19 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

19 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

18 October 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారు, అందుకే ఇప్పుడు తండ్రికి చెందినవారిగా అయ్యి వారి శ్రీమతాన్ని అనుసరించండి”

ప్రశ్న: -

తండ్రి, తమ పిల్లల అదృష్టాన్ని ఉన్నతంగా తయారుచేసేందుకు ఏ శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు?

జవాబు:-

మధురమైన పిల్లలూ, మృత్యువు కన్నా ముందు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి, ఇందులోనే మీ సంపాదన ఉంది. నాకు బిడ్డగా అయి, పొరపాటున కూడా ఏ పాప కర్మ చేయకూడదు. మాయా తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. శివభగవానువాచ. శివబాబా మనకు అర్థం చేయిస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమయుగానికి చెందినవారు. మీరు శివబాబా సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆ కలియుగ మనుష్యులు శివబాబా యొక్క జడ మందిరాలలోకి వెళ్ళి కూర్చొంటారు. తేడా అర్థమవుతుంది కదా. బుద్ధి తాళాన్ని కొంచెమైనా తెరవండి. మనం చైతన్యమైన శివబాబా వద్ద కూర్చున్నామని మీకు తెలుసు. బాబా మనతో సమ్ముఖంగా మాట్లాడుతున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, ఇంకొకవైపు చూస్తే మనుష్యులు శివబాబాకు పూజలు చేస్తున్నారు. వారిని వెతికేందుకు అమరనాథ్ కు, కాశీకి వెళ్తున్నారు. మరి, మీరు శివబాబా వద్ద కూర్చున్నారని పదే-పదే ఎందుకు మర్చిపోతారు, వారినే పరమపిత పరమాత్మ అంటారు. వారికి ఎంత మహిమ ఉంది. వారిని మీరు ‘బాబా-బాబా’ అని పిలుస్తారు. మనం శివబాబా మతాన్ని అనుసరిస్తూ, విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని పొందుతున్నామని మీకు తెలుసు. వారు మందిరాలు, తీర్థాలు మొదలైన వాటి వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, కానీ మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. మీతో పోలిస్తే వారు ఎంత బుద్ధూ (తెలివితక్కువవారి) గా ఉన్నారు. శివబాబా అంటారు – నేను మీ ఒబీడియెంట్ సర్వెంట్ (విధేయత కల సేవకుడను). నేను మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. వారు గాడ్ ఫాదర్ ను పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గాడ్ ఫాదర్ సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ బుద్ధిలో కూర్చొంటుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎందుకు మర్చిపోతారు! ఇక్కడ మీ కోసం ఇది పగలు, అక్కడ వారి కోసం అది రాత్రి. వారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు మరియు మీరు సమ్ముఖంలో కూర్చొని – మీతోనే కూర్చొంటాము, మీతోనే వింటాము… అని అంటారు. కానీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారు. మాయ చాలా ప్రబలమైనది. శివబాబాకు పిల్లలుగా అయి, పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే పురుషార్థం కూడా చేస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళి పూజారులుగా అయిపోతారు. శివబాబా జడ మందిరాలకు వెళ్తూ ఉంటారు.

ఇక్కడ బాబా అర్థం చేయిస్తారు – పిల్లలూ, శ్రీమతాన్ని అనుసరిస్తేనే మీరు శ్రేష్ఠంగా అవుతారు. ముఖ్యమైనది పవిత్రత. అక్కడ జడ చిత్రాల ఎదురుగా వెళ్ళి కత్తుల బావిలో దూకుతారు. ఇక్కడైతే చైతన్యంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ కత్తుల బావిలో దూకే విషయమేమీ లేదు. ఇక్కడ జీవిస్తూ మరణించాలి. తండ్రి చెప్తారు – శ్రీమతాన్ని అనుసరించండి. ఇక్కడ నుండి బయటకు వెళ్తూనే తండ్రిని మర్చిపోతారు. ఎప్పుడూ ఉత్తరం కూడా రాయరు. కొందరు ఎలా ఉన్నారంటే – వారు బాబాను ఎప్పుడూ చూడలేదు కానీ తపిస్తూ-తపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉంటారు మరియు ఎవరైతే సమ్ముఖంలో కలిసి వెళ్తారో, వారు పూర్తిగా మర్చిపోతారు. మీరు శివబాబాపై బలిహారమవ్వాలి కదా. భక్తి మార్గంలో శివబాబాను కలుసుకునేందుకు కత్తుల బావిలోకి దూకేవారు కానీ వారు కలుసుకోలేరు. ఇప్పుడు తండ్రి చైతన్యంలోకి వచ్చి – పిల్లలూ, నా వారిగా అవ్వండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను, పవిత్రంగా అవ్వకుండా వెళ్ళలేరు, పవిత్రంగా తయారుచేసేందుకు నేనే రావాల్సి ఉంటుంది. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి మీ వద్ద కూర్చొని ఉన్నారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. గీతా భగవంతుడు నేర్పించినది ఇదే. వారు కృష్ణుడిని భగవంతుడు అని అన్నారు. గీతా భగవంతుడు శివబాబా అని మీకు తెలుసు. మీరు ఉత్తరాలు కూడా – ‘శివబాబా కేరాఫ్ బ్రహ్మా’ అని రాస్తారు. తండ్రి మీకు సమ్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. అయినా – ఓహో! శివబాబా మమ్మల్ని ఒడిలోకి తీసుకున్నారు, దత్త పుత్రునిగా చేసుకున్నారు అనే నషా ఎక్కదు. కానీ అందరినీ ఇక్కడ ఉంచరు కదా. వేలాది మంది పిల్లలున్నారు. అందరినీ ఇక్కడ ఎలా ఉంచుతారు, అంత చోటు ఎక్కడుంది! తండ్రి అంటారు – మీరు ఉండడం మీ ఇళ్ళలోనే ఉండాలి. తండ్రిని స్మృతి చేయాలి. అందరికంటే మధురమైన, అనంతమైన తండ్రికి మీరు పిల్లలుగా అయ్యారు.

తండ్రి అర్థం చేయిస్తారు – పిల్లలూ, మీరు కామ చితిపై కూర్చొని కాలి మరణించారు, ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చొని దేవతలుగా తయారవ్వండి. దేవతలకు పూజలు కూడా చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉందని అంటారు. ఇప్పుడు మీరు చైతన్యంగా శివబాబా వద్ద కూర్చొని ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారని అంటూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఎలాంటి పాప కర్మలు చేయకండి, దేహాభిమానంలోకి రాకండి, మీరు నడుస్తూ-తిరుగుతూ ప్రియతముడిని స్మృతి చేయాలి. ఎవరినైతే మీరు అర్ధకల్పం నుండి స్మృతి చేసారో, వారు ఇప్పుడు మీ సేవలో ఉపస్థితులై ఉన్నారు. వారు ఆత్మిక సోషల్ వర్కర్ (సమాజ సేవకుడు). మీకు ఆత్మిక సేవను నేర్పిస్తారు. సమాజ సేవ యొక్క హెడ్స్ కూడా ఉంటారు కదా. ఇది ఆత్మిక సమాజ సేవ. వారు మానవ సమాజానికి భౌతిక సేవలు చేసేవారు. ఇప్పుడు చూడండి – గో హత్యను ఆపండి అని అంటారు. మీరు ఈ విధంగా రాయవచ్చు – పరస్పరంలో ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడం అన్నింటికంటే పెద్ద హత్య, ముందు దీనిని ఆపండి. దీని గురించే భగవంతుడు – కామం మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది అని చెప్పారు. మీరు గీతా భగవంతుడిని మర్చిపోయారు. బాబాకు అయితే ఆశ్చర్యమనిపిస్తుంది. ఒక వైపు అమరనాథ్ వద్ద, పర్వతాల వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, అక్కడ పార్వతికి అమరకథను వినిపించారని అనుకుంటారు. ఇప్పుడు ఒక్క పార్వతికి కథను వినిపించడం వలన ఏమవుతుంది! మీరంతా పార్వతులేనని తండ్రి అర్థం చేయిస్తారు. అందరికీ అమరకథను వినిపిస్తున్నారు. తండ్రి అంటారు – పిల్లలూ, 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు మృత్యులోకంలోకి వచ్చి చేరుకున్నారు. అచ్ఛా, లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారు, వారు తిరిగి వెళ్ళారా లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందా? సూర్యవంశ రాజులు-రాణులు, ప్రజలు అందరూ ఎక్కడకు వెళ్ళారు? తప్పకుండా 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయి ఉంటారు. అర్థమవుతుంది కదా! ఇక్కడ బ్రహ్మా ద్వారా శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఇప్పుడు నేను మీ అదృష్టాన్ని తయారుచేసేందుకు వచ్చాను, మరి మీరు అదృష్టానికి అడ్డుగీత ఎందుకు గీసుకుంటారు! కొంచెమైనా అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చాను. మీరు నా మతాన్ని అనుసరించరా! ఇంటికి వెళ్తూనే స్మృతిని ఎందుకు మర్చిపోతారు! తండ్రి పదే-పదే అర్థం చేయిస్తారు – పిల్లలూ, ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారు. వారు కలియుగానికి చెందినవారు. మీరు పూజ్యులు, వారు పూజారులు. మీరు భ్రమించడం అనేది ఇప్పుడు సమాప్తమైంది. వారు మిమ్మల్ని నాస్తికులుగా భావిస్తారు, కానీ మీరు వారిని నాస్తికులని అంటారు. మీరు భక్తి చేయరు కనుక మీరు నాస్తికులని వారు అంటారు. మీరు అంటారు – మీకు తండ్రి గురించి తెలియదు కనుక మీరు నాస్తికులు. మీరు అంటారు – మేము ఆస్తికులము, మేము తండ్రి గురించి తెలుసుకొని వారసత్వాన్ని తీసుకుంటాము. మీకు తెలియదు కనుక మీరు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కుంభ మేళాలకు కూడా ఎంతమంది వెళ్తారు, దాన-పుణ్యాలు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – ఈ విషయాలన్నింటినీ విడిచిపెట్టండి. మీకు జ్ఞానసాగరుడు లభించారు, ఇంకెక్కడికి వెళ్తారు. వీరు జ్ఞాన నదులు. జ్ఞాన సాగరుని వద్ద జ్ఞాన స్నానం చేయించేందుకు మిమ్మల్ని తీసుకొస్తారు. ఎంత మంచి-మంచి పిల్లలు తండ్రి వద్దకు వచ్చి, మళ్ళీ వెళ్ళి అశుద్ధంగా అవుతారు. కొందరు తండ్రి మతాన్ని అనుసరిస్తారు. బాబా, వినాశీ ధనాన్ని ఎలా సఫలం చేయాలి – అని అడుగుతారు. అప్పుడు వారికి అర్థం చేయించడం జరుగుతుంది – మునిగిపోయిన నావ నుండి ఎంత తీయగలిగితే అంత మంచిది. భారత్ యొక్క సేవ కోసం వినియోగించి దానిని సఫలం చేయండి, ఏదైనా సెంటర్ ను తెరవండి. ఈ చిత్రాలు కూడా ఎన్ని తయారవుతూ ఉంటాయి. బాబా వద్ద ఎలాంటి పిల్లలున్నారంటే – బాబా, అవసరమైనప్పుడు నన్ను గుర్తు చేయండి, నేను సహాయం చేసేందుకు తయారుగా ఉన్నాను, యజ్ఞానికి సంబంధించిన మంచి-మంచి పనుల కోసం అవసరమైతే నన్ను గుర్తు చేయండి అని అంటారు. బాబా అంటారు – నేను ఎవ్వరినీ గుర్తు చెయ్యను, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నేను దాతను. నేను భారత్ ను స్వర్గంగా తయారుచేసేందుకే వచ్చాను, మీరు కూడా స్వర్గంలోకి వెళ్తారు. ఎంత చేస్తే, అంత పొందుతారు. కానీ జన్మ-జన్మల పాపాల భారం తలపై ఉంది, దానిని తొలగించుకోవాలి. లేకపోతే దానికి చాలా శిక్షలుంటాయి. స్వర్గంలోకైతే వెళ్తారు కానీ శిక్షలు మిగిలిపోతే పదవిని పొందలేరు. సావల్ షాహ్ (సర్వుల మనోకామనలు తీర్చేవాడు) యొక్క హుండీ నిండుగా ఉంటుందని గాయనం ఉంది. వీరికి (బ్రహ్మాకు) ఏ చింత లేదు. బాబా అంటారు – హుండీ దానంతట అదే నిండుతుంది.

పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరించాలి. ఇందులోనే కళ్యాణముంది. అకళ్యాణము అని ఎప్పుడూ భావించకండి. ఉదాహరణకు ఢిల్లీకి వెళ్తూ, దారిలో కాలు విరిగిపోతే, అందులో కూడా కళ్యాణముందని భావించండి. ఆత్మ అయితే విరిగిపోలేదు కదా. కాలు విరిగిపోతే, ఏం పర్వాలేదు. నేనైతే ఆత్మలైన మీతో మాట్లాడతాను. తండ్రి అర్థం చేయిస్తారు – ఇది రావణ రాజ్యము, అందుకే కాలుస్తారు. మనం ఎలా ఉండేవారము, బాబా ఎలా ఉన్న మనల్ని ఎలా తయారుచేసారు. ప్రపంచంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి! ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు కనుక వారి మతాన్ని అనుసరించాలి. ఎలాంటి పాప కర్మలు చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ సత్యనారాయణ కథను వింటూ ఉండండి. ఈ కథ ఎంత పెద్దది. మొత్తం సాగరాన్ని సిరాగా చేసినా సరే ఇది సమాప్తమవ్వదు. కనుక తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. మనం భగవంతుని శ్రీమతం అనుసారంగా రాజ్యం పొందుతామని, మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతామని మీకు తెలుసు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, ప్రమాదాలలో మరణిస్తారు. తండ్రి అంటారు – మరణించే కన్నా ముందే బాగా పురుషార్థం చేయండి. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మీ సంపాదన చేసుకోండి. అనంతమైన తండ్రికి చెందినవారిగా అయి, మళ్ళీ పాపం చేస్తే ఒకటికి వంద రెట్లు అవుతుంది. అప్పుడు, మనుష్యులు ఏమనుకుంటారు అని సిగ్గుగా అనిపిస్తుంది. శివబాబా అంటారు – నేను ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్షలు వేయిస్తాను. అప్పుడు, ఆ సమయంలో వీరు నా బిడ్డ అని అనరు కదా. ఇందులో చాలా నియమాలున్నాయి. జడ్జి కొడుకు పాపం చేస్తే, వారు ఏమీ చేయలేరు కదా. శిక్ష అనుభవించాల్సిందే. అందుకే, తండ్రి రోజూ అర్థం చేయిస్తారు – పిల్లలూ, పాప కర్మలు అస్సలు చేయకండి. అన్నింటికన్నా పెద్దది – వికారాల పాపము. చాలా తుఫాన్లు వస్తాయి, బయట చాలా మాలిన్యముంది. ఇక అడగకండి. ఇది వేశ్యాలయము. ఒకవేళ మీరు ఎవరైనా గొప్ప వ్యక్తికి అర్థం చేయించి, వారు విద్యార్థిగా అయితే – వీరిపై బ్రహ్మాకుమారీల గారడి జరిగిందని అంటారు. గొప్ప-గొప్పవారు వచ్చి, మీరు నిజంగా సత్యమే చెప్తున్నారు, గీతా భగవంతుడు తప్పకుండా ఆ శివుడే కానీ శ్రీకృష్ణుడు కాదు అని రాస్తారు కూడా. అచ్ఛా, మళ్ళీ తమ ఇంటికి వెళ్తూనే సమాప్తమైపోతుంది. చాలా శ్రమించాల్సి ఉంటుంది.

తండ్రి అర్థం చేయిస్తారు – మధురాతి-మధురమైన పిల్లలూ, మర్చిపోకండి. మాయ చాలా ప్రబలమైనది. బాబా స్మృతి పాదరసం వంటిది, వెంటనే మర్చిపోతారు. తండ్రి అంటారు – గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ కేవలం పవిత్రంగా తయారవ్వండి. పురుషార్థం అయితే చేయాలి కదా. తండ్రి పిల్లలు ఒక్కొక్కరికి ప్రేమగా చెప్తారు – ఇప్పుడు నా బిడ్డగా అయి ఎలాంటి పాప కర్మలు చేయకండి. తండ్రినైతే తెలుసుకున్నారు కదా. సృష్టి చక్రం యొక్క రహస్యం కూడా బుద్ధిలో ఉంది. విద్వాంసులు, పండితులు, ఆచార్యులు మొదలైనవారు తమను తాము శివోహమ్ (నేనే శివుడిని) అని చెప్పుకుంటూ, పూజలు చేయించుకుంటారు. చాలా వరకు సన్యాసులు హరిద్వార్ కు వెళ్ళి ఉంటారు. రోజంతా – ‘శివకాశి విశ్వనాథ గంగ’ అని అంటూ ఉంటారు. తండ్రి ఎంత చక్కగా అర్థం చేయిస్తారు. అకాలమూర్త్ అని మహిమ చేస్తారు కూడా. అకాల సింహాసనము అంటే అది కూర్చునే ఆసనమేమీ కాదు. అకాలమూర్తి అయిన తండ్రికి ఈ రథమే ఆ సింహాసనము. ఎలాగైతే మీకు ఈ రథముందో, అలా బాబా కూడా – నేను ఈ రథాన్ని తీసుకున్నాను అని అంటారు. భృకుటిలో ఒకవైపు శిష్యుడు, మరోవైపు గురువు కూర్చొని ఉన్నారు. తప్పకుండా ఇతని పక్కనే వచ్చి కూర్చొంటాను కదా. నేను కూడా బిందువును. నేనేమీ అంత పెద్దగా లేను.

మధురాతి-మధురమైన పిల్లలూ, ఇది మీ సత్యాతి-సత్యమైన, చైతన్యమైన స్మృతియాత్ర. బాప్ దాదాలు ఇరువురూ కలిసి ఉన్నారు. బాప్ దాదా అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. టెలిగ్రామ్ లో – ‘బాప్ దాదా’ అని సంతకం చేస్తారు. ఎవరూ అర్థం చేసుకోలేరు. అరే, శివబాబా మీ బాబా (తండ్రి). ప్రజాపిత బ్రహ్మా మీ దాదా (అన్నయ్య) కదా. అంటే బాప్ దాదా అయినట్లు కదా. ఇప్పుడు తండ్రి అంటారు – నేను వీరి ద్వారా మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. శివబాబా కూడా మీకు చెందినవారే. ప్రజాపిత బ్రహ్మా కూడా అందరికీ తండ్రి అయినట్లు. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది. కనుక సంతకం అలాగే చేస్తారు కదా. బాప్ దాదా అని అంటారు. శివబాబా అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి. అయినా బుద్ధిలో కూర్చోదు. ప్రదర్శనీలకు వేలాది మంది వస్తారు. వారిలో 8-10 మంది అర్థం చేసుకునేందుకు వస్తారు. వారిలో కూడా నెమ్మది-నెమ్మదిగా ఒకరో, ఇద్దరో మిగులుతారు. కోట్లలో ఏ ఒక్కరో అని అంటూ ఉంటారు. మరి కోట్లలో ఏ ఒక్కరో వెలువడడానికి ఎన్ని ప్రదర్శనీలు చేయాల్సి ఉంటుంది. కొందరు 4-5 సంవత్సరాలు వచ్చి మళ్ళీ మాయమైపోతారు. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివబాబాపై పూర్తిగా బలిహారమవ్వాలి అనగా జీవిస్తూ మరణించాలి. శ్రీమతాన్ని అనుసరించాలి.

2. శివబాబాకు పిల్లలుగా అయ్యారు కనుక ఏ పాప కర్మలు చేయకూడదు. పవిత్రంగా అయి తమ కళ్యాణం చేసుకోవాలి.

వరదానము:-

ఎవరైనా ఆత్మ కోరిక కలిగి ఉండి, ధైర్యం లేని కారణంగా కోరిక ఉన్నా కూడా ప్రాప్తిని పొందలేకపోతే, ఇటువంటి ఆత్మలకు విధాతగా అనగా జ్ఞానదాతగా అవ్వడంతో పాటు దయాహృదయులుగా అయి వరదాతలుగా అవ్వండి, వారికి మీ శుభభావనల ఎక్స్ ట్రా బలాన్ని ఇవ్వండి. కానీ, ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పము బాబా పట్ల బలిహారమై ఉంటుందో, అప్పుడే ఇలాంటి వరదాని మూర్తులుగా అవ్వగలరు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో బలిహారమవుతాను అన్న ప్రతిజ్ఞ ఏదైతే చేసారో, దానిని పాలన చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top