18 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
17 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - బాబా ఎంత దూరం నుండి మిమ్మల్ని చదివించడానికి వస్తారు, చదివించడానికి ఫీజు కూడా తీసుకోరు కనుక ఎంత ప్రేమగా చదువుకోవాలి”
ప్రశ్న: -
ఆత్మిక గవర్నమెంట్ మొత్తం ప్రపంచం కోసం ఈ ఉచిత స్కూలును తెరిచింది – ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే అందరూ అనాథలుగా, నిరుపేదలుగా అయిపోయారు. తండ్రి అలాంటి పేద పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు. ఈ అంతిమ జన్మలో తండ్రి ఎలాంటి చదువును చదివిస్తారంటే, దాని ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వస్తారో, వారికి కూడా ఏ నష్టము కలగదు. వారు చివర్లో వచ్చినా కానీ, కొద్దిగా కష్టపడి పాతవారి కన్నా ముందుకు వెళ్ళవచ్చు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి… (జాగ్ సజనియా జాగ్…)
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇక్కడ పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాల్సి ఉంటుందని ఆత్మిక తండ్రి చెప్పారు. పరమపిత పరమాత్మ మరియు పిల్లలు ఇప్పుడు కలుసుకున్నారు. దీనిని ఈ సృష్టిపై జరిగే ఆత్మ మరియు పరమపిత పరమాత్మల మేళా అని అంటారు. ఈ మేళా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అర్ధకల్పం సత్య, త్రేతా యుగాలలో ఎవరూ పిలవనే పిలవరు. అక్కడ పిల్లలైన మీరు సుఖమయంగా ఉంటారు, ఆ సుఖాన్ని ఆత్మలైన మీరు ఇప్పుడు పొందుతున్నారు. మీరు ముందు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా, పతితులుగా అయ్యారు, మళ్ళీ తండ్రి పావనంగా తయారుచేస్తారు. పూజారులుగా అయినప్పుడు దుఃఖితులుగా అవుతారు. 5 వికారాల కారణంగానే దుఃఖం కలుగుతుంది. ఎంతెంతగా మెట్లు దిగుతూ ఉంటారో, అంతంతగా దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు దుఃఖపు పర్వతాలు పడనున్నాయని పిల్లలైన మీకు తెలుసు. ఈ పాత ప్రపంచ వినాశనం ఇప్పుడు జరగనున్నది. బాబా నిరాకారుడని, వారు టీచరుగా అయి సాలిగ్రామాలైన మిమ్మల్ని చదివిస్తారని మీ బుద్ధికి తెలుసు. వారు అంటారు – పిల్లలూ, నేను మళ్ళీ మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చాను. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, గుర్తుంది కదా. సంగమంలోనే మిమ్మల్ని అలా తయారుచేసాను. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, వైకుంఠానికి, స్వర్గానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చాను. ఇంతకుముందు మీకు ఈ వారసత్వాన్ని ఇచ్చాను, ఆ తర్వాత మీరు 84 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు నేను వచ్చాను, మీరు మళ్ళీ మొదటి నంబరు జన్మ నుండి మొదలుపెట్టాలి. మీ తండ్రినైన నేను, మిమ్మల్ని చదివిస్తాను కూడా. మరి, తండ్రి పిల్లల నుండి చదివించడానికి ఫీజు తీసుకుంటారా? పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు! ఒక్క పైసా ఫీజు కూడా తీసుకోను. మిమ్మల్ని చదివించడానికి ఎంత దూరంలో ఉన్న పరంధామం నుండి వస్తాను. ఈ ఉద్యోగం చేయడానికి రోజూ వస్తాను. ఎవరి ఉద్యోగమైనా ఎక్కడో దూరంగా ఉంటే, రోజూ వెళ్ళి-రావడం జరుగుతుంది కదా. బాబా జ్ఞానసాగరుడని, వారు మనకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారని మీకు తెలుసు. భగవానువాచ – నిరాకారుడినైన నేను పరమాత్మను, అంతేకానీ కృష్ణుడు కాదు. మీరు ఏ కృష్ణుడిని అయితే భగవంతునిగా భావిస్తారో, అతను భగవంతుడు కాలేరు. అతను పూర్తిగా 84 జన్మలను తీసుకుంటారు. భగవంతునికి తమ శరీరమంటూ లేదు. ఎలాగైతే మీరు ఆత్మనో, అలా వారు కూడా ఆత్మనే. కానీ కేవలం ఆత్మ అని సంబోధిస్తే అందరితో కలిసిపోతారు కదా. అందుకే నన్ను పరమ ఆత్మ అని అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మనైన నా పేరు ‘శివ’. నేను నిరాకారుడను. నన్ను ‘శివబాబా’ అని పిలుస్తారు. వాస్తవానికి నా పేరు ఒక్కటే కానీ వేర్వేరు పేర్లు పెట్టేసారు. నా పేరు రుద్రుడు ఏమీ కాదు. అలాగే కృష్ణుడు ఏమీ యజ్ఞాన్ని రచించలేదు. ఇదంతా అసత్యము. నేనే వచ్చి మీకు సత్యాన్ని తెలియజేస్తాను. మిమ్మల్ని నిజంగా నరుని నుండి నారాయణునిగా తయారుచేసేందుకు నేను వచ్చాను. నా ఇల్లు చాలా దూరంగా ఉంది. ఇక్కడకు వచ్చి, ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తాను. మొత్తం రోజంతా ఇతనిలో కూర్చోను. తిరుగుతూ ఉంటాను. నన్ను నిందించిన కారణంగా మీరు చాలా దుఃఖితులుగా, మహాన్ పతితులుగా అయిపోయారు. బ్రహ్మాను కూడా కొందరు ఆది దేవ్ అని అంటారు, కొందరు ఏడమ్ అని అంటారు, కొందరు మహావీర్ అని అంటారు, మీరు ప్రజాపిత అని అంటారు. మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేసారు, అందుకే నాకు ఈ పరాయి దేశంలోకి రావాల్సి వచ్చింది. అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. ఎవ్వరికీ నాథుడు లేరు. అనాథలను చదివించేందుకు గవర్నమెంట్ ఫీజు తీసుకోదు. ఇది చాలా పెద్ద ఆత్మిక గవర్నమెంట్. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఎన్ని జప-తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు. ఇవి ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, వీటి ద్వారా భగవంతుని వద్దకు చేరుకుంటామని అంటారు. కొందరు జప-తపాలు చేయడం ద్వారా చేరుకుంటామని, కొందరు శాస్త్రాలను చదవడం ద్వారా చేరుకుంటామని అంటారు. తండ్రి అంటారు – అలా జరగదు. భక్తి చేస్తూ-చేస్తూ మీరు ఇంకా పతితులుగా అయిపోయారు. రెక్కలు కట్ అయిపోయాయి. మీలో జ్ఞానమనే నెయ్యి పడనంత వరకు మీరు ఎగరలేరు. నెయ్యి లేక పెట్రోలు సమాప్తమవ్వడం వలన జ్యోతి ఆరిపోయింది. మళ్ళీ నేను వచ్చి నింపుతాను.
బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు. ఇంటికి వెళ్ళడంతో మీరు మర్చిపోతారు. మీ నుండి నేను ఈ చదువు కోసం ఫీజు తీసుకోను. ఈ పిడికెడు బియ్యం ఇస్తామని మీరు అంటారు. ఆ పిడికెడు బియ్యాన్ని మీరు భక్తి మార్గం నుండి ఇస్తూ వచ్చారు, దానికి ప్రతిఫలం మరుసటి జన్మలో లభిస్తుంది. తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు, ఫ్రీగా చదివిస్తారు ఎందుకంటే వీరి వద్ద ఏమీ లేదని వారికి తెలుసు. కనుక తండ్రి మీ నుండి ఏమీ తీసుకోరు. ఆ చదువులో ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఒక్క చదువును మాత్రమే చదివిస్తాను. ఈ స్కూలుకు ఎవరైతే వస్తూ ఉంటారో, వారిని చేరుస్తూ ఉంటాను. ఎవరైతే ఆలస్యంగా వస్తారో, వారికి కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దానికి రిటర్న్ లో ఆలస్యంగా వచ్చేవారికి మంచి పాయింట్లు లభిస్తాయి. ఎవరైతే త్వరత్వరగా చదువుకుంటారో, వారికి ఏ నష్టము ఉండదు. కొత్త-కొత్తవి, మంచి పాయింట్లు లభించడంతో పాతవారి కన్నా చురుకుగా ముందుకు వెళ్తారు. తండ్రి అంటారు – ప్రారంభంలో వచ్చిన వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు. మీరు ఆలస్యంగా రావడం మంచిదయింది, దీని వలన మీకు గుహ్యాతి-గుహ్యమైన పాయింట్లు లభిస్తున్నాయి. తండ్రి అంటారు – లౌకిక చదువును కూడా చదువుకోండి. శరీర నిర్వహణార్థం వ్యాపార-వ్యవహారాలు చేసుకోండి, కేవలం నన్ను స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడిది మన 84 జన్మల అంతిమము అని మీకు అర్థమవుతుంది కదా.
తండ్రి అర్థం చేయిస్తారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. మీరు తండ్రిని కూడా స్మృతి చేస్తారు, పతిని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు నేను మీకు పతులకే పతిని, తండ్రులకే తండ్రిని, టీచరును కూడా. నేను మీ సర్వస్వాన్ని. సుఖాన్ని ఇచ్చేవాడిని. ఆ పతిత సంబంధీకులు మొదలైనవారు మీకు దుఃఖాన్నే ఇస్తారు. సత్యయుగంలో ఎవరూ ఎవరికీ దుఃఖాన్నివ్వరు. ఇప్పుడు నేను సత్యయుగ రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఈ సంగమంలోనే మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎంత చదువుకుంటే, అంత పొందుతారు. చదువు కూడా చాలా సహజమైనది. ఇది సహజ జ్ఞానము, సహజ స్మృతి. మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉంది. నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చాను, అందుకే నన్ను కాలుడికే కాలుడు అని కూడా అంటారు. వీరిని మృత్యువు కబళించిందని కూడా అంటారు. మృత్యువు శరీరాన్ని కబళిస్తుంది, ఆత్మను కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి, వెళ్ళి మరొకటి తీసుకుంటుంది. పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు ఒక్క దెబ్బతో ఇదంతా సమాప్తమవుతుందని మీకు తెలుసు. ఎలాంటి మృత్యువు జరగనున్నది అంటే, ఎవరూ ఎవరి కోసం ఏడవరు. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. పునర్జన్మలు మళ్ళీ-మళ్ళీ దుఃఖపు ప్రపంచంలోనే తీసుకున్నప్పుడు ఏడుస్తారు. బాబా, మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి అనే మీరు తండ్రిని పిలుస్తారు. కనుక ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మనుష్యమాత్రులందరినీ తీసుకువెళ్తారు. వినాశనం జరిగితే అందరూ మరణిస్తారు. ఎవరూ మిగలరు. గవర్నమెంట్ తన ప్లాన్ లను తయారుచేస్తుంది. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూనే ఉంటుంది. చిన్న-చిన్న కొమ్మలు, రెమ్మలకు కూడా ఎన్ని ఆకులు వెలువడతాయి. వృక్షమైతే తప్పకుండా వృద్ధి చెందుతుంది. కానీ దానికి ఆయుష్షు కూడా తప్పకుండా ఉంది. కల్పవృక్షం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు ఏమీ ఉండదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పూజ్య దేవీ-దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు. మొట్టమొదటగా తండ్రి మీకే లభిస్తారు, మిగిలిన ధర్మాలవారు రావడమే చివర్లో వస్తారు. సత్యయుగంలో మీరు వస్తారు. నేను చదివించేది కూడా మిమ్మల్నే. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే వికారాలలోకి వెళ్ళకండి అని మాత్రమే చెప్తాను. అయినా సరే, మీరు ఎందుకు వినరు, విషం లేకుండా మీరు ఉండలేరా? నా మతం అనుసారంగా నడుచుకోకపోతే ఉన్నత పదవిని కూడా పొందరు. మీకు కృష్ణపురిలోకి వెళ్ళాలనే ఆశ ఉండేది. మరి కృష్ణుని రాజధానిలోకి వెళ్తారా లేక ప్రజల్లోకి వెళ్తారా? కృష్ణునితో పాటు రాకుమార-రాకుమారీలే ఆటలాడుతారు. ప్రజలు ఆడరు. ఈ మమ్మా-బాబా కూడా చదువుకుంటున్నారు. ఈ రాధా-కృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. రాజ్యం చేసేవారి మాలనే తయారవుతుంది కదా. అష్ట రత్నాలలోకి రండి, అచ్ఛా, 8 లోకి రాలేకపోతే కనీసం 108 లోకైనా రండి. కనీసం 16,108 లోకైనా రండి. ఇది రాజయోగము. తండ్రి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. కుటుంబ సభ్యులకు కూడా అర్థం చేయించండి. ఇతరులకు అర్థం చేయించేందుకు, తండ్రి మీకు అర్థం చేయిస్తారు. పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరుగుతుంది. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధమైనది, అప్పుడే భగవంతుడు వచ్చారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, స్వర్గ స్థాపన మరియు నరకం యొక్క వినాశనం జరిగింది. ఇది ఆ సమయమే. తర్వాత రాజధాని స్థాపనవుతుంది. సత్యయుగంలో వేరే ధర్మాలేవీ ఉండవు. భారత్ శిరోకిరీటముగా ఉండేది, ఎంత షావుకారుగా ఉండేది, క్రైస్తవులందరూ ఇక్కడి నుండే షావుకార్లుగా అయ్యారు. సోమనాథ మందిరం నుండి కూడా ఒంటెలపై నింపి ఎంత సంపదను తీసుకువెళ్ళారు. ఇది కేవలం ఒక్క మందిరానికి సంబంధించిన విషయమే. భారత్ లో అనేక మందిరాలుండేవి. బాబా మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బీజమునైన నేను పైన ఉన్నాను. ఇది తలకిందులుగా ఉన్న వృక్షం కదా. నేను నాలెడ్జ్ ఫుల్. మీరు నన్ను, పతితపావనా రండి అనే పిలుస్తారు. మళ్ళీ నామ రూపాలకు అతీతమైనవారని కూడా అంటారు. రావణుడు అందరినీ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసాడు. ఇప్పుడు మీకు – మా తండ్రి ఎవరు, ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది గుర్తుకొచ్చింది. అందరి బుద్ధి ఒకేలా ఉండదు. ఒకరి బుద్ధి మరొకరితో కలవదు. ఒకరి ముఖకవళికలు మరొకరితో కలవవు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రికి చెందినవారిగా అవ్వాలి కదా. వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. వీరు ఫీజు ఏమీ తీసుకోరని మీకు తెలుసు. ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంది. మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్థం ఏదైనా ఇస్తే, మరుసటి జన్మలో లభించేది. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాను. ఇందులో ఏ ఖర్చు జరిగినా అది పిల్లలే చూసుకుంటారు. ఖర్చు చేయాలని నేను పిల్లలకే చెప్తాను. ఖర్చు చేసేందుకు ఈ బ్రహ్మాను బాగా పట్టుకున్నాను. వీరిలో ప్రవేశించి వీరి ద్వారా అంతా చేయించాను. వీరు వెంటనే స్వాహా అయిపోయారు. వీరి వద్ద ఉన్నదంతా ఇచ్చేసారు. ఇప్పుడు ఇది ఏం చేయాలని బాబా ఆలోచించారు. వినాశనం జరగాల్సిందే. బాబా అన్నారు – కోతి వలె పిడికిలి మూయవద్దు, తెరవండి అని. అప్పుడు వెంటనే తెరిచేసారు. లేదంటే ఇంతమంది పిల్లల ఖర్చు ఎలా నడుస్తుంది. కొడుకు చక్రవర్తిగా, తండ్రి మంత్రిగా అయ్యారు. ధనం కోసం ఒక్కరినే పట్టుకున్నారు. పిల్లలైన మీ భట్టి జరగాల్సి ఉంది. స్కూళ్ళు కూడా తయారయ్యాయి. ఇప్పుడు మీరు చురుకైనవారిగా అయి ఇతరులను కూడా చదివిస్తారు. మీరు ఎంతమంది కళ్యాణం చేస్తారు. తండ్రి కళ్యాణకారి, అందరినీ నరకం నుండి బయటకు తీసి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే, అంత ఉన్నత పదవిని పొందుతారు. ప్రజల కోసం కూడా ప్రదర్శనీలు మొదలైన యుక్తులు ఇంకా వెలువడుతూ ఉంటాయి. అనేకమంది ప్రజలు తయారవుతూ ఉంటారు. రాజులు-రాణులు కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే కోట్లలో ఉంటారు కదా. రాజు-రాణి ఒక్కరే ఉంటారు. అక్కడ యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరగవు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారవుతారు, దీని కోసం వేరే ఉపాయమేమీ లేదు. సుపుత్రులైన పిల్లలు తల్లిదండ్రులను ఫాలో చేస్తారు. తండ్రి పావనంగా అయి, కొడుకు అవ్వకపోతే, అతను కుపుత్రుడు అయినట్లే కదా. ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకోవాలంటే పతితులుగా అవ్వకండి. పావనంగా అవ్వకుండా కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. జన్మ-జన్మలుగా పాపాలు చేసారు. వాటికి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. 63 జన్మల పాపాలకు శిక్షలు లభించినట్లుగా ఉంటుంది. గర్భజైలులో కూడా శిక్షలు అనుభవిస్తారు. సత్యయుగంలో జైళ్ళు మొదలైనవేవి ఉండవు. అది స్వర్గము. ఇప్పుడు తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు, అందుకే తండ్రిని ఎవరూ గుర్తించరు. తండ్రితో యోగం జోడిస్తేనే ఆత్మ పావనంగా తయారవుతుంది. తండ్రి అంటారు – నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వస్తాను, మళ్ళీ వీరిని నంబరువన్ పావనంగా తయారుచేస్తాను – తతత్వమ్ (అదే విధంగా) మీరు కూడా పావనంగా అవుతారు. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మాకు కూడా పిల్లలు, అందుకే బాప్ దాదా అని అనడం జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు – ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. శరీరంపై నమ్మకం లేదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. రోజంతా ఈ విషయాలనే బుద్ధిలో పెట్టుకోండి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. సుపుత్రులైన పిల్లలుగా అయి తల్లిదండ్రులను ఫాలో చేయాలి.
2. పైసా ఖర్చు లేకుండా చదువు ద్వారా 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంది కనుక చాలా తపనతో చదువు చదువుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
వరదానము:-
ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా లేక నిండుగా ఉంటారో, వారి నయనాలు మరియు మస్తకం ద్వారా ఈశ్వరీయ నషా కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్దనైతే ఎక్కువగా లేక తక్కువగా జమ అవుతుందో, అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎలాగైతే ఎవరైనా ఉన్నత కులానికి చెందినవారు ఉంటే, ఆ ప్రకాశం మరియు మెరుపు వారి ముఖం ద్వారా కనిపిస్తుంది, అలా మీ ముఖము ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను స్పష్టం చేయాలి, అప్పుడు సత్యమైన సేవాధారులని అంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!