20 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
19 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మీరు యోగబలంతో శత్రువైన రావణునిపై విజయాన్ని పొందాలి, మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి”
ప్రశ్న: -
పిల్లలందరూ తండ్రి శ్రీమతాన్ని ఒకే విధంగా అనుసరించరు – ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే తండ్రి ఎవరు అన్నది, అందరూ ఒకే విధంగా గుర్తించలేదు. ఎప్పుడైతే పూర్తిగా గుర్తిస్తారో, అప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తారు. 2. మాయ శత్రువు శ్రీమతాన్ని అనుసరించకుండా ఆపుతుంది, అందుకే పిల్లలు మధ్యమధ్యలో తమ మతాన్ని నడిపిస్తారు. తర్వాత అంటారు – బాబా, మాయ తుఫాన్లు వస్తున్నాయి, మీ స్మృతిని మర్చిపోతున్నాము. బాబా అంటారు – పిల్లలూ, మాయా రావణునికి భయపడకండి, జోరుగా పురుషార్థం చేసినట్లయితే అది అలసిపోతుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
వారు మా నుండి విడిపోలేరు….. (న వహ్ హమ్ సే జుదా హోంగే…..)
ఓంశాంతి. మీరు సింగిల్ (ఒక) ఆత్మ. ప్రతి ఒక్కరు ఓం శాంతి అని అంటారు. వీరు డబల్ (ఇద్దరు) కనుక ఓం శాంతి, ఓం శాంతి అని రెండు సార్లు చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు – ఇక్కడ మీరు యుద్ధ మైదానంలో కూర్చుని ఉన్నారు. అలాగని అక్కడి మనుష్యుల వలె పరస్పరంలో కొట్లాడుకోరు. ఆ మాటకు వస్తే, ప్రతి ఇంట్లో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. మెజారిటీ గురించి చెప్పడం జరుగుతుంది. నంబరువన్ – దేహాభిమానం, రెండవది – కామము. ఇప్పుడు మీరు స్మృతి బలంతో 5 వికారాల రూపీ రావణునిపై విజయాన్ని పొందుతారు. స్మృతి బలం ఉన్నట్లయితే మీరు ఎప్పుడూ పడిపోరు. మీ యుద్ధం ఒక్క రావణునితోనే. అక్కడైతే అనేక రకాల విషయాలుంటాయి. ఇక్కడ ఒకే విషయం ఉంటుంది. మీ యుద్ధం ఒక్క రావణునితోనే. మీకు నేర్పించేవారు ఎవరు? పతితపావనుడైన భగవంతుడు. వారు పతితులను పావనంగా తయారుచేసేవారు. పావనులు అనగా దేవతలు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు రావణుని ద్వారా పతితులుగా అయ్యారని మనుష్యులెవరూ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయించారు – ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యముంది. ఇదే విధంగా, సత్య-త్రేతా యుగాలలో రామ రాజ్యముంటుంది. అది కూడా మొత్తం ప్రపంచమంతటిపైన ఉంటుంది. కానీ అక్కడ ఇంతమంది మనుష్యులుండరు. మీరు యోగబలంతో విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. అలాగని, ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే తండ్రిని స్మృతి చేయాలి లేక స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అని కాదు. ఇదైతే ప్రతి క్షణం బుద్ధిలో ఉండాలి. మనం అర్ధకల్పం స్వర్గంలో రాజ్యం చేసాము, తర్వాత రావణుని శాపం లభించడంతో దిగిపోతాము. దిగిపోవడానికి సమయమైతే పడుతుంది. 84 మెట్లు దిగవలసి ఉంటుంది. ఎక్కే కళలో మెట్లు ఉండవు. ఒకవేళ మెట్లు ఉన్నట్లయితే సెకెండులో జీవన్ముక్తి అని ఎలా అంటారు? దిగిపోవడానికి 2500 సంవత్సరాలు పట్టడం ఎక్కడ, కొన్ని సంవత్సరాలలోనే మీరు ఎక్కే కళలోకి వెళ్ళడం ఎక్కడ. మీది యోగబలము, వారిది బాహుబలము. ద్వాపరం నుండి మొదలుకొని దిగిపోతారు. తర్వాత బాహుబలం మొదలవుతుంది. సత్యయుగంలో హతమార్చే విషయమేమీ ఉండదు. కృష్ణుడిని రోలుకు కట్టినట్లుగా చూపిస్తారు కదా, అలాంటిదేమీ జరగదు. అక్కడ పిల్లల్లో ఎప్పుడూ చంచలత్వం ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉంటారు. కృష్ణుడిని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మంచి వస్తువనేది గుర్తుకొస్తూ ఉంటుంది కదా. ఉదాహరణకు, ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి, అవి మనుష్యులకు గుర్తుకొచ్చినప్పుడు వాటిని చూడడానికి వెళ్తారు. ఆబూలో మనుష్యులు చూడడానికి వచ్చే అన్నింటికన్నా మంచి వస్తువేది? ధార్మిక వ్యక్తులు మందిరాలను చూడడానికి వస్తారు. భక్తి మార్గంలో చాలా మందిరాలుంటాయి. సత్య, త్రేతా యుగాలలో మందిరాలేవీ ఉండవు. మందిరాలు స్మృతి చిహ్నాల రూపంలో తర్వాత తయారవుతాయి. సత్యయుగంలో పండుగలు మొదలైనవేవీ ఉండవు. దీపావళి పండుగ కూడా ఇక్కడి వలె ఉండదు. అయితే, సింహాసనంపై కూర్చున్నప్పుడు పట్టాభిషేకం రోజును జరుపుకుంటారు. అక్కడ అందరి జ్యోతి వెలిగి ఉంటుంది.
నవయుగం వచ్చింది….. అని మీ వద్ద ఒక పాట కూడా ఉంది. మనం నవయుగం అనగా సత్యయుగం కోసం దేవీ-దేవతలుగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నామని కేవలం మీకు మాత్రమే తెలుసు. చదువునైతే పూర్తిగా చదువుకోవాలి. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఈ జ్ఞానము సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం కోసముంది. ఇక్కడ భాష మొదలైనవేవీ నేర్చుకోరు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, అంతే. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు, మీరు స్వదర్శన చక్రధారులు. మా 84 జన్మల చక్రం పూర్తి అయ్యిందని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు పాత శరీరాన్ని, పాత సంబంధాలను వదిలి కొత్తవి తీసుకోవాలి. విష్ణుపురికి యజమానులుగా తయారయ్యేందుకు, తండ్రి పురుషార్థం చేయిస్తున్నారు. ప్రపంచంలో మిగిలినవారంతా ఆసురీ సంప్రదాయానికి చెందినవారు. భగవానువాచ – ఇప్పుడు అదే గీతా యుగం నడుస్తుంది. ఇది కల్ప-కల్పపు సంగమయుగము. తండ్రి అంటారు – నేను కల్పం యొక్క ఈ సంగమయుగంలో వస్తాను. నేను ఆ గీత భగవానుడినే. నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచించడానికి ఇక్కడకు వస్తాను. నేను ద్వాపరంలో ఎలా వస్తాను. ఇది ఒక పెద్ద పొరపాటు. కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి, కొన్ని పెద్ద పొరపాట్లు జరుగుతాయి. ఇది అన్నింటికంటే పెద్ద పొరపాటు. పునర్జన్మ రహితుడైన శివ భగవానుడికి బదులుగా 84 జన్మలు తీసుకునే వారి పేరును రాసేసారు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు చెప్పలేరని ఇప్పుడు మీకు తెలుసు. అన్ని ధర్మాల వారు వారిని అంగీకరించరు. శివుడు నిరాకారుడు. మీరు శివశక్తి సైన్యము. మీరు శివబాబాతో యోగాన్ని జోడించి శక్తిని తీసుకుంటారు. ఇందులో స్త్రీ-పురుషుల విషయమేమీ లేదు. ఆత్మలైన మీరంతా సోదరులు. మీరంతా తండ్రి నుండి శక్తిని తీసుకుంటున్నారు. వారసత్వాన్ని తండ్రియే ఇస్తారు కదా. ఆ తండ్రియే సర్వశక్తివంతుడు. ఈ లక్ష్మీనారాయణులను కూడా సర్వశక్తివంతులు అని అంటారు ఎందుకంటే వీరు మొత్తం విశ్వానికి యజమానులు. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు? ఇప్పుడు కేవలం భారత్ లోనే కాదు, మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యముంది. ఎవరైనా రాజులుంటే, వారి పెద్దలు రాజ్యం చేసారని, అది అలా నడుస్తూ వస్తుందని తెలుస్తుంది. లక్ష్మీనారాయణులు సత్యయుగం ఆది నుండి ఉన్నారు అంటే తప్పకుండా పూర్వ జన్మలో అంతటి పురుషార్థం చేసి ఉంటారు. దాన-పుణ్యాలు చేయడం వలన పతిత రాజ్యాలు లభిస్తాయి. ఇక్కడ ఈ సంగమంలో జ్ఞాన బలం మరియు యోగ బలంతో 21 జన్మలకు రాజ్యాన్ని పొందుతారు. ఈ పాత ప్రపంచమంతా వినాశనమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ దేహం కూడా మిగలదు. కనుక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. బాబా-బాబా అని అనడం నేర్చుకోండి. ఎలాగైతే చిన్న పిల్లలకు నేర్పించినప్పుడు, ఇక వారు వారి తండ్రిని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలైన మీతో – ఓ పిల్లలూ, ఇది కొత్త విషయము అని చెప్తున్నారు. తండ్రి అంటారు – ఇప్పుడు ఆత్మిక తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ అయితే అవినాశీ, శరీరం వినాశీ, మరి శక్తివంతమైనది ఏది? శరీరము, ఆత్మ యొక్క ఆధారంతో నడుస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని అగ్నిలో కాల్చవలసి ఉంటుంది. ఆత్మ ఎలాగూ అవినాశీ, అది ఒక చిన్న బిందువుగానే ఉంటుంది. ఆ ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా, దాని వల్ల లాభమేముంటుంది! ఆత్మ ఒక బిందువు అని, అందులో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉంటుందని వారికి తెలియనే తెలియదు. ఈ విషయాలు మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. రాజయోగాన్ని నేర్పించేవారు ఆ తండ్రి మాత్రమే. ఇకపోతే, బ్యారిస్టర్లు, వకీళ్ళు, ఇంజనీర్లు మొదలైనవారైతే ఉంటూనే ఉంటారు. ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. వారు కూడా మనుష్యులే కానీ వారిని దేవతలని అంటారు. దేవతలు అనగా దైవీ గుణాలను ధారణ చేసేవారు. మీరు పురుషార్థం చేసి అలాంటి దైవీ గుణాలు కలిగినవారిగా తయారవ్వాలి. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ దేవతలలో ఏయే గుణాలున్నాయి అనేది మీకు తెలుసు. మనం ఆ విధంగా తయారవ్వాలి. ప్రజలు కూడా ఉంటారు కదా. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవుతారు కానీ రాజా-రాణులుగా అవ్వడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఎవరైతే బాగా కష్టపడతారో, వారు రాజా-రాణులుగా అవుతారు. ఎవరైతే చాలామందికి జ్ఞానాన్ని ఇస్తారో, వారంతా తమ హృదయం ద్వారా అర్థం చేసుకోగలరు. ఆత్మ అంటుంది – నేను అనంతమైన తండ్రికి చెందినవానిగా తప్పకుండా అవుతాను, వారిపై బలిహారమవుతాను, అర్పణ అవుతాను. నా వద్ద ఏదైతే ఉందో, అదంతా అర్పణ చేస్తాను. ఈశ్వరునికైతే ఇస్తారు కదా. మీరు వచ్చినట్లయితే నేను బలిహారమవుతాను. దానికి బదులుగా మీ నుండి కొత్త తనువును, మనసును, ధనాన్ని తీసుకుంటాను. కొత్త మనసును ఎలా తీసుకుంటారు? ఆత్మను కొత్తగా (పవిత్రంగా) తయారుచేస్తారు. ఆ తర్వాత శరీరం కూడా కొత్తది తీసుకుంటారు. రాజధానిని కూడా తీసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా. ఆత్మ అంటుంది – ఓ బాబా, ఈ శరీర సహితంగా నేను మీ వాడిని, బాబా, నేను మీ శరణులోకి వస్తాను. రావణ రాజ్యంలో అందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు, అందుకే, బాబా, ఇప్పుడు దీని నుండి విముక్తులను చేసి మీ రాజధానిలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. శివబాబా అయితే లభించారు, ఇంకేమి కావాలి? మీకు తెలుసు – శివబాబా శ్రీమతంతో స్వర్గం తయారవుతుంది. ఆసురీ రావణుని మతంతో నరకం తయారవుతుంది. ఇప్పుడు శ్రీమతంతో మళ్ళీ స్వర్గం తయారవ్వనున్నది. ఎవరైతే కల్పక్రితం వచ్చి ఉంటారో, తప్పకుండా వారే వస్తారు, శ్రీమతంతో ఉన్నతంగా తయారవుతారు. రావణుని మతాన్ని అనుసరించడంతో పడిపోతారు. ఇప్పుడు మీది ఎక్కే కళ, మిగిలినవారందరిదీ దిగే కళ. అనేక ధర్మాలున్నాయి. సత్యయుగంలో ఒక్క దేవీ-దేవతా ధర్మముండేది. ఇప్పుడు అది ప్రాయః లోపమైపోయింది (మర్రి వృక్షం వలె).
దేవీ-దేవతా ధర్మానికి సంబంధించిన గుర్తులున్నాయని మీకు తెలుసు. నిజంగా ఒకప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. ఇది 5000 సంవత్సరాల చక్రమని మీరు నిరూపించి చెప్తారు. ఇందులో 4 యుగాలున్నాయి. ప్రతి యుగం యొక్క ఆయువు 1250 సంవత్సరాలు. వారైతే లక్షల సంవత్సరాలని రాసేసారు. చాలా తేడా ఉన్న కారణంగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇతర సంస్థలు ఎలా ఉన్నాయో, అలా ఇది బి.కె.ల సంస్థ, వీరు గీతను గురించి చెప్తారు అని భావిస్తారు. ఇప్పుడు గీతను కృష్ణ భగవానుడు వినిపించారు కదా అని అనుకుంటారు. ఇక్కడ వజ్రాల వ్యాపారి అయిన దాదా కూర్చొని ఉన్నారు కనుక మనుష్యులు తికమకపడతారు కదా. తండ్రి అంటారు – నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా నా గురించి ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేదు. చివర్లో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఇప్పటివరకు నంబరువారుగా తెలుసుకున్నారు. అందుకే శ్రీమతాన్ని అనుసరించడం చాలా కష్టమని భావిస్తారు. మంచి-మంచి పిల్లలు కూడా శ్రీమతాన్ని అనుసరించరు. రావణుడు అనుసరించనివ్వడు. తమ సొంత మతాన్ని నడిపిస్తారు. శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించేవారు కొద్దిమందే ఉన్నారు. మున్ముందు పూర్తిగా గుర్తిస్తారు, అప్పుడు శ్రీమతాన్ని అనుసరిస్తారు. నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అది మున్ముందు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పూర్తిగా అర్థం చేసుకుంటే, ఇంకేం కావాలి! ఉండడమైతే తమ గృహస్థంలోనే ఉండాలి కానీ శత్రువైన మాయ ఎలాంటిదంటే, అది శ్రీమతాన్ని అనుసరించకుండా ఆపేస్తుంది. బాబా, మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయి, మాయ మీ స్మృతిని మరపింపజేస్తుందని అంటారు. అవును, పురుషార్థాన్ని తీవ్రంగా చేస్తూ ఉంటే, చివరికి మాయ కూడా అలసిపోతుంది. మాల కూడా 8 మందిదే. ముఖ్యమైనవారు 8 రత్నాలు. ఆ 8 మంది జంటలు, మధ్యలో 9వ రత్నంగా శివబాబాను పెడతారు. కొందరు ఎరుపు రంగు రత్నాన్ని పెడతారు, కొందరు తెల్ల రంగు రత్నాన్ని పెడతారు. ఇప్పుడు శివబాబా అయితే ఒక బిందువు. బిందువు ఎప్పుడూ ఎర్రగా ఉండదు. బిందువు తెల్లగానే ఉంటుంది. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని దివ్యదృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. డాక్టర్లు మొదలైనవారు బిందువును చూడడానికి ఎంతగా ప్రయత్నిస్తారు, కానీ వారు చూడలేరు ఎందుకంటే అది అవ్యక్తమైనది కదా. అందుకే మిమ్మల్ని అడుగుతారు – నేను ఒక ఆత్మ అని మీరు అంటారు కదా, అచ్ఛా, ఆత్మను ఎప్పుడైనా చూసారా. తమను తామే చూడలేరన్నప్పుడు తండ్రిని ఎలా చూడగలరు? ఆత్మలో పాత్ర ఎలా నిండి ఉంది అని ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఈ విషయం గురించి ఎవరికీ ఏమాత్రం తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలని అంటారు. తండ్రి వచ్చి పిల్లలకు కూడా అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. నేటి భారత్ ఎలా ఉంది, రేపటి భారత్ ఎలా ఉంటుంది? అంతా వివరిస్తారు. మహాభారత యుద్ధం కూడా ఉంది. గీతా జ్ఞానాన్ని కూడా ఇచ్చారు. ఇది రుద్ర యజ్ఞం కూడా. అన్ని ధర్మాల వినాశనం, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది.
ఇది శివబాబా భండారా (కిచెన్). ఇందులో మీకు పవిత్రమైన భోజనం లభిస్తుంది. బ్రాహ్మణ-బ్రాహ్మణీలే తయారుచేస్తారు కావుననే దీని మహిమ అపారమైనది. దీని ద్వారా మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున పవిత్రమైన భోజనం మంచిది. మీరు ఎంత ఉన్నతంగా అవుతూ ఉంటారో, అంతగా మీకు భోజనం కూడా శుద్ధమైనది లభిస్తూ ఉంటుంది. ఎవరైనా యోగయుక్తంగా భోజనం తయారుచేస్తే, చాలా బలం లభిస్తుంది. అది కూడా మున్ముందు లభిస్తుంది. సేవాధారులైన పిల్లలు ఎవరైతే సెంటర్లో ఉంటారో, వారు తమ చేతులతోనే భోజనాన్ని తయారుచేసుకొని తింటే, దానితో చాలా బలం లభించగలదు. ఎలాగైతే పతివ్రత స్త్రీ పతిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయరో, అలా పిల్లలైన మీరు కూడా స్మృతిలో ఉంటూ తయారుచేయండి, తినండి, అప్పుడు చాలా బలం లభిస్తుంది. తండ్రి స్మృతిలో ఉండడంతో మీరు విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. బాబా సలహానైతే ఇస్తారు కానీ ఇప్పుడు ఎవరి బుద్ధిలోకి రాదు. మున్ముందు కొంతమంది చెప్పవచ్చు – మేము మా చేతులతోనే యోగయుక్తంగా భోజనం తయారుచేస్తాము, తద్వారా అందరి కళ్యాణం జరుగుతుంది అని.
తండ్రి పిల్లలకు అన్ని రకాల డైరెక్షన్లు ఇస్తారు కదా. త్రిమూర్తి చిత్రం ఎదురుగా ఉండాలి. వారసత్వం శివబాబా నుండి తీసుకోవాలి. ఏదో ఒక యుక్తిని రచిస్తూ ఉండండి. బాబా తన ఉదాహరణను ఇలా ఇస్తారు – నేను భక్తి మార్గంలో నారాయణుని చిత్రాన్ని చాలా ప్రేమించేవాడిని, వారిని స్మృతి చేస్తూ ఉంటే అశ్రువులు వచ్చేవి ఎందుకంటే ఆ సమయంలో వైరాగ్యముండేది, బాల్యంలో వైరాగ్య వృత్తి ఉండేది. ఇవి అనంతమైన విషయాలు. అయినా, ‘మన్మనాభవ’ అని చెప్తారు. యోగంలో ఉండడంతోనే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. స్మృతిలో ఉండాలనే చింత ఉండాలి. శ్రీమతం లభిస్తుంది, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. నేను సృష్టి రచయితను కనుక మీరు కూడా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు కదా. లేకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు మరియు పదవి కూడా భ్రష్టమవుతుంది. మరణించేందుకు ముందే మేము సతోప్రధానులుగా ఎలా అవ్వాలి అన్న చింత పిల్లల్లో ఉండాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇది అన్నింటికంటే పెద్ద చింత. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. యోగయుక్తంగా ఉంటూ తమ చేతులతో భోజనాన్ని తయారుచేసుకోవాలి మరియు తినాలి. పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రమైన భోజనాన్ని తినాలి. అందులోనే బలముంది.
2. కొత్త తనువు, మనసు, ధనములను ప్రాప్తి చేసుకునేందుకు పాతదంతా తండ్రిపై బలిహారం చేయాలి. ఈ శరీర సహితంగా తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి.
వరదానము:-
ఎవరైతే మహాన్ ఆత్మలుగా ఉంటారో, వారి ప్రతి వ్యవహారం ద్వారా సర్వాత్మలకు సుఖం దానంగా లభిస్తుంది. వారు సుఖాన్ని ఇస్తారు మరియు సుఖాన్ని తీసుకుంటారు. కావున చెక్ చేసుకోండి – మహాన్ ఆత్మ యొక్క లెక్కలో మొత్తం రోజంతటిలో అందరికీ సుఖాన్ని ఇచ్చానా, పుణ్య కర్మలు చేసానా. పుణ్యం అనగా ఎవరికైనా ఎటువంటి వస్తువు ఇవ్వాలంటే, దాని ద్వారా ఆ ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభించాలి. కావున చెక్ చేసుకోండి – ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు లభిస్తున్నాయా. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా లేక ఎవరి నుండి దుఃఖాన్ని తీసుకోలేదు కదా. అప్పుడే మహాన్ ఆత్మ అని పిలవబడతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!