16 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

16 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

15 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - అన్ని విషయాలలో సహనశీలిగా కండి. నింద-స్తుతి, జయాపజయాలు అన్నింటిలోనూ సమానంగా ఉండండి, చెప్పుడు మాటలను విశ్వసించకండి”

ప్రశ్న: -

ఆత్మ ఎక్కే కళలో సదా ముందుకు వెళ్తూ ఉండాలంటే, దానికి సహజ యుక్తిని వినిపించండి?

జవాబు:-

ఒక్క తండ్రి నుండే వినండి, ఇతరుల నుండి కాదు. అనవసరమైన పరచింతనలో, వ్యర్థమైన మాటలలో మీ సమయాన్ని వృథా చేసుకోకండి, అప్పుడు ఆత్మ సదా ఎక్కే కళలో ఉంటుంది. తప్పుడు మాటలు వినడం వలన, వాటిని విశ్వసించడం వలన మంచి పిల్లలు కూడా పడిపోతారు, కనుక చాలా సంభాళించుకోవాలి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి, నిజంగా అర్ధకల్పము మేము తండ్రిని స్మృతి చేసామని మధురాతి-మధురమైన పిల్లలకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని పూర్తి అర్ధకల్పం స్మృతి చేసారని కూడా కాదు. ఎక్కువ దుఃఖం కలిగినప్పుడల్లా స్మృతి చేసేవారు. భక్తి మార్గం నుండి మనం దిగిపోతూనే వచ్చామని ఇప్పుడు మీకు తెలిసింది. డ్రామా రహస్యం మీ బుద్ధిలో ఉంది. నోటి ద్వారా ఏమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం వారికి చెందినవారిగా అయ్యాము, కనుక ఎక్కువ జ్ఞానం యొక్క అవసరం లేదు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే తండ్రి ఆస్తికి యజమానులుగా అయినట్లే. ఇక కర్మేంద్రియాలతో ఏమీ చేయనవసరం లేదు. భక్తి మార్గంలో భగవంతుడిని కలుసుకునేందుకు ఎన్ని యజ్ఞాలు-తపస్సులు, దాన-పుణ్యాలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, అన్ని చోట్ల తీర్థ స్థానాలు, మందిరాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం భారత్ లో ఉన్న తీర్థాలన్నీ మరియు మందిరాలన్నీ తిరగగలిగిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ఒకవేళ అలా తిరిగినా కూడా ఏమీ లభించదు. అక్కడ గుడి గంటల శబ్దాలు మొదలైన అలజడులు ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే అలజడి అనే మాటే లేదు. పాటలు పాడడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ ఏమీ లేవు. అసలు మనుష్యులు చేయనిదంటూ ఏముంది, ఎన్నో కర్మకాండలు ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలైన మీరు కేవలం స్మృతి చేయాలి. ఇంకేమీ చేయనవసరం లేదు. ఇంట్లో ఉంటూ, అన్నీ చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఆహార-పానీయాలు కూడా శుద్ధంగా ఉండాలి. 36 రకాల భోజనమైతే అక్కడ లభిస్తుంది. ఇక్కడ సాధారణంగా ఉండాలి. చాలా ఎక్కువగానూ ఉండకూడదు, చాలా తక్కువగా కూడా ఉండకూడదు. అన్ని విషయాలలో సహనశీలత కావాలి. నింద-స్తుతి, జయాపజయాలు, చలి-వేడి వీటన్నింటినీ సహించవలసి ఉంటుంది. ఇప్పుడు సమయమే అలా ఉంది. నీరు లభించదు, ఇంకేదో లభించదు. సూర్యుడు కూడా తన వేడిని చూపిస్తాడు. ప్రతి వస్తువు తమోప్రధానమైపోతుంది. ఈ సృష్టియే తమోప్రధానంగా ఉంది. తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అందుకే ఇవి దుఃఖాన్ని ఇస్తున్నాయి. నింద-స్తుతులకు కూడా ప్రభావితం అవ్వకూడదు. ఎవరైనా ఏవైనా తప్పుడు మాటలు, ఎవరికైనా వినిపిస్తే చాలా మంది వెంటనే డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా విషయాలను కల్పిస్తున్నారు కదా. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి – ఉదాహరణకు – మీకు దేహాభిమానముందని, బాహ్య ఆర్భాటం చాలా ఉందని బాబా మీ గురించి అన్నారు – అని ఎవరైనా చెప్తే, అంతే, ఇక జ్వరం వచ్చేస్తుంది, నిద్ర కూడా పట్టదు. అర్ధకల్పం నుండి మనుష్యులు ఇలానే ఉన్నారు. ఎవరికైనా వెంటనే జ్వరం తెప్పిస్తే, దానితో అవతలివారు వెంటనే పాలిపోయినట్లు అయిపోతారు. కనుక తండ్రి అంటారు – ఇటువంటి వ్యర్థమైన మాటలేవీ వినకండి. తండ్రి ఎప్పుడు ఎవరినీ నిందించరు. తండ్రి అర్థం చేయించేందుకే చెప్తారు. ఒకరికొకరు తప్పుడు విషయాలను వినిపించడంతో మంచి-మంచి పిల్లలు కూడా పాడైపోతారు. అప్పుడు వారు ద్రోహులుగా అయి వెళ్ళి ఇతరులకు వ్యర్థమైన మాటలను వినిపిస్తారు. భక్తి మార్గంలో కూడా ఎలాంటి కథలను తయారుచేసారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కనుక మీరెప్పుడూ కూడా ఓ రామా లేక అయ్యో భగవంతుడా అని అనలేరు. ఇవి కూడా భక్తి మార్గంలోని మాటలు. మీ నోటి నుండి ఇటువంటి మాటలు రాకూడదు.

మధురమైన గారాబాల పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి అని మాత్రమే తండ్రి చెప్తారు. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎవరి మాటలు వినకండి, అనవసరమైన పరచింతన చేయకండి. నేను ఒక ఆత్మను – ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అవినాశీ, శరీరం వినాశీ. ఆత్మయే సంస్కారాలను ధారణ చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ద్వాపరం నుండి మీరు రావణ రాజ్యంలో దేహాభిమానులుగా అవుతారు. అందుకే ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వడం కష్టమనిపిస్తుంది. మాకు అనంతమైన తండ్రి లభించారు అని పదే-పదే బుద్ధిలోకి వస్తూ ఉండాలి. తండ్రి కల్ప-కల్పము వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు వారి మతాన్ని అనుసరించాలి. నీవే తల్లివి-తండ్రివి….. అన్న మహిమ వారి గురించే ఉంది. వారు సర్వ సంబంధాల సుఖాన్ని ఇచ్చేవారు. వారిలో మాధుర్యమంతా ఉంది. మిగిలిన మిత్ర-సంబంధీకులు మొదలైన వారందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. ఒక్క తండ్రి మాత్రమే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఇదేమీ కొత్త విషయం కాదని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనం ఈ తండ్రి వద్దకు వస్తామని మీకు తెలుసు. వీరు సాధువు లేక సత్పురుషుడేమీ కారు. మీరు సాధు-సత్పురుషుల వద్దనేమీ ఉండరు. ఇకపోతే, ప్రవృత్తి మార్గం యొక్క సంబంధాలలో యుక్తిగా నడుచుకోవాలని తండ్రి అంటారు. లేదంటే ఇంకా గొడవలు జరుగుతాయి. యుక్తిగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఇలా ప్రేమగా అర్థం చేయించాలి – చూడండి, ఇప్పుడు వినాశన సమయం సమీపంగా ఉంది, ఈ ఆసురీ ప్రపంచం సమాప్తమవ్వనున్నది, ఇప్పుడు దేవతలుగా అవ్వాలి, దైవీ గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. ప్రేమగా అర్థం చేయించాలి. దేవతలు కూడా ఉల్లి-వెల్లుల్లి మొదలైనవి తినరు. మనం కూడా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము కనుక మనం వీటిని ఎలా తింటాము. వీటిని వదిలేయండి అని మీకు కూడా సలహానిస్తారు. ఇటువంటి పదార్థాలు మనం తినము. ఇప్పుడు మీకు దైవీ గుణాలను నేర్పించే అనంతమైన తండ్రి లభించారు, కనుక సర్వగుణ సంపన్నులుగా….. ఇక్కడే అవ్వాలి. ఇక్కడ తయారైతే, అప్పుడు భవిష్య కొత్త ప్రపంచం వస్తుంది. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వచ్చినట్లుగా, ఇది కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు రాత్రి యొక్క అంతిమంలోనే దైవీ గుణాలను ధారణ చేయాలి. అప్పుడు ఉదయం వస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తామే పరీక్షించుకోవాలి. తండ్రికి అన్నీ తెలుసు అని కాదు. మీరు స్వయాన్ని చూసుకోండి కదా. టీచరుకు అన్నీ తెలుసు అని విద్యార్థులు ఎప్పుడూ ఇలా అనరు. పరీక్ష రోజులు దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు కూడా – నేను ఎంతవరకు పాస్ అవుతాను, నేను ఏ సబ్జెక్టులో ఢీలాగా ఉన్నాను అనేది స్వయమే అర్థం చేసుకుంటారు. వేటిలోనైనా తక్కువ మార్కులు వస్తే, అన్ని సబ్జెక్టులు కలవడంతో పాస్ అయిపోతామని భావిస్తారు. మరి ఇక్కడ కూడా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి – నాలో ఏ లోపముంది? నేను చాలా మధురంగా అయ్యానా? అందరికీ ప్రేమగా అర్థం చేయించాలి, ఏమనంటే – ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మ, అంతేకానీ మనుష్యులెవరూ కాదు. మేము నిరాకారుడిని భగవంతుడని అంటాము, రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. మిగిలినవారంతా రచన. రచన నుండి ఎవరికీ వారసత్వం లభించదు. నియమం అలా లేదు. ఇప్పుడు రచన అంతటికీ సద్గతిదాత, రచయిత అయిన తండ్రి ఒక్కరే. ఈ రచనలోనే సాధు-సత్పురుషులు అందరూ వచ్చేస్తారు. వాస్తవానికి అందరూ ఆత్మలే కదా. అయితే, మనుష్యులు మంచివారిగా, చెడ్డవారిగా ఉంటారు. పొజిషన్ ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. సన్యాసులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందిని చూడండి, భిక్షం అడుగుతూ ఉంటారు, మరికొంతమంది విషయంలో అందరూ వారి పాదాలపై పడతారు. పిల్లలైన మీరు కూడా ఉన్నతంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వండి. ఎప్పుడూ క్రోధంగా మాట్లాడకండి. ఎంత వీలైతే అంత ప్రేమగా పని కానీయండి. పిల్లలు చాలా విసిగిస్తున్నారని అంటూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలే అలా ఉన్నారు. వారికి ప్రేమగా అర్థం చేయించండి. కృష్ణుడు అల్లరి చేస్తే వారిని తాడుతో కట్టేసినట్లుగా చూపిస్తారు. ఎంత వీలైతే అంత ప్రేమగా అర్థం చేయించాలి లేదంటే తేలికపాటి శిక్షను విధించండి. పాపం వారు అమాయకులు కదా. సమయం కూడా అలాగే ఉంది. బయటి సాంగత్య దోషం చాలా చెడ్డదిగా ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు – మీరు విగ్రహాలు మొదలైనవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. శివుని చిత్రాన్ని అయినా ఎందుకు పెట్టుకోవాలి! వారు మీ తండ్రి కదా. పిల్లలు ఇంట్లో తండ్రి చిత్రాన్ని ఎందుకు పెట్టుకుంటారు? తండ్రి ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉంటారు కదా. నేనిప్పుడు మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్నాను కదా అని తండ్రి అంటారు. ఇక చిత్రాల అవసరం లేదు. నేను కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను. బాప్ దాదాను చూడాలి అని అంటారు. ఇప్పుడు తండ్రి అయితే నిరాకారుడు, వారిని చూడలేరు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు – నేను వీరిలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తాను. లేదంటే ఎలా రాను! కృష్ణుని తనువులోకి ఎలా వస్తాను. సన్యాసులలోకి కూడా రాలేను. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, నేను వారిలోకే వస్తాను. వారే ఇప్పుడు లాస్ట్ నంబరులో ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు చదువుకొని మొదటి నంబరులోకి వెళ్ళాలి. చదివించేవారైతే ఒక్కరే. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. మీకు చాలా మంచి జ్ఞానం లభిస్తుంది. శాంతిధామం మన ఇల్లు, సుఖధామం మన రాజధాని అని మీకు తెలుసు. దుఃఖధామం రావణుని రాజ్యము. ఇప్పుడు తండ్రి అంటారు – మధురాతి-మధురమైన పిల్లలూ, మీ ఇల్లు అయిన శాంతిధామాన్ని గుర్తు చేయండి, సుఖధామాన్ని గుర్తు చేయండి. దుఃఖధామం యొక్క బంధనాలను మర్చిపోతూ వెళ్ళండి. ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు, అలా వెళ్ళలేరు కూడా. డ్రామా మధ్యలో తిరిగి ఎవరూ వెళ్ళలేరు. ఫలానా వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని లేక నిర్వాణం చెందారని అంటూ ఉంటారు కానీ ఒక్కరు కూడా వెళ్ళరు. అందరి తండ్రి మరియు యజమాని పరమపిత పరమాత్మ ఒక్కరే, ప్రేయసులందరికీ వారొక్కరే ప్రియుడు. ఆ దైహిక ప్రేయసీ-ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆ సమయంలో వారి చిత్రం బుద్ధిలోకి వస్తుంది. ఇక ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. భోజనం చేస్తూ ఉంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు ఒక్క జన్మ యొక్క ప్రేయసీ-ప్రియులు. మీరు ఆ ఒక్క ప్రియునికి జన్మ జన్మల ప్రేయసులు. మీరు ఇంకేమీ చేయనవసరం లేదు, కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఆ ప్రేయసీ-ప్రియుల ఎదురుగా వారి చిత్రాలు వచ్చేస్తాయి. అంతే, ఇక వారిని చూసుకుంటూ-చూసుకుంటూ పని కూడా ఆగిపోతుంది. తర్వాత వారి ముఖం మాయమైపోతుంది, అప్పుడిక మళ్ళీ పని చేయడం మొదలుపెడతారు. ఇక్కడైతే అలాంటిదేమీ లేదు. ఆత్మ కూడా బిందువు, పరమాత్మ కూడా బిందువే. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇటువంటి అభ్యాసాన్ని ఎవరూ చేయడం లేదు. ఆత్మ జ్ఞానం లభించింది అనగా ఆత్మను రియలైజ్ అయ్యారు, ఇక మిగిలింది పరమాత్మ. వారి గురించి కూడా మీకు తెలుసు. బాబా వచ్చి ఇక్కడ (భృకుటి మధ్యలో) కూర్చుంటారు, వీరి స్థానం కూడా ఇక్కడ భృకుటిలోనే ఉంది. ఆత్మ ఎక్కడి నుండైనా బయటకు వెళ్ళిపోతుంది, అది తెలియదు. దాని ముఖ్య స్థానం భృకుటి. తండ్రి అంటారు – నేను కూడా బిందువునే, వీరిలోకి వచ్చి కూర్చున్నాను. మీకు అసలు తెలియదు కూడా. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు వినిపిస్తారు. మీకు ఏదైతే వినిపిస్తారో, అది నేను (బ్రహ్మా) కూడా వింటాను. వివరణ అయితే పూర్తిగా రైట్. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుందని దైవీ ధర్మం వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ముందు స్థాపన, తర్వాత వినాశనం కూడా జరుగుతుంది. ఇతర ధర్మ స్థాపకులెవ్వరూ ఇలా చెయ్యరు. వారు కేవలం తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. తర్వాత అది వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో, భవిష్యత్తులో అంత ఉన్నత పదవిని పొందుతారు. మీరు భవిష్య 21 జన్మలకు ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారంటే ఎంత పురుషార్థం చేయాలి. ఇది చాలా సహజము కూడా, యోగం కూడా సహజమే. దీనితో మీ వికర్మలు వినాశనమవుతాయి.

తండ్రి అంటారు – కల్ప-కల్పము నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తానని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అక్కడ పతితులు ఒక్కరు కూడా ఉండరు. జ్ఞానం కూడా ఎంత సహజము, 84 జన్మల చక్రం ఎలా తిరుగుతారు అనే నాలెడ్జ్ కూడా బుద్ధిలో ఉంది. మేము 84 జన్మల చక్రం తిరిగామనే నిశ్చయం ఉంచుకోవాలి. నిశ్చయంలోనే విజయముంది. మేము 84 జన్మలు తీసుకుంటామా లేక ఇంకా తక్కువ తీసుకుంటామా తెలియదు అని అనుకోకూడదు. మీరు బ్రాహ్మణులు కనుక మేము తప్పకుండా 84 జన్మల చక్రాన్ని పూర్తిగా అనుభవించామని మీకు నిశ్చయముండాలి. ఇది చాలా సహజమైన వివరణ. ఈ చిత్రాలన్నింటినీ దివ్యదృష్టి ద్వారా తండ్రి తయారుచేయించారని పిల్లలకు అర్థం చేయించారు. చిత్రాలను కరెక్షన్ కూడా చేయించారు. ప్రారంభంలో బనారస్ లో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు కూర్చుని గోడలపై ఇటువంటి చక్రాలను గీసేవారు. అయితే, అదేమిటి అనేది వారికేమీ అర్థమయ్యేది కాదు. కానీ సంతోషం అనిపించేది. సాక్షాత్కారం జరిగినప్పుడు ఎగురుతున్నట్లుగా అనిపించేది. ఏమి జరుగుతుంది అనేది అర్థమయ్యేది కాదు. ఏ చిత్రాలైతే ముందు తయారయ్యాయో, వాటిని మళ్ళీ మార్చి కొత్త-కొత్తవి తయారుచేస్తూ వచ్చారని మీకు తెలుసు. కల్పక్రితం వలె ఇప్పుడు కొత్త-కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి. మెట్ల చిత్రం ఎంత బాగుందో చూడండి. దీనిపై అర్థం చేయించడం సహజము. ఆలస్యంగా వచ్చేవారికి ఇంకా సహజమైన వివరణ లభిస్తుంది. ఇప్పుడు కొత్త-కొత్త వారు ఎవరైతే వస్తారో, వారు ఏడు రోజుల్లోనే జ్ఞానమంతా అర్థం చేసుకుంటారు. పాతవారి కంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది, ముందే వచ్చి ఉంటే బాగుండేదని అంటారు. అరే, దీని గురించి కూడా చింతించకండి. ఒకవేళ ముందే వచ్చి ఉంటే, మళ్ళీ పారిపోయి ఉంటే అప్పుడు ఏమై ఉండేది? ఆలస్యంగా వచ్చేవారికైతే సింహాసనం సహజంగా లభిస్తుంది. ఇదివరకు ఎవరైతే ఉండేవారో, చూడండి, వారు ఇప్పుడు అసలు లేరు కూడా. సమాప్తమైపోయారు. ఎవరు పాస్ అయ్యారు అనేది చివర్లో రిజల్టు తెలుస్తుంది. కొత్త-కొత్త వారు వస్తారు, వెంటనే సేవలో నిమగ్నమైపోతారు. పాతవారు అంతగా నిమగ్నమవ్వరు. కొత్త-కొత్త కుమార్తెలు సేవ ద్వారా తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. పాతవారు ఎంతమంది సమాప్తమైపోయారు. అందుకే తండ్రి అంటారు – సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులని ఎవరినైతే అంటారో, వారిలో కూడా కొంతమంది ఆశ్చర్యవంతులై వింటారు, మళ్ళీ పారిపోతారు. దేని గురించైతే ఇంతకుముందు చెప్తూ ఉండేవారో, అది ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమను తామే చెక్ చేసుకోవాలి. నేను చాలా-చాలా మధురంగా అయ్యానా? నాలో ఏయే లోపాలున్నాయి? అన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయా? అని చూసుకోవాలి. మీ నడవడికను దేవతల వలె తయారుచేసుకోవాలి. ఆసురీ ఆహార-పానీయాలను త్యజించాలి.

2. ఎటువంటి వ్యర్థమైన మాటలను వినకూడదు మరియు మాట్లాడకూడదు. సహనశీలిగా అవ్వాలి.

వరదానము:-

మున్ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు రకరకాల సాధనాలను అలవరచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ సమయంలో పత్ర వ్యవహారం లేదా టెలిగ్రామ్, టెలిఫోన్ మొదలైనవి పని చేయవు. అటువంటి సమయంలో వైర్ లెస్ సెట్ కావాలి, దీనికోసం ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసం చేయండి, అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top