25 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
24 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఈ పాత ప్రపంచం యొక్క అంతిమము, అందుకే సంగమయుగంలో మీరు భవిష్య రాజ్యాధికారం కోసం యోగ్యులుగా తయారవ్వాలి”
ప్రశ్న: -
పిల్లల్లో ఏ అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారులుగా అవ్వగలరు?
జవాబు:-
ఆల్ రౌండ్ సేవ చేసే అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారులుగా అవ్వగలరు, ఎవరైతే ఆల్ రౌండ్ సేవ చేసి అనేకులకు సుఖమిస్తారో, వారికి దాని ప్రతిఫలం కూడా లభిస్తుంది. పిల్లలు సదా ప్రతి సేవలో హాజరై ఉండాలి. తల్లి-తండ్రులను షో చేసే విధంగా (ప్రత్యక్షం చేసేలా) తెలివైనవారిగా అవ్వండి. మమ్మా-బాబా అని అంటున్నారంటే, వారిలా తయారై చూపించండి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఈ పాపపు ప్రపంచం నుండి..
ఓంశాంతి. పాప ప్రపంచం అని దేనినంటారు మరియు పుణ్య ప్రపంచం అని దేనినంటారు, పతిత ప్రపంచమని దేనినంటారు మరియు పావన ప్రపంచమని దేనినంటారు – ఇది కేవలం మధురాతి-మధురమైన బ్రహ్మాకుమార-కుమారీలకు మాత్రమే తెలుసు. మనుష్యులు – పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేసేవారా, రండి అని పిలుస్తారు కానీ వారి గురించి తెలియదు. ఓ పతిత పావనా… అని కూడా ఆత్మనే అంటుంది. మనుష్యమాత్రులందరూ పిలుస్తూ ఉంటారు. కానీ పావన ప్రపంచమని దేనినంటారు, అది ఎప్పుడు మరియు ఎలా స్థాపనవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ ఫుల్ తండ్రికి చెందినవారిగా అయ్యారు, అందుకే నాలెడ్జ్ ఫుల్, జ్ఞానసాగరుడైన తండ్రి గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మిగిలినవారెవరికీ – పావన ప్రపంచం మళ్ళీ పతితంగా ఎలా అవుతుంది, పతిత ప్రపంచం మళ్ళీ పావనంగా ఎలా అవుతుంది, పతిత ప్రపంచంలో ఎవరుంటారు మరియు పావన ప్రపంచంలో ఎవరుంటారు అనేది అస్సలు తెలియదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. పావన ప్రపంచమైన భారత్ లో తప్పకుండా ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క రాజ్యముండేది, అందుకే భారత్ అన్నింటికంటే ప్రాచీన దేశంగా పిలవబడుతుంది. మనం మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పతితపావనుడైన తండ్రి మనకు యుక్తులను తెలియజేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు – నేను ఒక్క సెకెండులో యుక్తి తెలియజేస్తాను. తండ్రి, కొత్త ప్రపంచ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకే వస్తారు. ఇది అనంతమైన తండ్రి నుండి లభించే అనంతమైన వారసత్వము. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగం నేర్చుకుంటున్నాము. తండ్రి అంటారు – మీరే సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరే సతోప్రధానంగా తయారవ్వాలి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, హిందు ధర్మం కాదు. భారత్ కు చెందిన దేవీ-దేవతా ధర్మమే మొట్టమొదట ఉండేది. ఆ తర్వాత తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. క్రైస్తవులు కూడా పునర్జన్మలు తీసుకుంటూ వృద్ధి చెందుతారు. బౌద్ధుల ధర్మ స్థాపన చేసేవారు బుద్ధుడు, వారు ధర్మ స్థాపకుడు అయినట్లు. ఒక్క బుద్ధుడి నుండి ఎంతమంది బౌద్ధులు వెలువడ్డారు. క్రీస్తు కూడా ఒక్కరే. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూడండి. అన్ని ధర్మాలు ఈ విధంగా నడుస్తూ వచ్చాయి. అదే విధంగా, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమున్నప్పుడు ఇవేవీ ఉండేవి కాదు. మిగిలిన వారి గురించి మీకు తెలుసు. క్రైస్తవ ధర్మాన్ని క్రీస్తు, ఇస్లామ్ ధర్మాన్ని ఇబ్రహీమ్ స్థాపన చేసారు. అచ్ఛా, సత్యయుగంలో ఉన్న ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారు? సత్యయుగంలో దేవీ-దేవతల రాజధాని ఉండేది కదా. అంటే తప్పకుండా ఎవరో ఆ రాజ్య స్థాపన చేసి ఉంటారు. సత్యయుగంలో దేవీ-దేవతా ధర్మముండేది, దానిని ఇప్పుడు తండ్రి స్థాపన చేస్తారు కనుక తండ్రికి సంగమయుగంలో తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనుష్యమాత్రులందరూ పతిత ప్రపంచంలో కూర్చొని ఉన్నారు. పాత ప్రపంచంలో కోట్లాది మంది మనుష్యులున్నారు. కొత్త ప్రపంచంలో ఇంతమంది మనుష్యులుండరు. అక్కడ ఒకే ధర్మముండేది. ఇస్లామీయులు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైనవారెవరూ ఉండేవారు కాదు. ఆ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయఃలోపమైపోయింది. ఆ ధర్మాన్ని భగవంతుడు ఎలా స్థాపించారు అనేది ఎవ్వరికీ తెలియదు. దేవతా ధర్మం అన్న పేరే మర్చిపోయారు, హిందు ధర్మమని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు – ఎప్పుడైతే పాత ప్రపంచం పరివర్తన అవ్వాల్సి ఉంటుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడిది ఈ పాత ప్రపంచం యొక్క అంతిమము. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఈ మహాభారత యుద్ధంతోనే పాత ప్రపంచం ముగిసింది. అందరూ సమాప్తమైపోయారని, ఎవ్వరూ మిగలలేదని, పంచ పాండవులు మిగిలారని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని గీతలో చూపిస్తారు. కానీ అలా ఏమీ జరగదు. దీనిని తండ్రి స్థాపన చేస్తారు. ప్రళయం జరగడం లేక జలమయం అవ్వడమనేది జరగదు. ఓ పతితపావనా రండి, మా దుఃఖాన్ని హరించి సుఖాన్నివ్వండి అని బాబాను పిలుస్తారు, ఎందుకంటే ఇప్పుడిది రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని కోరుకుంటున్నారంటే, తప్పకుండా ఇది రావణ రాజ్యం అన్నట్లు కదా. ఇప్పుడు రామ రాజ్య స్థాపన, రావణ రాజ్య వినాశనం జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. నేను నేర్పించే యుక్తులను ఎవరైతే నేర్చుకుంటారో, వారే వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం అక్కడ ఏ మాత్రము ఉండదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఎవరి బుద్ధిలో జ్ఞానముంటుందో, వారు ఇతరులకు అర్థం చేయిస్తారు. నంబరువారుగా ఉంటారు కదా. సర్వీసబుల్ పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది. సత్యయుగంలో మొట్టమొదట తప్పకుండా దేవీ-దేవతా ధర్మం వారు ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా మొట్టమొదటగా బ్రాహ్మణులనే రచిస్తారు. ఇది జ్ఞాన యజ్ఞం కదా, కనుక తప్పకుండా బ్రాహ్మణ సంప్రదాయం వారే కావాలి. బ్రాహ్మణ సంప్రదాయం తప్పకుండా సంగమంలోనే ఉంటుంది. ఆసురీ సంప్రదాయం కలియుగంలో ఉంటుంది, దైవీ సంప్రదాయం సత్యయుగంలో ఉంటుంది. కనుక తప్పకుండా సంగమంలోనే దైవీ సంప్రదాయ స్థాపన జరుగుతుంది. పిల్లిమొగ్గలాట ఆడుతున్నప్పుడు పాదాలు మరియు పిలక కలుస్తాయి. మీరు బ్రాహ్మణులు అనేది మళ్ళీ గుర్తుకొస్తుంది. విరాట రూప చిత్రం కూడా అవసరము. దీని వివరణ చాలా బాగుంటుంది. బాబా, మేము మీకు 6 నెలల పిల్లలము, 4 రోజుల పిల్లలమని అంటారు కూడా. కొందరు – నేను ఒక రోజు బిడ్డను అంటారు అనగా ఈ రోజే బాబాకు చెందినవానిగా, ముఖవంశావళిగా అయ్యానని అంటారు. ఎవరైతే జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అవుతారో వారు – బాబా, మేము మీ వారము అని అంటారు. చిన్న బాలుడు ఇలా చెప్పలేడు. ఈ జ్ఞానం పెద్దవారి కోసము. బాబా, నేను మీకు చిన్న బిడ్డను అని అంటారు. చిన్న పిల్లలకు చిత్రాలను చూపించి అర్థం చేయించడం సహజము. రోజు-రోజుకు అర్థం చేయించే విధానం విస్తారమవుతూ ఉంటుంది. ఈ చిత్రాల యుక్తి డ్రామా ప్లాను అనుసారంగా 5 వేల సంవత్సరాల క్రితం వలె వెలువడింది. దీనికి సంబంధించి – ఇది ప్రారంభంలో ఎందుకు వెలువడలేదు, ఇప్పుడు ఎందుకు వెలువడింది అని ఎవరూ ప్రశ్నించలేరు. డ్రామానుసారంగా ఏ యుక్తి ఎప్పుడు వెలువడేది ఉంటుందో, అప్పుడే వెలువడుతుంది. స్కూల్లో చదువుకు సంబంధించి నంబరువారుగా తరగతులుంటాయి. అంతేకానీ, మొదట్లోనే పెద్ద పరీక్ష పాస్ అవుతారని కాదు. ముందుగా అల్ఫ్ (తండ్రి) మరియు బే (రాజ్యాధికారము) గురించి చదివించడం జరుగుతుంది కదా. బాబాకు పిల్లలుగా అయితేనే తండ్రి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. తండ్రిని తండ్రి అని అన్న తర్వాత ఇక నిశ్చయం తెగదు. కానీ ఇక్కడ బాబా-బాబా అని అన్న తర్వాత కూడా నిశ్చయం తెగిపోతుంది. వీరు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు కనుక వారి శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి అంటారు – మిగిలిన విషయాలన్నింటినీ వదిలి నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. నడుస్తూ-తిరుగుతూ ఇది గుర్తున్నట్లయితే, సంతోషం కూడా ఉంటుంది. కానీ ఈ స్మృతి ఎందుకు నిలవదు. మీరైతే గ్యారంటీ ఇచ్చారు – బాబా, మేము మీ వారిగా అయితే, ఇక మాకు ఎవరి పట్ల మమకారం ఉండదు, మేము మీ మతాన్నే అనుసరిస్తాము అని. తండ్రి కూడా అంటారు – శ్రీమతాన్ని అనుసరించకపోతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. శ్రీమతాన్ని అనుసరిస్తే సంతోషపు పాదరసం ఎక్కుతుంది. ఆత్మకు అతీంద్రియ సుఖం లభించినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. పరమపిత పరమాత్మ మాకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చారని, దానిని 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పొగొట్టుకున్నామని, మళ్ళీ తండ్రి ఇస్తున్నారని ఆత్మకు తెలుసు. కనుక అపారమైన సంతోషముండాలి కదా. ఆంతరిక సంతోషం కూడా కనిపిస్తుంది కదా. ఈ లక్ష్మీ-నారాయణుల ముఖం ద్వారా కనిపిస్తుంది కదా. అజ్ఞాన కాలంలో కూడా కొందరు చాలా సంతోషంగా ఉంటారు, ఇతరులతో మాట్లాడడంలో కూడా బాగుంటారు.
మనుష్య సృష్టిలో అందరికంటే ఉన్నతమైన పొజిషన్ ఎవరిది? వాస్తవానికి అందరికన్నా ఉన్నతమైనవారు శివ పరమాత్మ, వారినే అందరూ ‘ఫాదర్’ అని పిలుస్తారు. కానీ వారి ఆక్యుపేషన్ (కర్తవ్యం) గురించి తెలియదు. తండ్రి వచ్చినప్పుడే, వారు తమ పరిచయాన్నిస్తారు. మనకు బాబా నుండి వైకుంఠ రాజ్యం లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మరి సంతోషముండాలి కదా. మనం నరుని నుండి నారాయణునిగా అవుతాము. కొందరు చేతులు ఎత్తుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికైతే నిశ్చయముంటుందో, వారికి – ఇప్పుడు మేము 84 జన్మలు పూర్తి చేసాము, ఇప్పుడు మేము బాబా మతం అనుసారంగా నడుచుకొని విశ్వానికి యజమానులుగా అవుతాము అనే సంతోషముంటుంది. ఈ చదువు యొక్క నషా ఎంత ఉండాలి. ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైనవారికి నషా ఉంటుంది కదా. వారిని కలవడానికి గొప్ప-గొప్ప వ్యక్తులు వస్తారు. పొజిషన్ (హోదా) ను తెలుసుకోకుండా వారు ఎప్పుడూ ఎవరినీ కలవరు. బాబా కూడా ఎప్పుడూ కలవరు. బాబా పొజిషన్ గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా తెలుసు. బ్రహ్మాకుమారులుగా పిలవబడతారు కానీ – తాము శివబాబా సంతానమని, వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారని బుద్ధిలో ఉండదు. తండ్రిని గాని, వారసత్వాన్ని గాని స్మృతి చేయలేరు. స్మృతి ఉంటే ఆంతరిక సంతోషం కూడా ఉండాలి కదా.
ఉదాహరణకు కన్యకు వివాహం చేయించినప్పుడు, ఆమెకు గుప్త దానాన్ని ఇస్తారు. పెట్టెను నింపి తాళంచెవిని చేతికిస్తారు. తండ్రి కూడా మీకు విశ్వ రాజ్యాధికారం యొక్క తాళంచెవిని చేతికిస్తారు. మీరు కొత్త సత్యయుగ విశ్వం యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తారు. మీరు స్వర్గంలోకి కూడా వెళ్తారు. బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తారు. బాబా జ్ఞానాన్ని ఇవ్వనంత వరకు, తాము పవిత్రంగా అవ్వనంత వరకు భక్తులు స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వలేరు, అందుకే నారదుని ఉదాహరణ ఉంది. మంచి-మంచి భక్తులు చాలా మంది ఉన్నారు కానీ ఆత్మ అయితే పతితంగా ఉంది కదా. జన్మ-జన్మలుగా వారు పతితులుగా అవుతూ వచ్చారు. తండ్రి లభించనంత వరకు స్వర్గంలోకి వెళ్ళలేరు. తండ్రి మిమ్మల్ని బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు కనుక మీరు వెళ్ళి కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఇంకెవరూ రాజ్యాన్ని స్థాపన చేయరు, దీని గురించి ఎవరికీ తెలియదు. తండ్రియే సంగమయుగంలో వచ్చి భవిష్య 21 జన్మల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం భగవంతుడు వచ్చారని, గీతా జ్ఞానాన్ని వినిపించారని, దాని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. గీత అనేది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము. సత్యయుగంలో శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి అంటారు – నేను సంగమయుగంలోనే వస్తాను, వచ్చి మళ్ళీ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తాను, వారే దేవీ-దేవతలుగా అవుతారు, మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరిగి అంతిమానికి చేరుకున్నప్పుడు, మళ్ళీ వచ్చి వారికే అర్థం చేయిస్తాను. నేను ఎప్పుడూ మధ్యలో రాను. క్రీస్తు కూడా మధ్యలో వస్తారని కాదు, మిగిలిన ధర్మాలు ఏవైతే స్థాపన చేస్తారో, అవి ఈ ప్రపంచం కోసమే. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే సంగమంలో వస్తాను. క్రీస్తు ఆత్మ వచ్చి ప్రవేశించి, తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ తండ్రి అయితే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని ఎప్పుడు, ఎవరు స్థాపించారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలు మొదలైనవాటిని ఎవరైతే నిర్మిస్తారో, వారిని అడగాలి. మీరు సభలో కూడా అడగవచ్చు. ఈ రహస్యం మీ బుద్ధిలో ఉంది. తండ్రి కల్ప-కల్పము బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. పదాలు కూడా ఉన్నాయి కానీ యథార్థ రీతిలో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. కొంతమంది పిల్లలపై గ్రహచారం కూడా కూర్చొంటుంది. దేహాభిమానము మొదటి నంబరు గ్రహచారము. తండ్రి అంటారు – పిల్లలూ, దేహీ-అభిమాని భవ. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము మరియు మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటాయి. వీటి ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. కానీ డ్రామాలో ఇంకా సమయం ఉన్నట్లు ఉంది, కావుననే రాజధాని స్థాపనవ్వడంలో విఘ్నాలు వస్తున్నాయి. తండ్రి స్వయంగా అంటారు – చాలా విఘ్నాలు వస్తాయి, మాయ చాలా సమర్థవంతమైనది, నా పిల్లల ముక్కు, చెవిని పట్టుకుంటుంది. దీనిని రాహువు గ్రహచారమని అంటారు. భారత్ లో ముఖ్యంగా ఈ సమయంలో వికారాల రూపీ రాహువు గ్రహచారం పూర్తిగా కూర్చొని ఉంది. ఇదే భారత్ పావనంగా, వజ్ర సమానంగా ఉండేదని, ఇప్పుడు వికారీగా, గవ్వ సమానంగా తయారయిందని, మళ్ళీ వజ్ర సమానంగా తయారవ్వాలని మీరు సెకెండులో ఋజువు చేయగలరు. ఈ కథ అంతా భారత్ కు సంబంధించిందే. తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారుచేస్తారు. అయినా, ఎన్నో రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. దేహాభిమానమనే చాలా పెద్ద విఘ్నం కలుగుతుంది. లక్ష్మీ-నారాయణుల చిత్రంపై కూడా ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. సేవలు కూడా చాలా రకాలుగా ఉంటాయి కదా. అనేక మందికి సుఖమిస్తే, దానికి ప్రతిఫలం కూడా ఎంతగానో లభిస్తుంది, కొందరు ఆల్ రౌండ్ సేవలను, తమ ఎముకలను సైతం అర్పిస్తూ చేస్తారు. నేను ఆల్ రౌండర్ గా అవ్వాలి అన్న సంతోషముండాలి. బాబా, మేము సేవలో హాజరై ఉన్నాము. ఆత్మిక సేవ చేసే మంచి-మంచి పిల్లలు, భోజనాన్ని తమ చేతులతో తయారుచేసుకుంటారు. పిల్లలు కూడా ఎంత తెలివైనవారిగా అవుతారంటే, వారు సింహాసనాన్ని తీసుకునేవారిగా అవుతారని మీకు తెలుసు. ఇక్కడ ఇంటిని సంభాళించేవారు మాతలు. ఇప్పుడు మాతలు, కుమారీలు ఈ సేవలో నిలబడాలి. మమ్మా వలె సేవ చేసి చూపించాలి. షో చేయాలి. అంతేకానీ, కేవలం మమ్మా-మమ్మా అని అనడం వలన ఏం లాభముంది! వారి వలె తయారవ్వాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహాభిమానమనే గ్రహచారమే యజ్ఞంలో విఘ్నరూపంగా అవుతుంది, అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి.
2. మీ చదువు మరియు సత్యయుగ పదవికి సంబంధించిన పొజిషన్ యొక్క నషాలో ఉండాలి, శ్రీమతాన్ని అనుసరించాలి. ఎలాంటి తప్పులు చేయకూడదు.
వరదానము:-
సదా ఈ ఈశ్వరీయ నషాలో ఉండండి – ‘నేను బాప్ దాదా కంటి వెలుగును’, నా నయనాలు లేక దృష్టిలో ఇంకే వస్తువు ఇమిడి ఉండదు. ఈ నషాలో ఉన్నట్లయితే రకరకాల చింతలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఏ రకమైన ఫిర్యాదు ఉండదు. ఎవరు ఎంతగా తమ ఉన్నతమైన నషాలో స్థితులై ఉంటారో, వారికి అంతగా గౌరవం కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది మరియు వారి ప్రతి కర్మ రాయల్ గా ఉంటుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!