21 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
22 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
21 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - వృక్షపతి అయిన తండ్రి పిల్లలైన మీ పై బృహస్పతి దశను కూర్చోబెట్టారు, ఇప్పుడు మీరు అవినాశీ సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్తున్నారు”
ప్రశ్న: -
అవినాశీ బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చొంటుంది, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
ఏ పిల్లలైతే జీవిస్తూనే దేహం యొక్క సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో, అటువంటి నిశ్చయమున్న ఆత్మిక బుద్ధి గల పిల్లలపై బృహస్పతి దశ కూర్చొంటుంది. అతీంద్రియ సుఖం గురించి గోప-గోపికలను అడగండి అని వారి సుఖాన్ని గురించే గాయనముంది. వారి సంతోషం ఎప్పుడూ కూడా మాయమవ్వదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ….
ఓంశాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజును వృక్షపతి రోజు అని అంటారు, దీనినే బృహస్పతి రోజు అని కూడా అంటారు. దీనినే గురువారమని కూడా అంటారు. కేవలం గురువారం కాదు, ఇది సద్గురువారము. దీనిని బెంగాల్ లో బాగా నమ్ముతారు. మనుష్య సృష్టికి బీజరూపుడని గాయనం ఉంది, అందుకే వారిని వృక్షపతి అని అంటారు. వారు బీజము కూడా మరియు పతి కూడా. వృక్షం యొక్క బీజాన్ని తండ్రి అని కూడా అంటారు. వారి నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. దీని బీజం పైన ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మనపై అవినాశీ వృక్షపతి దశ ఉందని మీకు తెలుసు ఎందుకంటే అవినాశీ స్వరాజ్యం లభిస్తుంది. సత్యయుగాన్ని అవినాశీ సుఖధామమని అంటారు. కలియుగాన్ని వినాశీ దుఃఖధామమని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనం అవ్వనున్నది. సుఖధామం అవినాశీ, అది అర్ధకల్పం నడుస్తుంది, దీనిని అవినాశీ వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనీలో ముఖ్యంగా ఈ-ఈ పాయింట్లు అర్థం చేయించాలని సేవ కోసం పిల్లలు పాయింట్లు నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనుష్యులకు ఏమీ తెలియదు. వాస్తవానికి ఇది జ్ఞానము. ఇప్పుడు కొత్త మరియు పాత ప్రపంచాల మధ్యలో తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత ఇది ప్రాయః లోపమైపోతుంది. దేవతలకు ఈ జ్ఞానముండదు. ఒకవేళ వారికి ఈ చక్రం యొక్క జ్ఞానమున్నట్లయితే, ఇక రాజ్యంలో మజా ఉండదు. ఇప్పుడు కూడా మీకు ఆలోచన వస్తుంది కదా – రాజ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ మా పరిస్థితి ఇలా అయిపోతుందా అని. కానీ డ్రామా ఇలా తయారై ఉంది. చక్రమైతే తిరగాల్సిందే. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతున్నాయి. ఎలా రిపీట్ అవుతున్నాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనం యొక్క వృక్షం కూడా ఉంది. అందరి సెక్షన్లు వేరు-వేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎప్పుడూ ఎవరి బుద్ధిలోనూ ఉండవు. ఇవి ఏ శాస్త్రాలలోనూ రాసి లేవు. ఆత్మలమైన మనం వాస్తవానికి శాంతిధామ నివాసులము, అవినాశీ, ఎప్పటికీ వినాశనం అవ్వము. నీటి బుడగలు నీటి నుండి వెలువడి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయని వారు భావిస్తారు. మీ బుద్ధిలో రహస్యమంతా ఉంది. ఆత్మ అవినాశీ, ఆత్మలో పాత్ర అంతా ఇమిడి ఉంది. అక్కడక్కడ స్వస్తిక్ ను చూపిస్తారు కానీ ఈ చక్రం గురించిన జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు. చక్రానికి సంబంధించి కొన్ని గీతలు గీస్తారు, దీని ద్వారా అనేక ధర్మాలుండేవని నిరూపించబడుతుంది. తండ్రి అర్థం చేయించారు – ముఖ్యమైన ధర్మాలు మరియు శాస్త్రాలు 4, సత్య-త్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపన జరగదు, అక్కడ ఏ ధర్మ శాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపరం నుండి మొదలవుతాయి. ఆ తర్వాత ఎంత వృద్ధి జరుగుతుందో చూడండి. అచ్ఛా – గీత ఎప్పుడు వినిపించడం జరిగింది? నేను కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తానని తండ్రి అంటారు. వారు మళ్ళీ కల్పం అన్న పదాన్ని తొలగించి కేవలం సంగమయుగే-యుగే అని రాసేసారు. వాస్తవానికి సంగమయుగంలో ఇంకెవరూ ధర్మ స్థాపనను చేయరు. త్రేతా అంతిమము, ద్వాపరయుగ ఆది యొక్క సంగమంలో ఇస్లామ్ ధర్మ స్థాపన జరిగిందని కాదు. ద్వాపరంలో ఇస్లామ్ ధర్మ స్థాపన జరిగిందని అంటారు. ఇది సంగమం యొక్క మనోహరమైన సమయము, దీనిని కుంభమని అంటారు. కుంభమని సంగమాన్ని అంటారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మిలనం యొక్క సంగమము. ఈ ఆత్మిక మేళా సంగమంలోనే జరుగుతుంది. వారు నీటి గంగ యొక్క పేరును ప్రఖ్యాతం చేసారు. వారికి జ్ఞానసాగరుడు, పతితపావనుడి గురించి అసలు తెలియదు. వారు పతిత ప్రపంచాన్ని ఏ విధంగా పావనంగా చేసారు అనేది ఏ శాస్త్రాలలోనూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తారు – నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహపు సర్వ ధర్మాలను త్యాగం చేయండి. ఎవరికి చెప్తారు? ఆత్మలకు. దీనినే జీవిస్తూ మరణించడమని అంటారు. మనుష్యులు శరీరం వదిలినప్పుడు దేహపు సంబంధాలన్నీ దూరమైపోతాయి.
తండ్రి అంటారు – దేహం యొక్క సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నిశ్చయమున్న ఆత్మిక బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంతగా బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అనేది పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది మరియు మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలమైన మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అనేది మీరు రియలైజ్ అవ్వగలరు. ఒకవేళ తక్కువగా స్మృతి చేసినట్లయితే, తుప్పు కూడా తక్కువగా వదులుతుంది, సంతోషం కూడా తక్కువగా ఉంటుంది, పదవి కూడా తక్కువదే పొందుతారు. ఆత్మనే సతో, రజో, తమోగా అవుతుంది. గోప-గోపికల అతీంద్రియ సుఖం యొక్క గాయనం ఈ సమయానికి సంబంధించినదే. తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రానప్పుడే సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది. మనపై బృహస్పతి దశ మరియు సద్గురువు దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం మాయమైతే, బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చుందని అంటారు. కొందరు చాలా షావుకార్లుగా ఉంటారు, ఒకవేళ ఎవరైనా నష్టం కలిగిస్తే దివాలా తీస్తారు. భారత్ లోనే గ్రహణం పట్టినప్పుడు, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుందని అంటారు. మీ దేవీ-దేవతా ధర్మం కూడా 16 కళల సంపూర్ణంగా ఉండేది, ఇప్పుడు దానికి గ్రహణం పట్టి ఉంది. రాహు దశ కూర్చొంటుంది, అందుకే దేవతల ఎదురుగా వెళ్ళి – మీరు సర్వ గుణ సంపన్నులు….. మేము పాపులము, కపటులము అని పాడుతారు. రాహు గ్రహణం పట్టడంతో అందరూ నల్లగా అయిపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చంద్రునిలో చివరికి ఒక రేఖ మిగిలి ఉంటుంది. దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయని తండ్రి అర్థం చేయిస్తారు. గీతనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రము. కానీ వీరికి తమ ధర్మం గురించి తెలియదు. రిలీజియస్ హెడ్స్ యొక్క కాన్ఫరెన్స్ లు (ధర్మనేతల సమ్మేళనాలు) ఏర్పాటు చేస్తారు. మీరు అక్కడ కూడా అర్థం చేయించవచ్చు – ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, వారు అనంతమైన తండ్రి, వారు వచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు అని. సాధు-సత్పురుషులు మొదలైనవారికి వారసత్వం లభించదు కావున వారెలా నమ్ముతారు! పిల్లలైన మీకు మాత్రమే వారసత్వం లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని నిరూపించడమే ముఖ్యమైన విషయము. శివజయంతి జరుగుతుంది. శివజయంతి అనండి లేక రుద్ర జయంతి అనండి – రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. వారే శివుడు. ఇదే గీతా జ్ఞాన యజ్ఞము, దీని ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమయింది. నిరాకార తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారు అనేది మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. సాకారుడు ఏమీ చేయలేరు. ఇది అనంతమైన యజ్ఞము, ఇందులో పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. మిగిలినవన్నీ భౌతిక యజ్ఞాలు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, వినాశనం కూడా జరగనున్నదని తండ్రి అంటారు. మీరు పాస్ అయినప్పుడు, పూర్తి యోగులుగా మరియు జ్ఞానులుగా అయినప్పుడు, మీ కోసం కొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. నరకం తప్పకుండా వినాశనమవ్వాలి. రాజస్వ అశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గా ఉంది. వారు గుర్రాన్ని స్వాహా చేస్తారు. వాస్తవానికి ఇది మీ రథము. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని కూడా రచిస్తారు, వారికి సంబంధించిన కథ కూడా ఉంది.
మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. మాపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, మా అవస్థ చాలా బాగుంది అని అంటారు. తర్వాత నడుస్తూ-నడుస్తూ బాబా, మేము తికమకలో పడ్డాము, ఇదివరకు మేము చాలా సంతోషంగా ఉండేవారము, ఇప్పుడు ఏమయిందో తెలియదని రాస్తారు. ఇక్కడకు వచ్చి తండ్రికి చెందినవారిగా అవ్వడం అనేది పెద్ద యాత్ర. అక్కడ తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు, ఇక్కడ దానం చేసే విషయమేమీ లేదు. ఇక్కడ ధనమేమీ ఖర్చు చేయాల్సిన పని లేదు. అవి దైహిక యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రలతో లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము కానీ జన్మ-జన్మల నుండి దూరంగా ఉన్నామని పాటలో కూడా ఉంది కదా. మనం ఎన్ని యాత్రలు చేసి ఉండవచ్చు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు తప్పకుండా ఎదో ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. హరిద్వార్ లో గంగ వద్దకు తప్పకుండా వెళ్తారు. గంగను పతితపావనిగా భావిస్తారు కదా. ఇప్పుడు నిజానికి మీరు సత్యాతి-సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు కూడా చాలా మంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. సద్గురువు ఒక్కరేనని బాబా అర్థం చేయించారు. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువు తప్ప ఇంకే గురువు కాదు. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము సంగమయుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. తర్వాత మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులు అయిపోతారు. ఇది కూడా ఇప్పుడే మీకు తెలిసింది. తప్పకుండా అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది, తర్వాత ద్వాపరయుగంలో దేవీ-దేవతలైన మనమే వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి వామ మార్గం మొదలవుతుంది. దాని గుర్తులు కూడా ఉన్నాయి. జగన్నాథుని మందిరానికి వెళ్ళినట్లయితే, లోపల నల్లని మూర్తి ఉంటుంది. బయట దేవతలకు సంబంధించిన అశుద్ధమైన చిత్రాలున్నాయి. ఆ సమయంలో వాటి అర్థం మనకు కూడా తెలిసేది కాదు. వికారీ మనుష్యులు వికారీ దృష్టితో చూస్తారు కావున దేవతలు కూడా వికారులేనని అనుకున్నారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారని రాయబడి ఉంది. వస్త్రాలు కూడా దేవతలవే చూపించారు. ఇక్కడ కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గముంది. కింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ఈ రహస్యాలన్నింటి గురించి ఇంకెవరికీ తెలియదు. బాబాది అనుభవీ రథం కదా.
ఆత్మ-పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరకన్నా ముందు దూరమైన మీరే మళ్ళీ ముందు వచ్చి నన్ను కలుసుకుంటారు. సత్యయుగం యొక్క మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడికి తండ్రి కూడా ఉంటారు కదా. కృష్ణుని తల్లిదండ్రుల గురించి అంతగా ఏమీ చూపించరు. తలపై పెట్టుకొని నదిని దాటి తీసుకువెళ్ళినట్లుగా మాత్రమే చూపిస్తారు. రాజ్యం మొదలైనవేవీ చూపించలేదు. వారి తండ్రి మహిమ ఎందుకు లేదు! ఈ సమయంలో కృష్ణుని ఆత్మ చాలా బాగా చదువుకున్నారని, దీని కారణంగా తల్లిదండ్రుల కన్నా ఉన్నతమైన పదవిని పొందారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవారని మీకు తెలుసు, స్వర్గంలో ఉండేవారు కదా. తర్వాత మనం చంద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీయులుగా అయ్యేందుకు శ్రీమతంపై నడుచుకుని పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ప్రతి ఒక్కరు తమ అవస్థను చూసుకోగలరు. ఒకవేళ ఈ సమయంలో నేను ఈ శరీరాన్ని వదిలేస్తే ఏ గతిని పొందుతాను – అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మనుష్యులకు ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు లేక దుఃఖం కలిగినప్పుడు లేక దివాలా తీసినప్పుడు సాధువుల సాంగత్యంలోకి వెళ్తారు. ఈ సాధువులు భక్తుల వంటివారు, వీరు మోసం చేయరు అని భావిస్తారు. కానీ అలాంటివారు కూడా 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అయిపోతారు. వారు దాచిపెట్టుకున్న ధనం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువగా స్మృతి చేసేవారు చాలా మంది ఉన్నారు, అందుకే మీరు మీ కళ్యాణాన్ని కోరుకున్నట్లయితే మీ వద్ద నోట్ బుక్ పెట్టుకోండి అని బాబా అంటారు. మేము రోజంతటిలో ఎంత సమయం స్మృతిలో ఉన్నాము అని చార్టు నోట్ చేసుకోండి. మనుష్యులు పూర్తి జీవితం యొక్క చరిత్రను కూడా రాస్తారు. మీరైతే కేవలం స్మృతి చార్టును రాయాలి, దీనితో మీ ఉన్నతే జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలే వినాశనం కాకపోతే ఉన్నత పదవిని ఎలా పొందుతారు. తర్వాత శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైతే శిక్షలు అనుభవించరో, వారికి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించిన తర్వాత ఏంతో కొంత పదవిని పొందితే ఏమి లాభము. ధర్మరాజు శిక్షలను అనుభవించకూడదు, అమర్యాద జరగకూడదు – అనే పురుషార్థం చేయాలి. శివబాబా కూర్చొని ఉంటారు, వారితో పాటు ధర్మరాజు కూడా ఉంటారని మీరు చూస్తారు. మీకు అంతా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇవి-ఇవి చేసారు, గుర్తుందా? ఇప్పుడు శిక్ష అనుభవించండి. అప్పుడు, ఆ సమయంలోని శిక్షలు జన్మ-జన్మల శిక్షలు అనుభవిస్తున్నట్లుగా ఉంటాయి. చివర్లో కొద్దిగా రొట్టె ముక్క లభిస్తే, దానితో ఏమి లాభము. శిక్షలనైతే అనుభవించకూడదు. మీ అవస్థను పరిశీలించుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలు లెక్కలను, కొందరు 12 నెలల లెక్కలను తీస్తారు. కొందరు రోజువారీ లెక్కను కూడా తీస్తారు. మీరు కూడా వ్యాపారులే అని తండ్రి అంటారు. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేకపోతే తనువు, మనస్సు అయితే ఉన్నాయి కదా. వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చి-పుచ్చుకోవడము చేస్తారు కదా. మీరు తనువు-మనసు-ధనాలను ఇస్తారు, దీనికి రిటర్న్ లో 21 జన్మలకు ఎంత వారసత్వాన్ని పొందుతారు. బాబా, నేను మీ వాడిని, మా ఆత్మ మరియు శరీరం ఈ లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియజేయండి అని అంటారు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని ఎంత సుందరంగా తయారుచేస్తాను. మీ రూపాన్ని పూర్తిగా మార్చేస్తాను. మరుసటి జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మా-బాబాలు తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్యము-ఉద్దేశ్యమును కూడా చూపిస్తారు. ఇప్పుడిక ఎవరెంత పురుషార్థం చేస్తారో, అంత పొందుతారు. ఒకవేళ పురుషార్థం పూర్తిగా చేయకపోతే, అలజడి సృష్టించినట్లయితే తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయం యొక్క అవస్థను స్వయమే పరిశీలించుకోవాలి. తమ కళ్యాణం కోసం రోజువారీ డైరీ పెట్టుకోవాలి, అందులో స్మృతి చార్టును నోట్ చేయాలి.
2. అనంతమైన తండ్రితో సత్యాతి-సత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు-మనసు-ధనాలను తండ్రికి సమర్పించి 21 జన్మలకు రిటర్న్ తీసుకోవాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి తమ కళ్యాణం చేసుకోవాలి.
వరదానము:-
బాప్ దాదా యొక్క నంబర్ వన్ శ్రీమతము – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఒకవేళ స్వయాన్ని ఆత్మగా కాకుండా సాధారణ శరీరధారిగా భావించినట్లయితే స్మృతి నిలవదు. మామూలుగా కూడా ఏవైనా రెండు వస్తువులను జోడించేటప్పుడు ముందు వాటిని సమానంగా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ స్మృతి చేసినట్లయితే స్మృతి సహజమవుతుంది. ఈ శ్రీమతమే ముఖ్యమైన పునాది. ఈ విషయం పట్ల పదే పదే అటెన్షన్ పెట్టినట్లయితే సహజయోగిగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!