23 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
22 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు మీ గురించి చింతన చేసుకోవాలి, ఇతరుల గురించి కాదు ఎందుకంటే డ్రామానుసారంగా ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు”
ప్రశ్న: -
త్రికాలదర్శిగా అవ్వడంతో ఆత్మకు ఏ స్మృతి కలిగింది?
జవాబు:-
వాస్తవానికి మేము మూలవతన నివాసులమని, ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చామని, మేము ముఖ్య పాత్రధారులుగా అయి 84 జన్మల పాత్రను అభినయించామని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి సమ్ముఖంగా ఉన్నాము, తర్వాత వారితో పాటు ఇంటికి వెళ్తాము. పావనంగా అయి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఈ ఆటంతా భారత్ పైనే తయారుచేయబడింది. త్రికాలదర్శులుగా అవ్వడంతో ఇదంతా స్మృతి కలిగింది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మరణించినా మీ దారిలోనే….. (మర్నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే…..)
ఓంశాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు. పిల్లలు ఏమంటున్నారు? బాబా, మేము ఇప్పుడు మీ కంఠహారంగానే అవ్వాలి. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి. శాంతిధామం లేక నిర్వాణధామంలో తండ్రి మరియు పిల్లలైన మేము (ఆత్మలము) ఉంటాము – అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని ఇప్పుడు తండ్రి పదే-పదే చెప్తారు. ఆత్మలైన మేము తండ్రితో పాటు నిర్వాణధామంలో ఉండేవారమని, తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రంలో తిరిగామని మీకు తెలుసు. మేము వాస్తవానికి పరంధామ నివాసులమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు. మీరు కూర్చొని ఉన్నారు, బాబా ఎదురుగా కూర్చుని ఉండటాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఉన్నవి లౌకిక శారీరానికి సంబంధించిన సంబంధాలు. వాస్తవానికి మనం ఆత్మలము, తర్వాత లౌకిక సంబంధాలలో సుఖ-దుఃఖాల జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆత్మలైన మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. తండ్రి కూడా మూడు లోకాలు, మూడు కాలాలు గురించి తెలిసినవారు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. చదువు అయితే గుర్తుండాలి కదా. ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు మూలవతన నివాసులని, ఇప్పుడు బాప్ దాదా ద్వారా త్రికాలదర్శులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. మనం ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారులమని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా నాలెడ్జ్ అంతా ఉంది. అర్ధకల్పం మేము సుఖధామంలో ఉంటామని స్మృతి కలిగింది. అక్కడ రావణుడు ఉండడు. ఆత్మలైన మనం పూర్తి 84 జన్మల చక్రం తిరుగుతాము. ఇప్పుడు తండ్రి సమ్ముఖంగా కూర్చొని ఉన్నారు. మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ మేము మీతో పాటు వస్తాము. ఎంత వీలైతే అంత మిమ్మల్ని స్మృతి చేస్తాము. త్రికాలదర్శులుగా అయ్యారు కనుక పిల్లలైన మీరు మొత్తం రోజంతా ఇదే ఆలోచనలో ఉండాలి. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు. వారితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నతాతి ఉన్నతమైన స్థానంలో నివసించేవారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇంటి స్మృతి కలిగింది. మనం పవిత్రంగా అయి మన ఇల్లు అయిన పరంధామానికి వెళ్తాము. తండ్రి అయిన శివునికి పూజ జరిగేటప్పుడు సాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మలను పవిత్రంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, ఇంకెవ్వరూ అలా తయారుచేయలేరు. ఇప్పుడు మీరు మొత్తం డ్రామా ఆటను తెలుసుకున్నారు. భారత్ పైనే ఆట తయారుచేయబడిందని మీరు అర్థం చేసుకున్నారు. కనుక తండ్రి సమ్ముఖంగా కూర్చొని పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగరుడని ప్రతి జీవాత్మకు తెలుసు. వారినే భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము తప్పకుండా మీ మతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఇది లౌకిక సంబంధానికి చెందిన విషయమేమీ కాదు. మీరు దేహీ-అభిమానులుగా అయి, మేము ఒక్క అనంతమైన తండ్రి శ్రీమతమనుసారముగా నడుచుకోవాలనే ఆలోచన పెట్టుకోవాలి. వారు చెప్పినదే వినాలి. వారు చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ జ్ఞానమనే మూడవ నేత్రం తెరుచుకుంది. ఈ జ్ఞానం మీకు ఇక్కడే ఉంది. మూలవతనంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అక్కడ ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తమ గురించి పూర్తిగా తెలియజేస్తారు. వారే జ్ఞానసాగరుడు. బాబా ఆత్మలైన మమ్మల్ని చదివిస్తున్నారని ఇతర ఏ సత్సంగాలలోనూ చెప్పరు. ఈ విషయం మీకు తెలుసు. దేహీ-అభిమానులుగా అవ్వండి అని మీకు పదే-పదే చెప్పవలసి ఉంటుంది. ఆత్మ ఈ డ్రామాలో పాత్రధారి, పాత్రను అభినయిస్తుంది. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించాను. ఆ పాత్రధారులు వస్త్రాలు మారుస్తూ ఉంటారు.
ఆత్మలైన మీరు నిరాకారీ ప్రపంచం నుండి ఇక్కడకు వచ్చి ఈ శరీరం రూపీ వస్త్రాలను తీసుకుంటారు. ఆ నాటకంలో వారు కేవలం ఆ వస్త్రాలు మార్చుకుంటారు. ఆత్మలైన మనకు బాబా మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా వచ్చి ఉన్నారు కనుక మేము తప్పకుండా బాబాకు సహాయకులుగా అవుతామని, పవిత్రంగా అయ్యి మొత్తం భారత్ ను పవిత్రంగా చేస్తామని పిల్లలైన మీరు అనుకుంటారు. మనం శ్రీమతమనుసారముగానే నడుచుకోవాలి. బాబాను స్మృతి చేయాలని శ్రీమతం చెప్తుంది. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. అందరూ వచ్చి పురుషార్థం చేయరు. ఎవరైతే కల్పక్రితం పురుషార్థం చేసారో, వారే చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అందుకే పురుషార్థం చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనం పైన మూలవతనంలో నివసించేవారము. మొట్టమొదట మనం స్వర్గంలోకి వచ్చాము, తర్వాత మెట్లు కిందకు దిగుతూ వచ్చాము. తండ్రి భారతవాసీయులకే అర్థం చేయిస్తారు, భారత్ లోనే వస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, శరీరాన్ని ధరించి మాకు శ్రేష్ఠ కర్మలను నేర్పించండి అని భారత్ లోనే గుర్తు చేసుకుంటారు. వారు ధరించే శరీరం పేరుకు కూడా గాయనముంది. ఇది భాగ్యశాలి రథము. తండ్రి కూడా అంటారు – నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను. తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం కూడా బాబా ఈ విషయం చెప్పారని పిల్లలైన మీకు స్మృతి కలిగింది. ఇంకెవ్వరూ ఈ విషయాన్ని చెప్పలేరు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా, నేను ఈ శరీరంలోకి వచ్చి మీకు అర్థం చేయించానని తండ్రియే అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు మళ్ళీ పిల్లలైన మీకు చెప్తాను. మేము ఏ వస్త్రాలను ధరించి, ఏయే పాత్రలను అభినయిస్తాము అనేది నాటకం వేసే వారికి తెలుస్తుంది కదా. కానీ వారు దేహాభిమానులుగా ఉంటారు. ఇది అనంతమైన విషయము. దేహీ-అభిమానులుగా అవ్వాలి. వాస్తవానికి మనం ఆత్మలమే. ఇప్పుడు మన పాత్ర పూర్తవుతుంది. తండ్రి సమ్ముఖంగా కూర్చొని మీకు అంతా అర్థం చేయిస్తారు, ఇది మర్చిపోకూడదు. మాయ ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలూ, మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదని తండ్రి అర్థం చేయిస్తారు. మనసులో తుఫానులు అయితే చాలా వస్తాయి కానీ తమను తాము పరీక్షించుకోవాలి – నా కర్మేంద్రియాలు చంచలమవ్వడం లేదు కదా? నేను కామాన్ని జయించగలనా? మీకైతే ఇది చాలా సహజము. మనం ఆత్మలము, ఒక్క తండ్రి పిల్లలము. తండ్రితోనే యోగం జోడించాలి. కర్మేంద్రియాలు చంచలమవ్వడమనేది కూడా దేహాభిమానమే కదా. మీరు ఎవ్వరికీ భయపడకూడదు, నిర్భయులుగా అవ్వాలి. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినా సరే, సాక్షీగా అయి చూడాలి. మనం ఆత్మలము. మీరు ఈ ఆటను పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారని మీ బుద్ధిలోకి వచ్చింది. వారిని బిందువు అని అంటారు. నిరాకారీ ప్రపంచంలో ఆత్మల వృక్షముంటుంది. బీజం నుండి వృక్షం వెలువడుతుంది, తర్వాత నంబరువారుగా ఆకులు వస్తాయి, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పై నుండి నంబరువారుగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, బయటకు ఎలా వస్తుంది అనేది ఎవరూ చూడలేరు. మీ ఆత్మ పతితంగా అయిపోయిందని, దానిని పావనంగా చేసుకోండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చుని వీరి ద్వారా అర్థం చేయిస్తారు. మాట్లాడడమనేది కర్మేంద్రియాలతోనే చేస్తారు కదా. బిందువైన ఆత్మ శరీరంలో లేకపోతే కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు. ఇంత చిన్న బిందువు ఎంత శక్తిశాలిగా ఉంటుంది, దానిలో నాలెడ్జ్ అంతా ఉంటుంది. తండ్రి జ్ఞానసాగరుడు, వారు కూర్చుని మీకు అర్థం చేయిస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. వారి ఈ పాత్ర కూడా నిశ్చయించబడి ఉంది. మీ ఆత్మలో కూడా 84 జన్మల పాత్ర ఉంది. మీరు సుఖ దుఃఖాల పాత్రను అభినయిస్తారు. దుఃఖంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. తండ్రి అంటారు – నేను పునర్జన్మలలోకి రాను, మీరు 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని నేను వచ్చి పిల్లలైన మీకు సహజమైన యుక్తిని తెలియజేస్తాను. అర్ధకల్పం మీరు కామ చితిపై కూర్చొని తమోప్రధానంగా అయ్యారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మ యొక్క కర్మేంద్రియాలు ముందు చిన్నవిగా ఉంటాయి, తర్వాత పెద్దవిగా అవుతాయి. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఓ పతితపావనా! రండి అని ఆత్మయే అంటుంది. ఆత్మ తండ్రిని పిలుస్తుంది. పతితులైన మిమ్మల్ని పావనంగా చేసేందుకు, నేను కల్ప-కల్పము వస్తానని తండ్రి అంటారు. ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ బయటకు ఎలా వెళ్తుంది అనేది చూడడానికి మనుష్యులు చాలా తల బాదుకుంటారు కానీ ఎవరూ తెలుసుకోలేరు, ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. బీజంలో పూర్తి జ్ఞానముంటుంది, ఆ బీజం జడమైనది. మర్రి వృక్షం యొక్క బీజం ఎంత చిన్నది, దాని నుండి ఎంత పెద్ద పొడవైన వృక్షం వెలువడుతుంది. కలకత్తాలోని మర్రి వృక్షాన్ని చాలా మంది చూసి ఉంటారు. అది చాలా పెద్ద వృక్షము. ఇప్పుడు దాని పునాది అంతా కుళ్ళిపోయింది, వృక్షం మాత్రమే నిలిచి ఉంది. ఇది కూడా అటువంటిదే. దేవతా ధర్మం యొక్క పునాది లేదు. వృక్షం కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఈ విషయం కూడా మీకు తెలుసు, అందుకే, మేము ఇంత సమయంలో ప్రపంచాన్ని పావనంగా చేసి చూపిస్తామని గవర్నమెంట్ కు కూడా చెప్తారు. మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మేము ఈ భారత్ ను తప్పకుండా శ్రేష్ఠాచారిగా చేస్తామని, అప్పుడే భ్రష్ఠాచారీ ప్రపంచ వినాశనం జరుగుతుందని మీకు నిశ్చయముంది. శాంతి కావాలని వారు కోరుకుంటారు. ఆత్మ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అలసిపోయింది, అందుకే ఓ శాంతిదేవా, అని పిలుస్తుంది. ఆత్మ శాంతి స్వరూపమని అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలనైతే తప్పకుండా చేయాల్సిందే. శాంతినివ్వండి అని అంటారు. శాంతిధామం వేరు, సుఖధామం వేరు అని ఎవరికీ తెలియదు. సుఖధామంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. అది పవిత్ర ప్రపంచము. అక్కడ ఎవరూ శాంతిని అడగరు. కర్మలనైతే అక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ అశాంతి ఉండదు. జీవన్ముక్తిధామం మరియు శాంతిధామం, రెండూ వేర్వేరు. సత్యయుగంలో జీవాత్మలకు సుఖం కూడా ఉంటుంది మరియు శాంతి కూడా ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు.
స్వర్గమని దేనినంటారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గమంటే ఏమిటి అనేది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వీరు (లక్ష్మీ-నారాయణులు) నా పిల్లలు కదా. ఈ పిల్లలకు కూడా సుఖాన్ని ఎవరు ఇచ్చారు? సుఖాన్నిచ్చేవారు ఎవరో ఉంటారు కదా. వీరి రాజ్యం మళ్ళీ రానున్నదా? స్వర్గం తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. స్వర్గంలో ఉన్నప్పుడు, నరకం మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనరు. పవిత్రత, సుఖ-శాంతుల కొత్త ప్రపంచం మళ్ళీ రిపీట్ అవుతుందని ఇప్పుడు అంటారు. ఇది పాత ప్రపంచము, దుఃఖధామము. దీనిని ఇనుప యుగమని అంటారు. కొత్త ప్రపంచం కూడా ఉండేది కదా! దానిని స్వర్గమని అంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో నిలిచి ఉంది. తప్పకుండా మనం మళ్ళీ దేవీ దేవతలుగా అవుతున్నాము. ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము. మనం మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని పొందుతాము. ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఆత్మలమైన మనం అక్కడ ఉంటాము, తర్వాత మనం పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది ఇప్పుడు స్మృతి కలిగింది. తండ్రి అర్థం చేయించడం కూడా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకే అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మాకు సంతానంగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? ప్రజాపిత బ్రహ్మా అయితే ప్రసిద్ధమైనవారు కదా. బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక కొత్త ప్రపంచం యొక్క రాజ్యం కూడా వారికి తప్పకుండా లభించి ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేసారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దాని కోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది పిల్లలు, డ్రామా గొప్ప అని భావించాలా లేక పురుషార్థం గొప్ప అని భావించాలా అని అడుగుతారు. పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సిందేనని అర్థం చేయించడం జరుగుతుంది. పురుషార్థం లేకుండా ప్రారబ్ధం ఎలా లభిస్తుంది. పూర్తి పురుషార్థం చేయాలి. ఎవరైనా మంచి రీతిగా పురుషార్థం చేస్తే, డ్రామానుసారంగా వీరి పురుషార్థం బాగా నడుస్తుందని, మంచి పదవిని కూడా పొందుతారని అర్థం చేయించడం జరుగుతుంది. అటువంటివారి పురుషార్థం చాలా తీవ్రంగా నడుస్తుంది. తర్వాత నడుస్తూ-నడుస్తూ కొందరి పదవి తగ్గిపోతుంది కూడా. ఫలానావారు చాలా బాగా నడిచేవారని, ఈ రోజుల్లో రావడం లేదని బ్రాహ్మణీలకు తెలుస్తుంది, బ్రాహ్మణీల వద్దకు వచ్చేవారికి కూడా తెలుస్తుంది. మా బుద్ధిలో ఎందుకు కూర్చోవడం లేదో తెలియడం లేదు, మేము అసలు బాబాను స్మృతి చేయలేకపోతున్నాము, ఇక మేము నడవలేము, ఈ గమ్యం చాలా గొప్పది అని అంటారు. ఇలా రాస్తూ ఉంటారు. నిర్వికారులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. వికారాలను వదలడం చాలా కష్టము. డ్రామానుసారంగా కల్పక్రితం వలె వీరి అవస్థ ఇలాగే ఉంటూ వచ్చిందని మీకు తెలుసు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ అనంతమైన ఆటను సాక్షీగా అయి చూడాలి. ఎవరికీ భయపడకూడదు. నిర్భయులుగా అయ్యేందుకు ‘నేను ఆత్మను’ అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి.
2. తమను తాము చెక్ చేసుకొని స్వయాన్ని పరీక్షించుకోవాలి – ఏ కర్మేంద్రియము చంచలమవ్వడం లేదు కదా? కామ వికారంపై విజయం పొందానా? దేహీ-అభిమానిగా ఎంతవరకు అయ్యాను?
వరదానము:-
‘నేను మరియు నా బాబా’ – ఈ స్మృతితో కంబైండుగా ఉండండి మరియు ‘నేను ఈ రోజు బ్రాహ్మణుడిని, రేపు దేవతగా అవుతాను’ అనే శ్రేష్ఠమైన పొజిషన్ సదా స్మృతిలో ఉండాలి. హమ్ సో, సో హమ్ అనే మంత్రం సదా గుర్తున్నట్లయితే, ఈ నషా మరియు సంతోషంలో పాత ప్రపంచాన్ని సహజంగా మర్చిపోతారు. వారికి సదా ఇదే నషా ఉంటుంది – నేనే కల్ప-కల్పపు అధికారి ఆత్మను, నేనే అలా ఉండేవాడిని, ఇప్పుడు నేనే అలా ఉన్నాను మరియు కల్ప-కల్పము నేనే అలా ఉంటాను.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!