15 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
14 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభించిందో, దానిని బుద్ధిలో స్థిరంగా ఉంచుకోవాలి, ఉదయాన్నే లేచి స్వదర్శన చక్రధారులుగా అయి విచార సాగర మథనం చేయాలి”
ప్రశ్న: -
ఈ ఈశ్వరీయ చదువు యొక్క లా (నియమం) ఏమిటి? దాని కోసం ఏ డైరెక్షన్ లభించి ఉంది?
జవాబు:-
ఈ ఈశ్వరీయ చదువు యొక్క లా ఏమిటంటే – నియమిత రూపంలో (రెగ్యులర్ గా) చదువుకోవడము. అప్పుడప్పుడు చదువుకోవడము, అప్పుడప్పుడు చదువుకోకపోవడము – ఇది లా కాదు. బాబా చదువు కోసం చాలా ఏర్పాట్లు చేసారు. చదువు (మురళీ) ఇక్కడి నుండి పోస్ట్ లో వెళ్తుంది. 7 రోజుల కోర్సు తీసుకొని ఎక్కడైనా చదువుకోవచ్చు. చదువును ఎప్పుడు మిస్ చేయకూడదు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ…
ఓంశాంతి. ఏ పిల్లలైతే ఇక్కడ కూర్చున్నారో, వారు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను మరియు స్వదర్శన చక్రాన్ని గుర్తు చేస్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి అని తండ్రి పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చారు. బ్రాహ్మణ పిల్లలైన మీ ఉద్దేశ్యము – స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఈ 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. మిగిలినదంతా బుద్ధి నుండి తొలగించి వేయాలి. నిజంగా బాబా మనల్ని సూర్య వంశీయులుగా, చంద్ర వంశీయులుగా తయారుచేసారని, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చొంటూ స్వయానికి అనగా ఆత్మకు తండ్రి మరియు రచన ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. ఇప్పుడు శివబాబా మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసారు. మీరు 84 జన్మల చక్రం యొక్క ఆటను ఎలా ఆడుతారు అనేది బాబా అర్థం చేయించారు. మొట్టమొదట మనము బ్రాహ్మణులము, బ్రాహ్మణులైన మనల్ని రచించేవారు శివబాబా, వారు బ్రహ్మా ద్వారా రచిస్తారు. రచయిత మరియు రచనల జ్ఞానంతోనే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో స్థిరంగా ఉంచుకోవాలి. ఉదయాన్నే లేచి స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చుండిపోవాలి. మనం మన 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నాము. మన ఆత్మలందరి రచయిత, తండ్రి ఒక్కరే. మనమంతా సోదరులమని అంటారు కూడా. మన తండ్రి ఆ నిరాకార పరమపిత పరమాత్మ, పరంధామంలో నివసించేవారు. మనం కూడా అక్కడే ఉండేవారము. వారు మన బాబా. ‘బాబా’ అనే పదం చాలా ప్రియమైనది. శివబాబా మందిరాలకు వెళ్ళి ఎన్ని పూజలు చేస్తారు, చాలా స్మృతి చేస్తారు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, తుచ్ఛ బుద్ధి కలవారి నుండి స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారుచేస్తాను. తుచ్ఛ బుద్ధి అనగా శూద్ర బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి కలవారిగా చేసాను అనగా ఉన్నత బుద్ధి, పురుషోత్తమ బుద్ధి కలవారిగా చేసాను. స్త్రీ-పురుషులందరూ ఈ లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. కానీ వీరెవరు, ఎప్పుడు వచ్చారు, ఏం చేసారు అనేది తెలియదు. ఈ భారత్ అవినాశీ ఖండము ఎందుకంటే అవినాశీ తండ్రి అయిన పరమపిత పరమాత్మకు కూడా ఇది జన్మ స్థానము అని తండ్రి అర్థం చేయించారు. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాతకు ఇది జన్మ స్థానము కనుక ఇది అత్యంత గొప్ప తీర్థ స్థానం అయినట్లు. ఇది పరమపిత పరమాత్మ, సర్వుల సద్గతిదాత అయిన తండ్రి జన్మ స్థానము అని అంతటి నషా ఎవ్వరికీ లేదు. పతితపావనుడి జయంతి భారత్ లోనే జరిగింది. శివ జయంతిని జరుపుకుంటారు అంటే తప్పకుండా శివుని జన్మ ఇక్కడే జరుగుతుంది. ఈ భారత్ గొప్ప తీర్థ స్థానము కానీ ఇది మన గాడ్ ఫాదర్ మరియు మాత-పిత, పతితపావనుడు, సర్వుల సద్గతి దాత యొక్క జన్మ స్థానము అని డ్రామానుసారంగా ఎవ్వరికీ తెలియదు. అందుకే భారత భూమిని వందే మాతరం అని అంటారు. ఈ భూమిపై ఏ పిల్లలైతే శ్రీమతమనుసారంగా భారత్ ను స్వర్గంగా చేస్తారో, వారికి ఈ నషా ఉండాలి – మేము కల్ప-కల్పం శ్రీమతం అనుసారంగా భారత్ ను స్వర్గంగా తయారుచేస్తాము. ఎవరు ఎంతగా శ్రీమతాన్ని అనుసరిస్తారో, అంత ఉన్నత పదవి పొందుతారు. భారతవాసులు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసేసారు. మీకు తెలుసు – ఈ భారత్ తండ్రి జన్మ స్థలము, వారు ఏ ధర్మాన్ని అయితే స్థాపన చేసారో, ఆ ధర్మానికి సంబంధించినదే ఈ గీత. గీతను ఎవరు చెప్పారు అనేది భారతవాసులు మర్చిపోయారు. ఎంత తేడా వచ్చేసింది! నిరాకార శివుడెక్కడ, శ్రీకృష్ణుడెక్కడ. సుందరంగా ఉండే కృష్ణుని ఆత్మ ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో తమోప్రధానంగా అయిపోయిందని మీకు తెలుసు. కనుక వీరిలో ప్రవేశించి వీరిని మళ్ళీ సుందరమైన శ్రీకృష్ణునిగా తయారుచేస్తాను అందుకే కృష్ణుడిని నల్లనివారు మరియు సుందరమైనవారని, శ్యామము మరియు సుందరమైనవారని అంటారు. వీరు సత్యయుగంలో మొదటి నంబరు సుందరమైన రాకుమారునిగా ఉండేవారు. వీరి మహిమ – మర్యాదా పురుషోత్తముడు, అహింస పరమధర్మంగా ఉన్నవారు. రాధా-కృష్ణులకు మరియు లక్ష్మీనారాయణులకు మధ్యనున్న సంబంధమేమిటో భారతవాసులకు తెలియదు. తండ్రి అంటారు – ఇప్పటివరకు మీరు ఏదైతే చదువుకుంటూ వచ్చారో, అందులో సారమేమీ లేదు. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. బాబా మనకు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజయోగ శిక్షణను ఇస్తున్నారని మీకు తెలుసు. కృష్ణుడు గీతను వినిపించారని ప్రపంచమంతా అంటుంది. తండ్రి అంటారు – కృష్ణునిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమే లేదు. కృష్ణుని ఆత్మ ముందు జన్మలో ఈ జ్ఞానాన్ని పొందారు, ఇప్పుడు వచ్చి పొందుతున్నారు. నేను వీరికి ‘బ్రహ్మా’ అని పేరు పెట్టాను. వీరి అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. మీరు మరజీవులుగా అయ్యారు కదా. మీకు అవ్యక్త పేర్లను కూడా పెట్టాను. ఇప్పుడు పెట్టను ఎందుకంటే చాలామంది విడాకులిచ్చేసారు. తండ్రికి చెందినవారిగా అయ్యి, పేరు పెట్టించుకొని పారిపోవడమనేది శోభించదు అందుకే పేర్లు పెట్టడం ఆపేసారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మా సంతానము, శివబాబాకు మనవళ్ళు. తండ్రి అంటారు – వారసత్వం మీరు నా నుండి తీసుకోవాలి కనుక నన్ను స్మృతి చేయండి. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. సూక్ష్మవతనంలో ఏ బ్రహ్మానైతే చూపిస్తారో, వారు పావనమైనవారు. సూక్ష్మవతనంలో ప్రజాపిత అయితే ఉండరు. వీరు వ్యక్తంగా ఉన్నారని, వృక్షం చివర్లో నిలబడి ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తారు. పవిత్ర ఫరిశ్తాగా అయ్యేందుకు ఇక్కడ పిల్లలతో పాటు యోగంలో కూర్చొని ఉన్నారు. కనుక సూక్ష్మవతనంలో చూపించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రజాపిత తప్పకుండా కావాలి. వారు అవ్యక్తము, వీరు వ్యక్తము. మీరు కూడా ఫరిశ్తాలుగా అయ్యేందుకు వచ్చారు. ఇందులోనే మనుష్యులు తికమకపడతారు ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త జ్ఞానము. ఏ శాస్త్రాలు మొదలైనవాటిలో ఈ జ్ఞానం లేదు. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు, నిరాకార పరమపిత పరమాత్మ, ఆత్మలందరికీ తండ్రి. వారి నివాస స్థానం పరంధామము. వారిని అందరూ ఈ విధంగా స్మృతి చేస్తారు – రండి, మా పై మాయ నీడ పడింది, పతితులుగా అయిపోయాము. ఈ విషయాలు కొత్తవారి బుద్ధిలో కూర్చోవు. ఇప్పుడు మీకు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. సత్యయుగంలో మనం చాలా కొద్దిమంది మాత్రమే రాజ్యం చేసేవారము. అక్కడ అధర్మమనే విషయమే ఉండదు. శాస్త్రాలలో ఎన్ని విషయాలు రాసేసారు, కానీ వాటిలో సారమేమీ లేదు. మెట్లు దిగుతూ-దిగుతూ ఇప్పుడు చివర్లోకి వచ్చి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మీరు జంప్ చేస్తారు, దిగడానికి 84 జన్మలు పట్టింది, సెకండులో జంప్ చేస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు, తర్వాత శాంతిధామంలోకి వెళ్ళి సుఖధామంలోకి వస్తారు. ఇది దుఃఖధామము. ముందు మీరు వచ్చారు కనుక తండ్రి కూడా మొట్టమొదట మిమ్మల్నే కలుస్తారు. ఇక్కడ తండ్రికి మరియు పిల్లలకు, ఆత్మకు మరియు పరమాత్మకు మేళా జరుగుతుంది. లెక్క ఉంది కదా – మనం తండ్రి నుండి వీడ్కోలు తీసుకొని 5 వేల సంవత్సరాలయ్యింది. మొట్టమొదట స్వర్గంలో పాత్రను అభినయించారు, అక్కడి నుండి మీరు పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చేసారు, ఇకపోతే, మిగిలిన కొద్దిమంది ఎవరైతే ఉంటారో, వారు కూడా వచ్చేస్తారు. తర్వాత మీ చదువు సమాప్తమైపోతుంది. అందరూ ఇక్కడికి రావాల్సిందే. అక్కడ ఖాళీ అయినప్పుడు, బాబా అందరినీ తీసుకువెళ్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు చదువుకోవాలి. స్కూలుకు అప్పుడప్పుడు వెళ్ళడము, అప్పుడప్పుడు వెళ్ళకపోవడము – ఇది లా (నియమం) కాదు. బాబా చదువు కోసం చాలా ఏర్పాట్లు కూడా చేసారు. లేదంటే, చదువు అనేది ఎప్పుడు ఎవరి వద్దకు పోస్ట్ లో వెళ్ళదు. కానీ ఈ అనంతమైన తండ్రి యొక్క చదువు పోస్ట్ లో వెళ్తుంది. ఎన్ని కాగితాలు ముద్రించబడతాయి. ఎక్కడెక్కడికో వెళ్తాయి. 7 రోజుల కోర్సు తీసుకొని, తర్వాత ఎక్కడైనా చదువుకుంటూ ఉండండి. ఈ సమయంలో అందరూ అర్ధకల్పం యొక్క రోగులు, అందుకే 7 రోజులు భట్టీలో ఉంచవలసి ఉంటుంది. ఈ 5 వికారాల రోగం మొత్తం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. సత్యయుగంలో మీ శరీరం నిరోగిగా ఉండేది, సదా ఆరోగ్యంగా, సదా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయింది. ఈ ఆటంతా భారత్ కు సంబంధించినదే. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి కలిగింది. కల్ప-కల్పం మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు మరియు చక్రవర్తి రాజులుగా కూడా అవుతారు. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది, ఇందులో పదవులు నంబరువారుగా ఉంటాయి. ప్రజలు కూడా అనేక రకాల వారు కావాలి. నేను ఎంతమందిని నా సమానంగా స్వదర్శన చక్రధారులుగా తయారుచేసాను అని మనసును ప్రశ్నించుకోవాలి. ఎవరు ఎంతమందిని తయారుచేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి మాయతో యుద్ధం చేయడం నేర్పిస్తారు, అందుకే వీరి (బ్రహ్మా)కి యుధిష్టరుడు అని పేరు పెట్టారు. మాయపై విజయం పొందే యుద్ధాన్ని నేర్పిస్తారు. యుధిష్టరుడిని మరియు ధృతరాష్ట్రుడిని కూడా చూపిస్తారు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారని అంటూ ఉంటారు కూడా. ఎంత సమయం మీ విజయం నిలిచి ఉంది, తర్వాత ఎంత సమయం ఓటమిని చూసారు అనేది కూడా మీకు తెలుసు. ఇది దైహిక యుద్ధం కాదు, దేవతలు మరియు అసురుల యుద్ధం కూడా కాదు, కౌరవులు మరియు పాండవుల యుద్ధం కూడా కాదు. అసత్యపు శరీరం, అసత్యపు మాయ….. భారత్ ఇప్పుడు అసత్య ఖండంగా ఉంది. ఒకప్పుడు సత్య ఖండంగా ఉండేది, రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి అసత్య ఖండంగా అయిపోయింది. ఈశ్వరుని గురించి ఎన్ని అసత్యాలు చెప్తారు, ఎన్ని కళంకాలను మోపుతారు. కళంగీ అవతారం గురించి కూడా అంటూ ఉంటారు. అందరికన్నా ఎక్కువ కళంకాలను తండ్రిపై మోపారు. వారి గురించి, ఈశ్వరుడు తాబేలు, చేప అవతారాలు తీసుకుంటారని, రాళ్ళు-రప్పలలో ఉన్నారని అంటారు. ఎంతగా నిందిస్తారు. ఇది సభ్యతేనా? ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. తండ్రి మనకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తున్నారని, ఈ విషయాలు వేరెవ్వరికీ తెలియదని మీకు తెలుసు. తండ్రియే సద్గతిదాత. బాబా జ్ఞానంతో అందరికీ సద్గతి కలుగుతుంది. ఇకపోతే, ఎవరైతే స్వయమే దుర్గతిలో ఉన్నారో, వారు ఇతరులకు సద్గతిని ఎలా ఇస్తారు. నేను వచ్చి మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. మీరే పవిత్రంగా, పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. పవిత్ర రాజులను, అపవిత్ర రాజులు పూజిస్తారు. సత్యయుగంలో డబల్ కిరీటధారులుగా ఉండేవారు. వికారీ రాజులున్నప్పుడు సింగిల్ కిరీటం ఉంటుంది. వారు కూడా మహారాజా-మహారాణులే కానీ అపవిత్రమైనవారు పవిత్రమైనవారి వద్దకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. భారతవాసులు పవిత్ర ప్రవృత్తి మార్గం వారు. ఆ భారతవాసులే పతిత ప్రవృత్తి మార్గం వారిగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు – ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ సత్యయుగంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఈ ముసలాల (మిసైల్స్) యుద్ధం 5 వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలని తండ్రి అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులైన మీరు కమల పుష్ప సమానంగా అయ్యారు. కానీ ఈ గుర్తును విష్ణువుకు చూపించారు ఎందుకంటే మీరు సదా ఏకరసంగా ఉండరు. నేడు కమల పుష్ప సమానంగా అవుతారు, రెండు సంవత్సరాల తర్వాత పతితులుగా అవుతారు.
ఇది మీ సర్వోత్తమ కులము. బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అవ్వరు. పిలక సమానమైన బ్రాహ్మణులుగా కావాలి. ఇప్పుడు బ్రాహ్మణులను బాబా చదివిస్తున్నారు. కనుక ఇటువంటి బాబాకు విడాకులివ్వకూడదు. బాబా అంటారు – ఆశ్చర్యకరంగా నా వారిగా అవుతారు, వింటారు, తర్వాత పారిపోయి మాయకు చెందినవారిగా అవుతారు. ద్రోహులుగా అవుతారు, నన్ను నిందింపజేస్తారు….. ఇటువంటివారిని, సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు స్వర్గంలో ఉన్నత స్థానాన్ని పొందలేరు అని అంటారు. ఇకపోతే, వారు భక్తి మార్గపు గురువులు, వారేమీ సద్గతి దాతలు కాదు. ఆత్మలందరికీ తండ్రి, టీచరు, గురువు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారే అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. మున్ముందు అర్థం చేసుకుంటారు, అప్పుడిక ‘టూ లేట్’ అయిపోతుంది. వారు మళ్ళీ తమ ధర్మంలోకే వెళ్ళిపోతారు. శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైనది దేవతా ధర్మము. తండ్రితో పాటు కూర్చున్న బ్రాహ్మణులైన మీరు, దేవతలకంటే ఉన్నతమైనవారు. మిమ్మల్ని చదివించేవారు విచిత్రుడు మరియు విదేహి. తండ్రి అంటారు – నాకు దేహం లేదు, నన్ను ‘శివ’ అని అంటారు, నా పేరు మారదు. మిగిలిన అందరివి శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. నేను ‘పరమ ఆత్మను’. నా జన్మ పత్రిని ఎవ్వరూ రాయలేరు. అనంతమైన రాత్రి ఏర్పడినప్పుడు పగలుగా చేయడానికి నేను వస్తాను. ఇప్పుడిది సంగమము, ఈ విషయాలను బాగా అర్థం చేసుకొని, తర్వాత ధారణ చేయాలి, స్మృతిలోకి తీసుకురావాలి. పిల్లలైన మీరు ఇక్కడకు వస్తారు, తీరిక లభిస్తుంది. ఇక్కడ విచార సాగర మథనం బాగా చేయగలరు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సర్వోత్తమ కులం యొక్క స్మృతితో గృహస్థ వ్యవహారంలో ఉంటూ, కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఎప్పుడు సద్గురువును నిందింపజేయకూడదు.
2. శ్రీమతాన్ని అనుసరిస్తూ భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవ చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు తయారుచేయాలి. ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు తప్పకుండా విచార సాగర మథనం చేయాలి.
వరదానము:-
‘‘తమలోని విశేషతలను ఎంతగా తలచుకుంటారో, అంత నషా ఎక్కుతుంది’’ అని అంటారు. ఎప్పుడు ఇతరుల సంపాదన పట్ల దృష్టి వెళ్ళకూడదు. ఇతరుల నషాను లక్ష్యంగా చేసుకునేందుకు బదులుగా, బాప్ దాదా గుణాలను మరియు కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి. బాప్ దాదాతో పాటు అధర్మ వినాశనం మరియు సత్య ధర్మ స్థాపనా కర్తవ్యంలో సహాయకులుగా అవ్వండి. అధర్మాన్ని వినాశనం చేసేవారు అధర్మ కార్యాన్ని లేక దైవీ మర్యాదలను ఉల్లంఘించే కార్యాన్ని చేయలేరు. వారు మాస్టర్ మర్యాదా పురుషోత్తములుగా ఉంటారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!