24 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

24 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

23 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - ఇప్పటివరకు ఏదైతే చదివారో, అదంతా మర్చిపోయి ఒక్క తండ్రిని స్మృతి చేయండి”

ప్రశ్న: -

భారత్ లో సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలం కావాలి?

జవాబు:-

పవిత్రతా బలము. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగం జోడించి పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రతా బలంతోనే సత్యయుగ స్వరాజ్యం స్థాపనవుతుంది, ఇందులో యుద్ధం మొదలైనవాటి విషయం లేదు. జ్ఞాన-యోగ బలాలే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తాయి. ఈ బలంతోనే ఏకమత స్థాపన జరుగుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది… (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్…)

ఓంశాంతి.పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మనం తయారుచేసిందేమీ కాదు. ఎలాగైతే ఇతర వేద శాస్త్రాల సారం అర్థం చేయించడం జరుగుతుందో, అలా తయారుచేయబడిన ఈ పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, తోట యజమాని మరియు సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కోసమే భక్తి చేస్తారు. కానీ జీవన్ముక్తి దాత లేక సద్గతిదాత ఒక్క భగవంతుడే. దీని అర్థాన్ని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు, ఆ మనుష్యులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖం నుండి విడిపించి శాంతి యొక్క ప్రాప్తిని కలిగిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేవని భారతవాసులైన పిల్లలకు తెలుసు. దానిని రాధాకృష్ణుల రాజ్యమని అనలేరు. వాస్తవానికి మాతల యొక్క హమ్ జెన్స్ (తోటివారు) రాధ కావున ఆమెను ఎక్కువ ప్రేమించాలి, కానీ కృష్ణుడినే ఎక్కువ ప్రేమిస్తారు. ఊయలలో ఊపుతారు. కృష్ణుని జన్మాష్టమిని కూడా జరుపుకుంటారు. రాధ జయంతిని జరుపుకోరు. నిజానికి ఇద్దరి జయంతిని జరుపుకోవాలి. ఏమీ అర్థం చేసుకోరు. వారి జీవిత కథ గురించి ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి తమ జీవిత కథను మరియు అందరి జీవిత కథలను వినిపిస్తారు. మనుష్యులు శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు కానీ వారి జీవిత కథ గురించి ఎవరికి తెలియదు. మనుష్యుల జీవిత కథలను చరిత్ర-భూగోళాలని అంటారు, ప్రపంచ చరిత్ర మరియు భూగోళము అని అంటారు కదా – ఎన్ని ప్రాంతాలలో రాజ్యం చేసేవారు, ఎంత భూమిపై రాజ్యం చేసేవారు, ఎలా రాజ్యం చేసారు, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారు… ఈ విషయాలు ఎవరికీ తెలియవు. పిల్లలైన మీకు మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది అని పిల్లలైన మీకు తెలిసింది. సంగమంలోనే పరమపిత పరమాత్మ వచ్చి మనుష్యులను పతితుల నుండి పావన దేవతలుగా తయారుచేస్తారు, ఉత్తమ పురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారుచేస్తారు ఎందుకంటే ఈ సమయంలోని మనుష్యులు ఉత్తమంగా లేరు, కనిష్టులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు ఉంటారు, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. ఎవరైతే మంచి రీతిలో జ్ఞానం వింటారో, వారిని సతోగుణులు అని అంటారు. ఎవరైతే కొద్దిగా వింటారో, వారిని రజోగుణులు అని అంటారు, ఎవరైతే అసలు వినరో, వారిని తమోగుణులు అని అంటారు. చదువులో కూడా ఇలానే ఉంటుంది. పిల్లలైన మీకు సతోప్రధానమైన చదువు కావాలి, అందుకే సతోప్రధాన లక్ష్మీనారాయణులుగా అయ్యే జ్ఞానం మీకు ఇవ్వడం జరుగుతుంది. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారవ్వాలి. ఇది సత్యమైన గీత అని గీత గురించి కూడా మీరు చెప్తారు. మీరు ఇలా రాయవచ్చు కూడా – ఇది సత్యమైన గీతా పాఠశాల అనగా సత్యనారాయణునిగా తయారుచేసే కథ లేక సత్యమైన అమరకథ, సత్యమైన మూడవ నేత్రం యొక్క కథ. చిత్రాలైతే మీ వద్ద అన్నీ ఉన్నాయి, వీటిలో జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తారు – ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలైన మేము భారత్ ను సతోప్రధాన స్వర్గంగా తయారుచేసి తీరుతాము. మీరు అందరికీ ఈ వార్తను తెలియజేయాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు అంటే తప్పకుండా ఇప్పుడు పతిత రాజ్యమున్నట్లు. తాము స్వయం పతితులుగా ఉన్నారని ఎవరూ అర్థం చేసుకోలేరు. రావణుడు అనగా 5 వికారాలు. రామ రాజ్యం కావాలని అంటున్నారంటే తప్పకుండా ఆసురీ సంప్రదాయం కలవారిగా ఉన్నట్లే కదా, కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో పెద్ద-పెద్ద గురువులు కూడా ఏమీ అర్థం చేసుకోరు. మేము శ్రీమతమనుసారంగా బ్రహ్మా ద్వారా 5 వేల సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము అని పిల్లలైన మీరు అందరికీ ప్రకటిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఈ సమయంలోనే మీరు కనిష్ట పురుషుల నుండి సతోప్రధాన పురుషోత్తములుగా తయారవుతారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే మర్యాద పురుషోత్తమమైనది. ఇప్పుడు కేవలం దేవీ-దేవతా ధర్మ స్థాపన మాత్రమే జరుగుతుంది, అప్పుడిక ఇతర ధర్మాలు ఉండవు. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేవని పిల్లలైన మీరు ఋజువు చేసి అర్థం చేయిస్తారు. త్రేతాలో సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి వెళ్ళినా కానీ ఒకే భాష ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో అనేక భాషలున్నాయి. మన రాజ్యంలో ఒకే భాష ఉండేదని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉంటారు. ఎలాగైతే యాత్ర నుండి తమ దేశం వైపుకు దగ్గరకు వచ్చే కొలది, ఇక మా ఇంటికి చేరుకున్నాము, ఇక ఇప్పుడు వెళ్ళి అందరినీ కలుసుకుంటాము అని సంతోషపడతారు. మీకు కూడా మీ రాజధాని యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. పురుషార్థం చేయమని బాబా మాకు ఎంతగా చెప్తారు అనేది చూస్తారు. పురుషార్థము చేయకపోతే అయ్యో-అయ్యో అని అంటారు మరియు పదవి కూడా తగ్గిపోతుంది. యోగం యొక్క యాత్ర గురించి అందరికీ చెప్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజము. మెట్ల వరుస చిత్రం ఎంత సహజమైనది. ఎవరైతే ఆలస్యంగా వస్తారో, వారికి రోజు-రోజుకు సహజమైన జ్ఞానం లభిస్తుంది. ఒక వారం రోజులు అర్థం చేసుకోవడంతో, సహజంగా అర్థం చేసుకుంటారు. ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు తయారుచేయబడి ఉన్నాయి. 84 జన్మల చక్రం పూర్తిగా సరైన రీతిలో ఉంది. ఇది భారతవాసుల కోసమే. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీకు తెలుసు – పతితపావనుడు, సద్గతిదాత అయిన శివబాబా మతమనుసారంగా మనం మళ్ళీ సహజ రాజయోగ బలంతో, మన తనువు-మనస్సు-ధనములతో భారత్ ను స్వర్గంగా చేస్తున్నాము, వేరే వారెవరిదీ మనం ఉపయోగించము, మన తనువు-మనసు-ధనములతోనే సేవ చేస్తాము. ఎవరెంతగా చేస్తారో, వారు అంతగా తమ భవిష్యత్తు కోసం తయారుచేసుకుంటారు. మీరే కుటుంబ సభ్యులు. మీ ద్వారానే బాబా సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఖర్చును కూడా మీరే చూసుకుంటారు. మీకు పెద్ద ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి, కన్యలు ఏమి ఖర్చు చేస్తారు. వారి వద్ద ఏమైనా ఉందా? బాబా, పిల్లల నుండి ఏమి ఫీజు తీసుకుంటారు. ఏమీ తీసుకోరు. స్కూళ్ళలో ముందు ఫీజు గురించే మాట్లాడుతారు. అక్కడ చదువుకు ఎంత ఖర్చవుతుంది. ఇక్కడ శివబాబా పిల్లల నుండి డబ్బులు ఎలా తీసుకుంటారు. ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి శివబాబాకు తమ ఇల్లు కట్టుకునేదేమీ లేదు. పిల్లలైన మీకు భవిష్య స్వర్గంలోకి వెళ్ళి వజ్రవైఢూర్యాల మహళ్ళు నిర్మించవలసి ఉంటుంది, అందుకే ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో, దీనికి ప్రతిఫలంగా భవిష్యత్తులో మీకు మహళ్ళు లభిస్తాయి. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరెంతగా తనువు-మనస్సు-ధనములతో సేవ చేస్తారో, వారు అక్కడ ఆ విధంగానే పొందుతారు. కాలేజీ లేదా హాస్పిటల్ కట్టించేటప్పుడు, 10 లేక 20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంత ఖర్చు అవ్వదు. చిన్న ఇంటిలో ఆత్మిక కాలేజీ మరియు హాస్పిటల్ ను తయారుచేస్తారు. పాండవుల ఆది పతి ఎవరు? వారైతే కృష్ణుని పేరు రాసేసారు. నిజానికి పాండవుల ఆది పతి నిరాకార భగవంతుడు. మీకు శ్రీమతాన్ని ఇచ్చేవారు భగవంతుడు. మిగిలినవారంతా రావణ రాజ్యంలో, రావణుని మతమనుసారంగా నడుచుకుంటున్నారు. రావణుని మతమనుసారంగా ఎంత అశుద్ధంగా అయిపోయారు. ఇప్పుడు ఈ సృష్టియే పాతగా, ఇదే మళ్ళీ కొత్తగా అవుతుంది. సృష్టిలో భారత్ మాత్రమే ఉండేది. కొత్త భారత్, పాత భారత్ అని అంటారు. కొత్త భారత్ స్వర్గంగా ఉండేది. తర్వాత భారత్ పాతబడినప్పుడు నరకంగా అవుతుంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది మనుష్యుల విషయమే. ఇక్కడ సుఖం యొక్క నామ రూపాలే లేవు. ఇది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా, ఈ సమయంలోని సుఖాన్ని కాకిరెట్టతో సమానమని అంటారు, అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. వారు స్వర్గాన్ని లేక సత్యయుగాన్ని స్థాపన చేయలేరు. కృష్ణపురిని పరమాత్మయే స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరం, రెండు సతోప్రధానంగా ఉండేవి, అందుకే కృష్ణుడిని చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే వారు పవిత్రమైనవారు కదా. చిన్న పిల్లలు బ్రహ్మ జ్ఞానులతో సమానమని అంటూ ఉంటారు. చిన్న పిల్లలకు వికారాల గురించి తెలియదు. సన్యాసులకైతే తెలుసు. పిల్లలు జన్మతః మహాత్ములు. పిల్లలను పవిత్రమైన పుష్పాలని అంటారు. నంబరువన్ పుష్పము శ్రీకృష్ణుడు. వారు కొత్త ప్రపంచమైన స్వర్గంలో మొదటి రాకుమారుడు. జన్మించగానే, వారిని మొదటి రాకుమారుడని అంటారు. శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని వారిని అందరూ గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలనుకుంటే, అలా తయారవ్వండి అని తండ్రి అంటారు. కేవలం ఒక్క కృష్ణుడు మాత్రమే తయారవ్వరు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (వేల్స్ పట్టణ రాకుమారుడు) గా ఎంతమంది అవుతారు? సెకెండ్, థర్డ్… ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా వంశముంటుంది. తండ్రి వెనుక ఇంకొకరు ఆ రాజ్య సింహాసనంపై కూర్చొంటారు. ఎలాగైతే ఇతర వంశాలు ఉంటాయో, అలాగే ఈ వంశం కూడా ఉంది. మీకు క్రిస్టియన్లతో సంబంధం ఉంది. కృష్ణుడు మరియు క్రిస్టియన్, ఇరువురి రాశి ఒక్కటే. పరస్పరంలో ఇచ్చి-పుచ్చుకోవడాలు కూడా చాలా జరుగుతాయి. భారత్ నుండి వారు ఎంత ధనం తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. రిటర్న్ సర్వీస్ చేస్తున్నారు. ఈ యూరోప్ వాసులు పరస్పరంలో దెబ్బలాడుకుని సమాప్తమైపోతారు. దీని గురించి కథ కూడా ఉంది – రెండు పిల్లులు కొట్లాడుకుంటే, మధ్యలో కోతి వచ్చి వెన్న తినేసింది అని. ఇది ఇప్పటి విషయమే. వారు పరస్పరంలో కొట్లాడుకుంటారు మరియు రాజ్య భాగ్యం మీకు లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన జ్ఞానముంది. మేమంతా బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అంతేకానీ మేము గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఇలా ఉండకూడదు. ఈ మత భేదాలు కూడా తొలగిపోవాలి. మనం ఒక్క తండ్రికి సంతానము. బ్రహ్మా ద్వారా శివబాబా శ్రీమతం అనుసారంగా, మనం జ్ఞాన-యోగాల బలంతో మన స్వరాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నాము. యోగబలంతోనే మనం పావనంగా అవుతాము. తండ్రి సర్వశక్తివంతుడు, వారి నుండి బలం లభిస్తుంది. మీరు విశ్వ రాజ్యాధికారాన్ని పొందుతారు. ఇందులో యుద్ధము మొదలైనవేమీ చేయరు. అంతా పవిత్రత బలానికి సంబంధించిందే. మీరు వచ్చి పతితులను పావనంగా తయారుచేయండి అని అంటున్నారంటే, దానికి ఆధారము స్మృతి బలమే. అంతేకానీ, అక్కడ వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళి అంతా మర్చిపోవడం కాదు. ఇక్కడ సమ్ముఖంలో జ్ఞానసాగరుని అలలను చూస్తూ ఉంటారు. నదులలో ఆ అలలు ఉండవు. సాగరం యొక్క ఒక్క అల ఎంత నష్టం కలిగిస్తుంది. భూకంపం వచ్చినప్పుడు, సాగరం కూడా ఉప్పొంగుతుంది. సాగరాన్ని ఎండబెట్టి భూమిని తీసుకున్నారు, మళ్ళీ ఆ భూమిని ఎంత రేటుకు అమ్ముతారు. ఈ బొంబాయి ఇక ఉండదని మీకు తెలుసు. ఇంతకుముందు ఈ బొంబాయి ఉండేది కాదు, ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ మాతలు అమాయకులు. వారు అంతగా ఏమీ చదువుకోలేదు. ఇక్కడైతే చదువుకున్నదంతా మర్చిపోవాలి. మీరేమీ చదువుకోలేదంటే మంచిది. చదువుకున్న మనుష్యులు, వారికి అర్థం చేయించేటప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడైతే కేవలం తండ్రిని స్మృతి చేయాలి. దేహధారులైన మనుష్యులెవరినీ తలచుకునే విషయం లేదు. మహిమ అంతా ఒక్క అనంతమైన తండ్రిదే. భగవంతుడొక్కరే ఉన్నతోన్నతమైనవారని, తర్వాత రెండవ నంబరులో బ్రహ్మా ఉన్నారని మీకు తెలుసు. వారి కన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ ఉండరు. వీరి కన్నా గొప్ప ఆసామి ఇంకెవ్వరూ లేరు, కానీ ఎంత సాధారణంగా వ్యవహరిస్తారో చూడండి. ఎంత సాధారణ రీతిలో పిల్లలతో కూర్చొంటారు. రైలులో వెళ్ళేటప్పుడు, వీరు ఎవరు అనేది ఇతరులకు ఏమి తెలుస్తుంది! భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తారంటే, తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశించి జ్ఞానం ఇస్తారు కదా! ఒకవేళ వారు కృష్ణుడైతే, పెద్ద గుంపు ఏర్పడుతుంది, అప్పుడిక చదివించలేరు కూడా, కేవలం దర్శనం చేసుకుంటారు. ఇక్కడైతే తండ్రి గుప్తంగా, సాధారణ వేషంలో కూర్చొని పిల్లలను చదివిస్తారు.

మీరు గుప్తమైన సైన్యము. ఆత్మలైన మనం యోగబలంతో మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఈ పాత శరీరాలను వదిలి, వెళ్ళి కొత్త సుందరమైన శరీరాలను ధరిస్తారు. ఇప్పుడు ఆసురీ సంప్రదాయం కలవారిగా ఉన్నారు, తర్వాత దైవీ సంప్రదాయం కలవారిగా అవుతారు. నేను కొత్త ప్రపంచంలో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యం చేస్తాను అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుష్, శరీరం ప్రకృతి. ఆత్మ సదా పురుష్ గా ఉంటుంది. ఇకపోతే లెక్కాచారం అనుసారంగా స్త్రీ లేక పురుష శరీరం లభిస్తుంది. కానీ నేను అవినాశీ ఆత్మను. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశన గుర్తులు కూడా మీరు ఎదురుగా చూస్తారు. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. వారు ఏ రూపంలో ఉన్నారు మరియు ఎవరి తనువులో ఉన్నారు అనేది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. తండ్రి అంటారు – నేను పూర్తి సాధారణ తనువులోకి వస్తాను, నేను కృష్ణుని తనువులోకి రాను. వీరే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమ జన్మలో వస్తాను. 84 జన్మలను సూర్యవంశానికి చెందినవారే తీసుకుంటారు. వారే మొదటి నంబరులోకి వస్తారు. సాకార వృక్షము మరియు నిరాకార వృక్షము – ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానమంతా మీకు ఉంది. మూలవతనం నుండి నంబరువారుగా ఆత్మలు వస్తారు. మొట్టమొదటగా దేవీ-దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు వస్తారు, తర్వాత నంబరువారుగా ఇతర ధర్మాల వారు వస్తారు. చిత్రాలలో వివరణ చాలా ఉన్నతంగా ఉంది. పిల్లలు అందరికీ అర్థం చేయించాలి, కుమారీలు లేచి నిలబడాలి. కుమార్తెలు ఎవరైనా ఇలాంటి విషయాలను అర్థం చేయిస్తే అది అద్భుతం కదా. వారు ఎంత పేరు తీసుకొస్తారు. లౌకికము మరియు అలౌకికము – ఇరువురి పేర్లను ప్రఖ్యాతి చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంగమయుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్టులుగా తయారుచేసే కర్మలేవీ చేయకూడదు.

2. గుప్త రూపంలో తండ్రికి సహాయకులుగా అయి భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవ చేయాలి. తమ తనువు-మనసు-ధనములతోనే భారత్ ను స్వర్గంగా తయారుచేయాలి. స్మృతి మరియు పవిత్రత బలములను జమ చేసుకోవాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ, దాని స్వరూపులుగా అవుతారో, వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క నిజ సంస్కారము. దివ్య గణాలు మీకు చెందినవి, అవగుణాలు మాయకు చెందినవి, అవి సాంగత్య దోషం కారణంగా వచ్చినవి. ఇప్పుడు వాటి నుండి ముఖం తిప్పేసి, మీ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నట్లయితే, సదా హర్షితంగా ఉంటారు. ఏ విధమైన ఆసురీ లేక వ్యర్థ సంస్కారాలు మీ ముందుకు వచ్చేందుకు ధైర్యం కూడా చేయలేవు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top