22 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

22 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

21 October 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మాయకు భయపడకండి, మాయ ఎంత మరపింపజేసేందుకు ప్రయత్నించినా కానీ అలసిపోకండి, అమృతవేళ లేచి స్మృతిలో ఉండేటువంటి పూర్తి పురుషార్థం చేయండి”

ప్రశ్న: -

ఏ పిల్లలు పురుషార్థంలో ముందు నంబరు తీసుకుంటారు?

జవాబు:-

ఎవరైతే తండ్రిపై పూర్తిగా బలిహారమవుతారో అనగా సమర్పణ అవుతారో, వారే అందరికన్నా ముందుకు వెళ్తారు. పిల్లలు తండ్రిపై బలిహారమవుతారు మరియు తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. మీరు ఏ విలువ లేని మీ పాత తనువు-మనసు-ధనాలను తండ్రికి ఇస్తారు మరియు తండ్రి మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు, అందుకే వారిని పేదల పెన్నిధి అని అంటారు. నిరుపేద అయిన భారత్ కు దానమిచ్చేందుకే తండ్రి వచ్చారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నయనహీనులకు మార్గాన్ని చూపించండి…

ఓంశాంతి. మధురాతి-మధురమైన, అతి మధురమైన అని అంటారు కదా! వారు అనంతమైన తండ్రి మరియు వారికి అనంతమైన ప్రేమ ఉంది. మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారని వారు అంటారు. ఒక్క తండ్రి మాత్రమే మార్గాన్ని చూపిస్తారు. భక్తి మార్గంలో మార్గం చూపించేవారు ఎవ్వరూ లేరు. అక్కడే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు మార్గం లభించింది, అయినా కానీ మాయ తండ్రితో బుద్ధియోగాన్ని జోడించనివ్వదు. ఒక్క తండ్రిని స్మృతి చేయడంతో మా దుఃఖాలన్నీ దూరమవుతాయని, చింతించే విషయమేమీ ఉండదని అర్థం చేసుకుంటారు కూడా, అయినా సరే మర్చిపోతారు. తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతితపావన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. తండ్రి జ్ఞానసాగరుడు కదా. వారే గీతా జ్ఞాన దాత. స్వర్గ రాజ్యాధికారాన్ని, సద్గతిని ఇస్తారు. కృష్ణుడిని జ్ఞానసాగరుడని అనలేరు. సాగరం ఒక్కటే ఉంటుంది. ఈ భూమికి నలువైపులా సాగరమే ఉంది. సాగరమంతా ఒక్కటే. తర్వాత దానిని విభజించడం జరిగింది. మీరు విశ్వానికి యజమానులుగా అయినప్పుడు మొత్తం సాగరానికి, భూమికి యజమానులుగా అవుతారు. ఇది మా భాగము, మా హద్దులోకి రాకండి అని ఎవ్వరూ అనలేరు. ఇక్కడైతే సాగరంలో కూడా భాగాలు-భాగాలుగా చేసేసారు. పూర్తి విశ్వమే భారత్ గా ఉండేదని, దానికి మీరు యజమానులుగా ఉండేవారని మీరు భావిస్తారు. పాట కూడా ఉంది – బాబా, మీ నుండి మేము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము, దానిని ఎవ్వరూ లాక్కోలేరు అని. ఇక్కడ చూడండి, నీటి కోసం కూడా గొడవపడతారు. ఒకరికొకరు నీళ్ళు ఇచ్చుకునేందుకు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు మొత్తం విశ్వ రాజ్యము కల్పక్రితం వలె లభిస్తుంది. తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. జ్ఞానదాత పరమపిత పరమాత్మ. వారు ఈ సమయంలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల వద్ద ఈ జ్ఞానముండదు. అయితే, వారు పూర్వ జన్మలో జ్ఞానం తీసుకొని ఈ విధంగా తయారయ్యారని అంటారు. మీరే అలా ఉండేవారు. మీరు అంటారు – బాబా, మీరు ఆ తండ్రియే, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసారు. తండ్రి అంటారు – నా మతము చాలా పెద్దదేమీ కాదు. ఆ చదువు ఎంత పెద్దదిగా ఉంటుంది. ఇదైతే చాలా సహజమైనది. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకొని, 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగారని ఇతరులకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. మాయా తుఫాన్లు చాలా వస్తాయి, వాటికి భయపడకండి అని కూడా తండ్రి చెప్పారు. ఉదయాన్నే లేచి కూర్చొన్నప్పుడు బుద్ధి వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. రెండు నిమిషాలు కూడా స్మృతి నిలవదు. తండ్రి అంటారు – అలసిపోకండి. అచ్ఛా, ఒక్క నిమిషం స్మృతిలో ఉంటే మళ్ళీ రేపు కూర్చోండి, ఆ మర్నాడు కూర్చోండి. మేము స్మృతి చేయాల్సిందేనని లోలోపల తప్పకుండా పక్కా చేసుకోండి. ఒకవేళ ఎవరైనా వికారాలలోకి వెళ్తే, వారికి చాలా తుఫాన్లు వస్తాయి. పవిత్రతయే ముఖ్యమైనది. నేడు ఈ ప్రపంచం పతిత వేశ్యాలయంగా ఉంది. రేపు పావన శివాలయంగా ఉంటుంది. ఇది పాత శరీరమని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, ఏ సమయంలో శరీరం వదిలినా, స్వర్గానికి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారు. తండ్రి నుండి ఎంతో కొంత జ్ఞానాన్ని అయితే విన్నారు కదా. ఇక్కడ నుండి వెళ్ళిపోయి, మళ్ళీ వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అంతమతి సో గతి (అంతిమ సమయంలో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి గతి (జన్మ) లభిస్తుంది) అని కూడా అర్థం చేయించడం జరిగింది. ఎవరైనా శరీరం వదిలారు అనుకోండి, జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు, అప్పుడు వారికి చిన్నతనం నుండే ఇటువైపు ఆకర్షణ కలుగుతుంది. ఇంద్రియాలు చిన్నగా ఉన్నా, మాట్లాడలేకపోయినా ఆకర్షించబడతారు. చిన్నతనం నుండే సంస్కారాలు బాగా ఉంటాయి. సుఖాన్ని ఇచ్చేవారిగా తయారవుతారు. తండ్రి ఆత్మకే నేర్పిస్తారు కదా. తండ్రి మిలటరీ వారి ఉదాహరణను అర్థం చేయిస్తారు – సంస్కారాలను తీసుకువెళ్తే మళ్ళీ సైన్యంలో చేరుతారు. ఉదాహరణకు శాస్త్రాలు చదివేవారు సంస్కారాలను తీసుకువెళ్తారు కనుక చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్తమవుతాయి. వారికి మహిమ కూడా జరుగుతుంది. కనుక ఎవరైతే ఇక్కడ నుండి వెళ్తారో, వారికి చిన్నతనంలోనే మహిమ జరుగుతుంది. ఆత్మనే జ్ఞాన ధారణ చేస్తుంది కదా. ఇకపోతే, మిగిలి ఉన్న లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. స్వర్గంలోకైతే వస్తారు కదా. తండ్రి వద్దకు వచ్చి ‘మాలేకమ్ సలామ్’ చేస్తారు (నమస్కరిస్తారు). ప్రజలైతే అనేకమంది తయారవుతారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. చివర్లో ‘అహో ప్రభూ, మీ లీల…’ అని అంటారు కదా.

ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు – ఓహో బాబా, డ్రామా ప్లాన్ అనుసారంగా మీ లీల ఇలా ఉంది. బాబా, మీ పాత్ర మనుష్యమాత్రులందరి పాత్ర కన్నా అతీతమైనది. ఎవరైతే తండ్రి సేవను బాగా చేస్తారో, వారికి బహుమతి కూడా చాలా మంచిది లభిస్తుంది. విజయమాలలో కూర్చబడతారు. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి, ఆత్మలకు ఇస్తారు. మనుష్యులందరూ శరీరాలనే గుర్తు చేస్తారు. శివానందుడు, గంగేశ్వరానందుడు… మొదలైనవారు ఫలానా జ్ఞానాన్ని ఇస్తున్నారని అంటారు. ఇక్కడ నిరాకార శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నారని అంటారు. నేను ఉన్నతోన్నతుడను. ఆత్మనైన నా పేరు ‘శివ’. శివ పరమాత్మాయ నమః అని అంటారు. మళ్ళీ బ్రహ్మా, విష్ణు, శంకరులను దేవతాయ నమః అని అంటారు. వీరు కూడా రచనయే, వీరి నుండి ఎలాంటి వారసత్వం లభించదు. మీరు పరస్పరంలో సోదరులు. సోదరుడిని స్మృతి చేయడం వలన వారసత్వం లభించదు. వీరు (బ్రహ్మా దాదా) కూడా మీ సోదరుడే, వీరు విద్యార్థి కదా, చదువుకుంటున్నారు, వీరి నుండి వారసత్వం లభించదు. వీరు స్వయం శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. ముందు వీరు (బ్రహ్మా) వింటారు. నేను (బ్రహ్మా) బాబాకు చెప్తాను – బాబా, నేను మీ మొట్టమొదటి సంతానమును, మీ నుండి నేను కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటాను, కల్ప-కల్పము మీ రథంగా అవుతాను. శివుని రథము బ్రహ్మా. బ్రహ్మా ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు కూడా సహాయకులు, తర్వాత మీరు యజమానులుగా అవుతారు. ఇప్పుడు మీకు తెలుసు – మనం 5 వేల సంవత్సరాల క్రితం వలె తండ్రి ద్వారా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము, ఎవరైతే కల్పక్రితం రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారో వారే వస్తారు. ఎవరు మహారాజు-మహారాణిగా అవుతారు, ఎవరు ప్రజలుగా అవుతారు అనేది ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా తెలిసిపోతుంది. చివర్లో మీకు అంతా సాక్షాత్కారం అవుతుంది. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంది. బలిహారం అవ్వాల్సి ఉంటుంది కూడా. తండ్రి అంటారు – నేను పేదల పెన్నిధిని, పేదవారైన మీరే నాపై బలిహారమవుతారు. దానము సదా పేదలకే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కాలేజీలు కట్టించారనుకోండి, అది పేదవారికి దానమివ్వడం కాదు. అదేమీ ఈశ్వరార్థం జరగదు, కానీ దానమైతే చేస్తారు కదా. ఎవరైనా కాలేజీని తెరిస్తే, దానికి ఫలం లభిస్తుంది. మరుసటి జన్మలో బాగా చదువుకుంటారు. ఈ ఆశీర్వాదం లభిస్తుంది. భారత్ లోనే అన్నింటికన్నా ఎక్కువ దాన-పుణ్యాలు జరుగుతాయి. ఈ సమయంలో చాలా దానం జరుగుతుంది. మీరు తండ్రికి దానమిస్తారు. తండ్రి మీకు దానమిస్తారు. మీ నుండి ఏ విలువ లేనివి తీసుకొని మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు. ఈ సమయంలో మీరు తనువు-మనసు-ధనములన్నింటినీ తండ్రికి దానంగా ఇస్తారు. అక్కడి వారు మరణిస్తే, ఫలానా ఆశ్రమానికి ఇవ్వాలి లేక ఇది ఆర్య సమాజం వారు తీసుకోవాలి అని వీలునామా రాసి వెళ్తారు. కానీ వాస్తవానికి ఆకలితో ఉన్న పేదవారికి దానమివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ పేదగా ఉంది కదా. స్వర్గంలో భారత్ ఎంత షావుకారుగా ఉంటుంది. అక్కడ మీ వద్ద ఎంత ధన-ధాన్యాలు ఉంటాయో, అంత ఇంకెవ్వరి వద్ద ఉండవని మీకు తెలుసు. అక్కడ ధనమేమీ ఖర్చు అవ్వదు. పిడికెడు బియ్యాన్ని దానమిస్తే, దానికి ప్రతిఫలంగా 21 జన్మలకు మహళ్ళు లభిస్తాయి. ఆస్తి కూడా లభిస్తుంది. ఇప్పుడు తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్న కారణంగా దుఃఖమిస్తాయి. అక్కడ తత్వాలు సతోప్రధానంగా ఉంటాయి. సత్యయుగంలో ఎవరెవరు వస్తారు, తర్వాత ద్వాపరంలో ఫలానావారు వస్తారని మీకు తెలుసు. కలియుగ అంతిమంలో చిన్న-చిన్న శాఖలు, మఠాలు, పీఠాలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీ బుద్ధిలో వృక్షము, డ్రామా మొదలైనవాటి జ్ఞానముంది. మీకు తండ్రి పాత్ర గురించి కూడా తెలుసు. పంచ పాండవులు మిగిలారని మహాభారత యుద్ధంలో చూపిస్తారు. అచ్ఛా, తర్వాత ఏమి జరిగింది? ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, తప్పకుండా వారే వెళ్ళి రాజ్యం చేస్తారు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. బాబా (బ్రహ్మా) కూడా గీత మొదలైనవి చదివేవారు. నారాయణుని భక్తి చేసేవారు. వారికి గీత పట్ల కూడా చాలా ప్రేమ ఉండేది. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడా గీతను చదివేవారు. ఇప్పుడు చూస్తే, వారికి ఏమీ అర్థం అవ్వలేదని తెలుస్తుంది, అనగా బుద్ధి రూపీ డబ్బాలో రాళ్ళు ఉన్నాయని అర్థమవుతుంది. భక్తి మార్గంలో అన్నీ చేస్తూ వచ్చారు కానీ ఉద్ధరణ జరగలేదు. ప్రపంచంలో ఎన్ని గొడవలున్నాయి. ఇక్కడ కూడా అందరూ పవిత్రంగా అవ్వలేరు, అందుకే గొడవలు జరుగుతాయి. తండ్రి శరణులోకి కూడా తీసుకుంటారు, అయినా సరే రోగం తప్పకుండా తిరగబడుతుందని అంటారు. పిల్లలు మొదలైనవారు గుర్తుకొస్తారు, ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. మేము మరణించాము అని భావించాలి. తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా ఈ ప్రపంచం నుండి మరణించడము. అప్పుడిక శరీర భానం ఉండదు. తండ్రి అంటారు – దేహ సహితంగా ఏ సంబంధాలైతే ఉన్నాయో, వాటిని మర్చిపోవాలి. ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో, అవేవీ లేనట్లే. ఈ పాత శరీరాన్ని కూడా విడిచిపెట్టాలి. మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి, మళ్ళీ వచ్చి కొత్త సుందరమైన శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శ్యామంగా ఉన్నారు, తర్వాత సుందరంగా తయారవుతారు. భారత్ ఇప్పుడు శ్యామంగా ఉంది, తర్వాత సుందరంగా తయారవుతుంది. ఇప్పుడు భారత్ ముళ్ళ అడవిలా ఉంది. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా విషయంలో డిస్టర్బ్ అయితే నిందించుకుంటారు, గొడవపడతారు. పిల్లలైన మీరు ఇంట్లో కూడా చాలా మధురంగా అవ్వాలి. లేదంటే మనుష్యులు అంటారు – వీరు 5 వికారాలను దానమిచ్చారు, మళ్ళీ క్రోధమెందుకు చేస్తున్నారు, బహుశా క్రోధాన్ని దానమివ్వలేదేమో అని. తండ్రి అంటారు – పిల్లలూ, జోలిలో5 వికారాలను దానమివ్వండి, అప్పుడు మీ గ్రహణం తొలగిపోతుంది. చంద్రునికి గ్రహణం పడుతుంది కదా. మీరు కూడా ఇప్పుడు సంపూర్ణంగా అవుతున్నారు కనుక – వికారాలను దానమివ్వండి, మీకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందని తండ్రి అంటారు. ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మ అంటుంది – ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది, పని ముగించాలి, ఏ ఆలోచనలు వచ్చినా వాటిని తొలగించుకోవాలి. అనేక రకాల ఆలోచనలు వస్తాయని బాబాకు తెలుసు. వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. భక్తి మార్గంలో భక్తి చేసే సమయంలో కొనుగోలుదారులు, వ్యాపార-వ్యవహారాలు గుర్తుకొస్తే – నేను నారాయణుని స్మృతిలో కూర్చొన్నాను, మరి ఆ విషయాలు ఎందుకు గుర్తుకొచ్చాయి అని తమను తాము గిచ్చుకుంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ ఆత్మిక సేవలో మంచి రీతిలో నిమగ్నమైతే – ఇక వ్యాపార-వ్యవహారాలను విడిచిపెట్టండి, బాబా సేవలో నిమగ్నమవ్వండి అని అర్థం చేయించడం జరుగుతుంది. వదిలేస్తే వదిలిపోతుందని అంటారు. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే, కోతుల వలె ఉన్నవారు మందిర యోగ్యులుగా తయారవుతారు. భ్రమరము, తాబేలు, ఈ ఉదాహరణలన్నీ తండ్రి ఇస్తారు, వీటినే మళ్ళీ భక్తి మార్గంలోని వారు ఉదాహరణలుగా చూపిస్తారు. ఆ పురుగు ఎవరితో పోల్చబడ్డదో ఇప్పుడు మీకు తెలుసు. మీరు బ్రాహ్మణీలు. మీరు భూ-భూ చేస్తారు. ఈ ఉదాహరణ ఇప్పటిదే. వారు చెప్పలేరు. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి సంబంధించినవి. సత్య, త్రేతా యుగాలలో పండుగలేవీ ఉండవు. ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. ఇప్పుడు చూడండి, కృష్ణ జయంతి రోజున మట్టితో కృష్ణుడిని తయారుచేసి, వారిని పూజించి, తర్వాత తీసుకువెళ్ళి నదిలో ముంచేసారు. వారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంధ విశ్వాసము. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే, వారు అర్థం చేసుకోలేరు. ఎవరికైనా అనారోగ్యం మొదలైనవి వస్తే – మీరు కృష్ణుని పూజను వదిలేసారు, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అంటారు. ఇలా చాలా మంది ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, తర్వాత పారిపోతారు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఉన్నతోన్నతమైనవారు ఈ బ్రాహ్మణ కులభూషణులు. కానీ వారి మాల తయారవ్వదు. ఇది శివబాబా మాల, తర్వాత మనం వెళ్ళి సత్యయుగంలో నంబరువారుగా విష్ణు మాలలో మణులుగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. మీ ఒక్కొక్క పదము ఎటువంటిదంటే, వీటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చదివిస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. ప్రదర్శనీలకు ఎంత మంది వస్తారు. మేము వచ్చి అర్థం చేసుకుంటామని అంటారు కానీ ఇంటికి వెళ్ళగానే ఇక అంతే, అక్కడిది అక్కడే ఉండిపోతుంది. ప్రభువును కలుసుకునే మార్గాన్ని చాలా బాగా చెప్తున్నారని అంటారు. కానీ తాము ఆ మార్గంలో నడవాలని, వారసత్వాన్ని తీసుకోవాలని వారి బుద్ధిలోకి రాదు. బ్రహ్మాకుమారీలు చాలా మంచి సేవ చేస్తున్నారు అని అంటారు, అంతే. అరే! మీరు కూడా అర్థం చేసుకోండి కదా. భౌతిక సేవలను చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవను చేయండి. సమాజ సేవను మనుష్యులందరూ చేస్తూ ఉంటారు. ఉచితంగా ఎవ్వరూ సేవలు చేయరు, లేదంటే ఎక్కడ నుండి తింటారు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా మంచి సేవ చేస్తారు. మీకు భారత్ పట్ల చాలా దయ కలుగుతుంది. మన భారత్ ఎలా ఉండేది, తర్వాత రావణుడు ఏ గతిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మేము తండ్రి శ్రీమతం అనుసారంగా నడుచుకుని తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము.

మనమంతా సంగమయుగానికి చెందినవారమని, మిగిలినవారంతా కలియుగం వారని ఇప్పుడు మీకు తెలుసు. మనం అటువైపుకు వెళ్తున్నాము. ఎవరైతే మంచి రీతిలో తండ్రి స్మృతిలో ఉంటారో, వారు కూర్చొని-కూర్చొనే స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. ఇక ఆత్మ తిరిగి రాదు. కూర్చొని-కూర్చొనే తండ్రి స్మృతిలో వెళ్ళిపోయారు. ఇక్కడ హఠయోగం మొదలైనవాటి విషయమేమీ లేదు. ఎలాగైతే ధ్యానంలో కూర్చొని-కూర్చొనే వెళ్ళిపోవడం చూస్తారో, అలా మీరు కూర్చొని-కూర్చొనే ఈ శరీరాన్ని వదిలేస్తారు. సూక్ష్మవతనానికి వెళ్ళి తర్వాత తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతియాత్రలో చాలా శ్రమిస్తారో, వారు ఆ విధంగా శరీరాన్ని వదిలేస్తారు. సాక్షాత్కారం జరుగుతుంది. ఎలాగైతే ప్రారంభంలో మీకు చాలా సాక్షాత్కారాలు జరిగాయో, అలా చివర్లో కూడా మీరు చాలా చూస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మందిర యోగ్యులుగా అయ్యేందుకు దేహాభిమానాన్ని వదిలేయాలి. ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలి.

2. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయం కనుక ఏవైతే లెక్కాచారాలు, వ్యాపార-వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయో, వాటిని తొలగించుకోవాలి. స్మృతి యాత్రలో ఉండేందుకు శ్రమించాలి.

వరదానము:-

యోగయుక్తమైనవారి గుర్తు – వారు బంధనముక్తులుగా ఉంటారు. యోగయుక్తంగా అయ్యేందుకు అన్నింటికంటే పెద్ద అంతిమ బంధనము – స్వయాన్ని తెలివైనవారిగా భావిస్తూ శ్రీమతాన్ని తమ స్వంత బుద్ధి యొక్క అద్భుతమని భావించడము అనగా శ్రీమతంలో తమ బుద్ధిని మిక్స్ చేయడము, దీనినే బుద్ధి యొక్క అభిమానమని అంటారు. 2) ఎప్పుడైనా ఎవరైనా ఈ బలహీనత ఉంది అని సూచన ఇస్తే లేక మన చెడును గురించి చెప్తే – ఒకవేళ ఆ సమయంలో ఏ కొంచెం వ్యర్థ సంకల్పాలు నడిచినా, అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటి గెలుపు-ఓటమి, నింద-స్తుతిలో సమాన స్థితిని తయారుచేసుకుంటారో, అప్పుడు సంపూర్ణ బంధనముక్తులని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top