13 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

13 December 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

12 December 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - శ్రేష్ఠంగా అవ్వాలంటే శ్రీమతంపై పూర్తిగా నడవండి, శ్రీమతంపై నడవకపోవడమే అన్నింటికంటే పెద్ద లోపము”

ప్రశ్న: -

ఏ పిల్లల గొంతు ఎండిపోతుంది, బుద్ధి నుండి జ్ఞానం తొలగిపోతుంది?

జవాబు:-

ఎవరైతే నడుస్తూ-నడుస్తూ అపవిత్రంగా అవుతారో, చదువును వదిలి తండ్రికి విడాకులు ఇస్తారో, వారి బుద్ధి నుండి జ్ఞానం తొలగిపోతుంది. ఎప్పటివరకైతే నిర్వికారీగా అవ్వరో, అప్పటివరకు అవినాశీ జ్ఞానం బుద్ధిలో కూర్చోదు, బుద్ధి తాళం తెరుచుకోదు. పతితంగా అయ్యేవారి ఆహార-పానీయాలు కూడా అశుద్ధంగా ఉంటాయి. వారు వెళ్ళి మాయావీ మనుష్యులతో కలిసిపోతారు, అప్పుడు వారి గొంతు ఎండిపోతుంది. ఎవ్వరికీ జ్ఞానం వినిపించలేరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

మిమ్మల్ని పొంది మేము..

ఓంశాంతి. ఈ పాటను ఎవరు పాడుతున్నారు? ఎవరైతే తండ్రి నుండి మూడు లోకాల రాజ్యాధికారాన్ని తీసుకున్నారో, వారు. మీ నుండి ఏవైతే లభించాయో, వాటిని ఎవ్వరూ తొలగించలేరు. మమ్మల్ని ఎవరూ కదపలేరు అనగా కాలుడు తినలేడు, అలాగే మా రాజ్యాన్ని కూడా ఎవ్వరూ తీసుకోలేరు. మనం ఆ యజమాని నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. తండ్రిని యజమాని అని కూడా అంటారు, కానీ ఆ యజమాని నుండి ఏం లభిస్తుంది అనేది కూడా ఏమీ తెలియదు. యజమానిని మనం ఎలా స్మృతి చేయాలి, వారి నామ-రూపాలేమిటి అనేది ఏమీ తెలియదు. యజమాని అంటే సృష్టికి యజమాని కదా. వారు రచయిత, మనం రచన. బాబా, వారసులను అనగా పిల్లలను రచిస్తారు, తర్వాత వారిని తమ యజమానులుగా చేస్తారు. పిల్లలు మళ్ళీ తండ్రికి యజమానులుగా అవుతారు. పిల్లలంటారు – నా తండ్రి ఆస్తి ఏదైతే ఉందో, దానికి నేను యజమానిని. పిల్లల ఆస్తికి నేను యజమానిని అని తండ్రి అయితే అనరు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తెలివైన పిల్లలే అర్థం చేసుకోగలరు. బుద్ధి స్వచ్ఛంగా లేకపోతే, అందులో రత్నాలు నిలవలేవు. దేహీ-అభిమానులుగా అయినప్పుడే రత్నాలు నిలవగలవు. దేహీ-అభిమానులుగా అయి ఉండాలి మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆ తండ్రిని స్మృతి చేయాలి. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చినప్పుడు, పిల్లలు యజమానులుగా అవుతారు. పిల్లలంటారు – ‘నా తండ్రి’ అని. తండ్రి అంటారు – ‘నా పిల్లలు’ అని. కానీ పిల్లల వద్ద ఏమీ ఉండదు. వారికైతే తండ్రి ఆస్తి లభిస్తుంది. తండ్రి ఎప్పుడూ, ‘పిల్లల ఆస్తి నాది’ అని అనరు. పిల్లలు నా ఆస్తికి యజమానులు అని తండ్రి భావిస్తారు, ఇవి గొప్ప ధారణాయుక్తమైన విషయాలు. ధారణ జరగడం లేదు ఎందుకంటే లోపాలున్నాయి. నాలో చాలా లోపాలున్నాయని అర్థం చేసుకోవాలి. నంబరు వన్ లోపం – శ్రీమతంపై నడుచుకోకపోవడము. శ్రీమతం ద్వారానే శ్రేష్ఠంగా అవ్వాలి. శ్రీమతం రాజయోగాన్ని నేర్పిస్తుంది. శ్రీ అంటే నిరాకార భగవానువాచ. అందుకే, మనం ప్రశ్న అడుగుతాము – జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, పరమపిత పరమాత్మతో మీకు ఉన్న సంబంధం ఏమిటి? ఇది చాలా పెద్ద-పెద్ద బోర్డుల పైన రాయాలి. పరమాత్మ స్వర్గ రచయిత, కనుక ఎవరికైతే పరమాత్మతో సంబంధం ఉంటుందో, వారు కూడా తప్పకుండా స్వర్గానికి యాజమానిగా అయిపోతారు.

తండ్రి వచ్చి పిల్లలకు సలామ్ చేస్తారు. ‘సలామ్ మాలేకం పిల్లలూ,’ అని అంటారు. పిల్లలంటారు – ‘మాలేకం సలామ్.’ నేను కేవలం బ్రహ్మాండానికి యజమానిని, మీరు బ్రహ్మాండానికి మరియు విశ్వానికి రెండింటికీ యజమానులుగా అవుతారు, అందుకే బాబా పిల్లలకు డబల్ సలామ్ చేస్తారు. ఒకే అనంతమైన తండ్రి, మీకు ఎంత నిష్కామ సేవ చేస్తారు! లౌకిక తండ్రి నిష్కామంగా ఉండరు. వారికి ఆశ ఉంటుంది – నేను వానప్రస్థ అవస్థలోకి వెళ్తే పిల్లలు నాకు సేవ చేస్తారు అని. వాస్తవానికి ఇలా నియమం ఉండేది – పిల్లలు తండ్రికి సేవ చేసేవారు. ఈ రోజుల్లో అయితే ధనాన్ని ఖర్చు చేసేస్తారు. తండ్రి నుండి మనకు ఇటువంటి రాజ్యాధికారం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. లక్ష్మీ-నారాయణుల గురించి కూడా ఈ విధంగా రాయండి – వీరి గురించి తెలుసా, వీరికి ఈ స్వర్గ రాజ్యాధికారం ఎవరిచ్చారు? తప్పకుండా స్వర్గ స్థాపన చేసేవారే ఇస్తారు. పాత ప్రపంచం ఉన్నప్పుడే, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కనుక లక్ష్మీనారాయణులు ఈ వారసత్వాన్ని శ్రీమతంపై నడుచుకోవడం ద్వారా పొందారు. శ్రీమతం రాజయోగాన్ని మరియు సహజ జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఎవరికైతే అర్థం చేయిస్తారో, వారు రాజుగా అవుతారు. మొదటి నంబరులో శ్రీకృష్ణుడు ఉంటారు, వారు ఏ కర్మలను చేయడం వలన తన తల్లిదండ్రుల కంటే కూడా పెద్ద పదవిని పొందారు? ఎవరి వద్దనైతే కృష్ణుడి జన్మ జరిగిందో, ఆ మహారాజు-మహారాణి ఎక్కడ ఉండేవారు. ఎప్పటివరకైతే నిర్వికారీగా అయి ఉండరో, అప్పటివరకు అవినాశీ జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. పవిత్రంగా ఉన్నప్పుడే బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అపవిత్రంగా అవ్వడంతో అంతా బుద్ధి నుండి తొలగిపోతుంది. చాలా మంది పిల్లలు విడాకులిచ్చేస్తారు, చదువును వదిలేస్తారు. వారు మళ్ళీ ఎప్పుడూ ఎవ్వరికీ జ్ఞానాన్ని వినిపించలేరు. పతితంగా అవుతారు, ఆహార-పానీయాలు కూడా అశుద్ధమైనవి తింటారు. వెళ్ళి మాయావీ మనుష్యులలో కలిసిపోతారు. వారి గొంతు ఎండిపోతుంది. ఈ విషయం కూడా శాస్త్రాలలో ఉంది. బృందావన్ లో రాస్ మొదలైనవి జరిగేవి. ఎవరికైనా వినిపిస్తే గొంతు ఎండిపోతుందని, ఎవ్వరికీ చెప్పవద్దని అనేవారు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. ఒకవేళ విడాకులిచ్చి, వెళ్ళి నిందించినట్లయితే గొంతు ఎండిపోతుంది. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరని అంటారు కదా! తండ్రి అంటారు – ఎప్పుడైతే సృష్టి పతితంగా, పాతదిగా అయిపోతుందో, అప్పుడు నేను వస్తాను. మనుష్యులు తమోప్రధానంగా అవ్వాల్సిందే. ఏ కర్తవ్యాలనైతే చేస్తారో, అవి విరుద్ధంగానే చేస్తారు ఎందుకంటే తప్పుడు మతం లభిస్తుంది, శ్రీమతమే లేదు. తప్పుడు మతం పతితంగా, భ్రష్టాచారీగా చేస్తుంది. ఒకప్పుడు భ్రష్టాచారం అనే పదమే ఉండేది కాదు. సన్యాసులు పావనంగా అయ్యేందుకు వికారాలను సన్యసిస్తారు.

కనుక, పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. అందరూ భగవంతుడిని స్మృతి చేస్తారు. భగవంతుడు అంటారు – నాకు భక్తులందరూ ప్రియమైనవారు ఎందుకంటే వారందరికీ నేనే గతి సద్గతినివ్వాలి. భగవంతుడు వచ్చి భక్తులకు భక్తి ఫలాన్ని ఇస్తారని వారు భావిస్తారు, అందుకే భక్తులు భగవంతునికి ప్రియమైనవారు. బాబా అర్థం చేయిస్తారు – మీరు దుర్గతిని పొందారు, ఇప్పుడు నేను సద్గతినిచ్చేందుకు వచ్చాను. భక్తి తర్వాత భగవంతుడు తప్పకుండా రావాలి. నేను భక్తి ఫలాన్ని ముందు మీకే ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలినవారెవ్వరూ ప్రారంభం నుండి నాకు భక్తులు కారు. వారైతే అనేకులకు భక్తి చేస్తారు. మీరు నా ప్రియమైన పిల్లలు, మీరు యజమానులుగా ఉండేవారు, తర్వాత మాయా రావణుడు మీపై విజయాన్ని పొందాడు, మళ్ళీ భక్తి ప్రారంభమయింది. ఇది కూడా డ్రామా. నేనైతే అందరికీ సద్గతినిస్తాను. ఇప్పుడు మీరు నా మతంపై నడుచుకుంటారు కదా. మతాన్ని ఇచ్చేందుకు తప్పకుండా నేను రావాల్సి ఉంటుంది. లేదంటే సద్గతి మార్గాన్ని ఎలా తెలియజేస్తాను! నేను ఈ మొదటి నంబరు భక్తుడి తనువులోకి వస్తాను. వీరు నంది. శివుని మందిరంలో ఎదురుగా నందిని ఉంచుతారు. ఇప్పుడు ఆలోచించండి – పరమపిత పరమాత్మ ఎద్దు తనువులోకైతే రారు. రాజయోగాన్ని ఎద్దు ద్వారా ఎలా నేర్పిస్తాను. జ్ఞాన సాగరుడు ఎద్దులో ఏమైనా ప్రవేశిస్తారా! ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అవుతారు. శ్రీమతంపై నడుచుకుని లక్ష్మీ-నారాయణులుగా, సూర్యవంశీ రాజా-రాణులుగా అవుతున్నారు. ఆ రాజధానిని మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు, ఏ తుఫానులు ఉండవు. మనం అమరపురికి యజమానులుగా అవుతాము. ఇది మృత్యులోకము. అమరనాథుడైన బాబాయే కాలునిపై విజయం పొందేలా చేస్తారు, వారి పాత్ర వేరు. మీరందరూ పార్వతులు, నేను అమరనాథుడను. నేను ఎప్పుడూ జనన-మరణాలలోకి రాను. అమరపురి స్వర్గానికి యజమానులుగా మిమ్మల్ని తయారుచేస్తాను. భారతవాసులకు వైకుంఠం చాలా ప్రియంగా అనిపిస్తుంది. ఫలానావారు వైకుంఠవాసులుగా అయ్యారని అంటారు, నోరు చాలా తీపి చేసేసారు. ఇప్పుడు వైకుంఠం అనేది వాస్తవానికి సత్యయుగంలో ఉంటుంది. సత్యయుగం ఉన్నప్పుడు, పునర్జన్మలు కూడా సత్యయుగంలోనే తీసుకుంటారు. తర్వాత త్రేతాలోకి వస్తారు, అప్పుడు, పునర్జన్మలు కూడా త్రేతాలో తీసుకుంటారు. ఆ తర్వాత ద్వాపరంలోకి వస్తారు, అప్పుడు పునర్జన్మలు కూడా ద్వాపరంలో తీసుకుంటారు. అంతేకానీ, కలియుగంలో మరణించినవారు సత్యయుగంలో పునర్జన్మలు తీసుకోవడమనేది జరగదు. స్వర్గంలో జన్మలు తీసుకుంటూ ఉండాలంటే, అది చదువుపైన ఆధారపడి ఉంది. తండ్రి అంటారు – నేను మిమ్మల్ని సృష్టికి యజమానులుగా చేస్తాను, నేను నిష్కాముడను. నేను విశ్వానికి యజమానిగా అవ్వను. మీరు స్వర్గానికి వెళ్తారు, అప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. నేను చక్రంలోకి రాను. ఈ ఈశ్వరీయ జన్మ తర్వాత మీరు దైవీ ఒడిలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు జన్మ-జన్మలుగా ఆసురీ ఒడిలో జన్మ తీసుకుంటున్నారు, భ్రష్టాచారులుగా అయ్యారు. సత్యయుగంలో అందరూ శ్రేష్ఠాచారులుగా ఉంటారు. ఇప్పుడు శ్రీమతంతో మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. అక్కడ విషం ఉండదు. ఇక్కడ సన్యాసులున్నారు, కానీ జన్మ అయితే వికారాలతోనే తీసుకుంటారు కదా! సత్యయుగంలో వికారాల ద్వారా జన్మ జరగదు. లేదంటే వారిని సంపూర్ణ నిర్వికారులని అనలేము. అక్కడ మాయ ఉండదు. కానీ ఈ విషయాలు కూడా ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా.

ఇప్పుడు బాబా అంటారు – పిల్లలూ, మీరు ఇంటికి వెళ్ళాలి, తర్వాత స్వర్గంలోకి వచ్చి రాజ్యం చేయాలి. ఆత్మలు పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. తర్వాత పతిత-పావనుడు వచ్చి లిబరేట్ చేయనంతవరకు, ఒక్కరు కూడా వెళ్ళలేరు. ఫలానావారు నిర్వాణం చెందారని వ్యర్థ ప్రలాపాలు చెప్తూ ఉంటారు. తండ్రి వచ్చి అన్ని విషయాలను మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధమేమిటి – మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇతరులెవ్వరికీ ఈ ప్రశ్నను అడగడం రాదు. మీరు కల్ప-కల్పం రాతి బుద్ధి నుండి పారసబుద్ధి మరియు పారస బుద్ధి నుండి రాతి బుద్ధి కలవారిగా అవుతూ వచ్చారు. ఇది మంచి రీతిగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ నిశ్చయం కూడా కూర్చోవాలి కదా. వాస్తవానికి మనం శివబాబాకు పిల్లలము. బాబా అంటారు – నేను ఇప్పుడు వచ్చాను మిమ్మల్ని సుఖధామానికి తీసుకువెళ్ళడానికి, వస్తారా? అక్కడ ఈ విషం లభించదు. ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించినది. కల్పక్రితం ఎవరైతే పవిత్రంగా ఉండేవారో, వారే ఇప్పుడు కూడా ఉండగలరు. చాలా మంది పిల్లలు రాస్తారు – బాబా, బంధనాలు ఎప్పుడు తెగిపోతాయో తెలియదు, యుక్తి చెప్పండి అని. బాబా అంటారు – పిల్లలూ, బంధనాలు వాటి సమయానుసారంగా తెగిపోతాయి. బాబా ఏం చేస్తారు? ఒక బంధనం వదిలిపోతే మళ్ళీ పిల్లలు మొదలైనవారి పట్ల మోహం ఏర్పడుతుంది. వీటన్నింటి నుండి బుద్ధిని తొలగించడానికి చాలా శ్రమ అనిపిస్తుంది. చాలామంది అయితే ఇంకా ఎక్కువగా మోహంలోకి వచ్చేస్తారు. మోహంలో వేలాడుతూ ఉండేవారు చాలామంది ఉన్నారు. బాబా అంటారు – మీరు మోహం ఒక్క తండ్రిపైన ఉంచుకోండి, అప్పుడే ధారణ అవుతుంది. కొందరు జ్ఞానాన్ని తీసుకోలేకపోతే, పారిపోతారు. తర్వాత పేరు అప్రతిష్ఠపాలు అవుతుంది. డ్రామాలో కల్ప క్రితం కూడా ఇలా జరిగింది. ఏ సెకెండు అయితే గడిచిందో, అది డ్రామా. అమ్మ మరణించినా కూడా హల్వా తినాలి, భార్య మరణించినా కూడా హల్వా తినాలి… కచ్చాగా ఉన్నవారికి కొద్దిగా కుదుపు వస్తుంది. చాలామంది సన్యాసులు కూడా ఇలాగే ఉంటారు, నిలవలేకపోతే గృహస్థంలోకి వెళ్ళిపోతారు. నడవడికయే అలా ఉంటుంది. ఇక్కడైతే ఒక్కటే ముఖ్యమైన విషయము. మేము కూడా ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము, మీరు కూడా వారిని తండ్రిగా భావిస్తారు, వచ్చి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి. విషయం ఒక్కటే – సెకెండులో జీవన్ముక్తి, చివర్లో మనుష్యులకు కొద్దిగా అర్థం చేయించినా, వెంటనే అర్థం చేసుకుంటారు. అనేక మతాలున్నాయి, వాటితో భారత్ భ్రష్టంగా అయిపోయింది. మళ్ళీ ఒక్కరి మతంతో అర్ధకల్పం కోసం భారత్ శ్రేష్ఠాచారిగా అవుతుంది. శ్రేష్ఠంగా తప్పకుండా తండ్రియే తయారుచేస్తారు. అందరినీ తీరానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే, మరి తప్పకుండా ముంచేవారు కూడా ఎవరో ఉంటారు. తండ్రి అయితే అందరికీ చెప్తారు – వికారాలను సన్యసించాల్సి ఉంటుంది, అప్పుడే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వగలరు. బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎంతోమంది బ్రహ్మాకుమారీలు ఉన్నారు. మీరు కూడా బి.కె.లు, వారసత్వం ఆత్మిక తండ్రి నుండి లభిస్తుంది. ఎంత సహజము. కానీ కొంతమంది కేవలం వర్ణిస్తూ ఉంటారు, ఆచరణ ఉండదు కనుక ఎవ్వరికీ బాణం తగలదు. వర్ణించడం వలన ఇతరులెవరికైనా మేలు జరగవచ్చు, కానీ స్వయం ఆచరించకపోతే పడిపోతారు. ఎవరికైతే జ్ఞానం ఇస్తారో, వారు ముందుకు వెళ్ళిపోతారు, స్వయం పడిపోతారు. ఇలా చాలామంది ఉన్నారు. బాబా పిల్లలకు పూర్తి వారసత్వాన్ని విల్ చేసేస్తారు, ఇప్పుడు మీరు యోగ్యులుగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రేష్ఠాచారులుగా అయ్యేందుకు తమ లోపాలన్నింటినీ తొలగించుకొని సదా శ్రీమతంపై నడవాలి. బుద్ధిలో జ్ఞాన రత్నాల ధారణను దేహీ-అభిమానులుగా అయి చేయాలి.

2. మనం చెప్పడము మరియు చేయడము ఒకే రకంగా ఉండాలి. జ్ఞాన ధారణ కోసం అందరి నుండి మోహాన్ని తొలగించి ఒక్క తండ్రి పట్ల మోహం ఉంచుకోవాలి.

వరదానము:-

ఎలాగైతే తండ్రికి స్నేహీలుగా అయ్యారో, అలా తండ్రిని సాథీగా చేసుకోండి, అప్పుడు మాయ దూరం నుండే మూర్ఛితమైపోతుంది. మొదట్లో చేసిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో – నీతోనే తింటాను, నీతోనే కూర్చొంటాను, నీతోనే ఆత్మను సంతోషపెడతాను… ఈ ప్రతిజ్ఞ అనుసారంగా మొత్తం దినచర్యలో ప్రతి కార్యం తండ్రితో పాటు చేసినట్లయితే, మాయ డిస్టర్బ్ చేయలేదు, దాని వినాశనం జరుగుతుంది. కనుక సాథీని సదా తోడుగా పెట్టుకున్నట్లయితే, తోడు యొక్క శక్తి ద్వారా లేదా మిలనంలో మగ్నమై ఉండడం ద్వారా మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top