13 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 12, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - నేను పిల్లలైన మీ కోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది”

ప్రశ్న: -

అనంతమైన సంతోషం ఏ పిల్లలకు నిరంతరం ఉంటుంది?

జవాబు:-

ఎవరైతే అనంతమైన సన్యాసం చేసారో, ఇతర సాంగత్యాలను వదలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించారో, వారే నిరంతరం సంతోషంగా ఉండగలరు. 2. ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో, ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారి సంతోషం ఎప్పుడు మాయమవ్వదు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఆకాశ సంహాసనాన్ని వదిలి రా….

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇలా ఎవరు అన్నారు? పాట విన్నారా అని తండ్రి పిల్లలను అడిగారు. ఎప్పుడైతే అతి దుఃఖం ఉంటుందో అప్పుడు పిలుస్తారు. తండ్రియే సుఖధామాన్ని లేక పావన ప్రపంచాన్ని రచిస్తారని అనగా భగవాన్, భగవతీల రాజ్యాన్ని స్థాపన చేస్తారని పిల్లలకు తెలుసు. భగవాన్ మరియు భగవతి స్వర్గానికి యజమానుల వంటివారు. లక్ష్మీనారాయణులు ఎంతటి ధనవంతులుగా ఉండేవారు, ఎంత పెద్ద రాజధాని ఉండేది అనేది మీరు చూస్తారు. వారి రాజధానిలో ఎప్పుడు ఉపద్రవాలేవీ సంభవించవు. తండ్రి పిల్లలకు అటువంటి వారసత్వాన్నే ఇస్తారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. కానీ నంబరువారు పురుషార్థానుసారంగా అయితే ఉన్నారు. కొంతమంది పూర్తి జ్ఞానాన్ని తీసుకోని కారణంగా అక్కడ కూడా సంతోషంగా ఉండరు, ఇక్కడ కూడా సంతోషంగా ఉండరు. అటువంటివారిని రెండు ప్రపంచాలకు చెందనివారు అని అంటారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ-తీసుకుంటూ పడిపోతారు. భగవంతుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వారు రావడం కూడా గుప్త రూపంలో వస్తారు. ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా ఉండాలని అంటారు ఎందుకంటే అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. రాత్రి 12 గంటలైతే దానిని ఘోర అంధకారమని అంటారు. రాత్రి ఘోర అంధకారం ఉంటుంది, పగలు ఘోర ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు భక్తి మార్గమనే రాత్రి పూర్తవుతుందని, అందులో దుఃఖమే దుఃఖముందని పిల్లలకు తెలుసు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. తండ్రియే వచ్చి మనందరికీ సద్గతినిస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా తప్పకుండా నంబరువారుగా ఉన్నారు. కొందరిలో సంతోషమనే పాదరసం ఎక్కి ఉంటుంది. శ్రమను కూడా సంతోషంగా చేస్తారు. ఎవరికైనా వెళ్ళి అర్థం చేయించాలి అని సేవ పట్ల అభిరుచి ఉంటుంది, అందుకే ప్రదర్శనీలు, మేళాలను కూడా బాబా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించడంతో సంతోషమనే పాదరసం ఎక్కుతుంది. ఇక్కడ ఎవరి వద్దనైతే ధనముంటుందో, వారు మేము స్వర్గంలో కూర్చొన్నామని భావిస్తారు. వారికి జ్ఞానం తీసుకోవడం కష్టమనిపిస్తుంది అందుకే, కోటిలో ఏ ఒక్కరు మాత్రమే అంతటి వివేకవంతులుగా అయి తండ్రి వారసత్వానికి అధికారులుగా అవుతారు అని అంటారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. కనుక తండ్రి శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఎవరైతే శ్రీమతంపై మంచి రీతిగా నడుచుకుంటారో వారు తండ్రిని అనుసరిస్తారు. ఉదాహరణకు ఈ పుత్రుడు (బ్రహ్మా) బాగా నడుచుకుంటున్నారు. లౌకిక పిల్లలు అతని సలహాను పాటించనప్పుడు, మీ దారి మీరు చూసుకోండి అని అన్నారు. రావణుని మతాన్ని అనుసరించేవారు మరియు రాముని మతాన్ని అనుసరించేవారు కలిసి ఉండలేరు.

భారత్ లోనే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు అందుకే – ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. దైవీ రాజధాని స్థాపన చేయడంలో సమయం పడుతుంది. ఇది గుప్తమైనది. ఇందులో యుద్ధమనే మాటే లేదు. అలాగని దాడి చేసి రాజ్యం తీసుకుంటారని కాదు. అలా జరగదు. ఇక్కడ తండ్రి వచ్చి రాజులకే రాజులుగా తయారుచేస్తారు, ఆ తండ్రిని దుఃఖహర్త, సుఖకర్త రండి అని స్మృతి చేస్తారు. సన్యాసులు, గురువులు దుఃఖహర్తలుగా అవ్వలేరు. వారిది హద్దు సన్యాసము, మీది అనంతమైన సన్యాసము. ఇందులో అనంతమైన సంతోషముంటుంది. భగవతీ భగవాన్ అయిన ఈ లక్ష్మీనారాయణులకు కూడా అనంతమైన సంతోషముంటుంది కదా. పతిత మనుష్యులకు ఏది తోస్తే అది అంటూ ఉంటారు. మీరు ఒక్కొక్క పదాన్ని అర్థ సహితంగా అంటారు. కొత్త ప్రపంచంలో ఒక్క ధర్మమే ఉంటుంది. ఆ ప్రపంచాన్ని దేనితో కూడా పోల్చడం జరగదు. పాత ప్రపంచంలో పోల్చడం జరుగుతుంది. పాత ప్రపంచంలో ఏముంటుంది అనేది కొత్త ప్రపంచంలో తెలియదు. అక్కడ అంతా మర్చిపోతారు. ఇక్కడ – కొత్త ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుంది, పాత ప్రపంచం ఎప్పుడు వినాశనమవుతుంది అని మీకు అంతా చెప్పడం జరుగుతుంది. మీలో పూర్తి జ్ఞానం ఉంది. ఇప్పుడు మీకు స్వర్గ స్థాపన చేసే తండ్రి లభించారు కనుక వారి నుండి మంచి రీతిగా వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరైతే కల్పక్రితం బాగా పురుషార్థం చేసారో, వారసత్వం కూడా వారికే లభిస్తుంది. వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది ముళ్ళ ప్రపంచము. మొదటి నంబరు ముల్లు అందరిలోనూ ఉంది. పాత ప్రపంచం ఛీ-ఛీగా, కొత్త ప్రపంచం మంచిగా ఉంటుంది. స్వర్గమని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని ఊరికనే అలా అంటూ ఉంటారు. స్వర్గస్థులవ్వడానికి అసలు స్వర్గం ఎక్కడుంది.

స్వర్గం కూడా ఈ భారత్ లోనే ఉండేదని మీకు తెలుసు. నరకం కూడా భారత్ లోనే ఉంది. మనుష్యులు ఈ పదాలను పట్టుకొని స్వర్గం-నరకం ఇక్కడే ఉన్నాయని అంటారు. ఎవరి వద్దనైతే చాలా ధనముంటుందో వారు స్వర్గంలో ఉన్నారని భావిస్తారు కానీ అలా కాదు. భారత్ కొత్తగా ఉన్నప్పుడు సత్యయుగంగా ఉండేది, దానిని స్వర్గమని అంటారు. ఇప్పుడిది పతిత ప్రపంచం, నరకంగా ఉంది. ప్రపంచమైతే ఒక్కటే. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. పాత ప్రపంచంలో రావణ రాజ్యముంది. భగవానువాచ – నేను మీకు 84 జన్మల రహస్యాలను తెలియజేస్తాను. ఈ రాజయోగంతో మిమ్మల్ని రాజులకు రాజులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. కనుక నరకం తప్పకుండా వినాశనమవ్వాలి. శాస్త్రాలలో కృష్ణుని పేరు రాసి యుద్ధం మొదలైనవి చూపించారు. పాండవులకు సైన్యమంటూ ఏదీ లేదు. ఈ రోజుల్లో కన్యలు, మాతల సైన్యాన్ని తయారుచేసి వారికి తుపాకులు మొదలైనవి ఉపయోగించడం నేర్పిస్తారు. ఇక్కడ మీ చేతిలో తుపాకులు మొదలైనవేవీ లేవు. శివశక్తి సేన అంటే ఎవరు అని వారికేమి తెలుసు. శివబాబా అయితే ఎప్పుడూ హింసను చేయించలేరు. యుద్ధమన్న మాటే లేదు. ఇది శివబాబా ఆత్మిక సైన్యం అని మీకు తెలుసు. శివబాబా మనల్ని డబల్ అహింసకులుగా తయారుచేస్తారు. దీనినే 100 శాతం అహింస అని అంటారు. ఇక్కడ 100 శాతం హింస ఉంటుంది. ఒక్క బాంబుతోనే ఎంతమందిని వినాశనం చేస్తారు. అనంతమైన అహింసకు మరియు హింసకు ఎంత తేడా ఉంది. ఈ సమయంలో మీరు అనంతమైన సైలెన్స్ లో ఉన్నారు. అటువైపు ఎంతగా యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయో, అంతగా శబ్దం పెరుగుతూ ఉంటుంది. వినాశన సమయంలో ఎంత హంగామా జరుగుతుంది. స్థాపన సమయంలో మీరు ఎంత సైలెన్స్ లో కూర్చొని ఉన్నారు! హింస విషయమేమీ లేదు. ఇప్పుడు మీది ప్రాక్టికల్ జీవితము. యోగ బలం ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. తండ్రి అయిన అల్ఫ్ ను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది, ఇది ఎంత సహజము. తండ్రి ఎంత ప్రియాతి ప్రియమైనవారు. ఎంతటి దూరదేశం నుండి వస్తారు. ఉదాహరణకు విదేశాల నుండి ఎవరి తండ్రి అయినా వచ్చినప్పుడు పిల్లలు చాలా సంతోషపడతారు. మా తండ్రి మా కోసం విదేశాల నుండి మంచి-మంచి కానుకలు తీసుకువస్తారని భావిస్తారు. ఈ అనంతమైన తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఏ కానుకను తీసుకువస్తారు? వారంటారు – నేను మీ కోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చాను. హనుమంతుడు సంజీవనీ మూలిక యొక్క పర్వతాన్ని తీసుకువచ్చారని అంటారు కదా. కానీ పర్వతాన్ని అయితే ఎవ్వరూ ఎత్తలేరు. అదే విధంగా తండ్రి అంటారు – నేను అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను. ఎవ్వరూ అరచేతిలో స్వర్గాన్ని తీసుకురాలేరు. ఇది అర్థం చేసుకునే విషయము. బాబా మా కోసం నంబరువన్ కానుకను తీసుకువచ్చారని పిల్లలకు తెలుసు. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను కనుక పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. ఇది రాజయోగం కదా. భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని గీతా భగవంతుడే నేర్పించారు మరియు రాజ్యాన్నిచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు. మేము స్వర్గ స్థాపన చేసే తండ్రి పిల్లలము అని మీరంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక తప్పకుండా ఎవరో ఒకరికి రాజ్యాధికారం లభించి ఉంటుంది కదా. అలాగని, కేవలం స్వర్గంలో ఉండేవారికి మాత్రమే తండ్రి ఇచ్చి ఉంటారని కాదు. తండ్రి అందరికీ ఇస్తారు కదా. ఇకపోతే మిగిలిన వారందరికీ డ్రామానుసారంగా ముక్తి యొక్క పాత్ర లభించి ఉంది. అందరూ ముక్తులుగా అవుతారు. ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతిదాత, ఇతరులెవ్వరూ కారు. ప్రదర్శినీలలో మీ వద్దకు ప్రసిద్ధమైనవారు ఎవరైతే వస్తారో, అందులో ఎవరైతే – నిజంగా గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు అని నమ్ముతారో, అటువంటివారి చేత రాయించాలి. పెద్ద వ్యక్తుల మాటలనే వింటారు. పేదవారి మాటలు ఎవ్వరూ వినరు. అందుకే ప్రదర్శినీలలో ప్రయత్నించి, గీతా భగవంతుడు ఒక్కరే, వారే అందరికీ తండ్రి అని రాయించండి. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు మొత్తం విశ్వంపై రావణ రాజ్యముంది. ఇతడే అందరికీ శత్రువు, ఇతడినే ప్రతి సంవత్సరం కాలుస్తారు, అయినా మరణించడు. ఇప్పుడు భారత్ కు ఈ రావణుడే పెద్ద శత్రువు. ఈ విషయం కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు రాముడైన పరమపిత పరమాత్మ రావణుడిపై విజయం ప్రాప్తింపజేస్తారు. వారంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నాశనమవుతాయి, మీరు యోగ్యులుగా తయారవుతారు, అప్పుడిక కొత్త ప్రపంచం కావాలి. ఇంతకుముందు తప్పకుండా పాత ప్రపంచ వినాశనం కూడా జరిగింది, అది మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడైతే రావణ రాజ్యం వినాశనం అయి రామరాజ్య స్థాపన జరిగిందో, అప్పుడే మహాభారత యుద్ధం జరిగింది. రావణ రాజ్యంలోనే హాహాకారాలు మొదలవుతాయి. హాహాకారాల తర్వాత జయ జయకారాలు జరుగుతాయి. ప్రపంచం పరివర్తనవుతుంది. ఎలాగైతే పాత ఇంటిని పడగొట్టి కొత్త దానిని నిర్మించి, తర్వాత దానిని కూడా పడగొడతారో, స్థాపన కూడా అలాగే జరుగుతుంది. బాంబులు మొదలైనవి తయారుచేస్తూనే ఉంటారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు దశరా రాగానే రావణుని దిష్టిబొమ్మను కూడా తయారుచేస్తారు. మీది అనంతమైన విషయము. వారు ఏమి చేస్తున్నారో మీ బుద్ధిలోకి వస్తుంది. మీరు అర్థం చేయించినప్పుడు, ఏం చేస్తున్నాము అనేది వారికి అర్థమవుతుంది. నవ్వు వస్తుంది కూడా. ఇంత పెద్ద రావణుడైతే ఉండడని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు తండ్రి అంటారు – మీరు రామరాజ్యాన్ని తీసుకోండి. 5 వికారాలను దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది. ఈ 5 వికారాల గ్రహణం మొత్తం ప్రపంచమంతటికీ పట్టి ఉందని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పూర్తిగా నల్లగా అయిపోతారు. పిల్లలైన మీకు అపారమైన సంతోషముండాలి. ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి.

ఇప్పుడు మీకు క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్స్ గురించి, డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధి స్వచ్ఛంగా అయ్యింది. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక తప్పకుండా స్వర్గంలోకి పంపిస్తారు. జ్ఞానం సంపాదనకు ఆధారం అని అంటారు. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని తండ్రి మాత్రమే ఇస్తారు. మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. ప్రపంచంలో అంతా, మనుష్యులు, మనుష్యులకు జ్ఞానాన్ని ఇస్తారు. మీకైతే తండ్రి అయిన పరమాత్మ వచ్చి జ్ఞానమిస్తారు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని కట్టుకథలను వినిపించేవారు. సత్యనారాయణ కథ, రామాయణ కథ….. ఎవరైతే ఉండి వెళ్ళారో వారి గురించి ఏవో ఒక కథలను తయరుచేస్తూ ఉంటారు. ఇది చదువు. చదువులో చరిత్ర-భూగోళాలను వినిపించడం జరుగుతుంది. ఇది ప్రపంచ చరిత్ర-భూగోళము, చాలా పెద్దది. మీరు ఇలా అర్థం చేయిస్తారు – ఆ గీతను చదివేవారు ఏమీ అర్థం చేసుకోరని బాబా 5 వేల సంవత్సరాల క్రితం కూడా చెప్పారు. యాదవులు, పాండవులు, కౌరవులు అని ఎవరినంటారో మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. యూరోప్ వాసులైన యాదవులు ముసలాలను (మిస్సైల్స్ ను) తయారుచేసారు, వాటి ద్వారా వినాశనం జరిగింది. కానీ వినాశనం తర్వాత ఏం జరిగింది అనేదేమీ చూపించరు. ప్రళయం జరిగిందని వారు భావిస్తారు. మీరు శాస్త్రాలను నమ్ముతారా అని వారు అడుగుతారు. అప్పుడు వారికి చెప్పండి – అవును, మాకు శాస్త్రాల గురించి తెలుసు, నమ్ముతాము, ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. జ్ఞానమైతే ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారు, వారే జ్ఞానసాగరుడు. ఇప్పుడు భక్తి సమాప్తమై జ్ఞానం జిందాబాద్ అవుతుంది. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, కొత్తేమీ కాదు. మనకు తండ్రి పట్ల ప్రీతి ఉంది. మనం ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తాము. తండ్రి అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగం జోడించండి, దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు, దీనిని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మ కూడా ఈ సమయంలో అంతిమ జన్మలో ఉంది. తండ్రి వీరితో అంటారు – మీకు మీ జన్మల గురించి తెలియదు, ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ అందుకే నేను వీరిలో ప్రవేశించాను. నేను వీరిలో కూర్చొని పిల్లలైన మిమ్మల్ని బ్రహ్మా ముఖవంశావళిగా చేసి రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇలా చెప్పలేరు. ఇక్కడ స్వయంగా తండ్రి ఈ నోటి ద్వారా వినిపిస్తున్నారు. ఈ బాబాకు కూడా ఒకప్పుడు ఏమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలియదు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది భారతవాసులకే అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే యుద్ధం నిలబడి ఉంది, దీని ద్వారా స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి. ఆ సమయంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను దేవతలుగా తయారుచేసారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైతే శ్రీమతాన్ని మంచి రీతిగా అనుసరిస్తారో, వారిని ఫాలో చేయాలి. అనంతమైన సంతోషంలో ఉండేందుకు తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి.

2. ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో జోడించాలి. డబల్ అహింసకులుగా అయి సైలెన్స్ లో కూర్చొని తమ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి.

వరదానము:-

ఇప్పుడిది మరజీవా జన్మ కనుక లౌకిక కర్మ బంధనాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అవి శ్రీమతం ఆధారంగా సేవా సంబంధాలకు ఆధారము. అది కర్మ బంధనము కాదు సేవా సంబంధము. సేవా సంబంధంలో వెరైటీ ఆత్మలకు సంబంధించిన జ్ఞానాన్ని ధారణ చేస్తూ నడుచుకున్నట్లయితే బంధనంలో విసుగు చెందరు. కానీ అతి పాపాత్మ, అపకారీ ఆత్మల పట్ల కూడా అయిష్టత, ద్వేషానికి బదులుగా దయాహృదయులుగా అయి దయా భావన పెడుతూ, సేవా సంబంధంగా భావించండి. అలా సేవ చేసినట్లయితే ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణులుగా మరియు పరోపకారులుగా మహిమ చేయబడతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top