12 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
11 January 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకునేందుకు వికారాల దానం తప్పకుండా ఇవ్వాలి, దేహీ-అభిమానులుగా అవ్వాలి, మమ్మా బాబా అని అంటున్నారంటే యోగ్యులుగా అవ్వండి’’
ప్రశ్న: -
ఆస్తికులుగా అయిన పిల్లలు కూడా ఏ ఒక్క విషయం కారణంగా నాస్తికులుగా అయిపోతారు?
జవాబు:-
దేహాభిమానం కారణంగా – మాకు అన్నీ తెలుసు అని అంటారు. పాత నడవడికను విడిచిపెట్టరు. జ్ఞానం యొక్క తూటా తగిలిన తర్వాత మళ్ళీ మాయ యొక్క తూటాలు తగిలించుకుంటూ ఉంటారు. నేను ఆత్మను, దేహీ-అభిమానిగా అవ్వాలి, ఈ విషయాన్ని మర్చిపోవడంతో ఆస్తికులుగా అయినవారు కూడా నాస్తికులుగా అయిపోతారు. ఈశ్వరీయ ఒడి నుండి మరణిస్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఈ రోజు కాకపోతే రేపు..
ఓంశాంతి. అది కూడా గడియారము, ఇది అనంతమైన గడియారము. అందులో కూడా పావు, సగము మరియు మొత్తము చూపించారు, ఇందులో కూడా అలానే ఉంది. 4 భాగాలు ఉన్నాయి. 15-15 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అలానే, ఇదేమో ఒకటి నుండి ప్రారంభమవుతుంది. ఇందులో అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. ఎలాగైతే మ్యాప్ లో చూసారు – నార్త్ పోల్ (ఉత్తర ధృవం) లో 6 మాసాలు రాత్రి ఉంటుంది, అంటే తప్పకుండా సౌత్ పోల్ (దక్షిణ ధృవం) లో 6 మాసాలు పగలు ఉంటుంది. ఇక్కడ కూడా బ్రహ్మా పగలు అర్ధకల్పం ఉంటే బ్రహ్మా రాత్రి అర్ధకల్పం ఉంటుంది. ఇది డ్రామా చక్రమని, దీనిని కల్ప వృక్షం అని కూడా అంటారని ప్రపంచం వారికి తెలియదు. దీని ఆయువు ఎంత? పేరే కల్పవృక్షము, ఇంత ఆయువు కలిగిన పెద్ద వృక్షమైతే ఇంకేదీ ఉండదు, అందుకే దీనిని మర్రి వృక్షంతో పోలుస్తారు. దాని పునాది కూడా పాడైపోయింది, ఇకపోతే వృక్షం నిలబడి ఉంది. అందుకే, ఒక కాలు విరిగిపోయింది, మిగిలిన 3 కాళ్ళపై నిలబడి ఉంది అని అంటూ ఉంటారు. అర్ధకల్పం పగలు మరియు అర్ధకల్పం రాత్రి లేక అర్ధకల్పం జ్ఞానం మరియు అర్ధకల్పం భక్తి అని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారు సగం-సగం చేయలేరు. సత్యయుగానికి చాలా సమయం ఇచ్చేసారు కావున సగం-సగం అవ్వలేదు. అసలు లెక్కే ఉండదు. మనుష్యులకు ఆస్తికులు మరియు నాస్తికులు అనే పదాల యొక్క అర్థం కూడా తెలియదు. అర్ధకల్పం సృష్టి ఆస్తికునిగా ఉంటుంది, అర్ధకల్పము నాస్తికునిగా ఉంటుంది. ఆ ఆస్తికత్వపు వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. శివరాత్రి ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. సమయం అనేది ఉండాలి కదా, అప్పుడు తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు. బాబానే వచ్చి భక్తి ఫలాన్ని ఇచ్చి, భక్తి నుండి విడిపించాలి. పరమపిత పరమాత్మ తప్పకుండా రావాలి. పతితపావనా రండి అని పిలుస్తారు. పతితపావనుడు ఎవరు – ఇది తెలియదు, అందుకే వారిని నాస్తికులని అంటారు. తెలుసుకున్నవారిలో కూడా నంబరువారు పురుషార్థం అనుసారంగా ఉన్నారు. ఇక్కడ ఉండేవారు కూడా ఏక్యురేట్ (ఖచ్చితం) గా తెలుసుకోని కారణంగా ఆశ్చర్యం కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ – పవిత్రత. చాలా సెంటర్లకు వికారీ మనుష్యులు కూడా అమృతాన్ని తాగడానికి వెళ్తారు, వారు ఏ ధారణ చేయలేకపోతారు. వికారాలను కూడా విడిచిపెట్టరు. ఎవరైతే అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని తాగుతారో, వారిని భస్మాసురులని అంటారు. కామ చితిపై కూర్చొని భస్మమైపోతారు, దేవతలుగా అవ్వరు. మొదట వికారాల దానమివ్వాలి. దానమిచ్చినట్లయితే, బాబా-మమ్మా అని అనడానికి యోగ్యులు అవుతారు. క్రోధం కూడా తక్కువేమీ కాదు. క్రోధంలోకి వచ్చి ముందు నిందిస్తారు, తర్వాత కొట్టడం కూడా మొదలుపెడతారు. ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా. వార్తాపత్రికలలో ఇటువంటి సమాచారాలు చాలా ముద్రించబడతాయి. బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే, దుర్గతిని కలిగించే ఈ వికారాలను తప్పకుండా దానమివ్వాలి. బాబా అంటారు, పిల్లలూ, మీరు అశరీరిగా అయ్యి నడుచుకోవాలి, ఈ దేహ భానాన్ని విడిచిపెట్టండి. ఎంత సమయం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఆత్మలమైన మేము ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని తీసుకుంటాము అని మీరు భావించేవారు. అక్కడ మాయ ఉండదు, అందుకే దుఃఖం యొక్క విషయం ఉండదు. ఇక్కడైతే పెద్ద వ్యక్తి ఎవరైనా అనారోగ్యంపాలైతే వార్తాపత్రికలలో పడుతుంది. వారిని రక్షించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. చూడండి, ఈ సమయంలో పోప్ కు ఎంత గౌరవం ఉంది. కానీ, ఈ సమయంలో అందరూ నాస్తికులు. గాడ్ ఫాదర్ గురించి తెలియనే తెలియదు అంటే నాస్తికులని అంటారు కదా. ఎవరైనా తండ్రికి 5-7 మంది పిల్లలుంటే, మా తండ్రి సర్వవ్యాపి అని ఆ పిల్లలు ఏమైనా అంటారా. ఈ తండ్రి కూడా అంటారు, నేను రచయితను, ఇది నా రచన. రచనలో రచయిత ఎలా వ్యాపించి ఉండగలరు. ఎంత సహజమైన విషయము, అయినా కూడా అర్థం చేసుకోరు, అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, మొదట నాస్తికుల నుండి ఆస్తికులుగా చేయండి, తద్వారా పరమపిత పరమాత్మ మా తండ్రి, వారి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారు అనాలి. కన్యాదానంలో ఏదైతే ధనమిస్తారో, దానిని కూడా వారసత్వం అని అంటారు. సుఖం యొక్క వారసత్వాన్ని ఎవరు ఇస్తారు, దుఃఖం యొక్క వారసత్వాన్ని ఎవరు ఇస్తారు, ఇది ఎవరికీ తెలియదు. భారతవాసులు స్వర్గాన్నే మర్చిపోయారు. స్వర్గం యొక్క పేరు కూడా తీసుకుంటారు, ఫలానావారు స్వర్గానికి వెళ్ళారు అని అంటారు, కానీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. పతితపావనా రండి అని పాడుతారు, కానీ తమను తాము పతితులుగా ఏమైనా భావిస్తారా. తండ్రి అంటారు, మొదట అల్ఫ్ (భగవంతుడు) గురించి అర్థం చేయించండి. పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధముంది! ఎప్పుడైతే మాకు తెలియదు అని అంటారో, అప్పుడు చెప్పండి, తండ్రి గురించి తెలియదా! లౌకిక తండ్రి అయితే శరీరం యొక్క రచయిత, పరమపిత పరమాత్మ అయితే ఆత్మలకు తండ్రి. మరి మీకు తండ్రి గురించి తెలియదా? ఎంత సహజమైన విషయము. కానీ పిల్లల బుద్ధిలో కూర్చోదు. లేదంటే సేవ చేయడం మొదలుపెట్టాలి. పరమపిత పరమాత్మతో ఏం సంబంధముంది? ప్రజాపిత బ్రహ్మాతో ఏం సంబంధముంది? వారు పరమపిత, వీరు ప్రజాపిత. ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడ ఉంటారు కదా. ప్రజాపిత బ్రహ్మా పేరు విన్నారా? నిరాకార పరమాత్మ సృష్టిని ఎలా రచించారు? కావున ప్రజాపిత సాకారుడు, వారికి పిల్లలైన బి.కె.లు కూడా తప్పకుండా ఉంటారు. పిల్లలే వారసత్వానికి యోగ్యులుగా అవుతారు. కానీ మంచి-మంచి పిల్లలు కూడా యుక్తిగా అర్థం చేయించరు. కొత్త-కొత్త విషయాలను బాబా అర్థం చేయిస్తారు, అయినా కూడా పిల్లలు తమ పాత నడవడికనే నడుచుకుంటూ ఉంటారు. కొత్త ధారణ చేయరు. దేహాభిమానం ఉంటుంది. మాకు అంతా తెలుసు అని అంటారు. కానీ మొదటి విషయం తెలియని కారణంగానే విడాకులు ఇచ్చేస్తారు. ఆస్తికుల నుండి నాస్తికులుగా అయిపోతారు. ఈశ్వరీయ ఒడిలోకి వచ్చి, మళ్ళీ మరణిస్తారు. బాబా-మమ్మా అని అంటూ కూడా మళ్ళీ ఎలా మరణిస్తారో చూడండి. మాయ లేక దేహాభిమానపు తూటా తగలగానే మరణిస్తారు. ఇది జ్ఞానం యొక్క తూటా, అది మాయ యొక్క తూటా. మాయ ఎలాంటి తూటాను వేస్తుందంటే, ఇక రావడమే మానేస్తారు. పాండవులైన మీ యుద్ధము మాయతో ఉంది.
తండ్రి అర్థం చేయిస్తారు, నన్ను జ్ఞానసాగరుడని అంటారు. జ్ఞానసాగరుడి నుండి జ్ఞాన గంగలు వెలువడ్డాయా లేక నీటివా? అక్కడ గంగ చిత్రాన్ని కూడా దేవిగా చూపిస్తారు, అయినా కూడా వారు ఎవరు అనేది బుద్ధిలోకి రాదు. దేవీ-దేవతలైతే ఎవ్వరికీ అమృతాన్ని తాగించలేరు. యజ్ఞం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల ద్వారా రచించడం జరుగుతుంది. యజ్ఞంలో మళ్ళీ యుద్ధం యొక్క విషయం ఎక్కడ నుండి వచ్చింది? ఈ విషయాలను తెలివైన పిల్లలే అర్థం చేసుకుంటారు. మందబుద్ధి కలవారైతే మర్చిపోతారు. స్కూల్ లో కూడా అదృష్టవంతులు నంబరువారుగా ఉంటారు. స్కూల్ లో 12 మాసాలు కూర్చుని ఉండవచ్చు, కానీ చదువు పట్ల ధ్యాస పెట్టకపోతే చదవలేరు. తండ్రి అయితే ఆత్మలను చదివిస్తారు. వారు మనుష్యులను చదివిస్తారు. తండ్రి అంటారు, ఓ ఆత్మా, వింటున్నావా? ఇంకెవ్వరూ ఆత్మతో మాట్లాడలేరు. తండ్రి అంటారు, లక్కీ సితారలుగా భావిస్తున్నారా? మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మనే చేస్తుంది మరియు చేయిస్తుంది. చేసేవారు-చేయించేవారు ఆత్మ కూడా మరియు పరమాత్మ కూడా. ఎలాగైతే ఆత్మ, ఆత్మతో చేయిస్తుందో, అలా పరమాత్మ తండ్రి ఆత్మలతో చేయిస్తారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీతో మంచి పనులు చేయిస్తాను. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మొట్టమొదట ఈ ప్రశ్నావళిని తీసుకోండి. వారు పారలౌకిక పరమపిత పరమాత్మ, వీరు లౌకిక పిత. ఆత్మ మరియు శరీరం వేర్వేరు కదా. శరీరం యొక్క పిత లౌకిక తండ్రి, ఆత్మల పిత పరమపిత పరమాత్మ. వారు పెద్ద తండ్రి. భక్తులందరూ వారినే స్మృతి చేస్తారు. సర్వుల పతితపావనుడు వారే. ఈ రోజులలోనైతే జగద్గురువు అనే పేరు పెట్టుకునే గురువులు అనేకమంది ఉన్నారు. జగదంబలు కూడా ఎంతో మంది వెలువడ్డారు. వారంతా అసత్యము. అసత్యంలో సత్యాన్ని గుర్తించడం కష్టమవుతుంది. పెద్ద-పెద్ద పేర్లు పెట్టుకొని కూర్చున్నారు. కానీ సత్యమైతే దాగలేదు. సత్యం ఉన్నచోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఉండండి. నాట్యమైతే ప్రసిద్ధమైనది. మీరు ఆస్తికులుగా అయి ధారణ చేసినట్లయితే స్వర్గంలో మీరు నాట్యం చేయండి. దేవతలే నాట్యం చేస్తారు. పతిత ప్రపంచము నరకము. మరి నరకాన్ని స్వర్గంగా లేక పావన ప్రపంచంగా ఈ గురువులు, సాధువులు మొదలైనవారు ఏమైనా తయారుచేస్తారా. దీనిని కుంభీపాక నరకము అని అంటారు. స్వర్గాన్ని శివాలయం అని అంటారు. మొదట ఇలా రాయించుకోండి – పరమపిత పరమాత్మ మా తండ్రి, వారు ప్రజాపిత బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణుల రచనను రచించారు. మేము శివబాబాకు మనవలం అవుతాము. వారసత్వం కూడా వారే ఇస్తారు. జ్ఞానసాగరుడు కూడా వారే. అవినాశీ జ్ఞాన రత్నాలను బ్రహ్మా ద్వారా ఇస్తారు. మొదట బ్రహ్మాకు లభిస్తాయి, తర్వాత ముఖవంశావళికి లభిస్తాయి. స్కూల్ లో కూడా ఒక్కొక్కరు వెనుక వచ్చేవారు కూడా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే చదువు బాగా చదువుకుంటారు. ఇక్కడ కూడా మంచి రీతిలో చదువుకోవాలి మరియు చదివించాలి. ఎవరైతే తమ సమానంగా తయారుచేయరో, వారిలో తప్పకుండా ఏవో ఒక లోపాలు ఉన్నాయి, అందుకే ధారణ జరగదు. ఒకవేళ కామ వికారం యొక్క సెమీ నషా ఉన్నా సరే ధారణ కష్టమవుతుంది. బాబా, కామం యొక్క తుఫాను చాలా విసిగిస్తుంది, పిచ్చివాడిలా చేసేస్తుంది అని రాస్తారు.
తండ్రి అంటారు, పిల్లలూ, కామం మహాశత్రువు. దానిని యోగబలంతో జయించండి. కల్పక్రితం కూడా మీరు జయించారు. తండ్రి యొక్క సింహాసనంపై కూర్చున్నారు. వారి వెనుక రాయల్ వంశం కూడా ఉంది. కేవలం ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడంతో ఇంత ఉన్నతంగా తయారైపోతారు. పవిత్రంగా ఉండకపోతే చాలా నష్టం కలుగుతుంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. యాక్సిడెంట్లు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయి. రజోప్రధాన సమయంలో ఇన్ని మృత్యువులు జరగవు. ఇప్పుడైతే ఆర్భాటముంది. ఇంతకుముందు ఇన్ని మెషీన్లు మొదలైనవి లేవు. ఇంతకుముందు యుద్ధాలు, స్టీమర్లు లేక విమానాల ద్వారా ఏమైనా జరిగేవా. ఇవన్నీ ఇప్పుడు వెలువడ్డాయి. ఇక్కడ ఉండేవి కావు. మొదట సత్యయుగంలో ఉండేవి, కావున మళ్ళీ సంగమంలోనే ఉండాలి. ఈ సుఖం మళ్ళీ మీకు స్వర్గంలో లభించేది ఉంది. విమానాలు ఎవరైతే తయారుచేస్తారో, వారు కూడా అక్కడ ఉంటారు. ప్రజలలోకి కూడా కొంతమంది వచ్చేస్తారు. సంస్కారాలు తీసుకువెళ్తారు, మళ్ళీ వచ్చి తయారుచేస్తారు. ఇప్పుడు వినాశనం కోసం తయారుచేస్తారు, తర్వాత అవి సుఖం కోసం ఉపయోగపడతాయి. అక్కడైతే ఫుల్ ప్రూఫ్ (పూర్తి సురక్షితం) గా ఉంటాయి. మాయ ఆర్భాటంతో వినాశనం జరుగుతుంది. వినాశనమైతే తప్పకుండా జరగాలి కదా. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞం కూడా రచించబడింది, ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాలు రచిస్తారు, లభించడం కూడా బ్రాహ్మణులకే లభిస్తుంది. బ్రాహ్మణ వర్ణమే మళ్ళీ దేవతా వర్ణంగా అవుతుంది. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను తయారుచేస్తారు. బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది ఎంత స్పష్టమైన విషయము, కానీ పిల్లలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత సహజమైన విషయాన్ని కూడా చాలామంది పిల్లలు ధారణ చేయలేకపోతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రితో సదా సత్యంగా ఉండాలి. వికారాలను దానమిచ్చి మళ్ళీ భస్మాసురులుగా అవ్వకూడదు. పవిత్రత యొక్క ఆజ్ఞను తప్పకుండా పాలన చేయాలి.
2. వికారాల సూక్ష్మ నషాను యోగబలంతో సమాప్తం చేయాలి. చదువును మంచి రీతిలో చదవాలి మరియు చదివించాలి.
వరదానము:-
తీవ్ర పురుషార్థుల ఎదురుగా సదా గమ్యం ఉంటుంది. వారు ఎప్పుడూ అటూ-ఇటూ చూడరు. ఫస్ట్ నంబరులో వచ్చేటువంటి ఆత్మలు వ్యర్థాన్ని చూస్తూ కూడా చూడరు, వ్యర్థ విషయాలను వింటూ కూడా వినరు. వారు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని బ్రహ్మాబాబాను ఫాలో చేస్తారు. ఎలాగైతే బ్రహ్మాబాబా స్వయాన్ని చేసేవారిగా భావించి కర్మలు చేసారు, ఎప్పుడూ చేయించేవానిగా భావించలేదు, అందుకే బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా సదా తేలికగా ఉన్నారు. ఇలా ఫాలో ఫాదర్ చేయండి (తండ్రిని అనుసరించండి).
స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవం చేయండి
తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందంటే, వారు ప్రతి రోజు ప్రేమకు బదులు ఇచ్చేందుకు ఇంత పెద్ద లేఖను రాస్తారు. ప్రియ స్మృతులు ఇస్తారు మరియు సహచరునిగా అయి సదా తోడును నిర్వర్తిస్తారు, కనుక ఈ ప్రేమలో తమ బలహీనతలు అన్నింటినీ బలిహారం చేసి సమాన స్థితిలో స్థితులవ్వండి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!