటారు. వాస్తవానికి లైట్ పవిత్రతకు గుర్తు. మనుష్యులు, పరమాత్మను జ్యోతి స్వరూపుడని భావిస్తారు. ఒకవేళ బిందువును చిన్న లైట్ గా చూపిస్తే, పూజ ఎలా జరుగుతుంది, అందుకే పెద్దదిగా చేస్తారు. తండ్రి అంటారు – నేను పరమ ఆత్మను, సుప్రీమ్ సోల్ ను. వీరినే మీరు పరమాత్మ అని అంటారు. కానీ చిన్న బిందువుకు పూజ ఎలా జరుగుతుంది. లైట్ ను ఎలా చూపించగలము. కొందరు లింగాన్ని పూజిస్తారు, షావుకార్లు అయితే వజ్రాన్ని గుండ్రంగా తయారుచేసి, దానిని పూజిస్తారు. పేరైతే శివలింగమనే పెడతారు. వారు ఒక నక్షత్రం వంటివారు, అంతేకానీ ఇంకేమీ కాదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఆత్మ ఏమీ చిన్నగా, పెద్దగా అవ్వదు. లేదంటే ఎలా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఆత్మను ఎలా అయితే తెలుసుకున్నారో, అలా తండ్రిని తెలుసుకున్నారు. ఆత్మ తండ్రిని పిలుస్తుంది, మీరు మీ ఆత్మను చూసారా? మరి పరమాత్మను ఎలా చూడగలరు? అవును, దివ్యదృష్టితో చూడగలరు. మీరు తెలుసుకున్నప్పుడు, ఇక చూడడం వలన లాభమేముంది? ఇది చదువు, చదువుకోవాల్సి ఉంటుంది. దీనితో మనుష్యులు దేవతలుగా తయారవుతారు. ఈ చదువు భవిష్య కొత్త ప్రపంచం కోసము. ఈ లక్ష్మీ-నారాయణులు ఇటువంటి కర్మలను ఎక్కడ నేర్చుకున్నారు? సంగమంలో. తండ్రి అంటారు – నేను సంగమంలోనే వచ్చి మీకు కొత్త ప్రపంచం కోసం చదువును చదివిస్తాను. బాబా ప్రదర్శనీలలో టెలిగ్రామ్ పంపిస్తారు, అందులో కూడా, ఇది సంగమయుగమని రాయాలి. తండ్రి అంటారు – మీరు భవిష్య 21 జన్మల కోసం నా నుండి జన్మ సిద్ధ అధికారాన్ని పొందవచ్చు అని. సంగమయుగం అనే పదాన్ని తప్పకుండా రాయాలి. టెలిగ్రామ్ ఏదైతే వెళ్తుందో, దాని ఏక్యురేట్ కాపీ అక్కడ పెట్టాలి. పెద్ద అక్షరాలలో రాయాలి. రోజు-రోజుకు స్పష్టమవుతూ ఉంటుంది. కింద ఏమని రాస్తారంటే – బాప్ దాదా, ఆత్మల తండ్రి అయిన శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా నేర్పిస్తారు. తండ్రి అంటారు – నాకు శరీరం ఆధారమైతే కావాలి కదా. శివుడైతే నిరాకారుడు. వారికి తమకంటూ శరీరమేమీ లేదు. బ్రహ్మా, విష్ణు, శంకరులైతే ఆకారీ సూక్ష్మ శరీరధారులు. మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి. తండ్రి అంటారు – నాకు శరీరం ఎక్కడుంది. అలాగని నేను నామ రూపాలకు అతీతుడను అని కాదు. చాలా స్పష్టంగా పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను నిరాకారుడిని, కానీ నేను వచ్చినప్పుడు నాకు శరీరం తప్పకుండా కావాలి. నేను గర్భంలోకి రాను. నేను ఈ సాధారణ తనువులోకి వచ్చానని నేను స్వయంగా చెప్తున్నాను. వీరు (బ్రహ్మా) ముందు పూజ్యునిగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయ్యారు. మాలలో కూడా ముందు శివబాబా, తర్వాత రెండు పూసలుంటాయి. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ మాల ప్రవృత్తి మార్గం వారిదేనని మీకిప్పుడు తెలుసు. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో పతితంగా ఉండేవారే, ఇప్పుడు శివబాబా మతంతో పావనంగా అయి సృష్టిని పావనంగా తయారుచేస్తున్నారు, అందుకే వారి స్మృతిచిహ్నంగా మాల తయారయింది. రుద్రమాల మరియు విష్ణు యొక్క వైజయంతిమాల ఉన్నాయి. బ్రాహ్మణుల మాల తయారవ్వదు. తయారుచేసేందుకు ప్రయత్నించారు కానీ తయారవ్వలేదు, అందుకే మాలను తయారుచేయడం, అవ్యక్త పేర్లను ఇవ్వడం మానేసారు. ఇక్కడ పెట్టిన పేర్లను ఇక్కడే వదిలేసి, మళ్ళీ తమ పాత పేర్లనే పెట్టుకొని పారిపోతారు. వారిని ఎవ్వరూ ఆ కొత్త పేర్లతో పిలవరు. తండ్రి మన తండ్రి, టీచరు, గురువు. అటువంటి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. కానీ మాయ ఎలాంటిదంటే అది మరిపింపజేస్తుంది, అందుకే అవస్థ కింద-మీద అవుతూ ఉంటుంది. వాడిపోయిన ఫీలింగ్ వస్తుంది. శివబాబా స్మృతితో మళ్ళీ అలెర్ట్ అయిపోతారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వికారీ సంబంధాలతో మమకారాన్ని తొలగించివేయాలి. భవిష్య కొత్త సంబంధాలతో బుద్ధియోగాన్ని జోడించాలి.
2. ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు శ్రీమతాన్ని అనుసరిస్తూ అంధులకు చేతికర్రగా అవ్వాలి.
వరదానము:-
శక్తి స్వరూపంగా అయ్యేందుకు కోమలతను అద్భుతంలోకి పరివర్తన చేయండి. కేవలం స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో కోమలంగా అవ్వండి. కర్మలో ఎప్పుడూ కోమలంగా అవ్వకండి, ఇందులో శక్తి రూపంగా అవ్వాలి. ఎవరైతే శక్తి రూపం యొక్క కవచాన్ని ధారణ చేస్తారో, వారికి మాయ యొక్క ఏ బాణము తగలదు. అందుకే మీ ముఖం, నయనాల ద్వారా కోమలతకు బదులుగా శక్తి రూపం కనిపించాలి, అప్పుడు మాయాజీతులుగా అయి పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికెట్ తీసుకోగలరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!