13 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

13 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

12 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మన్మనాభవ డ్రిల్ ను సదా చేస్తూ ఉన్నట్లయితే 21 జన్మలకు పుష్టిగా (నిరోగులుగా) అవుతారు”

ప్రశ్న: -

సద్గురువు యొక్క ఏ శ్రీమతాన్ని పాలన చేయడంలోనే గుప్తమైన శ్రమ ఉంటుంది?

జవాబు:-

సద్గురువు యొక్క శ్రీమతము – మధురమైన పిల్లలూ, ఈ దేహాన్ని కూడా మర్చిపోయి నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని కేవలం ఆత్మగా భావించండి. దేహీ-అభిమానులుగా ఉండే పురుషార్థం చేయండి. అందరికీ సందేశాన్ని ఇవ్వండి – అశరీరులుగా అవ్వండి, దేహ సహితంగా దేహం యొక్క ధర్మాలన్నింటినీ మర్చిపోండి, అప్పుడు మీరు పావనంగా అవుతారు. ఈ శ్రీమతాన్ని పాలన చేయడంలో పిల్లలు గుప్తమైన శ్రమను చేయవలసి ఉంటుంది. అదృష్టవంతులైన పిల్లలే ఈ గుప్తమైన శ్రమను చేయగలరు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. తమ సోదరులు మరియు సోదరీలకు డ్రిల్ నేర్పించేందుకే పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇది ఏ డ్రిల్? ఇందులో పిల్లలు ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శారీరిక డ్రిల్స్ మొదలైనవి చేస్తారో, అక్కడ మాట్లాడవలసి ఉంటుంది. వీరు సుప్రీమ్ టీచర్, గీతా భగవంతుడు కూడా, వీరు కూర్చొని పిల్లలకు యోగం యొక్క డ్రిల్ కూడా నేర్పిస్తారు. ఈ డ్రిల్ కూడా గుప్తమైనది. విద్యార్థులు పుష్టిగా (ఆరోగ్యంగా) ఉండడం కోసమే డ్రిల్ నేర్పించడం జరుగుతుంది. ఈ మన్మనాభవ డ్రిల్ ద్వారా 21 జన్మల కోసం చాలా ఆరోగ్యంగా ఉంటామని, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వమని పిల్లలైన మీకు తెలుసు. కనుక ఇది ఎంత మంచి ఆత్మిక డ్రిల్. తండ్రి అంటారు – మన్మనాభవ, ఇందులో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి – అని అర్థం చేయించడం జరుగుతుంది. దేహీ-అభిమాని భవ. భవ అంటే అర్థము – మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఎవర్ హెల్దీగా (సదా ఆరోగ్యవంతులుగా) అయిపోతారు. కల్పక్రితం కూడా మనం ఈ ఆత్మిక డ్రిల్ ద్వారా ఎవర్ హెల్దీగా అయ్యాము. ఆత్మిక డ్రిల్ ను ఆత్మిక తండ్రి అయిన పరమపిత పరమాత్మ శివుడే నేర్పిస్తారు. భగవంతుడు అని వారినే అంటారు, వారికే పూజ కూడా జరుగుతుంది. శివాయ నమః అని కూడా అంటారు కదా. బ్రహ్మా దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఈ డ్రిల్ ను దేహధారి మనుష్యులు ఎవరూ నేర్పించరు. మీరు బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలవబడతారు, అలాగని ఈ డ్రిల్ మీకు బ్రహ్మా నేర్పించారని కాదు. ఉత్తరంపై కూడా శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని రాస్తారు. వారు గుప్తంగా ఉన్నారని అర్థము. కానీ బ్రహ్మా ప్రజాపిత అని మనుష్యులకు ఎలా తెలుస్తుంది. ప్రపంచంలోని వారంతా వారి (బ్రహ్మా) పిల్లలు. వారు ప్రజాపిత కదా. డ్రిల్ నేర్పించేవారైతే నిరాకార తండ్రి. వారు గుప్తంగా ఉన్నారు. గుప్తంగా ఉన్న కారణంగా మనుష్యులకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బ్రహ్మాను భగవంతుడని అనరు. ఇక్కడ బ్రహ్మాకుమారులు, కుమారీలు అనే పేరును చూపిస్తున్నారంటే వీరు బ్రహ్మాకు సంతానమని అర్థము. ఎవరైనా వచ్చినప్పుడు వారికి – ఈ కొత్త ప్రపంచాన్ని రచించేవారు బ్రహ్మా కాదు, నిరాకారుడైన తండ్రి అని అర్థం చేయించాలి. వారు బ్రహ్మా ద్వారా రచనను రచిస్తారు. పారలౌకిక పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రచిస్తారు అంటే సుప్రీమ్ సోల్ యొక్క రచన అయినట్లు. మీరు ఉత్తరంపై శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని రాస్తారు, అంటే ఇది కూడా స్మృతి చేసేందుకు యుక్తి. శివబాబా బ్రహ్మా ద్వారా నేర్పిస్తారు. వారు మన్మనాభవ అని మాత్రమే చెప్తారు, ఇంకే కష్టము ఇవ్వడం జరగదు. మీరు మీ ఉన్నతిని కోరుకుంటే, సత్యఖండానికి యజమానులుగా అవ్వాలనుకుంటే, సత్య ఖండాన్ని స్థాపించేవారు ఆ సత్యమైన తండ్రి ఒక్కరే, వారిని స్మృతి చేయండి అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. నన్ను స్మృతి చేస్తే పాపాల నుండి ముక్తులుగా అవుతారని అనంతమైన తండ్రియే వచ్చి పిల్లలకు చెప్తారు. పరమపిత పరమాత్మను తప్ప కృష్ణుడిని పతితపావనుడని అనరు. ఈ విషయంలో ఇంకెవరి పేరు తీసుకోరు. వారిని గాడ్ ఫాదర్ అనే అంటారు. అందరూ వారిని ఫాదర్ అని పిలిచినప్పుడు, వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు. వారు విముక్తులుగా చేసేందుకే వస్తారని అంటారు. ఈ విషయం మనుష్యులకు తెలియదు. కల్పం ఆయువును తప్పుగా రాసేసారు. ఇప్పుడు పిల్లలు ఈ డ్రిల్ చేయాలి. జ్ఞానమైతే లభించి ఉంది. మీరు కూర్చొన్నప్పుడు, స్వయాన్ని దేహీగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. టీచర్ గద్దిపై ఎదురుగా కూర్చొంటే బాగా అనిపిస్తుంది. నియమేమిటంటే, డ్రిల్ చేయించేందుకు టీచర్ తప్పకుండా కావాలి. కొందరు పెద్ద టీచర్లు ఉంటారు, కొందరు చిన్న టీచర్లు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే – అతి ప్రియమైన తండ్రిని మీరు ఎంత సమయం స్మృతి చేస్తున్నారనేది మీకే స్వయంగా తెలుసు. బ్రహ్మా అతి ప్రియమైనవారేమీ కాదు. సదా పావనమైనవారే అతి ప్రియమైనవారు. అందరికన్నా ప్రియమైనవారు ఎవరు అనేది పిల్లలైన మీకు తెలుసు. హే దుఃఖహర్త-సుఖకర్త, అని మనుష్యులు పరమాత్మనే స్మృతి చేస్తారు. వారిని లిబరేటర్ (ముక్తిదాత) అని కూడా అంటారు అనగా దుఃఖాల నుండి విముక్తులుగా చేసేవారు. కనుక పిల్లలు తమ పురుషార్థాన్ని చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ ప్రపంచం తప్పకుండా పావనంగా అవ్వాల్సిందే మరియు ఇది పావన ప్రపంచం తయారవ్వాలంటే నిప్పు అంటుకోవాల్సిందే. నిప్పు ఎలా అంటుకుంటుందనేది కూడా మీకు తెలుసు. వినాశనమవ్వకుండా ఈ ప్రపంచం పావనంగా తయారవ్వలేదు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము… రుద్రుడు అన్నా, శివుడు అన్నా, తేడా ఏమీ లేదు. కానీ శివ అనే పేరు ముఖ్యమైనది. ఇకపోతే తమ-తమ భాషలలో అనేక పేర్లు పెట్టేసారు. అసలు పేరు శివ. శివజయంతిని కూడా జరుపుకుంటారు. భారత్ లోనే శివజయంతి ప్రసిద్ధమైనది. అనంతమైన తండ్రి యొక్క శివజయంతి కావున వారు తప్పకుండా వస్తూ ఉండవచ్చు. శివబాబా పేరు ప్రసిద్ధమైనది. వారు బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేయించేవారు. కావున ఆ ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. బ్రహ్మా ఉన్నతోన్నతమైనవారు కాదు. నిజానికి బ్రహ్మా ఉన్నతోన్నతంగా తయారవుతారు. తర్వాత కిందకు కూడా దిగుతారు. బి.కె. లైన మీరు కూడా కిందకు దిగజారి ఉండేవారు, ఇప్పుడు ఉన్నతంగా తయారవుతున్నారు. ఒక్కసారిగా మీరు ఉన్నతమైన తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఈ సమయంలో త్రికాలదర్శులుగా అవుతున్నారు. మనమే స్వదర్శన చక్రధారులము – అని మీకు స్వయంగా తెలుసు. మనం బ్రహ్మాండము మరియు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలిసినవారము. బ్రహ్మాండము అనగా ఉన్నతమైన స్థానము, అక్కడ ఆత్మలన్నీ నివసిస్తాయి. మూలవతనంలో ఆత్మలుంటాయని అర్థం చేయించేవారు ప్రపంచంలో ఇంకెవరూ లేరు. విశ్వము మరియు బ్రహ్మాండము వేర్వేరు. ఆత్మలు నిర్వాణధామంలో ఉంటాయి, దానిని శాంతిధామమని అంటారు. అది అందరికీ ప్రియమనిపిస్తుంది. దాని అసలు పేరు నిర్వాణధామము లేక శాంతిధామము. ఆత్మ యొక్క స్వరూపము – శాంతి. ఒకటి శాంతిధామము, తర్వాత మూవీధామము మరియు ఇది టాకీధామము. మూవీధామంలో ఎక్కువ సమయం ఉండరు. శాంతిధామంలోనైతే చాలా మంది ఉండాల్సి ఉంటుంది, ఇంకే స్థానము లేదు. ఆత్మ తన తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేసినప్పుడు పైన స్మృతి చేస్తుంది. మధ్యలో ఉన్న ధామము గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనుష్యులకైతే ఇంత జ్ఞానం లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనంలో ఉంటారని మాత్రమే అంటారు. ఇకపోతే, వారి కర్తవ్యం గురించి తెలియదు. వారు 84 జన్మలను తీసుకుంటారు. బ్రహ్మా విష్ణువుగా అవుతారు, విష్ణువు బ్రహ్మాగా అవుతారు. ఇది లీప్ యుగము. ఇది కొంత సమయమే ఉంటుంది. ఎలాగైతే పురుషోత్తమ మాసమని అంటారో, అలా ఇది మీకు వజ్ర సమానంగా ఉత్తమంగా తయారయ్యే ఉన్నతమైన జన్మ. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వడం అన్నింటికన్నా ఉత్తమమైనది. బ్రాహ్మణులుగా అయితే తాతగారి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు.

తండ్రి పిల్లలకు చెప్తారు – పిల్లలూ, సదా మన్మనాభవ. తండ్రి సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. తండ్రిని సందేశకుడు అని అంటారు, ఇంకెవరూ సందేశకులు కాదు. మిగిలిన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. సందేశకుడు ఒక్కరు మాత్రమే, వారే వచ్చి పవిత్రంగా తయారవ్వాలనే సందేశాన్ని మీకు ఇస్తారు. మిగిలిన వారు ధర్మ స్థాపన చేసేందుకు వస్తారు. వారెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళే మార్గదర్శకులు కారు. సద్గతినిచ్చే సద్గురువు వారు ఒక్కరే. సత్యం చెప్పేవారు, సత్యమైన మార్గాన్ని తెలియజేసేవారు ఒక్క పరమపిత పరమాత్మ శివుడే. కావున పిల్లలు చాలా గుప్తమైన శ్రమను చేయాలి. మేము ఈ దేహాన్ని మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి – అని ఇప్పుడు మీకు తెలుసు. శరీరాన్ని వదిలేసారంటే ప్రపంచాన్ని అంతా వదిలేస్తారు. ఆత్మ ఒంటరిగా అయిపోతుంది. తండ్రి అంటారు – దేహీ-అభిమానులుగా అయినట్లయితే ఇక మిత్ర-సంబంధీకులు ఎవరూ గుర్తుకు రారు. నేను ఆత్మను, నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. మీరు తండ్రి వద్దకు ఎలా వెళ్ళచ్చు అనే విషయంలో తండ్రి సలహాను ఇస్తారు. ఈ బాబా కూడా ప్రసిద్ధమైనవారే. వీరి ద్వారా తండ్రి ఆత్మలందరికీ మార్గదర్శకునిగా అయి దోమల గుంపు వలె తిరిగి తీసుకువెళ్తారు. ఈ యథార్థ జ్ఞానం కేవలం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. మిమ్మల్ని పాండవ సైన్యము అని కూడా అంటారు. పాండవపతి స్వయంగా సాక్షాత్తు పరమపిత పరమాత్మ, వారు కల్పక్రితం వలె పిల్లలైన మీకు డ్రిల్ నేర్పిస్తున్నారు. వినాశనం జరిగినప్పుడు ఆత్మలన్నీ శరీరాలను వదిలి వెళ్ళిపోతాయి. సత్యయుగంలో కొద్దిమంది ఆత్మలు ఉన్నప్పుడు ఒకే రాజ్యముంటుంది. ఇప్పుడు అనేక రాజ్యాలున్నాయి, మళ్ళీ తప్పకుండా ఒకే రాజ్యముంటుంది. రోజంతా ఈ జ్ఞానాన్ని బుద్ధిలో స్మరణ చేయాలి. పిల్లలు ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు కొత్త భారత్ ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. ఆది సనాతన ధర్మము హిందూ ధర్మమేమీ కాదు. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇది ఇతర ధర్మాలవారు ఒప్పుకోరు. ఎవరైతే ముందు వస్తారో, వారే 84 జన్మలను తీసుకుంటారు. ఇవి చాలా సులువుగా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పాత్రధారులందరూ వచ్చేసారు. 84 జన్మలను పూర్తి చేసుకున్నారు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీరు చాలా అలసిపోయారు కదా. భక్తి మార్గమంటేనే అలసిపోయే మార్గము. తండ్రి అంటారు – ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, ఇతరులకు సందేశాన్నివ్వండి – దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అశరీరిగా అయినట్లయితే పావనంగా అవుతారు ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది.

ఇక్కడకు కూడా పిల్లలు తండ్రి సమ్ముఖంలో రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తండ్రి పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తారు – పిల్లలూ, దేహాభిమానాన్ని వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. మీరు ఒక్క తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఒకవేళ శ్రమ చేయకపోతే ఫలం కూడా లభించదు. అప్పుడు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. తండ్రి అంటారు – మీ సంపాదనను జమ చేసుకుంటూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఆహ్వానం అందించండి. తండ్రి మార్గాన్ని కూడా తెలియజేయండి. పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. తమ మిత్ర-సంబంధీకుల కళ్యాణం కూడా చేయాలి. ఇక్కడ మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేయడం జరుగుతుంది. మహామంత్రాన్ని ఇస్తారు. ప్రాచీన యోగాన్ని తండ్రియే వచ్చి నేర్పించారు, దీని గురించే – యోగాగ్నితో పాపాలు దగ్ధమవుతాయి అని అంటూ ఉంటారు. కల్పక్రితం కూడా ఇదే సూచన లభించింది. తండ్రి సూచనను ఇస్తారు – మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. నేను మీ శరణులోకి వచ్చాను అని అంటూ ఉంటారు. ఇలా కూడా జరుగుతుంది – ఎప్పుడైనా ఎవరైనా దుఃఖితులు అయినట్లయితే, ఎక్కువ శక్తి గలవారి వద్దకు వెళ్ళి శరణు తీసుకోవడమనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది ప్రాక్టికల్ గా జరుగుతుంది. చాలా దుఃఖం కలుగుతుంటే, ఇక సహనం చేయలేకపోతే, గత్యంతరం లేదనిపిస్తే, అప్పుడిక పరుగెత్తుకొని వచ్చి తండ్రి శరణు తీసుకుంటారు. తండ్రి తప్ప ఇంకెవరూ సద్గతినివ్వలేరు. పాత ప్రపంచం వినాశనమవ్వనున్నదని పిల్లలకు తెలుసు. ఏర్పాట్లు జరుగుతున్నాయి – ఇటువైపు మీ స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి, అటువైపు వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థాపన జరిగిందంటే వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. బాబా స్థాపన చేయించేందుకు వచ్చారు, వీరి ద్వారా వారసత్వం కూడా తప్పకుండా లభిస్తుందని మీకు తెలుసు. అంతేకానీ ప్రేరణతో పనేమీ జరగదు. మీ ప్రేరణతో మేము చదువుకుంటామని టీచర్ తో ఏమైనా అంటారా. ఒకవేళ ప్రేరణతోనే అంతా జరిగితే, ఇక శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు? ప్రేరణతో చేసేవారికి, శివ జయంతి జరపవలసిన అవసరం లేదు. ఆత్మలందరికీ జయంతి ఉంటుంది. ఆత్మలందరూ శరీరంలోకి వస్తారు. ఆత్మ మరియు శరీరం కలిసినప్పుడు, పాత్రను అభినయిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి, ఆత్మలోనే జ్ఞానం ధారణ అవుతుంది. ఆత్మనే మంచి-చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది. తండ్రి స్వర్గ రచయిత. అక్కడ పవిత్రతయే ఉంటుంది. అపవిత్రత యొక్క నామ-రూపాలు ఉండవు. ఇది విషయ సాగరము. ఎంతో స్పష్టంగా అర్థం చేయించినా కానీ ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు, కానీ మీరు ఎవరినీ దూషించరు. అందరూ డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నారు.

మీరు మెట్ల వరుసలో పై నుండి కిందకు దిగారని అర్థం చేసుకుంటారు. డ్రామానుసారంగా మనం దిగాల్సిందే, ఇప్పుడిక ఎక్కడానికి పురుషార్థం చేయాలి అని తండ్రి అంటారు. కానీ ఎవరి అదృష్టంలోనైతే లేదో, వారు డ్రామానుసారంగా కిందకు దిగాల్సిందేనని అంటారు. ఎవరైతే ఇలా అంటారో, వారి అదృష్టంలో లేదని అర్థమవుతుంది. 2-4 సంవత్సరాలు నడుస్తూ- నడుస్తూ కూడా కింద పడిపోతారు. మేము చాలా పెద్ద పొరపాటు చేసాము, పెద్ద దెబ్బ తిన్నామని రియలైజ్ అవుతారు కూడా. ఇది కూడా అర్ధకల్పం యొక్క రోగము, ఇది చిన్న విషయమేమీ కాదు. అర్ధకల్పం బట్టి రోగులుగా ఉన్నారు. భోగులుగా అవ్వడంతో రోగులుగా అయిపోతారు. కావున తండ్రి వచ్చి పురుషార్థం చేయిస్తారు. కృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. ఈ సమయంలో మీరు సత్యాతి-సత్యమైన యోగులు. యోగేశ్వరుడు మీకు యోగాన్ని నేర్పిస్తారు. మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరులు కూడా, తర్వాత రాజ-రాజేశ్వరులుగా అవుతారు. జ్ఞానంతో మీరు ధనవంతులుగా అవుతారు, యోగంతో నిరోగులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. అర్ధకల్పం కోసం మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కావున దీని కోసం ఎంత పురుషార్థం చేయాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పావనంగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఒక్క తండ్రిని స్మృతి చేయండి, దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోండి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి.

2. యోగేశ్వరుడైన తండ్రి నుండి యోగం నేర్చుకొని సత్యాతి-సత్యమైన యోగులుగా తయారవ్వాలి. జ్ఞానం ద్వారా ధనవంతులుగా, యోగం ద్వారా నిరోగులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలి.

వరదానము:-

ఎవరైతే అందరి పట్ల కళ్యాణ వృత్తిని మరియు శుభచింతక భావాన్ని పెట్టుకుంటారో, వారు తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే-పదే పడేసేందుకు ప్రయత్నం చేసినా, మనసును డిస్టర్బ్ చేసినా, విఘ్నరూపంగా అయినా సరే, మీకు వారి పట్ల శుభ చింతక భావం సదా స్థిరంగా ఉండాలి, విషయాల కారణంగా భావం మారిపోకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావము యథార్థంగా ఉన్నట్లయితే, మీపై ఆ పరిస్థితి యొక్క ప్రభావం పడదు. అప్పుడిక ఎలాంటి వ్యర్థమైన విషయాలు అసలు కనిపించవు మరియు సమయం పొదుపు అవుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top