17 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
16 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడంలో మీ సంపాదన కూడా ఉంది మరియు ఆరోగ్యం కూడా ఉంది, మీరు అమరులుగా అయిపోతారు”
ప్రశ్న: -
హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏమిటి?
జవాబు:-
ఎక్కడ ఉన్నా సరే, ట్రస్టీగా ఉండండి. ఎల్లప్పుడూ, మేము శివబాబా భండారా నుండి తింటున్నామని భావించండి. శివబాబా భండారా యొక్క భోజనం తినేవారి హృదయం శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ, ఒకవేళ శ్రీమతమనుసారంగా ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా ట్రస్టీగా ఉన్నట్లయితే, అది కూడా శివబాబా భండారాయే అవుతుంది, అటువంటివారు మనసుతో సరెండర్ అయినట్లు.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. అర్ధకల్పం నుండి, జన్మజన్మలుగా పిల్లలు సత్సంగాలకు వెళ్తూ వచ్చారు. సాధు-సన్యాసులు, పండితులు మొదలైన వ్యక్తుల సత్సంగాలు ఉంటాయి. ఇది మనుష్య సత్సంగము కాదు. దీనిని ఆత్మిక సత్సంగమని అంటారు. సుప్రీమ్ ఆత్మ, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు అనగా సత్సంగం జరుపుతున్నారు. ఇక్కడ మీరు మనుష్యుల నుండి వినరు, అలాగని దేవతల నుండి వినరు. మీరు భగవంతుడి నుండి వింటారు. భగవంతుడిని సదా నిరాకారుడు అని అంటారు. ఎప్పుడైతే పిల్లలను భగవాన్-భగవతీలుగా చేసేందుకు చదివించవలసి ఉంటుందో, అప్పుడే భగవంతుడు వస్తారు. భగవంతుడు తప్ప భగవాన్ మరియు భగవతీల పదవిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కల్ప-కల్పము సంగమయుగం ఉంటుందని, అప్పుడు నిరాకార భగవంతుడు వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయం కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతరులెవరైనా కష్టం మీద అర్థం చేసుకోగలరు. శివబాబా తప్పకుండా వస్తారు కానీ వారికి బదులుగా కృష్ణుడిని గీతా భగవంతుడని అనేసారు. కనుక అందరి బుద్ధిలోకి తప్పకుండా మనిషి తనువే వస్తూ ఉంటుంది. మీరే దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు మరియు ఇప్పుడు ఆసురీ గుణాలు కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు కలవారిగా అవుతారు. దైవీ గుణాలు కలవారిని ఈశ్వరీయ సంప్రదాయం వారని, ఆసురీ గుణాలు కలవారిని ఆసురీ సంప్రదాయం వారని అంటారు. ఇప్పుడు నిరాకార తండ్రి నిరాకార సంప్రదాయం వారిని అనగా ఆత్మలను చదివిస్తున్నారు, అందుకే ఈశ్వరీయ సంప్రదాయం లేక ఆత్మిక సంప్రదాయం అని అంటారు, వీరిని ఆత్మిక తండ్రి వచ్చి చదివిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మ-అభిమానులుగా అవుతారు. మనం ఆత్మలము, తండ్రి మనల్ని చదివిస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. వారు ఆత్మలనే చదివిస్తారు, వారే నాలెడ్జ్ ఫుల్ మరియు ఋషులు-మునులు మొదలైనవారంతా నేతి-నేతి (తెలియదు-తెలియదు) అని అంటూ వచ్చారు అనగా మాకు ఆత్మ గురించి తెలియదు అని అన్నారు. ఆ జ్ఞానసాగరుడు సమ్ముఖంగా రానంత వరకు జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనల్ని మనుష్యులెవరూ చదివించడం లేదు, మనల్ని తండ్రి చదివిస్తున్నారు. వారు అనంతమైన తండ్రి, నిరాకారుడు. సాకార తండ్రి మరియు నిరాకార తండ్రి – ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారని కూడా పిల్లలకు అర్థం చేయించారు. ఒకరు ఆత్మిక తండ్రి, ఇంకొకరు దైహిక తండ్రి. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. మనం పావనంగా ఉండేవారము, పతితులుగా అయ్యామని మీకు తెలుసు, మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవుతాము. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. పదే-పదే చక్రం ముందుకు వెళ్ళి కూర్చున్నట్లయితే – మేమిప్పుడు సంగమయుగంలో కూర్చున్నామని బుద్ధిలోకి ఈ జ్ఞానమంతా వచ్చేస్తుంది. మిగిలినవారంతా తమను తాము కలియుగంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగాన్ని ఘోర అంధకారమని అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు, ఇప్పుడు మీకు ప్రకాశముంది, సత్యయుగంలో మళ్ళీ మీకు ఈ జ్ఞానం లభించదు. తండ్రి వచ్చినప్పుడే అత్యంత ప్రకాశం ఉంటుంది. ఈ సంగమయుగము కళ్యాణకారి యుగము. తండ్రి వచ్చేటువంటి యుగం ఇది తప్ప ఇంకేదీ ఉండదు. సత్యయుగాన్ని కళ్యాణకారి యుగమని అనరు. అక్కడ ఎవరి కళ్యాణం జరగదు. సంగమయుగంలోనే కళ్యాణం జరుగుతుంది. సత్యయుగంలో ఎలాగూ కళ్యాణము ఉంటుంది. సంగమయుగంలో కలియుగాన్ని సత్యయుగంగా, కళ్యాణకారిగా తయారుచేస్తారు. కనుక ఇప్పుడు మీ కళ్యాణం ఎంతగా జరుగుతుందో చూడండి, కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడంతో మీకు ఎంత సంపాదన జరుగుతుంది. సంపాదనకు సంపాదన కూడా జరుగుతుంది మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. మీ జీవితం అమరంగా అవుతుంది. మీకెప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. కనుక పిల్లలకు ఎంత సంతోషముండాలి, ఎందుకంటే మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు వస్తారు కనుక పురుషార్థం చేసి మ్యూజియంలోని చిత్రాల గురించి అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవ్వాలి. స్వయాన్ని యోగ్యులుగా చేసుకునేందుకు 7-8 రోజులు కూర్చుని నేర్చుకోండి. ప్రాక్టిస్ అవ్వగానే వెంటనే సేవ కొరకు పరుగుపెట్టాలి. సేవ చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవడం చాలా సహజము. చిత్రాలను ఎదురుగా చూస్తూనే, మేము సంగమయుగంలో కూర్చున్నామని బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది మనుష్యులున్నారు, రేపు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలినవారంతా తిరిగి వెళ్ళిపోనున్నారు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు, పిల్లలకు ఎంత గౌరవాన్ని ఇస్తారు. దూర దేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు….. రావణుని దేశం పరాయి దేశం కదా. రాముని దేశంలోకి రావణుడు ఎప్పుడూ రాలేడు. దీని గురించి ఒక కథను కూడా వినిపిస్తారు. ఏ కథలనైతే వినిపిస్తారో, అవన్నీ కథలు మాత్రమే. కథలలోనూ సారము లేదు, నవలలోనూ సారము లేదు. నవలలు కూడా ఎన్ని అమ్ముడుపోతూ ఉంటాయి. కేవలం నవలలను అమ్ముకునేవారు లక్షాధికారులుగా అయిపోతారు.
ఇప్పుడు పిల్లలైన మీ పాలన తండ్రి చేతిలో ఉంది. కేవలం మీతోనే తింటాను అనగా మీ భండారా నుండే తింటాను….. మీ పాలన అంతా ఇక్కడే జరుగుతుంది. ఎవరైతే సరెండర్ అవుతారో, వారి పాలన అయితే ఎలాగూ జరుగుతుంది. కానీ, ఎవరైతే, ఇదంతా ఈశ్వరునిదే (బాబాదే), నేను ట్రస్టీను, నేను శ్రీమతమనుసారంగానే నడుచుకుంటూ ఖర్చు చేస్తాను అని మనసు ద్వారా భావిస్తారో, వారు కూడా శివబాబా భండారా నుండి తింటున్నట్లే. శివబాబా భండారా నుండి తినడం వలన హృదయం శుద్ధమవుతుంది. అలాగని మిగతావారు శివబాబా భండారా నుండి తినడం లేదని కాదు. బాబా డైరెక్షన్ అనుసారంగా నడుచుకునేవారు కూడా బాబా భండారా నుండి తింటున్నట్లే. ఏ భండారా నుండైతే తింటున్నారో, ఆ భండారా నిండుగా ఉంటుంది, కష్టాలు, దుఃఖాల నుండి దూరంగా ఉంటుంది….. ఇక తర్వాత మీరెప్పుడూ అకాల మృత్యువును పొందరు. శివబాబా ఈ సమయంలోనే వస్తారు. వారి మహిమ కూడా గాయనం చేయబడింది. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారి భండారా ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూడా తప్పకుండా వస్తారు కదా. పిల్లలు ఎవరు వచ్చినా సరే, వారికి శివబాబా భండారా నుండి భోజనం లభిస్తుంది. అచ్ఛా, పురుషులు సరెండర్ అయితే మంచిదే, ఒకవేళ వారు సరెండర్ అవ్వకపోతే మాతలు ఏమి చేయగలరు? ఎందుకంటే సంపాదన పతిది. కానీ అతను సరెండర్ అవ్వరు. అతను సంపాదిస్తేనే పత్ని తినగలుగుతుంది. ఒకవేళ ఇద్దరూ సరెండర్ అయితే, అప్పుడు శివబాబా భండారా నుండి పాలన జరుగుతుంది. తండ్రి పిల్లలకు మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కర్మాతీత అవస్థకు చేరుకునేంత వరకు మేము తండ్రి వద్ద కూర్చుని ఉంటామని బుద్ధిలో ఉండాలి. రోజురోజుకు మనం మన స్వరాజ్యానికి సమీపంగా వస్తూ ఉంటాము. సమయం గడుస్తూ ఉంటుంది, మీరు సమీపంగా వస్తూ ఉంటారు. సత్యయుగపు మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలుందని అంటారు? ఇప్పుడు ఎంత సమీపంగా వచ్చారు? తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తవుతుంది. మీరిప్పుడు 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. చక్రాన్ని చూడడంతోనే ఇప్పుడు మేము సంగమయుగంలో ఉన్నామని అంటారు. ఇటు వైపు కలియుగము ఉంది, అటు వైపు సత్యయుగము ఉంది. రేపు మనం మన సుఖధామంలో ఉంటాము. ప్రపంచానికి ఇది తెలియదు. వారు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి నుండి మనము 21 జన్మల కోసం సంపాదన చేసుకుంటున్నాము. సదా సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నామనే సంతోషముంటుంది. స్వర్గవాసులుగా అవ్వడమనేది మీ భాగ్యంలోనే ఉంది. స్వర్గం ఒక అద్భుతమైన స్థానము. 7 అద్భుతాలను చూపిస్తారు కదా. ఇది అన్నింటికంటే గొప్ప అద్భుతము. అద్భుతమైన స్వర్గం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. అందుకే బాబా ఇలా రాసారు – పైన సూర్యవంశీయులని రాయండి, దాని కింద చంద్రవంశీయులని రాయండి, అప్పుడు అర్ధకల్పం పూర్తి అయిపోతుంది. సూర్యవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు, చంద్రవంశీయులు 1250 సంవత్సరాలు ఉంటారు. అప్పుడిక లక్షల సంవత్సరాలనే మాటే ఉండదు. అక్కడ బాహుబలం వెనుక ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రారంభం నుండి అంతిమం వరకు ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి మరియు పిల్లల లెక్క ఉంటుంది, ఖర్చు అనే మాటే ఉండదు. ఇక్కడకు పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవుతారు, అందుకే భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ఇదంతా పిల్లల ధనమే. అయినా ఇప్పటికి ఎన్ని రోజులు గడిచిపోయాయి, ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. పైసా ఖర్చు లేకుండా మీరు జీవన్ముక్తిని పొందుతారు. ఇందులో కేవలం శ్రమించాల్సి ఉంటుంది. భగవంతుడిని భక్తులందరూ స్మృతి చేస్తారు కానీ భగవంతుడు ఎవరు అనేది తెలియదు. భగవంతుని గురించి తెలియని కారణంగా అనేకులను భగవంతునిగా భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పెద్ద-పెద్ద చిత్రాలను ముఖ్యమైన స్థానాలలో పెట్టండి అని బాబా ఎన్ని సార్లు అర్థం చేయించారు. ఉదాహరణకు విమానాశ్రయం ఉంది, విమానాశ్రయం వారు ఏమి తీసుకుంటారు? ఇవన్నీ మనుష్యుల కళ్యాణం కోసమేనని వారికి అర్థం చేయించండి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారానే మనుష్యులు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని విశ్వానికి యజమానులుగా అవ్వగలరని చెప్పండి. ముఖ్యమైనది ఢిల్లీ. ఢిల్లీ రాజధాని కదా. అక్కడ అందరూ కలుసుకుంటూ ఉంటారు. అక్కడ టిన్ను రేకుపై తయారుచేయబడిన పెద్ద-పెద్ద చిత్రాలుండాలి. ముఖ్యమైనవి త్రిమూర్తి, సృష్టి చక్రం మరియు కల్పవృక్షం. ఈ మెట్ల చిత్రమైతే అద్భుతమైనది. ఇందులో వినాశనం మొదలైనవి కూడా చాలా బాగా రాయబడి ఉన్నాయి. పతితపావనుడు పరమపిత పరమాత్మనా లేక నీటి గంగనా? మీరే నిర్ణయించండి అని రాయండి. ఈశ్వరుడు సర్వవ్యాపినా లేక ఒక్క నిరాకార పరమపిత పరమాత్మనా అని బ్రహ్మాకుమార-కుమారీలు అడుగుతారు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఈ చిత్రమే ముఖ్యమైనది. త్రిమూర్తి చిత్రం కూడా చాలా-చాలా విలువైనది. బ్రహ్మా ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. మళ్ళీ వారే పాలన కూడా చేస్తారు.
అనంతమైన తండ్రి మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నారని పిల్లలకు అపారమైన సంతోషముండాలి. తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయిస్తారు మరియు నరకాన్ని వినాశం చేయిస్తారు. అందుకే మహాభారత యుద్ధం కూడా ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. తండ్రి కూడా కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగంలో వస్తారు. గీతలో, వారు ప్రతి యుగంలో వస్తారని రాసేసారు. అలాగైనా కూడా 5 యుగాలున్నాయి కనుక 5 సార్లు రావాలి. అలాంటప్పుడు 24 అవతారాలు, ఫలానా అవతారం అని ఎందుకు రాసారు! మనుష్యులు ఎన్ని యజ్ఞ-తపాలు, తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తారు. ఈ మార్గాలన్నీ భగవంతుడిని కలుసుకునేందుకేనని భావిస్తారు. కానీ భగవంతుని వద్దకు ఎవరూ వెళ్ళలేరు. అర్ధకల్పం ఎంతగా తల బాదుకున్నారు. జన్మజన్మలుగా ప్రదక్షిణలు చేసాము, ఇది చేసాము….. అయినా తండ్రి లభించలేదు. ఇప్పుడు తండ్రి, పిల్లలైన మీకు ఎంత సమీపంగా ఉన్నారు! వారు మీతో మాట్లాడుతున్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు. కల్ప-కల్పము మేము ఇలాగే కలుసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారు. ఏదైతే గడిచిపోయిందో, అది కల్ప-కల్పము జరుగుతుంది. ఈ దాదానే వజ్రాల వ్యాపారిగా ఉంటారు. మళ్ళీ వీరిలోనే బాబా ప్రవేశిస్తారు, మళ్ళీ ఆ పిల్లలే వచ్చి తండ్రికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీతో, బాబా యొక్క ఈ అనాది, అవినాశీ పాత్ర కల్ప-కల్పము ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది కళ్యాణకారి సంగమయుగము. ఇందులో ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. సంపాదనే సంపాదన ఉంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ 21 జన్మల కోసం జీవితాన్ని అమరంగా చేసుకోవాలి.
2. ప్రవృత్తిలో ఉంటూ మనసు, బుద్ధి ద్వారా సరెండర్ అవ్వాలి. శ్రీమతమనుసారంగా ఖర్చు చేయాలి. పూర్తిగా ట్రస్టీలుగా ఉండాలి. శివబాబా భండారా నిండుగా, కష్టాలు, దుఃఖాలకు దూరంగా ఉంటుంది…..
వరదానము:-
ఎప్పుడైతే తండ్రిని చూసేందుకు బదులుగా విషయాలను చూడడం మొదలుపెడతారో, అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మరియు సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవమవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే విషయాలు వృక్షము వంటివి మరియు తండ్రి బీజము వంటివారు. ఎవరైతే విస్తారం కల వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో, వారు తండ్రిని పక్కకు పెట్టేస్తారు. అప్పుడు విస్తారం ఒక వలలా అయిపోతుంది, అందులో చిక్కుకుపోతూ ఉంటారు. విషయాల విస్తారంలో రంగు-రంగుల విషయాలు ఉంటాయి, అవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. అందుకే, బీజ రూపుడైన తండ్రి స్మృతితో బిందువు పెట్టి వాటి నుండి పక్కకు తప్పుకున్నట్లయితే, సహజ యోగులుగా అయిపోతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!