26 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
25 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు, దేహాభిమానం యొక్క తుఫాన్లు అలసిపోయేలా చేస్తాయి, దేహీ-అభిమానులుగా అయినట్లయితే అలసట దూరమైపోతుంది”
ప్రశ్న: -
ఏ సంస్కారం 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది?
జవాబు:-
ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారముంటే… తండ్రిపై లేక చదువుపై అలిగినట్లయితే 21 జన్మల భాగ్యం పాడైపోతుంది, అందుకే బాబా అంటారు – మధురమైన పిల్లలు, దేహాభిమానానికి వశమై ఎప్పుడూ, నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహాయం చేసాను అనే తప్పుడు నషా కలగకూడదు. చూడండి, బాబా ఎంత గొప్ప అథారిటీ, కానీ ఎంత నిరహంకారిగా ఉన్నారు, అందుకే సీ ఫాదర్ (తండ్రిని చూడండి).
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు….. (రాత్ కే రాహీ థక్ మత్ జానా…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన చాలా కాలం విడిపోయి తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. ఎవరైతే యోగయుక్తులైన సర్వీసబుల్ పిల్లలుగా ఉన్నారో, వారు ఈ పాట అర్థాన్ని వెంటనే తెలుసుకోగలరు. మనము రాత్రి ప్రయాణీకులము అనగా బ్రాహ్మణుల రాత్రి ఇప్పుడు పూర్తయ్యింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్పపు రాత్రి పూర్తవుతుంది. హద్దులో కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణులకు అర్ధకల్పం పగలు మరియు అర్ధకల్పం రాత్రి ఉంటాయి. ఈ సమయంలో తండ్రి వచ్చేటప్పటికి అంధకారముంది. ఇప్పుడు ప్రభాత సమయంలోని మొదటి వెలుగు మొదలైంది అనగా తెల్లవారుతుంది. మధురాతి-మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో అలసిపోకండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారని పిల్లలకు తెలుసు. ఎలాగైతే దైహిక యాత్రలు ఉంటాయి, ఇంతకుముందు కాలినడకన వెళ్ళేవారు. చాలా నెమ్మది-నెమ్మదిగా వెళ్ళేవారు, మధ్య-మధ్యలో వసతి గృహాలు నిర్మించబడి ఉండేవి. మేము ఫలానా-ఫలానా గమ్య స్థానాలలో ఉండాల్సి ఉంటుందని వారికి తెలుసు. ఇదివరకు చాలా శ్రద్ధతో కాలినడకన వెళ్ళేవారు, అందులో చాలా శ్రమ ఉండేది. ఇప్పుడైతే ఇది చాలా సహజము. దీనిని సహజ స్మృతి లేక యోగం అని అంటారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి, అలసిపోవడమంటే దేహాభిమానులుగా అవ్వడమని అర్థము. మాయ విఘ్నాలు కలుగుతాయి, ఇందులో అనుమానమేమీ లేదు కానీ ఇందులో అలసిపోకూడదు. అలసిపోవడం వల్ల దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి అంటారు – పిల్లలూ, శరీర నిర్వహణ కోసం పనులైతే చేయాలి, వాటి కోసం అనుమతి ఉంది. 8 గంటలు శరీర నిర్వహణ కోసము, 8 గంటలు విశ్రాంతి, మిగతా 8 గంటలు దీని కోసం కేటాయించండి. ఇప్పుడైతే ఎవరూ పూర్తి 8 గంటలు ఇవ్వడం లేదు. అంతిమంలో 8 గంటల వరకు ఉంటారు. చార్టును పెంచుకుంటూ ఉండండి. ఇక్కడకు వచ్చి కూర్చొన్నప్పుడు, స్మృతినిప్పించడం జరుగుతుంది. దీనిని మీరు నిష్ఠ (యోగం) అని అంటారు. ఇక్కడకు వచ్చి తండ్రి స్మృతిలో కూర్చుంటారు. అలాగని, కేవలం ఇక్కడికే వచ్చి స్మృతిలో కూర్చోవాలని కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి లేవాలి అని భావించేవారు చాలా మంది ఉంటారు కానీ తండ్రి అంటారు – వ్యాపార-వ్యవహారాలు చేసుకుంటూ, ఎక్కడికైనా వస్తూ-వెళ్తూ కూడా మీరు యోగంలో ఉండండి. గంగా స్నానాలు మొదలైనవి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామ-రామ అని జపిస్తారు కదా. ఇక్కడ మీకు, ఏమీ స్మరించవలసిన అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఈ తండ్రి పిల్లలతోనే మాట్లాడుతున్నారు. స్మృతి యాత్రలోనే మీ కళ్యాణముంది, ఇందులో అలసిపోకూడదు. ఇందులో తుఫాన్లు చాలా వస్తాయి. తుఫాన్లు అంటే మట్టి తుఫాన్లు మొదలైనవేమీ కాదు. మాయా తుఫాన్లు రావడంతో బుద్ధియోగం తెగిపోతుంది, ఇక తర్వాత దేహాభిమానంలోకి రావడంతో వ్యాపార-వ్యవహారాలు, పిల్లలు మొదలైనవారు గుర్తుకొస్తారు. తండ్రి అంటారు – ఇప్పుడు ఈ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి. మీ పిల్లలు వారసులుగా అవ్వడమనేది జరగదు, అంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసులు నిలబడ్డారు. హద్దు వారసత్వం నశించనున్నది. ఇప్పుడు కొడుకు పెద్దవాడవుతాడు, వివాహం చేసుకుంటాడు, తర్వాత ఇలా జరుగుతుంది, అని షావుకార్లు అనుకుంటారు. తండ్రి అంటారు – ఇప్పుడు అంత సమయం లేదు, అందుకే ప్రపంచం పట్ల ఉన్న మోహాన్ని పూర్తిగా తొలగించండి. ఇది శ్మశానవాటిక. వ్యాపార-వ్యవహారాలు, పిల్లలు మొదలైనవాటి చింతనలో మరణించినట్లయితే అనవసరంగా తమను తాము నాశనం చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే, చాలా సంపన్నంగా అవుతారు. దేహాభిమానంలోకి రావడం వల్ల నాశనమవుతారు. దేహీ-అభిమానులుగా అవ్వడం వల్ల సంపన్నంగా అవుతారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా భవిష్య 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. స్మృతి చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. అది ఇక కల్ప-కల్పానికి అలాగే ఉండిపోతుంది. ఇది ఎంత పెద్ద నష్టము. మేము పూర్తి వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అని ఆలోచించాలి. ధనం పట్ల లోభం కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. టూ మచ్ (అతి)లోకి వెళ్ళకూడదు. ఎవరైనా దివాలా తీస్తే, చాలా చింతిస్తారు. శివబాబాను పూర్తిగా మర్చిపోతారు. జ్ఞానంలోకి వచ్చాము, అందుకే దివాలా తీసాము, అనారోగ్యం పాలయ్యాము అని అంటూ దోషం మోపుతారు. ఎప్పుడూ ఇలా అనుకోకూడదు. అనారోగ్యాలు మొదలైనవి రావడం కర్మభోగము. ఇది మంచిదే, వికర్మలు వినాశనమైపోతాయి. ధర్మరాజు శిక్షలు అనుభవించడం కంటే అనారోగ్యం మంచిది కదా. కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలి. ఇది మహారోగీ శరీరము. దీన్ని ఎంతగా సంభాళించడం జరుగుతుంది. నడుస్తూ-నడుస్తూ ఆగిపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇటువంటి పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా పూర్తిగా మర్చిపోవాలి. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉండడం చూస్తే, పిల్లల మనస్సు పాత దాని నుండి పూర్తిగా తొలగిపోతుంది. బాబా, ఇల్లు త్వరగా కట్టండి, పాత ఇంట్లో చాలా కష్టంగా ఉందని అంటారు. ఈ పాత ప్రపంచం చాలా అశుద్ధంగా ఉందని మీకు కూడా తెలుసు. ఇది మీ అనంతమైన సన్యాసము. వారు ఇళ్ళు-వాకిళ్ళను సన్యసిస్తారు. దానిని హద్దు సన్యాసమని అంటారు. మీరు వికారాలను సన్యసిస్తారు. తండ్రి అంటారు – దేహ సహితంగా మీ దేహ సంబంధాలన్నింటినీ వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి. ఈ కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మేము స్వర్గ రాజధాని కోసం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీ బుద్ధికి తెలుసు. జ్ఞానము యొక్క మూడవ నేత్రం లభించింది. ఇదంతా శ్మశానవాటికగా అవ్వనున్నది. దీని పట్ల ప్రేమనుంచుకోకూడదు. ఈ రోజుల్లో మనుష్యుల వద్ద చాలా ధనముంది కనుక వికారాలు కూడా తీవ్రమైపోయాయి. కామ వికారం ఎంత తీవ్రంగా ఉంది. కామము లేకుండా ఉండలేరు. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, తర్వాత రాస్తారు – బాబా, ఈ రోజు వీరికి భూతం పట్టింది, నల్ల ముఖం చేసుకున్నారు అని. ఎంతటి ఎదురుదెబ్బను తిన్నారు! ఒక్కసారిగా 5 అంతస్థుల నుండి పడిపోయారు. మొట్టమొదటిది దేహాభిమానము. పై నుండి కిందపడితే ముక్కలు-ముక్కలుగా అయిపోతారు, అంతా సమాప్తమైపోతుంది, ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మళ్ళీ పురుషార్థం చేయడానికి సమయం పడుతుంది. ఇదే అన్నింటికంటే పెద్ద దెబ్బ. అందుకే కామము మహాశత్రువు అని తండ్రి అంటారు. వికారాలనే పతితత్వము అని అంటారు. బాబా, మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని అంటారు. భారత్ లోనే సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు కదా. భారత్ యే నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు భారత్ వికారీగా అయిపోయింది. సంపూర్ణ నిర్వికారులని సూర్యవంశీయులను అంటారు. రామచంద్రుని రాజ్యంలో కూడా వికారాల విషయం ఉండదు కానీ కళలు తగ్గిపోతాయి. 1250 సంవత్సరాలు తగ్గిపోయాయి కనుక ఆ ప్రపంచం యొక్క శక్తి తగ్గిపోయినట్లే కదా. అందుకే దానిని సతోప్రధానమని, తర్వాత దానిని సతో అని అంటారు. మేము మమ్మా-బాబాలను ఫాలో చేసి, సూర్యవంశీ మహారాజ-మహారాణులుగా అవ్వాలని మీరు కోరుకుంటారు. ఇందులో కష్టం లేక ఖర్చు మొదలైనవాటి విషయమేమీ లేదు, ఇందులో నోటితో మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు. కేవలం స్మృతి చేయాలి, దీనినే సహజ యోగమని అంటారు. ఇందులో చాలా శ్రమ కావాలి. బాబా ముందు అందరూ మహారథులే. ఇందులో పూర్తి యోగం కావాలి, అప్పుడే బాణం తగులుతుంది. యోగబలం కదా. యోగం చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా యోగంలోనే చాలా వస్తాయి. అనంతమైన తండ్రి కూర్చొని, మధురాతి-మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిపై లేక చదువుపై ఎప్పుడూ అలగకూడదు. అలిగినట్లయితే 21 జన్మల భాగ్యంపై అలిగినట్లే. చాలా మంచి-మంచి పిల్లలు కూడా అలుగుతారు. నేను ఇంతమందికి అర్థం చేయించాను అని దేహాభిమానం యొక్క నషా ఎక్కుతుంది. దేహ-అహంకారం రావడంతో పడిపోతారు. ఇందులో అహంకారం రాకూడదు. శివబాబాకు ఏమైనా అహంకారం ఉందా? వారు ఎంతటి నిరహంకారి కానీ ఎంత గొప్ప అథారిటీ! నేను సాధారణ తనువులోకి, సాధారణమైన ఇంట్లోకి వస్తాను, షావుకార్ల ఇంట్లోకి రాను అని అంటారు. కనుక ఇప్పుడు పిల్లలు మేలుకోవాలి. బాబా చాలా మంచి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. పిల్లలైన మీదే ఆలస్యము. డ్రామానుసారంగా అవస్థ ఇంకా అంత శక్తివంతంగా అవ్వలేదు. మున్ముందు శక్తివంతంగా అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో స్వర్గ స్థాపన జరిగిపోతుందని మనం గవర్నమెంట్ కు సూచననిస్తాము. మనుష్యులు ఈ విషయాలను వార్తాపత్రికలు మొదలైనవాటిలో చదివినప్పుడు, వచ్చి మిమ్మల్ని అడుగుతారు. కొన్ని సంవత్సరాలలో స్థాపన జరుగుతుంది కావున వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఎంతోమంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవి కొంత సమయం కోసమే ఉంటాయి. మీరు ఈ ఆస్తిని, ఆస్తిగా భావించరు. ఇవి కొద్ది రోజుల కోసమే ఉన్నాయని మీకు తెలుసు. ఈ భవనాలు మొదలైనవి నివసించడం కోసం నిర్మించారు, ఎందుకంటే చాలా మంది పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు మధుబన్ కు వస్తారు. మధుబన్ హెడ్ ఆఫీస్. ఈ రోజు మీరేమి చేస్తున్నారు, రేపు ఏమి చేస్తారు? ఇక్కడ తపస్సు చేస్తారు. తర్వాత ఢిల్లీ, బృందావనం మొదలైన చోట్లకు వెళ్ళి రాజ్యం చేస్తారు. మన స్మృతి చిహ్నాలు ఎలా నిర్మించబడి ఉన్నాయనేది మంచి రీతిగా చూపించాలి. ఇప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో, అది 5 వేల సంవత్సరాల క్రితం కూడా చేసాము. మొట్టమొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాము. ఇకపోతే, దిల్వాడా మందిరం మొదలైనవి తర్వాత తయారుచేయబడ్డాయి. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దిల్వాడా మందిరం ఎప్పుడు నిర్మించబడింది అనే లెక్కను తీయాలనుకుంటే తీయవచ్చు. అది పూర్తిగా మన స్మృతిచిహ్నమే. ఇది స్థాపన యొక్క స్మృతిచిహ్నమని మీకు తెలుసు.
మధురాతి-మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. సేవను వృద్ధి చేసే యుక్తులను రచించాలి. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, అతడి పెద్ద పరివారం కూడా వెళ్ళిపోయింది. రావణుడి పరివారం ఎంత పెద్దదో చూడండి. రామునిది ఎంత చిన్న పరివారము. గాయనం కరెక్టుగా ఉంది. కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు కానీ నిశ్చయం కూర్చోదు. మీరు శరీర నిర్వహణార్థం కర్మలు తప్పకుండా చేయాలి. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుంటారో – పాండవులు, వారు ఈ గవర్నమెంట్ నుండి పాలన తీసుకోవచ్చు. వారి సంభాళన అంతా మనం చేయవలసి ఉంటుంది. మరి పిల్లల అవస్థ కూడా ఆ విధంగా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచానికి సంబంధించినదంతా మర్చిపోవాలి. స్మృతియాత్రలో ఎవరైతే పక్కాగా, ఆనందంగా ఉంటారో వారి అవస్థ కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వము స్మృతిలో శరీరాన్ని వదులుతారు, అప్పుడు కూడా వాయుమండలంలో పూర్తి నిశ్శబ్దం ఏర్పడుతుంది. బాబాకు అనుభవముంది. మనుష్యులు మరణించినప్పుడు, ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడుతుంది కదా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చివర్లో అంతా మర్చిపోయినట్లుగా అవుతుంది. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. చివర్లో సంతోషంగా, హర్షితముఖులుగా అయి శరీరాన్ని వదలాలి. అంతే. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది గుర్తుంటే, అటువంటి అవస్థ ఉంటే విజయమాలలో కూర్చబడేందుకు యోగ్యులుగా అవుతారు. మీలో శాంతి యొక్క కరెంటు ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు, ఇక్కడ ఎంతో శాంతి ఉందని అంటారు. ఇది రియల్ శాంతి. ఆత్మ శరీరం నుండి అతీతంగా అవుతుంది. ఆత్మలైన మనము శాంతి స్వరూపులమని మీకు తెలుసు. మనము మన స్వధర్మంలో కూర్చుండిపోతాము. కర్మలు చేయకుండా మనుష్యులెవరూ ఉండలేరు. మనుష్యులు హఠయోగంతో చేయలేనిది ఏముంటుంది. మన స్వధర్మమే శాంతి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి అని తండ్రి అంటారు. తండ్రిని స్మృతి చేయడంతో వారసత్వం లభిస్తుంది. నన్ను కూడా ఆ ఇంట్లో స్మృతి చేయండి అని తండ్రి అంటారు. నేను ఇక్కడకు తాత్కాలికంగా వస్తాను. మీ బుద్ధి తండ్రి స్మృతిలో శాంతిధామంలో స్థితి అయి ఉండాలి. ఆ ఇంటి వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా. అది ఆత్మల ఇల్లు. ఇది జీవాత్మల ఇల్లు. మీ ఇంటిని కూడా మర్చిపోకండి, బాబాను కూడా మర్చిపోకండి. తండ్రిని స్మృతి చేయడంతోనే, పవిత్రంగా అయి ఇంటికి వెళ్ళిపోతారు. జ్ఞానాన్ని ధారణ చేయడంతో మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేయడానికి వస్తారు. ఎంత వీలైతే అంత, ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తూ వెళ్ళండి. సదా తండ్రినే చూస్తూ ఉండండి. బాబా ఏమి చేసారు అనేది మీకు తెలుసు! అంతా మాతలకు ఇచ్చేసారు. అంతా మాతల సేవలో వినియోగించండి అని శివబాబానే డైరెక్షన్ ఇచ్చారు. ఒకరిని చూసి మరొకరు ఫాలో చేసారు, స్వాహా అయిపోయారు. కానీ తర్వాత ఇక్కడ నిలవగలగాలి కదా. డ్రామానుసారంగా భట్టీ కూడా జరిగింది. పాకిస్తాన్-హిందుస్థాన్ ఏర్పడ్డాయి. మీ భట్టీ ముందు పాకిస్తాన్ లో మొదలయ్యింది. మీరు నదిని దాటి వచ్చారు – శాస్త్రాలలో ఏవేవో విషయాలను రాసేసారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వింటున్నారు కదా. మళ్ళీ కల్పం తర్వాత మీరే వింటారు. ఇప్పుడు తండ్రి అంటారు – చెడు వినకండి, వ్యాపారం మొదలైనవి చేసుకోండి కానీ చెడు వినకండి. ప్రతి విషయంలో శ్రీమతాన్ని తీసుకోండి అని తండ్రి అంటారు. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏమి చేయాలి అని అడిగినట్లయితే బాబా అంతా తెలియజేస్తారు. ఏ విషయాన్ని అయినా అడగాలనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరెందుకు భయపడతారు. అడుగడుగునా సలహా అడగాలి. శ్రీమతమనుసారంగా నడుచుకుంటే అడుగడుగులోనూ పదమాలు ఉంటాయి. మీ ప్రతి క్షణం ఏదైతే గడుస్తుందో, అందులో పదమాలు ఉంటాయి. కనుక ఎంత సంపాదన జరుగుతుంది! అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విజయమాలలో కూర్చబడేందుకు ఈ శరీరం నుండి అతీతంగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. బుద్ధి ద్వారా ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి.
2. ధనం పట్ల టూ మచ్ లోభం ఉండకూడదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన ఉండకూడదు. ఎప్పుడూ తండ్రిపై లేక చదువుపై అలగకూడదు.
వరదానము:-
ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేసినట్లయితే, మీరు ఒక్క సెకండులో అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేయండి. ఎవరైనా తమ సంస్కార-స్వభావాల రూపంలో పరీక్షగా అయి ఎదురుగా వచ్చినట్లయితే, మీరు ఆ ఒక్కరి స్మృతితో, అటువంటి ఆత్మ పట్ల కూడా దయాహృదయమనే శ్రేష్ఠ సంస్కార-స్వభావాన్ని ధారణ చేయండి. ఎవరైనా దేహధారి దృష్టితో ఎదురుగా వచ్చినట్లయితే, వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి. ఇలా పరివర్తన చేసే యుక్తి వస్తే, విఘ్నజీతులుగా అవుతారు. అప్పుడిక సంపర్కంలోకి వచ్చే సర్వాత్మలు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!