12 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
11 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - సుఖాన్నిచ్చే తండ్రిని చాలా-చాలా ప్రేమగా స్మృతి చేయండి, స్మృతి లేకుండా ప్రేమ ఉండదు”
ప్రశ్న: -
తండ్రి పిల్లలకు ప్రతి రోజు స్మృతి యొక్క అభ్యాసం చేయాలనే సూచనను ఎందుకు ఇస్తారు?
జవాబు:-
ఎందుకంటే స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. స్మృతి ద్వారానే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలరు, ఆత్మకు గల బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. వికర్మల నుండి ముక్తులు అయిపోతారు. శిక్షల నుండి విముక్తులైపోతారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషముంటుంది. గమ్యం సమీపంగా ఉన్నట్లు అనుభవమవుతుంది. ఎప్పుడూ అలసిపోరు. అనంతమైన సుఖాన్ని పొందుతారు, అందుకే స్మృతి యొక్క అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
బాల్యపు రోజులు మర్చిపోకూడదు….. (బచపన్ కే దిన్ భులా న దేనా…..)
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు జీవిస్తూనే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి చెందినవారిగా ఉన్నారు. సత్యయుగంలో కూడా హద్దు తండ్రికి చెందినవారిగా ఉంటారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెడితే, అనంతమైన వారసత్వం లభించదు. మీరు అర్థం చేయిస్తారు కానీ కొద్ది మాత్రానికే ఎవరూ రాజీ పడరు. మనుష్యులు చాలా ధనాన్ని కోరుకుంటారు. ధనం లేకుండా సుఖం లభించదు. ధనం కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరం కూడా కావాలి. ప్రపంచంలో నేడు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇతురులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా, ఏమి చేయాలి అనేది వారికి తెలియదు. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చునని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చిన్న నిప్పురవ్వ అంటుకుందంటే, విస్ఫోటం జరుగుతుంది, సమయం పట్టదు. ఇంతకుముందు కూడా చిన్న విషయానికే ఎంత పెద్ద యుద్ధం జరిగింది. పాత ప్రపంచం ఇక సమాప్తమైనట్లేనని పిల్లలకు తెలుసు, అందుకే ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానంలోకి రావడంతోనే ఆ సంతోషం మాయమైపోతుంది. దేహీ-అభిమానులుగా అయితే, తండ్రిని స్మృతి చేస్తారు. దేహాభిమానంలోకి రావడం వలన తండ్రిని మర్చిపోయి దుఃఖం తీసుకుంటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖం పొందుతారు. ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవ్వడానికే మీరు ఇక్కడకు వచ్చారు. రాజా-రాణుల నౌకర్లకు మరియు ప్రజల నౌకర్లకు, చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి పురుషార్థమే ఇక కల్ప-కల్పానికి నిశ్చితమైపోతుంది. నేను ఎంత పురుషార్థం చేసాను – అనేది చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి అంటారు – ఏ మధురాతి-మధురమైన తండ్రి నుండైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో, వారిని నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను – అని మీ అవస్థను చూసుకుంటూ ఉండండి. మీదంతా స్మృతి పైనే ఆధారపడి ఉంటుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంత సంతోషం కూడా ఉంటుంది. ఇప్పుడిక దగ్గరకు చేరుకున్నామని అర్థం చేసుకుంటారు. గమ్యం ఎంత దూరంగా ఉందో తెలియదు అని కొందరు అలసిపోతారు కూడా. గమ్యం చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది. భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది కూడా ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా, అని అంటారు కూడా, మళ్ళీ రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. మనం తండ్రికి చెందినవారిగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మతమనుసారంగానే నడుచుకోవాలి. విదేశాల్లో ఉంటున్నా కూడా, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతమైతే లభించింది. ఆత్మ తండ్రి స్మృతితో తప్ప తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వలేదు. మీరంటారు – బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, ఎలాగైతే మా బాబా (బ్రహ్మా) వారసత్వాన్ని తీసుకుంటారో, అలా మేము కూడా పురుషార్థం చేసి వారి సింహాసనంపై తప్పకుండా కూర్చుంటాము. మమ్మా-బాబా రాజ-రాజేశ్వరునిగా మరియు రాజ-రాజేశ్వరిగా అవుతారు కావున మేము కూడా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒక్కటే. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని మీకు చాలా కొద్దిగా నేర్పించడం జరుగుతుంది. దీనిని సహజ రాజయోగ బలం అని అంటారు. యోగంతో చాలా బలం లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. మనం ఏదైనా వికర్మను చేసినట్లయితే, చాలా శిక్ష అనుభవిస్తాము, పదవి భ్రష్టమైపోతుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది.
మనం పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే నిమిత్తులుగా అవుతారు. మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికే పిల్లలను రచిస్తారు. మనం ఎలాగూ శివబాబాకు చెందినవారమే. వారు పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికి కొత్త సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వాన్ని ఇస్తారు. ఆత్మలైతే పైన ఉంటాయి. అక్కడ వారసత్వం లేక ప్రారబ్ధం యొక్క విషయమేమీ ఉండదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ప్రారబ్ధాన్ని పొందుతున్నారు, ఈ విషయం ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంటుంది. ఫలానావారు ఒకవేళ అలా చేసినట్లయితే, మేము వారిని మొత్తానికి సమాప్తం చేసేస్తామని బెదిరిస్తూ ఉంటారు. అలా హతమార్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి దాచిపెట్టుకునేందుకు ఏమీ కాదు. చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రిటీష్ గవర్నమెంట్ సమయంలో పాకిస్థాన్, హిందుస్థాన్ ఉండేవా? యవనుల యుద్ధం గురించి రాయబడి ఉంది. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. యవనులు నిజంగా యుద్ధం చేసుకుంటున్నారు. బాంబులు కూడా తయారైపోయాయి. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నారు, లేదంటే చివర్లో చాలా ఏడ్వాల్సి ఉంటుంది. పరీక్షలో ఫెయిల్ అయితే, ఆ కోపంలో వెళ్ళి నీటిలో దూకి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మేము ఎలా-ఎలా అవుతాము అనేది కూడా తెలిసిపోతుంది. తండ్రి పని పురుషార్థం చేయించడము. తండ్రి అంటారు – పిల్లలూ, కర్మలు చేస్తూ స్మృతి చేయడం మర్చిపోయినా లేక తీరిక లభించకపోయినా, అచ్ఛా, కూర్చోండి, స్మృతిలో కూర్చుని తండ్రిని గుర్తు చేయండి. మీరు పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా, మేము తండ్రిని స్మృతి చేయాలి అనే ప్రయత్నం చేయండి. అలా కలిసి కూర్చున్నట్లయితే, మీరు బాగా స్మృతి చేయగలరు, సహాయం లభిస్తుంది. ఇక్కడకు వచ్చినా, రాకపోయినా సరే, తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. కొందరు విదేశాలకు వెళ్ళిన తర్వాత ఇక్కడకు మళ్ళీ రాలేరు. అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి – తండ్రి స్మృతితోనే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. బాబా అంటారు – తండ్రిని స్మృతి చేయండి, కేవలం ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రి అంటారు – మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించినది. ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. పవిత్రంగా అవ్వకపోతే స్మృతి చేయలేరు. అందరూ క్లాసుకు వచ్చి చదువుకోవడమనేది జరగదు. మంత్రాన్ని తీసుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. సతోప్రధానంగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేసారు. అయితే, సెంటరుకు రావడం వలన కొత్త-కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా రాలేకపోతే, వర్షం కురిస్తే లేక కర్ఫ్యూ ఉంటే, ఎవరూ బయటకు రాలేకపోతే, అప్పుడు ఏమి చేస్తారు? తండ్రి అంటారు – ఫర్వాలేదు, ఎక్కడ ఉన్నా సరే, మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవతలుగా అవుతారని ఇతరులకు చెప్పండి. చెప్పాల్సినవి కేవలం రెండు మాటలే.
ఈ బాల్యాన్ని మర్చిపోకండి అని తండ్రి అంటారు. ఈ రోజు నవ్వుతున్నారు, ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడ్వాల్సి ఉంటుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. స్వర్గంలోకైతే వెళ్తాము కదా, ఇక తర్వాత భాగ్యంలో ఏముంటే అది అని అనేవారు చాలామంది ఉన్నారు. దీనిని పురుషార్థం చేయడమని అనరు. మనుష్యులు ఉన్నత పదవిని పొందడానికే పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నత పదవి లభిస్తుంది అన్నప్పుడు పొరపాట్లు ఎందుకు చేయాలి. ఎవరైతే స్కూల్లో చదువుకోరో, వారు చదువుకున్నవారికి సేవ చేయవలసి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే, వెళ్ళి ప్రజల వద్ద కూడా నౌకర్లుగా అవుతారు. దీనికి సంతోషపడకూడదు. కనుక మధురాతి-మధురమైన పిల్లలు సమ్ముఖంగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారని తండ్రి అర్థం చేయిస్తారు. బంధనంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు, ఫర్వాలేదు, ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, యుద్ధం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఏ మాత్రం తేడా చేసినా, మేము ఇలా చేస్తామని ఒకరికొకరు ముందుగానే చెప్పుకుంటారు. బాంబులు ఉన్నాయన్న అహంకారం చాలా ఉంటుంది. తండ్రి అంటారు – పిల్లలు యోగబలంలో ఇంకా తెలివైనవారిగా అవ్వలేదు, మీరు తయారవ్వక ముందే యుద్ధం మొదలవ్వడమనేది జరగకూడదు. కానీ డ్రామానుసారంగా అలా జరగనే జరగదు. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదు, అందుకే ఈ యుద్ధం మొదలైనా కూడా మళ్ళీ ఆగిపోతుంది అని వారికి నిశ్చయం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడింకా రాజధాని స్థాపన అవ్వలేదు. దానికి సమయం పడుతుంది. పురుషార్థం చేయిస్తూ ఉంటారు, ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు, చెప్పలేము. బస్సులు పడిపోతూ ఉంటాయి, విమానాలు, రైళ్ళు పడిపోతూ ఉంటాయి, మృత్యువు ఎంత సహజంగా నిలబడి ఉంటుంది. భూమి కూడా కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువ పని భూకంపాలు చేస్తాయి. కానీ వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకు వేరెవ్వరూ లేరు. కేవలం తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజంగా చిన్న-చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా అర్థం చేయిస్తున్నారు. ఇంకే కష్టము ఇవ్వను, కేవలం స్మృతి చేయండి. కామ చితిపై కూర్చుని కాలిపోయిన మీరు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చుని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశ్యం ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారని సర్వుల తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది అని ఇప్పుడు తండ్రి అంటారు. ఈ మాత్రం సందేశాన్ని అయితే ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత కూడా స్మృతి చేయించగలరు. ఇతరులకు అభిరుచితో చెప్పగలరు. లేదంటే మనస్సు నుండి ఈ మాటలు రావు. తండ్రి అంటారు – ఎక్కడ ఉన్నా సరే, ఎంత వీలైతే అంత కేవలం స్మృతి చేయండి. ఆహార-పానీయాల విషయంలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఉండడం అయితే ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు కలిసినా వారికి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అనే శిక్షణను ఇవ్వండి.
తండ్రి అంటారు – మీరంతా తమోప్రధానంగా, పతితంగా అయిపోయారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. ఆత్మయే పతితంగా అయ్యింది. సత్యయుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుంది. ఇంకే ఉపాయము లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళినట్లయితే అనేకుల కళ్యాణం చేస్తారు. ఇంకే కష్టము ఇవ్వరు. పురుషోత్తమ మాసంలో కూడా వెళ్ళి, అందరికంటే పురుషోత్తములు ఎవరు అనేది అర్థం చేయించండి. సత్యయుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. వారిని ఇలా పురుషోత్తములుగా తయారుచేసేవారు అనగా స్వర్గ స్థాపన చేసేవారు తండ్రియే. ఆత్మలందరినీ పావనంగా చేసే పతితపావనుడు తండ్రి మాత్రమే. అందరికంటే ఉత్తమోత్తమమైన పురుషులుగా తయారుచేసేవారు తండ్రియే. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజారులుగా అయ్యాము, రామ రాజ్యంలో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యం యొక్క అంతిమము. మనం పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. తండ్రిని స్మృతి చేసే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలి. వృద్ధులు కూడా ఈ సేవ చేయాలి. మిత్ర-సంబంధీకులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. వారికి చెప్పండి – నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తున్నారు అని. నిరాకార శివబాబా, సర్వుల సద్గతిదాత అయిన బాబా ఆత్మలందరికీ చెప్తున్నారు – నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు అని. ఈ విషయాన్ని అర్థం చేయించడం సహజము కదా. వృద్ధులు కూడా ఈ సేవను చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయము. వివాహాలు మొదలైనవాటికి ఎక్కడికి వెళ్ళినా చెవిలో ఈ విషయాన్ని వినిపించండి. నన్ను స్మృతి చేయండి అని గీతా భగవంతుడు చెప్తున్నారని చెప్పండి. ఈ విషయాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి – అనే తండ్రి సందేశాన్ని ఇవ్వాలి.
అచ్ఛా – భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారనుకోండి. స్వప్నంలో సాక్షాత్కారం జరుగుతుంది, నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారని తండ్రి అంటారు అనే శబ్దం వినిపిస్తుంది. స్వయం మీరు కూడా కేవలం ఇదే చింతన చేస్తూ ఉంటే నావ తీరానికి చేరుతుంది. మనం ప్రాక్టికల్ గా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము కనుక సంతోషముండాలి కదా. తండ్రిని మర్చిపోవడం వలనే కష్టం అనిపిస్తుంది. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు, వీరికి నిజంగా సరైన మార్గం లభించిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ తెలియజేయలేరు. ఎలాంటి సమయం వస్తుంది అంటే మీరు ఇంటి నుండి బయటకు రాలేరు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో….. వారు నారాయణుని వంశంలో జన్మిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వస్తారు. పదే-పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి, అంతే. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తుంది కావుననే స్మృతి చేయడం జరుగుతుంది. దుఃఖమిచ్చేవారిని ప్రేమించడం జరగదు. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను కనుక నన్ను ప్రేమించండి అని తండ్రి అంటారు. తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చదువులో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు. యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.
2. శ్రీమతాన్ని అనుసరిస్తూ తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.
వరదానము:-
సంగమయుగంలో ప్రతి బిడ్డకు జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పకుండా ప్రాప్తించింది. కనుక హోలీహంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి మరియు వర్ణించండి. ఎప్పుడైనా ఎవరి బలహీనతనైనా చూసినా లేక విన్నా ఈ బలహీనత ‘వీరిది కాదు, నాది’ అని భావించాలి. ఎందుకంటే మనమంతా ఒక్క తండ్రికి చెందినవారము, ఒక్క పరివారానికి చెందినవారము, ఒక్క మాలలోని మణులము. ఎలాగైతే స్వయంలోని బలహీనతలు ఇతరులకు తెలియకూడదని అనుకుంటారో, అలా ఇతరుల బలహీనతలను కూడా వర్ణించకండి. హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను తొలగించడము.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!