24 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
23 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు మీ జీవితాన్ని వజ్ర సమానంగా తయారుచేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు, తండ్రి స్మృతితోనే ఇటువంటి జీవితం తయారవుతుంది”
ప్రశ్న: -
కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందడానికి ఏ ముఖ్యమైన పురుషార్థం చేయాలి?
జవాబు:-
బాబా అంటారు – మధురమైన పిల్లలూ, ఏ పాత సంబంధీకులు అయితే ఇంత దుఃఖితులుగా చేసారో, వారి మోహజాలం నుండి ఇప్పుడు బుద్ధిని తొలగించి, నన్నొక్కడినే స్మృతి చేయండి. వారితో ఉంటూ కూడా, మనస్సును నాతోనే జోడించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా గుర్తుంచుకున్నట్లయితే, మీరు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు….. (తూనే రాత్ గవాయి సోకే…..)
ఓంశాంతి. ఎలాగైతే పిల్లలకు అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారో, అలా ఈ పాటల సారాన్ని కూడా మీకు అర్థం చేయిస్తారు. వారే అందరికీ ఆత్మిక తండ్రి, వారు కూర్చొని బ్రహ్మా తనువు ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఓ పిల్లలూ, మా జన్మ వజ్ర సమానంగా అవుతుందని మీకు తెలుసు. వజ్ర తుల్యమైన జన్మను తయారుచేసుకునేందుకే బాబా వద్దకు వస్తారు. స్వర్గవాసులది వజ్ర తుల్యమైన జన్మ అని అంటారు. నరకవాసులది గవ్వ సమానమైన జన్మ. మీరు సంగమయుగం గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనము సంగమయుగవాసులము. ఈ సంగమయుగం అందరికీ కళ్యాణకారీ యుగము. ఈ సంగమయుగంలోనే సర్వులకు గతి-సద్గతి లభిస్తాయి. అవి ఎవరు ఇస్తారు? పరంధామం నుండి వచ్చే బాటసారి ఇస్తారు. వారు బాటసారి కదా. మీరు బాటసారులు కాదు. మీరు వచ్చిన తర్వాత, తిరిగి వెళ్ళరు. నేను పాత ప్రపంచంలోకి వచ్చి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని తండ్రి అంటారు. ఈ సేవను చేసేవారు కేవలం ఆ బాటసారి ఒక్కరేనని పిల్లలకు తెలుసు, వారు వచ్చి పిల్లలైన మనకు చాలా సేవ చేస్తారు. ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చేయలేరు. మీరు వచ్చి పతితులుగా ఉన్న మా సేవ చేయండి అని సేవ చేయడం కోసమే వారిని పిలుస్తారు. తండ్రి అంటారు – నేను పిల్లల సేవ చేయడం కోసమే వచ్చాను ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. మా దుఃఖాన్ని హరించండి మరియు శాంతినివ్వండి అని పిలుస్తారు కూడా. రెండు విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి – సుఖం మరియు శాంతి. ఇక్కడ దుఃఖం మరియు అశాంతి ఉన్నాయి, అందుకే పిలుస్తారు. తండ్రియే వచ్చి సృష్టి చక్రం యొక్క రహస్యాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. కలియుగాంతము అనగా భక్తి కిందకు దిగిపోతూ వస్తుంది. జ్ఞానంతో మీరు ఎక్కే కళలోకి వెళ్తారు, ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతారు, తర్వాత ప్రారబ్ధం యొక్క సుఖం తగ్గుతూ వస్తుంది. భారత్ లో ఎంతైతే భక్తి జరుగుతుందో, అంతగా మరెక్కడా జరగదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఎప్పటినుండైతే ద్వాపరం మొదలవుతుందో మరియు ఇతర ధర్మాలు స్థాపనవ్వడం మొదలవుతుందో, అప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. భక్తి కూడా ముందు చాలా బాగుంటుంది. ఎలాగైతే స్వర్గం మొదట్లో చాలా బాగుంటుంది, తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటగా శివుని పూజారులుగా అవుతారు. అర్ధకల్పం ఎటువంటి పూజలూ జరగవు. తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది మరియు ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంతటి భక్తిని ఇంకెవ్వరూ చేయలేరు, అర్ధకల్పం పూర్తిగా భక్తి నడుస్తుంది. ఏ తండ్రి అయితే సర్వులకు, విశేషంగా భారత్ కు సద్గతినిస్తారో, స్వర్గానికి యజమానులుగా చేస్తారో, ఆ దూరదేశపు బాటసారి పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చి ఉన్నారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఈ వారసత్వం కూడా ఎంత గొప్పగా ఉంది! కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. భారత్ లో ఎంత భక్తి చేస్తారు! ఎన్ని మందిరాలున్నాయి! భారత ఖండంలోనైతే ఎన్నో మందిరాలున్నాయి. ఇవి ఎవరి మందిరాలు అనేది ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట శివబాబా మందిరం తయారవుతుంది, తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. ఆ మందిరాలు కూడా మీ ఎదురుగా నిలిచి ఉన్నాయి. ఒకవైపు శివబాబాను పూజిస్తూ ఉంటారు, మరొక వైపు శివబాబా మిమ్మల్ని పూజ్యులుగా చేస్తున్నారు. మీరు ఇక్కడకు పూజ్య దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతల పూజారులు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి వారు కూడా ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. నెమ్మది-నెమ్మదిగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. అందరూ ఒకేసారి కలిసి చదువుకోలేరు. సమయం పడుతుంది. ఎవరైతే కల్పక్రితం కూడా చదువుకొని ఉంటారో, వారే మళ్ళీ చదువుకుంటారు. ఒకరినొకరు చదివించుకుంటూ ఉండాలి. అందరికీ తండ్రి మరియు సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను వినిపిస్తారు. దీనితో మనుష్యులు స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. కనుక వచ్చి అర్థం చేసుకోండి. ఈ నాటకం ఎలా తిరుగుతుంది అనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. లక్షల సంవత్సరాల కథనైతే ఎవరూ వినిపించలేరు. 5 వేల సంవత్సరాల క్రితం ఏముండేది, ఎవరి రాజ్యముండేది అనేది మీకు తెలుసు. భారత్ లో పూజ్య దేవీ-దేవతలైన మన రాజ్యముండేది. మేము పూజ్యులుగా ఉండేవారము, తర్వాత పూజారులుగా అయ్యాము అనే విషయం గుర్తుకు వచ్చింది కదా. మేమే పూజ్య దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ మేమే 84 జన్మలు తీసుకున్నామని ఇంతకుముందు తెలియదు. 84 జన్మల కథ లక్ష్మీ-నారాయణులది. మీరు మీ 84 జన్మల కథను వినిపిస్తారు. మనుష్యులకు, తమ కథను తాము కూర్చొని రాయడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఒక్క నిముషంలో 84 జన్మల కథను తెలియజేయగలరు. మనుష్యులు, బాల్యం నుండి ఏమేమి చేసారు అని తమ జన్మ కథను రాస్తారు. నేను 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతాను అని వీరు (బ్రహ్మా) కూడా తన కథను వినిపిస్తారు. ఇది ఒక్కరి విషయం కాదు, చాలామంది బ్రాహ్మణులున్నారు. ఈ చక్రం గురించి మీకే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు రాజా-రాణులుగా అవుతారు మరియు ఇతరులను తయారుచేస్తారు కూడా. భక్తి కూడా భారతవాసుల వలె ఎవరూ చేయరు. ఇక మిగతా మఠాలు, మార్గాలు, ధర్మాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవి మన భక్తి సమయంలో స్థాపనవుతాయి. మొట్టమొదట మన పుష్పాల వృక్షం ఎంత చిన్నదిగా ఉండేది, ఆత్మిక గార్డెన్ వలె ఉండేది. మీరు చైతన్యమైన పుష్పాలుగా ఉండేవారు. దీనినే పుష్పాల తోట అని అంటారు, తర్వాత అదే ముళ్ళ తోటగా అవ్వడం మొదలవుతుంది. ఈ సమయంలో అందరూ ముళ్ళలా అయిపోయారు. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా అవ్వాలి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకోవడమంటే ముళ్ళు గుచ్చుకోవడమే. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (విద్యార్థి జీవితం అన్నింటికన్నా ఉన్నతమైన జీవితము) అని అంటారు. అది చాలా బాగుంటుంది. కుమారులు-కుమారీలు చాలా సంతోషంగా చదువుకుంటూ ఉంటారు. వివాహం చేసుకున్నారంటే, ఇక ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవడం ప్రారంభిస్తారు. సత్యయుగంలో ఎవరూ ముళ్ళు గుచ్చరు. ఇప్పుడు మీరు మళ్ళీ పుష్పాలుగా అవుతారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు అపారమైన సుఖముండేదని, బంగారు గనులుండేవని మీకు తెలుసు. ఇప్పుడు అవి ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీకు చాలా బంగారం లభిస్తుంది. భారత్ లోనే బంగారం, వజ్ర-వైఢూర్యాల గనులుండేవి. ఆ సమయంలో అమెరికా మొదలైనవేవీ లేవు. బొంబాయి కూడా లేదు. ఆశ్చర్యం కదా. కలియుగాంతములో, చూడడానికి కూడా బంగారం ఏ మాత్రం కనిపించదు. తర్వాత సత్యయుగం ఆదిలో ఈ బంగారు గనులన్నీ నిండిపోతాయి. బంగారు మహళ్ళు తయారవుతాయి. అద్భుతం కదా! అక్కడ గనుల నుండి ఎంత బంగారాన్ని తీస్తారు. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు తయారవుతాయో, అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. మాయా మశ్చీంద్రుని ఆటను చూపిస్తారు కదా. ధ్యానంలో, ఇక్కడ బంగారమే బంగారముంది అన్నట్లు చూస్తాడు. నిజంగానే సత్యయుగంలో బంగారముంటుంది. ఇక్కడ చూడండి, మట్టి ఇటుకలు కూడా లభించవు. ఇక్కడ డబ్బుకు ఎన్ని ఇటుకలైతే లభిస్తాయో, అక్కడ ఉచితంగా అన్ని బంగారు ఇటుకలు లభిస్తాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కనుక కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందే పురుషార్థం ఎందుకు చేయకూడదు! ఇక్కడ మోహజాలంలో ఎందుకు చిక్కుకోవాలి!
పాత సంబంధాలలో మీరు ఎంతటి దుఃఖాన్ని చూస్తారని తండ్రి అంటారు. బాబా వాటిని వదిలేయమని చెప్పడం లేదు. కేవలం బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించినట్లయితే, మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. నన్ను స్మృతి చేయండి మరియు చతుర్భుజుడైన విష్ణువును అనగా విష్ణుపురిని స్మృతి చేయండి – ఇదే మన్మనాభవ అర్థము. ఈ ఒక్క పదమే ముఖ్యమైనది. భక్తి మార్గంలో ఎన్నో పంచాయతీలున్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా ప్రియుడైన ఒక్క పరమపిత పరమాత్మునికి ప్రేయసులు. వారు మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తారు. ఆత్మలందరూ వారిని స్మృతి చేస్తారు. ఆత్మిక ప్రేయసులైన మీరు, ఒక్కసారి మాత్రమే ఆత్మిక ప్రియునికి చెందినవారిగా అవుతారు. మిగిలిన మనుష్యులందరూ దైహిక ప్రేయసి-ప్రియులు. ఇప్పుడు అనంతమైన ప్రేయసులను, అనంతమైన ప్రియుడు వచ్చి కలుసుకున్నారు. మీరు రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని వారితో అంటారు కూడా. ఆ ఒక్కరినే పిలుస్తారు. మన ఆత్మ పతితంగా అయిందని మీకు తెలుసు. అందుకే, పతితపావనా రండి అని పిలుస్తారు. కుంభ మేళా జరుగుతుంది, ఎంతమంది వెళ్ళి గంగా స్నానాలు చేస్తారు. కానీ లాభమేమీ ఉండదు. ఎవరూ పావనంగా అవ్వరు. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. మీపై జ్ఞాన వర్షం కురుస్తూ ఉంది. దీనితో ముళ్ళ అడవి మళ్ళీ పుష్పాల తోటగా అయిపోతుంది. మన రాజ్యమున్నప్పుడు అక్కడ పతితులెవ్వరూ ఉండరని మీకు తెలుసు. మొత్తం విశ్వంపై జ్ఞాన వర్షం కురుస్తుంది, అంతా సస్యశ్యామలంగా అయిపోతుంది. వజ్ర-వైఢూర్యాల గనులు కూడా కొత్తగా తయారవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉండాలి. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయని అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయించడాన్ని మీరు సమ్ముఖంగా చూస్తారు. మీరు ఎక్కడ కూర్చొన్నా సరే, స్నానం చేస్తున్నా సరే, బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. అక్కడ స్మృతి చేసేందుకు సమయముంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంత సంపాదన జరుగుతుంది. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. స్మృతితో సంపాదన జరుగుతుంది అని ఎప్పుడైనా విన్నారా! ఇది ఎంత గొప్ప సంపాదన, మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఆత్మలమైన మన తండ్రి నిరాకారుడని మీకు తెలుసు. వారు ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. భగీరథుని గురించి కూడా వర్ణన ఉంది కదా. వీరిది భాగ్యశాలి రథం, ఈ రథంపై పరమపిత యొక్క పరమ ఆత్మ స్వారీ జరుగుతుంది. ఆత్మకు రథం తయారైనప్పుడు, ఆత్మ వెంటనే వచ్చి అందులో ప్రవేశిస్తుంది. తండ్రికి ఈ రథంలోకి వచ్చి కేవలం నాలెడ్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీరి అనేక జన్మల అంతిమ జన్మలో, వానప్రస్థ అవస్థ ఏర్పడినప్పుడు, నేను వచ్చి వీరిలో ప్రవేశిస్తాను లేక ఈ రథంలో విరాజమానమవుతాను అని తండ్రి అంటారు. అంతేకానీ, గుర్రపు రథం యొక్క విషయమేమీ లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు సమ్ముఖంగా అర్థం చేయిస్తారు. మీకు చాలా సంతోషముండాలి. ఐ.సి.యస్ పరీక్షకు చదువుతున్నప్పుడు చాలా నషా ఉంటుంది. అది అన్నింటికన్నా పెద్ద పరీక్ష. ఇది కూడా మీ చదువు. ఇది భగవంతుని పాఠశాల. భగవంతుడు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, శ్రీ కృష్ణుడా లేక శివబాబానా? అందరికీ భగవంతుడు ఎవరు? ఒక్క నిరాకారుడిని తప్ప కృష్ణుడిని అందరూ ఒప్పుకోరు. ఆత్మలందరి తండ్రి ఆ నిరాకార పరమపిత పరమాత్మ. వారు సదా పరంధామంలో ఉంటారు. పిల్లలను స్వర్గానికి యజమానులుగా చేసేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ తండ్రే కల్ప-కల్పము వచ్చి, మనల్ని నిరుపేద నుండి ధనవంతులుగా చేస్తారని మీకు తెలుసు. భారత్ ఇప్పుడు నిరుపేదగా ఉంది కదా. తర్వాత జన్మలో ఏమి అవ్వనున్నారు అనేది మీకు అంతా సాక్షాత్కారం జరిగింది. వినాశనం సాక్షాత్కారం కూడా జరిగింది, స్థాపన సాక్షాత్కారం కూడా జరిగింది. భగవానువాచ – నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను. చాలా దాన-పుణ్యాలు చేస్తే, కొందరికి అల్పకాలిక సుఖం లభిస్తుంది. రాజుల వద్ద జన్మ తీసుకొని, మళ్ళీ వెంటనే మరణిస్తారు. కొందరు గర్భంలో కూడా మరణిస్తారు. కొందరు కుంటివారిగా, చెవిటివారిగా అయిపోతారు. ఎలాంటి కర్మలు చేస్తారో, అలాంటి పదవిని పొందుతారు. ఇప్పుడు మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తారు. బాబా, మేము బలిహారమవుతామని మీరంటారు. కనుక రాజ్యం కూడా తప్పకుండా మీరే పొందుతారు. భారత్ ను మహాదాని ఖండమని అంటారు. ఇక్కడ దాన-పుణ్యాలను బాగా చేస్తారు. అవి మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బాబా మీకు 21 జన్మల కోసం దానం ఇస్తారు. ఇప్పుడు మీరు బాబాపై బలిహారమవుతారు. తనువు, మనసు, ధనం అన్నింటినీ ఇచ్చేసారు. ట్రస్టీగా అయి ఉండండి, మీ ఇళ్ళు-వాకిళ్ళను సంభాళించండి అని ఇప్పుడు తండ్రి అంటారు. అంతా శివబాబాదే, నేను మీ వాడిని, మిమ్మల్నే స్మృతి చేస్తానని మనస్ఫూర్తిగా సరెండర్ చేస్తారు. తండ్రి అంటారు – మహళ్ళలో ఉండండి, తిరగండి, ఆనందంగా గడపండి, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి మీరు అలా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తారు – మధురాతి-మధురమైన పిల్లలూ, ఈ యోగబలం ద్వారానే మీరు వికర్మాజీతులుగా అవుతారు. తండ్రి స్మృతితో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. తనువు, మనసు, ధనం అన్నింటినీ సమర్పణ చేసి ట్రస్టీగా అయి ఉండాలి. వికర్మాజీతులుగా అయ్యే పురుషార్థం చేయాలి.
2. స్మృతిలోనే సంపాదన ఉంటుంది, అందుకే, నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే విధంగా ఆత్మిక పుష్పంగా అవ్వాలి. లోపల ఎటువంటి ముళ్ళు ఉండకూడదు.
వరదానము:-
త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటూ ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను చేయండి మరియు ప్రతి విషయాన్ని చూడండి. ఇది ఎందుకు, ఇదేమిటి – అనే క్వశ్చన్ మార్కులు (ప్రశ్నార్థకాలు) ఉండకూడదు, సదా ఫుల్ స్టాప్. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ప్రతి ఆత్మ పాత్రను బాగా తెలుసుకొని, అప్పుడు పాత్రలోకి రండి. ఆత్మలతో సంబంధ-సంపర్కములోకి వస్తూ, అతీతం-ప్రియం యొక్క సమానత ఉన్నట్లయితే, అలజడి సమాప్తమైపోతుంది. ఇలా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండడమే నంబర్ వన్ భాగ్యశాలి ఆత్మల గుర్తు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!