19 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

19 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

18 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు సత్యాతి-సత్యమైన రాజఋషులు, రాజయోగులు. మీరు రాజ్యం కోసం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి”

ప్రశ్న: -

ఏ అటెన్షన్ రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది?

జవాబు:-

ఒకవేళ చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే, రాజ్యం లభిస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని బాగా విని ధారణ చేయండి. తండ్రి వినిపించినది పిల్లలు విన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవలింతలు వస్తే లేక కునికిపాట్లు పడితే లేక బుద్ధి భ్రమిస్తే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మనం ఆ మార్గంలో నడవాలి….. (హమే ఉన్ రాహోం పర్ చల్ నా హై…..)

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ రోజు పిల్లలకు హఠయోగం మరియు రాజయోగం గురించి అర్థం చేయిస్తారు. మనుష్యులు నేర్పించేవన్నీ హఠయోగాలేనని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులు హఠయోగం లేక కర్మ సన్యాసం నేర్చుకోకూడదు. అది నివృత్తి మార్గము. ఆ ధర్మమే వేరు. మీ ధర్మం దేవీ-దేవతా ధర్మము. ఆ దేవీ-దేవతలు రాజయోగం ద్వారానే రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు మీరు రాజఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో, వారిని ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా ఉన్నారు. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే వారిని ఋషి అని అనరు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా అవుతారు. వారు రాజ్యాన్ని పొందేందుకు పవిత్రంగా ఏమీ అవ్వరు. పవిత్ర ప్రపంచంలో మనకు పవిత్రమైన రాజ్యముండేదని మీకు తెలుసు. భారత్ లోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ-దేవతల పూజ్య పవిత్రమైన ప్రవృత్తి మార్గముండేది. ఇప్పుడు పూజారులుగా, పతితులుగా అయ్యారు. పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క ఉంది కదా. ఏ తండ్రి అయితే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారో, వారే మీకు 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మం వారికి ఏమి తెలుస్తుంది? ఇది దేవీ-దేవతల ప్రాచీన ధర్మము. సన్యాస ధర్మం తర్వాత వచ్చింది. గతించిపోయిన వాటి గురించి సన్యాసులు అర్థం చేసుకోలేరు.

హఠయోగము అనేక రకాలుగా ఉంటుందని మీకు తెలుసు. ద్వాపరయుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం ప్రారంభమవుతుంది. ఇప్పుడిది రాజయోగము. ఆ హఠయోగాన్ని జన్మజన్మలుగా నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మజన్మాంతరాలు పునర్జన్మలు తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ రాజయోగాన్ని కేవలం సంగమంలోనే నేర్చుకుంటారు. రాజ్యం లభించింది, స్వర్గం వచ్చింది అంటే ఇక మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజఋషులు. రాధా-కృష్ణులు కూడా పవిత్రమైనవారు కదా. కృష్ణుడిని మహాత్మ అని కూడా అంటారు. మహాత్ములు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు లేక రాజఋషులు. మహాత్మ అనగా పవిత్రమైన మహాన్ ఆత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. వాటిని కూర్చుని కథలుగా రాస్తారు. ఏదైతే గతిస్తుందో, దానిని కూర్చుని నాటకంలా తయారుచేస్తారు. అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రాక్టికల్ గా చదివిస్తున్నారు. దానిని మళ్ళీ చరిత్రగా తయారుచేసారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారు అని అంటారు. వారు తప్పకుండా సంగమంలోనే ఉండి ఉంటారు. వారు కూర్చుని సంగమయుగ చరిత్రను తయారుచేసారు. పండుగలన్నీ కూడా సంగమయుగానికి చెందినవే. రక్షా బంధనం కూడా పవిత్రతపై జరుపుకునే పండుగ. తర్వాత దాని స్మృతిచిహ్నము కొనసాగుతుంది. ఇక్కడ తండ్రి కూడా అందరినీ పవిత్రంగా చేసి, ప్రతిజ్ఞ చేయిస్తారు. సిక్కులు కంకణాన్ని ధరిస్తారు. అది కూడా పవిత్రతకే గుర్తు. హిందువులు జంద్యమును ధరిస్తారు. అది కూడా పవిత్రతకే గుర్తు కానీ పవిత్రంగా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు కానీ దాని అర్థం తెలియదు. ఇంతకుముందు బ్రాహ్మణులు రాఖీ కట్టేవారు. ఇప్పుడు సోదరి, సోదరునికి రాఖీ కడుతుంది. అతను ఆమెకు కానుకగా డబ్బులిస్తారు. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయము. తండ్రి అంటారు – పిల్లలూ, కామము మహాశత్రువు. ఆ బ్రాహ్మణులెవరూ ఇలా అర్థం చేయించరు. ఇప్పుడు అనంతమైన తండ్రి – పిల్లలూ, మేము పవిత్రంగా అవుతాము, ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి అని చెప్తారు. మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి అని దీని కోసమే పిలుస్తారు. సత్య-త్రేతా యుగాలలో ఎవరూ పిలవరు. అది రామ రాజ్యము, ఇది రావణ రాజ్యము. రామ రాజ్యంలో 5 వికారాలుండవు. యథా రాజా రాణి, తథా ప్రజ….. మనం తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా చేసి స్వర్గానికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. అలాంటప్పుడు మనం పావనంగా ఎందుకు అవ్వకూడదు? వారి హఠయోగాలైతే అనేక రకాలుగా ఉంటాయి. ఎన్ని వెరైటీల హఠయోగులు ఉంటారు అనేది జైపూర్ మ్యూజియంకు వెళ్ళి చూడండి. వాటి ద్వారా ఏమీ లభించదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు.

తండ్రి అర్థం చేయించారు – భారత్ పతితంగా అయినప్పుడు, రావణ రాజ్యం ఏర్పడినప్పుడు భూమి కంపించడం మొదలవుతుంది. బంగారు మహళ్ళు మొదలైనవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. మహళ్ళు మొదలైనవాటిని ఎవరూ దోచుకోరు. వారు కేవలం మందిరాలను దోచుకున్నారు. కొన్ని నగలు, బంగారం మొదలైనవాటిని తీసుకువెళ్ళిపోయారు. నగల పట్ల అందరికన్నా ఎక్కువ అభిరుచి మీకు ఉంటుంది. మీరు స్వర్గంలోకి రావడంతోనే నగలు ధరిస్తారు, రాజ్యం చేస్తారు. ఇతర ధర్మాల వారు వచ్చిన వెంటనే రాజ్యం చేయరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, అంతేకానీ గీతను చదివి వినిపించరు. గీతలో రాసినవన్నీ నేను చెప్పినవి కావు, మనుష్యులు తర్వాత కూర్చుని నా మహావాక్యాలను శాస్త్రాలుగా తయారుచేసారు. నేను మీకేదైతే వినిపించానో, దానిని మీరు మాత్రమే విన్నారు, తర్వాత వెళ్ళి రాజ్యం చేసారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడ తండ్రి, టీచర్ కూర్చుని శిక్షణనిస్తారు. తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ హిందీనే మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకంటే ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష హిందీయే, సంస్కృతం కాదు. ఈ సంస్కృతము శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరు వస్తే, వారు తమ భాషను నడిపిస్తారు. అంతేకానీ, తండ్రి గీతను సంస్కృతంలో వినిపించారని కాదు. గురునానక్ కు తమ గ్రంథం ఉంది. వారు సిక్కు ధర్మాన్ని స్థాపన చేసారు. వారిని కూడా అవతారంగా భావిస్తారు. ఆ ధర్మంలో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో రాజ్యాలు లేవు. తండ్రి అర్థం చేయించారు – బుద్ధుడు, క్రీస్తు మొదలైనవారు ముందు గృహస్థ ఆత్మలుగా ఉండేవారు. కానీ గృహస్థులైన పతితాత్మలు ధర్మ స్థాపన చేయలేరు. వారిలో పవిత్రాత్మ ప్రవేశించి ధర్మ స్థాపన చేసింది. ఇతర ధర్మాలైతే రకరకాలవి చాలా ఉన్నాయి. వారు వచ్చి తమ చిన్న మఠాలను, ఆశ్రమాలను స్థాపన చేస్తారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కనుక హఠయోగము మరియు రాజయోగములలో చాలా తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి, ఎవరికైతే అర్థం కావో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఖజానా లభిస్తుంది. ఇది చాలా భారీ సంపాదన. మీరు రత్నాలతో జోలిని నింపుకుంటారు. కనుక ఇక్కడ కళ్ళు తెరుచుకొని వినవలసి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే లేక బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు.

మీరు రాజఋషులు, రాజ్యాన్ని పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తారు. శ్రీ కృష్ణుడు చేయరు. కృష్ణుడు తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ తండ్రి నిరాకారుడు, వారి నుండి విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎంత షావుకార్లుగా అవుతారు. ఇక్కడ ఒక్క తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. విహరించండి, తిరగండి, తినండి, తాగండి కేవలం తండ్రిని స్మృతి చేయండి. షావుకార్లు తప్పకుండా బాగా తింటారు. వారు తమ సంపాదన యొక్క ఫలాన్ని తింటారు. మాల్పుడా తినండి లేదా రోటీ తినండి. తండ్రిని స్మృతి చేయండి. ఏదైనా తినండి. ధనమంతా దేని కోసముంది. తండ్రి వద్దు అని ఏమీ అనరు. కేవలం తండ్రితో యోగాన్ని జోడించాలి. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడంలో ఖర్చు ఏమీ లేదు. ఆ యుద్ధం మొదలైనవాటిలో ఎంత ఖర్చవుతుంది. విమానాలు తయారుచేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. అవి కూలిపోతే పూర్తిగా సమాప్తమైపోతాయి. ఎంత నష్టం జరుగుతుంది. కనుక తండ్రి అంటారు – నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మనం 84 జన్మలను పూర్తి చేసాము. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేస్తాము. మీరు పాత్రధారులు కదా. ఆ బయోస్కోప్ (సినిమా) అయితే రెండున్నర గంటల పాటు నడుస్తుంది. ఈ అనంతమైన నాటకం 5000 సంవత్సరాలు నడుస్తుంది. దీని గురించి మనుష్యులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ ప్రపంచం ముళ్ళ అడవి. అన్నింటికంటే పెద్ద ముల్లు వికారాలది. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. రెండవ నంబరు ముల్లు క్రోధము. దీనికి గుర్తుగానే ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయంలోనైనా కోపం వస్తే వెంటనే బాంబులు వేయడం మొదలుపెడతారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారుచేసారంటే, ఇక అడగకండి. సత్యయుగంలో ఎటువంటి యుద్ధాలు మొదలైనవి ఉండవు. సంగమయుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇంకే శాస్త్రములోనూ ఈ యుద్ధం గురించి వర్ణన లేదు. అక్కడ మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు. యుద్ధమనే మాటే ఉండదు. శాస్త్రాలలో దేవతలకు మరియు అసురులకు యుద్ధం జరిగినట్లుగా చూపించారు. కానీ దేవతలు అహింసకులు. మీరు యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది సైలెన్స్ బలము. ఇందులో మీరేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. స్మృతి బలంతో మీరు బాబా నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. సైన్స్ బలంతో వినాశనం జరుగుతుంది. మళ్ళీ అదే సైన్స్ ద్వారా సత్యయుగంలో సుఖాన్ని చూస్తారు. సైన్స్ ద్వారా ఆవిష్కరణలు చేస్తారు, వాటిని సుఖం కోసమే చేస్తారు. వారు కూడా వచ్చి కొంత జ్ఞానం తీసుకుంటారు. ప్రదర్శనీలకైతే అందరూ వస్తారు, మున్ముందు అందరూ వస్తారు. మీ ఈ సైలెన్స్ బలం ప్రఖ్యాతమవుతుంది.

గీతా భగవంతుడు ఎవరు అని మీరు ప్రశ్నిస్తారు. ఇటువంటి ప్రశ్నను ఇంకెవరూ అడగలేరు. ఈ ప్రశ్న రాసిన చోట దానితో పాటు చిత్రాన్ని కూడా పెట్టండి – గీతా భగవంతుడు పరమపిత పరమాత్మనా లేక పూర్తి 84 జన్మలను తీసుకునే శ్రీకృష్ణుడా? పతితుల నుండి పావనంగా చేసేవారు తండ్రి మాత్రమే. కృష్ణుని ఆత్మ 84 జన్మలను తీసుకొని నల్లగా అయిపోయింది. మీరు 84 జన్మలను తీసుకున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు అని తండ్రి కూర్చొని వారికి అర్థం చేయిస్తారు. మనం 84 జన్మలను ఎలా తీసుకుంటాము అనేది పాత్రధారులకు తెలిసి ఉండాలి కదా! సన్యాసుల ధర్మము వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదంతో ఎవరికైనా ధనం లభిస్తే ఇక ఆ గురువు వెనుక అతుక్కుపోతారు. మళ్ళీ దివాలా తీస్తే భగవంతుడి రాత అని అంటారు. కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. అచ్ఛా, 10-12 రోజుల తర్వాత ఆ కొడుకు మరణిస్తే ఈశ్వరుడి వ్రాత, ఇతడిని బ్రతికించడం మా చేతుల్లో లేదు అని అంటారు. బాబా ఇలాంటి ఉదాహరణలను చాలా చూసారు. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – మధురాతి-మధురమైన పిల్లలూ! పావనంగా అవ్వండి. మీకు గుర్తుందా, మహాభారీ మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది ఇలా పిలిచింది – బాబా, నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, నన్ను ఇతడి నుండి రక్షించండి అని. ఇది 5000 సంవత్సరాల విషయము. ఈ విషం కారణంగానే అబలలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది స్త్రీలు కూడా ఎలా ఉంటారంటే ఇక విషం లేకుండా ఉండలేరు. అటువంటివారికి శూర్పణఖ, పూతన అని పేర్లు పెట్టడం జరిగింది. ఎవరైతే విషం కోసం విసిగిస్తారో వారు కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు….. వీరంతా వినాశనమవ్వాల్సిందే. ఈ సమయంలో ఆసురీ రావణ రాజ్యముంది, తర్వాత ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని మీరు ఈ మొత్తం చక్రమంతటి గురించి తెలుసుకున్నారు. వికారాలలోకి వెళ్ళినప్పుడు వీటిని మర్చిపోతారు. వికారాలలోకి వెళ్ళేవారి ముఖము పాలిపోతుంది. నేను ఇలా చేసేసానేమిటి అని స్వయము కూడా భావిస్తారు. పిల్లలూ, ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి, ఇది మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది, ఇందులో పడిపోకండి అని తండ్రి అంటారు. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. భగవానువాచ, కామము మహాశత్రువు. ప్రతి చిత్రంలో ముందు – జ్ఞానసాగరుడు, పతితపావనుడు, గీతా జ్ఞాన దాత అయిన శివ భగవానువాచ అని రాయండి. అప్పుడు కృష్ణుని పేరు తొలగిపోతుంది. మనకు ఈ విషయాలను గీతా భగవంతుడు కూర్చుని తెలియజేస్తున్నారు. ఆ జ్ఞానాన్నే మనం తీసుకుంటున్నాము. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మరియు పాత ప్రపంచ వినాశనం అవుతుంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కదా! నిజానికి వారు శివబాబా. రుద్రబాబా అని అనరు. బొంబాయిలో బాబురీనాథ్ (బబుల్ నాథ్) మందిరం కూడా ఉంది. ముళ్ళను బబుల్ అని అంటారు. బాబురీనాథ్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది ఎవరూ అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రము శివునిదే. అలా అనేక పేర్లు పెట్టేసారు. శివబాబాయే వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారుచేస్తారు. వారే మీ తండ్రి, వారి పేరు శివ. శివ పరమాత్మాయ నమః, బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరమపిత పరమాత్మ కూర్చొని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి, పిల్లలూ – మన కులానికి కళంకాన్ని తీసుకురాకండి, ఎటువంటి తప్పుడు పనులు చేయకండి అని అర్థం చేయిస్తారో, అలా ఈ తండ్రి కూడా పిల్లలూ, ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళకండి అని చెప్తారు. పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు. మీరు చాలా గొప్ప సంపాదన చేసుకుంటున్నారు. మిగిలినవారంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద కోటానుకోట్లు ఉండవచ్చు, వారు పెద్ద-పెద్ద మహళ్ళను నిర్మిస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇదంతా టైమ్ వేస్ట్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇవేవీ పనికి రావు, అంతా సమాప్తమైపోతుంది. 10-12 వేల సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు. మృత్యువు ఎదురుగా, తలపైనే నిలబడి ఉందని పిల్లలైన మీకు తెలుసు. కొద్ది సమయంలో ఈ భూకంపాలు మొదలైనవి జరిగి అంతా అస్తవ్యస్తమైపోతుంది. భూకంపాలు మొదలైనవాటిలో లెక్కలేనంత మంది చనిపోతారు. ఇప్పుడు వినాశనం జరగాల్సిందే. వినాశన సాక్షాత్కారాన్ని మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి మార్గంలో ఎంత చేసినా కానీ ఎవరూ వైకుంఠానికి వెళ్ళలేరు. జ్ఞానం లేకుండా సద్గతి కలగదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆట బొమ్మలు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కులాన్ని కళంకితం చేసే చెడు పనులేవీ చేయకూడదు. పవిత్రంగా అవుతామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి.

2. ఇప్పుడు మీ సమయాన్ని, ధనాన్ని…. వ్యర్థం చేసుకోకూడదు. పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించివేయాలి.

వరదానము:-

ఎలాగైతే బాప్ దాదా స్వయాన్ని వినమ్రుడినైన సేవకునిగా చెప్పుకుంటారో, అలా సేవకుడిని అని అనడంతో స్వతహాగానే కిరీటధారిగా అయిపోతారు. అదే విధంగా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్ఠమైన సీటును ఇవ్వండి. వారిని సీటుపై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయం దిగిపోయి స్వతహాగానే మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒకవేళ మీరు కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు. కావున కూర్చోబెట్టడమే కూర్చోవడము. కనుక ‘ముందు మీరు’ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు సంస్కారాలు కూడా సహజంగానే కలిసిపోతాయి మరియు కిరీటధారిగా కూడా అయిపోతారు – ఇదే చతుర సుజాన్ గా (వివేకవంతులుగా) అయ్యే పద్ధతి. ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top