19 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

January 18, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - కార్య వ్యవహారాలు చేస్తూ బుద్ధియోగం ఒక్క తండ్రితో జోడించబడి ఉండాలి, ఇదే సత్యమైన యాత్ర, ఈ యాత్రలో ఎప్పుడూ కూడా అలసిపోకూడదు’’

ప్రశ్న: -

బ్రాహ్మణ జీవితంలో ఉన్నతి కోసం ఏ విషయం యొక్క బలం కావాలి?

జవాబు:-

అనేక ఆత్మల ఆశీర్వాదాల బలమే ఉన్నతి యొక్క సాధనము. ఎంతగా అనేకుల కళ్యాణం చేస్తారో, ఏ జ్ఞాన రత్నాలైతే తండ్రి నుండి లభించాయో, వాటిని దానం చేస్తారో, అంతగా అనేక ఆత్మల ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా పిల్లలకు సలహా ఇస్తారు – పిల్లలూ, ధనముంటే సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవండి. అందులో ఎవరెవరి కళ్యాణమైతే జరుగుతుందో, వారి ఆశీర్వాదాలు లభిస్తాయి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

రాత్రి ప్రయాణీకుడా, అలసిపోకు..

ఓంశాంతి. పాట యొక్క అర్థమైతే పిల్లలకు దానంతట అదే బుద్ధిలోకి రావాలి. ఇప్పుడు మనమంతా ఆత్మిక యాత్రికులము. భగవంతుడైన తండ్రి వద్దకు ఆత్మలు వెళ్ళాలి. జీవాత్మలు వెళ్ళాలి అని అనరు. జీవాత్మలు శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళాలి. మనుష్యులు మరణిస్తే ఫలానావారు వైకుంఠవాసులు అయ్యారు అని అంటారు. కానీ మీకు తెలుసు – మంచి లేక చెడు సంస్కారాల అనుసారంగా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. చెడు సంస్కారాల కారణంగా మీ తలపై పాపాల భారం ఎక్కి ఉంది. ఈ జన్మది కావచ్చు లేక జన్మ-జన్మాంతరాలది కావచ్చు, పాప భారం ఎక్కి ఉంది. దానిని ఇప్పుడు మీరు యోగబలంతో భస్మం చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయాలి – దీనినే యోగాగ్ని అని అంటారు. కామ చితిపై కూర్చోవడంతో పాపాత్ములుగా అవుతారు మరియు ఈ యోగాగ్నితో మళ్ళీ మీపై ఉన్న పాపాలు భస్మమవుతాయి. కావున బ్రాహ్మణ పిల్లలకు తెలుసు, మేము యాత్రికులము అని. గృహస్థ వ్యవహారంలో ఉంటూ, వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ మన బుద్ధియోగం తండ్రితో ఉన్నట్లయితే మనం యాత్రలో ఉన్నట్లే. ఇందులో అలసిపోకూడదు, చాలా పురుషార్థం కావాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. ప్రాచీన భారత్ యొక్క యోగానికి చాలా మహిమ ఉంది. కానీ ఆ గీతను వినిపించేవారు ఎప్పుడూ కూడా, శివబాబా యోగం నేర్పించారు అని అనరు. ఒక్క అర్జునుడికి మాత్రమే కృష్ణుడు కూర్చొని వినిపించారు అని గీతలో చూపించారు. ఇటువంటి విషయమేదీ లేదు. ఇక్కడైతే మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి మరియు పాండవ సైన్యం తప్పకుండా ఉంది, పాండవుల సైన్యానికే జ్ఞానం లభిస్తుంది మరియు పాండవపతియే ఇస్తారు. మనుష్యులకు ఏమీ తెలియదు. మున్ముందు చాలామంది అంటారు, తప్పకుండా గీతా భగవంతుడే 5 వేల సంవత్సరాల క్రితం జ్ఞానం ఇచ్చారు అని. కానీ ఎవరు ఇచ్చారు అనే విషయం తెలియదు. కల్పము యొక్క ఆయువు గురించి కూడా తెలియదు. తమ-తమ అభిప్రాయాలను ఇస్తూ ఉంటారు – గాంధీ గీత, ఠాగూర్ గీత ఉన్నాయి, లోపల పేరు ఇదే వేస్తారు, కృష్ణ భగవానువాచ అర్జునుడి కోసం అని. యుద్ధాన్ని కూడా చూపిస్తారు. కానీ యుద్ధం యొక్క విషయమేమీ లేదు. ఇక్కడ మీది యోగబలం యొక్క విషయము. వారు యుద్ధం అనే పేరు పెట్టేసారు. ఎలాగైతే చంద్రవంశీ రామునికి బాణాలు మొదలైనవి చూపించారు. వాస్తవానికి జ్ఞాన బాణం యొక్క విషయము. వారు ఫెయిల్ అయ్యారు అందుకే ఆ గుర్తును చూపించారు. కావున త్రేతాయుగీ సీతారాముల చిత్రాన్ని కూడా చూపించవలసి ఉంటుంది. వంశాలు ఉంటాయి కదా. సూర్యవంశము, చంద్రవంశము. గీతలోనైతే ఇలాంటి విషయం రాసి లేదు, భగవంతుడు గీతను వినిపించి సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానిని స్థాపన చేసారు అని. తప్పకుండా గీత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క శాస్త్రము, వారు హిందువులది అని అనేస్తారు. తమను తాము దేవీ-దేవతా ధర్మం వారు అని చెప్పుకోలేరు ఎందుకంటే అపవిత్రంగా ఉన్నారు. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము… అని ఏదైతే అంటారో, అదైతే పూర్తిగా సరైనది. అసత్య ఖండంలో అసత్యమైనవారే ఉంటారు. సత్యఖండంలో సత్యము ఉంటుంది. సత్యఖండాన్ని స్థాపన చేసేవారు సత్యాన్ని తెలియజేస్తారు. భారత్ ఏదైతే పూజ్యంగా ఉండేదో, అదే ఇప్పుడు పూజారిగా అయిపోయింది. పూజ్యులు ఎవరైతే ఉండి వెళ్ళారో, వారికి పూజ చేస్తున్నారు. పూజ్య వంశం ఏదైతే ఉండేదో, అది ఇప్పుడు పూజారిగా అయ్యింది, అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటూ ఉంటారు. పూజ్య వంశం ఉండేది, ఇప్పుడు కలియుగంలో పూజారి, శూద్ర వంశం ఉంది. సూర్యవంశీ కులము, చంద్రవంశీ కులము. భారత్ ఈ విధంగా ఉండేది అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. చిత్రాలైతే ఉన్నాయి కదా. సత్యయుగంలో భారత్ సమృద్ధిగా ఉండేది. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికము గురించి ఎవ్వరికీ తెలియదు. అర్థం చేయించేందుకు ఈ వర్ణాలు కూడా తప్పనిసరి. బ్రాహ్మణులైన మనం ఉన్నతోన్నతమైనవారము, దీనిని కొత్త ఉన్నతమైన వర్ణము అని అంటారు. వివాహం చేసేటప్పుడు కూడా కులాన్ని చూస్తారు కదా. మరి మీ కులం చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ సంగమంలో బ్రహ్మా యొక్క సంతానమైన బ్రాహ్మణ కులము ఉంటుంది. వారికి ఈ విషయం తెలియదు, ఇది కొత్త విషయం కదా. బహుశా వీరికి తమ కొత్త గీత తయారైందేమో అని మనుష్యులు భావిస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనైతే పిల్లలైన మీకు తెలుసు. మనమే దేవతలుగా అవుతున్నాము. మేము రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, ఇలా ఇంకెవ్వరూ అనలేరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి కథలను కూర్చొని వినిపిస్తారు. ఇక్కడ మనం గీత యొక్క మహిమనే చేస్తాము. కావున మనుష్యులు వీరు గీతను నమ్ముతారు అని భావిస్తారు. అది భక్తి మార్గం యొక్క గీత అని మీకు తెలుసు. కానీ ఎవరైతే గీతను వినిపించారో, వారి నుండి మీరు ఇప్పుడు డైరెక్టుగా వింటున్నారు. వానర సైన్యం కూడా ప్రసిద్ధమైనది. చెడు వినవద్దు, చెడు చూడవద్దు… అని చిత్రాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు కోతులకైతే ఈ విధంగా చెప్పరు. ఇది తప్పకుండా మనుష్యుల కోసమే ఉంటుంది. ముఖం మనుష్యుల వలె ఉండి ఉండవచ్చు కానీ గుణము కోతి వలె ఉంది, అందుకే మానవ కోతులకు, చెడు వినవద్దు, చెవులు మూసుకోండి అని చెప్పడం జరుగుతుంది.

ఇది పాత శరీరము, దీనికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరి పత్ని అయినా మరణిస్తే, పాత చెప్పు పోయింది, మళ్ళీ కొత్తది కొనుక్కుంటాము అని అంటారు. శివబాబాకైతే పాత చెప్పే కావాలి. కొత్త చెప్పు అనగా కొత్త శరీరము, అందులోకైతే వచ్చేది లేదు. ఏదైతే అన్నింటికన్నా కొత్తగా ఉండేదో, అదే ఇప్పుడు పాతగా అయిపోయింది. బాబా అంటారు, నంబరువన్ లో 84 జన్మలను వీరు తీసుకున్నారు. ఎవరైతే నంబరువన్ పావనంగా, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారో… వారు కూడా పతితంగా అవ్వాల్సి ఉంటుంది, అప్పుడు మళ్ళీ పావనంగా అవుతారు. 84 జన్మల లెక్క కదా. మీరే పూజ్యులు, మీరే పూజారులు… ఆ శ్రీ నారాయణుడే ఎప్పుడైతే స్వయం పూజారిగా అవుతారో, అప్పుడు కూర్చొని నారాయణుడిని పూజిస్తారు. ఆశ్చర్యం కదా. చివరి జన్మలో కూడా లక్ష్మీ-నారాయణులను పూజించేవారు. కానీ లక్ష్మి దాసిగా అయి కాళ్ళు ఒత్తుతూ ఉండడం చూసారు, అది బాగా అనిపించలేదు. అప్పుడు లక్ష్మి చిత్రాన్ని తీసేసి కేవలం నారాయణునిది ఉంచారు. ఆ ఆత్మనే మళ్ళీ పూజారి నుండి పూజ్యునిగా అవుతుంది, తతత్వం (ఇది మీకు కూడా వర్తిస్తుంది). కేవలం ఒక్కరే ఉండరు కదా. సత్యయుగంలో పిల్లలు జన్మిస్తే వారు కూడా రాకుమారులు-రాకుమారీలుగా అవుతారు కదా. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు తండ్రి అలంకరిస్తున్నారు. మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అని తెలుసు. పునర్జన్మ సత్యయుగంలో లభిస్తుంది. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. తప్పకుండా ఇటువంటి స్థిరమైన, అఖండమైన సుఖ-శాంతుల రాజ్యం ఉండేదని మీకు తెలుసు. మేము రాజయోగాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నాము అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. కొందరు అంటారు, ఫలానా సన్యాసి వద్దకు వెళ్ళాము, మాకు చాలా శాంతి లభించింది అని. కానీ అది అల్పకాలికమైన, క్షణభంగురమైన శాంతి. మహా అయితే 10-20 మందికి లభిస్తుంది. ఇక్కడైతే ప్రపంచం యొక్క విషయము. సత్యాతి-సత్యమైన శాంతి అయితే సత్యయుగంలోనే ఉంటుంది. తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు కల్పక్రితం వలె తమ పురుషార్థం చేస్తున్నారు. చాలా మంది కొత్త-కొత్త గోపికలకు ఇంట్లో కూర్చొని ఉండగానే, ఒక్కసారి జ్ఞానం లభించిందంటే, సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. నిన్న ఒక యుగళ్ బాబా వద్దకు వచ్చారు, బాబా అర్థం చేయించారు – పిల్లలూ, మీరు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోరా. అర్ధకల్పము నరకంలో మునకలు వేసి దుఃఖితులుగా అయ్యారు, ఇప్పుడు ఒక్క జన్మ విషాన్ని విడిచిపెట్టలేరా? స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వరా. ఇదైతే కష్టము అని వారు అన్నారు. బాబా అన్నారు, కామచితిపై కూర్చోవడానికి దైహిక బ్రాహ్మణులు మీకు ముడి వేసారు, ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చుని స్వర్గం యొక్క మహారాజా-మహారాణిగా అవ్వండి. అప్పుడు వారు, మీరు సహాయం చేయాల్సి ఉంటుంది అని అన్నారు. బాబా అన్నారు, శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సహాయం లభిస్తుంది. అయితే స్మృతి చేస్తాను అని అన్నారు. వెంటనే తండ్రితో బంధం ఏర్పర్చుకున్నారు, ఉంగరాన్ని కూడా ధరించారు. వీరు బాప్ దాదా కదా. అనంతమైన తండ్రి అంటారు, పిల్లలూ, మీరు పవిత్రంగా అవ్వకపోతే, స్వర్గంలోకి కూడా వెళ్ళలేరు. ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వకపోతే, మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ కొద్ది సమయం కూడా మీరు పవిత్రంగా అవ్వలేరా! బాబా మిమ్మల్ని జ్ఞాన-యోగాలతో అలంకరిస్తున్నారు. మీరు ఇలా లక్ష్మీ-నారాయణుల వలె అయిపోతారు. ఒకవేళ తండ్రి చెప్పింది వినకపోతే, వీరి వంటి మహామూర్ఖులు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అని భావిస్తారు. ఒకరు హద్దులోని మూర్ఖులు, మరొకరు అనంతమైన మూర్ఖులు. ఇక్కడ వాయుమండలాన్ని పాడు చేసేవారు ఎవరూ కూర్చోలేరు. హంస మండలిలో పాపులు కూర్చోలేరు. తండ్రి ఎంతగా అలంకరించి లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేస్తారు మరియు మాయ మళ్ళీ పూర్తిగా నిరుపేదగా, పైసకు కొరగాని వారిగా చేసేస్తుంది. ఎవరి వద్దనైనా 50 కోట్లు ఉండి ఉండవచ్చు, అయినా కూడా, పైసకు కొరగానిది ఎందుకంటే ఇదంతా భస్మమవ్వనున్నది. సత్యమైన సంపాదనే తోడుగా వస్తుంది.

బాబా సలహా ఇస్తారు – పిల్లలూ, సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. కూర్చొని మనుష్యులను అలంకరించండి. కానీ యూనివర్సిటీ మరియు హాస్పిటల్ ను తెరిచేవారు కూడా బాగుండాలి, ఎవరికైనా అర్థం చేయించగలిగేలా ఉండాలి. లేదంటే ఇతరులకు తెరిచి ఇస్తే, వారు కూర్చొని అర్థం చేయిస్తారు. అప్పుడు వారి ఆశీర్వాదాలతో కూడా నిండుగా అయిపోతారు. బలమైతే లభిస్తుంది కదా. 21 జన్మల కోసం లాభం ఉంటుంది. తండ్రి శ్రీమతంపై నడవనివారు ఎవరైనా ఉంటారా. అడుగడుగులో తండ్రి శ్రీమతంపై నడవాలి. విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. బంధనంలో ఉన్న గోపికలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి, ఇందులో నిర్భయులుగా ఉండాల్సి ఉంటుంది. నిర్భయుడు, నిర్వైరుడు… అని తండ్రికి మహిమ ఉంది. మనకు ఎవ్వరితోనూ వైరము లేదు. తండ్రి అలంకరణ చేయిస్తారు, కావున వారి సేవను స్వీకరించాలి. బాబా, మేమెందుకు మీ శ్రీమతంపై నడవము! మాకైతే ఇందులో చాలా కళ్యాణం ఉంది. మా తర్వాత పిల్లలు మొదలైనవారి కళ్యాణం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సత్యమైన యాత్రపై వెళ్ళేందుకు దారిని తెలియజేయాలి. గొడవలు జరుగుతాయి, అబలలు సహించవలసి ఉంటుంది. ఎవరైనా అంగీకరించకపోతే వారు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోండి. శ్రమించాల్సి ఉంటుంది. ఎక్కడి నుండి అయినా మన కులము వారు వెలువడవచ్చు, వారు ప్రజలుగా అయ్యేందుకు యోగ్యులుగా కూడా అవ్వవచ్చు. ఇతరులను కూడా ప్రజలుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారుచేస్తే, అది కూడా మంచిదే. ప్రజలను కూడా తయారుచేయాలి కదా. మనుష్యుల నుండి దేవతలుగా చేయడము, ఈ కార్యాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ చేయలేరు. బ్రాహ్మణులైన మీరు ఉన్నతోన్నతమైనవారు. వారు నీచాతినీచమైనవారు. మీరు హంసలు, వారు కొంగలు. కావున తప్పకుండా గొడవ జరుగుతుంది. అత్యాచారాలు జరుగుతాయి. మాయా రావణుడు అందరినీ నాశనం చేసేసాడు, తండ్రి వచ్చి సంపన్నులుగా చేస్తారు. ఋణ ముక్తులుగా చేస్తారు. చివర్లో రాజ్యం మీదవుతుంది. యుద్ధం తర్వాత భారత్ సమృద్ధిగా అవుతుంది, ఈ మహాభారీ యుద్ధం తర్వాతనే భారత్ స్వర్గంగా అవుతుంది అని వారికి తెలియదు. కావున ఇప్పుడు పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. భాషణ కూడా రిఫైన్ గా చేయాలి. శంఖ ధ్వని చేయాలి. లేదంటే వీరి వద్ద శంఖము లేదు అని అంటారు. కమల పుష్ప సమానంగా ఉండి ఉండవచ్చు, చక్రం కూడా ఉండి ఉండవచ్చు కానీ శంఖము లేదు. బాబా అంటారు, జ్ఞానయుక్త ఆత్మలే నాకు ప్రియము. గోపికలు కూడా మురళీ వింటూ ఆనందించేవారు. కృష్ణుడైతే మురళీని వినిపించలేదు. ఇది శ్రీకృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మ. వారు చక్రం తిరిగి వచ్చారు, ఇప్పుడు వారికి జ్ఞానం లభించింది. మీకు తెలుసు, ఇది పాత ప్రపంచము, దీనికి విడాకులు ఇవ్వాలి అని. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నారు. వినాశనం కన్నా ముందు పాత ప్రపంచానికి విడాకులు ఇస్తారు. ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే కొత్త ప్రపంచంతో యోగం కూడా జోడించబడదు. రావణపురిలో 63 జన్మలు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు దీనికి విడాకులు ఇచ్చేయండి. దేహ సహితంగా ఏదైతే ఉందో, వీటన్నింటికీ విడాకులు ఇవ్వండి, అప్పుడు మీరు ఒంటరి ఆత్మగా అయి నా వద్దకు వచ్చేస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానయుక్త ఆత్మలుగా అయి శంఖ ధ్వని చేయాలి. ప్రతి ఒక్కరికీ సత్యమైన యాత్రను నేర్పించాలి. తమ ప్రజలను తయారుచేసుకోవాలి.

2. బుద్ధి ద్వారా పాత ప్రపంచానికి విడాకులు ఇవ్వాలి, కొత్త ప్రపంచంతో బుద్ధియోగాన్ని జోడించాలి. నిర్భయులుగా, నిర్వైరులుగా అవ్వాలి.

వరదానము:-

ప్రవృత్తిలో ఉంటూ బంధనముక్తులుగా అయ్యేందుకు సంకల్పం ద్వారా కూడా ఏ సంబంధంలోనూ, తమ దేహంలోనూ మరియు పదార్థాలలోనూ చిక్కుకోకూడదు. సంకల్పంలో కూడా ఏ బంధనమూ ఆకర్షించకూడదు ఎందుకంటే సంకల్పంలో వస్తే, సంకల్పం తర్వాత మళ్ళీ కర్మలోకి కూడా వచ్చేస్తుంది, అందుకే వ్యక్త భావంలోకి వస్తూ కూడా, వ్యక్త భావం యొక్క ఆకర్షణలోకి రావద్దు, అప్పుడే అతీతమైన మరియు ప్రియమైన అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

పరమాత్మ ప్రేమలో సదా లవలీనులై, మైమరిచిపోయి ఉన్నట్లయితే ముఖం యొక్క మెరుపు మరియు నషా, అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే, ఏ సమస్య అయినా సమీపంగా రాదు సరి కదా, కన్నెత్తి కూడా చూడలేదు. ఏ రకమైన శ్రమ అనుభవం అవ్వదు.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top