11 October 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
10 October 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - యోగాగ్నితో పాపాలను భస్మం చేసుకొని సంపూర్ణ సతోప్రధానంగా అవ్వాలి, ఎటువంటి పాప కర్మలను చేయకూడదు”
ప్రశ్న: -
సత్యయుగంలో ఉన్నత పదవి దేని ఆధారంగా లభిస్తుంది? ఇక్కడ ఉన్న ఏ నియమాన్ని (సిస్టమ్ ను) అందరికీ వినిపించాలి?
జవాబు:-
సత్యయుగంలో పవిత్రత ఆధారంగా ఉన్నత పదవి లభిస్తుంది. ఎవరైతే పవిత్రతను తక్కువగా ధారణ చేస్తారో, వారు సత్యయుగంలోకి ఆలస్యంగా వస్తారు మరియు పదవి కూడా తక్కువది పొందుతారు. ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు, వారికి ఈ నియమాన్ని వినిపించండి – దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. మీరు 5 వికారాలను దానమిచ్చినట్లయితే 16 కళల సంపూర్ణులుగా అవుతారు. పిల్లలైన మీరు కూడా, మాలో ఏ వికారాలు లేవు కదా? అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుందని మనుష్యులకెలా అర్థం చేయించాలి అనేది ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా భారత్ లో స్వర్గముండేది, లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఆ సమయంలో ఎంతమంది మనుష్యులుండేవారో ఆలోచించాలి. సత్యయుగం ఆదిలో మహా అయితే 9-10 లక్షల మంది ఉంటారు. మొదట్లో వృక్షం చిన్నగానే ఉంటుంది. ఈ సమయంలో కలియుగాంతంలో వృక్షం ఎంత పెద్దగా అయిపోయింది, ఇప్పుడు దీని వినాశనం తప్పకుండా జరగనున్నది. ఇది అదే మహాభారత యుద్ధమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ సమయంలోనే గీతా భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు మరియు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. సంగమంలోనే అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరిగింది. పిల్లలకు ఈ విషయం కూడా తెలుసు – నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది, అప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదు. తండ్రి అటువంటి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు సంగమంలో వస్తారు. ఇప్పుడు ఆ స్థాపన జరుగుతుంది. పాత ప్రపంచం వినాశనమవుతుంది. సత్యయుగంలో భారత ఖండం ఒక్కటే ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. ఇప్పుడైతే ఎన్ని ఖండాలున్నాయి. ఇప్పుడు భారత ఖండం కూడా ఉంది కానీ ఇందులో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం లేదు. అది ప్రాయః లోపమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇక మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్య, త్రేతా యుగాలలో వేరే రాజ్యాలేవీ ఉండేవి కావని గుర్తుంచుకోవాలి. ఇతర ధర్మాలన్నీ ఇప్పుడు వచ్చాయి. ఎంత దుఃఖం, అశాంతి, మారణహోమం ఉంది. మహాభారీ మహాభారత యుద్ధం కూడా ఇదే. ఒక వైపు యూరోప్ వాసులైన యాదవులు కూడా ఉన్నారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా వీరు మిసైల్స్ ను కనుగొన్నారు. కౌరవులు, పాండవులు కూడా ఉండేవారు. స్వయంగా పరమపిత పరమాత్మ పాండవులకు సహాయకునిగా ఉండేవారు. అందరికీ ఈ విషయాన్నే చెప్పారు – గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వృద్ధి చెందవు మరియు గతం యొక్క వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు కూడా తండ్రి అర్థం చేయిస్తారు – సత్యయుగంలో సతోప్రధానంగా ఉన్న భారతవాసులైన మీరే ఈ సమయంలో 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, మీ ఆత్మలు ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాయి. ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలి? పతితపావన తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ యోగాగ్నితోనే పాపాలు భస్మమవుతాయి మరియు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. తర్వాత స్వర్గంలో 21 జన్మలకు వారసత్వాన్ని పొందుతారు. ఇకపోతే, ఈ పాత ప్రపంచ వినాశనమైతే జరగాల్సిందే. భారత్ సత్యయుగంలో శ్రేష్ఠాచారిగా ఉండేది మరియు సృష్టి ఆదిలో చాలా తక్కువమంది మనుష్యులు ఉండేవారు. భారత్ స్వర్గంగా ఉండేది, అప్పుడు ఇంకే ఖండము ఉండేది కాదు. ఇప్పుడు ఇతర ధర్మాలు వృద్ధి చెందుతూ-చెందుతూ వృక్షం ఎంత పెద్దగా అయింది, అంతేకాక తమోప్రధానంగా అయి శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు ఈ తమోప్రధాన వృక్షం యొక్క వినాశనం మరియు కొత్త దేవీ-దేవతా ధర్మానికి చెందిన వృక్షం యొక్క స్థాపన తప్పకుండా జరగాలి. ఇది సంగమంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. తండ్రి పతిత మనుష్యులను పావనంగా తయారుచేస్తున్నారు. వారే తర్వాత దేవతలుగా తయారవుతారు. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే మళ్ళీ మొదటి నంబరులోకి వస్తారు. అందరికంటే ముందు దేవీ-దేవతల పాత్ర ఉండేది. వారే మొట్టమొదట విడిపోయారు. మళ్ళీ వారి పాత్రే ఉండాలి కదా. సత్యయుగంలో సర్వగుణ సంపన్నులుగా….. ఉంటారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు వికారీ ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచంగా ఎవరు తయారుచేస్తారు? పావనంగా తయారుచేసే వారా రండి, అని పిలుస్తారు కూడా. ఇప్పుడు వారు వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని నిర్వికారులుగా తయారుచేస్తున్నాను అని తండ్రి అంటారు. ఈ వికారీ ప్రపంచం యొక్క వినాశనం కోసం యుద్ధం జరగనున్నది. ఇప్పుడు ఏక మతం ఎలా ఏర్పడుతుంది అని మనుష్యులంటారు ఎందుకంటే ఈ సమయంలో అనేక మతాలున్నాయి కదా. అనేక మతాలు ఉన్నప్పుడు ఏక ధర్మం యొక్క మతమును ఎవరు స్థాపన చేస్తారు? ఇప్పుడు ఏక మత స్థాపన జరుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. పావనంగా ఉన్న ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారే 84 జన్మలు అనుభవించి ఇప్పుడు పతితంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి వచ్చి భారతవాసులకు మళ్ళీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు అనగా అసురుల నుండి దేవతలుగా తయారుచేస్తున్నారు. మీరు ఎవరికైనా ఇలా అర్థం చేయించవచ్చు – తండ్రి చెప్తున్నారు – నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చోండి. ఈ చితిపై కూర్చుంటే మీరు పావనంగా అవుతారు. తర్వాత ద్వాపరంలో రావణ రాజ్యం ఉన్న కారణంగా కామ చితిపై కూర్చొని-కూర్చొని భ్రష్టాచారీ ప్రపంచంగా తయారయింది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం దేవీ-దేవతలు ఉండేవారు. అప్పుడు కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఎంతగా అసురులు వలె అయ్యారు. ఇతర ధర్మాలు కూడా చేరడంతో వృక్షం పెద్దది అయింది. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ వృక్షం శిథిలావస్థకు చేరుకుంది, ఇప్పుడు నాకు మళ్ళీ ఏక మత రాజ్యాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది. భారతవాసులు, ఒకే ధర్మంలో ఒకే మతం ఉండాలని అంటారు కూడా. సత్యయుగంలో ఒకే ధర్మముండేదని భారతవాసులు మర్చిపోయారు. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఏక ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పిల్లలైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తప్పకుండా భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ప్రదర్శనీని ప్రారంభోత్సవం చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి కూడా ఇలా అర్థం చేయించాలి – మీరు దేని ప్రారంభోత్సవం చేస్తున్నారు? తండ్రి ఈ భారత్ ను స్వర్గంగా తయారుచేస్తున్నారు. ఇకపోతే, నరకవాసులంతా వినాశనమవుతారు. వినాశనానికి ముందే ఎవరైతే తండ్రి నుండి వారసత్వం తీసుకునేది ఉందో, వారు వచ్చి తెలుసుకోండి. ఈ బి.కె.ల ఆశ్రమం క్వారంటైన్ క్లాసు వంటిది. ఇక్కడ ఏడు రోజుల క్లాసు తీసుకోవాలి, అప్పుడు ఈ పంచ వికారాలు తొలగిపోతాయి. దేవతలలో ఈ పంచ వికారాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఈ పంచ వికారాలను దానమివ్వాలి, అప్పుడే గ్రహణం తొలగుతుంది. దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. తర్వాత మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. భారత్ సత్యయుగంలో 16 కళల సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడైతే ఏ కళ మిగలలేదు. అందరూ నిరుపేదలుగా అయిపోయారు. ఎవరైనా ప్రారంభోత్సవం చేసేందుకు వస్తే వారికి చెప్పండి – ఇక్కడి నియమేమిటంటే – పంచ వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారు. మీరు 16 కళల సంపూర్ణులుగా దేవతలుగా అవుతారు. పవిత్రత అనుసారంగా పదవిని పొందుతారు. ఇకపోతే, ఒకవేళ ఏవైనా కళలు తక్కువైతే జన్మ కూడా ఆలస్యంగా తీసుకుంటారు. వికారాలను దానమివ్వడమనేది మంచిదే కదా! పూర్వ కాలంలో చంద్రునికి గ్రహణం పడితే బ్రాహ్మణులు దానం తీసుకునేవారు. ఇప్పుడు బ్రాహ్మణులు గొప్పవారయ్యారు. పాపం పేదవారు భిక్షం అడుగుతూ ఉంటారు. పాత బట్టలు మొదలైనవి కూడా తీసుకుంటూ ఉంటారు. వాస్తవానికి బ్రాహ్మణులు పాత బట్టలు తీసుకోరు, వారికి కొత్త బట్టలిస్తారు. భారత్ 16 కళల సంపూర్ణంగా ఉండేదని, ఇప్పుడు ఇనుపయుగంగా అయిపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. 5 వికారాల గ్రహణం పట్టి ఉంది. ఇప్పుడు మీరు ఆ పంచ వికారాలను దానమిచ్చి ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉంటే, కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. స్వర్గంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు, తర్వాత వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. పంచ వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది అని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అయి స్వర్గంలో సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకోవాలి కనుక భ్రష్టాచారాన్ని వదిలేయాల్సి ఉంటుంది. 5 వికారాలను దానమివ్వండి. మేము సర్వ గుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా అయ్యామా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నారదుని ఉదాహరణ ఉంది కదా. ఒక్క వికారమున్నా సరే, లక్ష్మిని ఎలా వరించగలరు? ప్రయత్నిస్తూ ఉండండి. మాలిన్యాన్ని కాల్చేస్తూ ఉండండి. బంగారాన్ని కరిగించేటప్పుడు, అది కరుగుతూ ఉండగా అగ్ని చల్లారిపోతే మాలిన్యం తొలగదు. అందుకే, చాలా తీవ్రమైన అగ్నిలో కరిగిస్తారు. బంగారం నుండి మాలిన్యం వేరైపోయిందని చూసినప్పుడు దానిని అచ్చులలో పోస్తారు. ఇప్పుడు స్వయంగా తండ్రి చెప్తున్నారు – ఏ వికారాలలోకి వెళ్ళకండి, తీవ్ర వేగంతో పురుషార్థం చేయండి. ముందు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి – బాబా, మీరు పావనంగా తయారుచేయడానికి వచ్చారు, ఇక మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము. దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తారు. వారు సుప్రీమ్ ఆత్మ. మనం పతితంగా ఉన్నామని మీకు తెలుసు. ఆత్మలోనే సంస్కారాలుంటాయి. నేను మీ తండ్రిని, ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను. నేను మీ తండ్రిని, పరమాత్మను అని ఇంకెవ్వరూ అనలేరు. నేను పావనంగా తయారుచేయడానికి వచ్చాను. మీరు మొట్టమొదట సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వచ్చారు, తమోప్రధానంగా అయ్యారు. ఈ సమయంలో పంచ తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అందుకే అవి దుఃఖాన్నిస్తున్నాయి. ప్రతి వస్తువు దుఃఖం ఇస్తుంది. ఈ తత్వాలే సతోప్రధానంగా ఉన్నప్పుడు సుఖం ఇస్తాయి. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము. సుఖధామము అనంతమైన తండ్రి వారసత్వము. దుఃఖధామము రావణుని వారసత్వము. ఇప్పుడు శ్రీమతాన్ని ఎంతగా అనుసరిస్తారో, అంత ఉన్నతంగా తయారవుతారు. ఇక కల్ప-కల్పము వీరు ఈ విధమైన పురుషార్థమే చేస్తారని ప్రసిద్ధమవుతారు. ఇది కల్ప-కల్పం యొక్క పందెము. ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తున్నారో, వారు తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. పురుషార్థం సరిగ్గా చేయకపోతే థర్డ్ గ్రేడ్ లోకి వెళ్ళిపోతారు. ప్రజలలో కూడా ఏమవుతారో తెలియదు. లౌకిక తండ్రి కూడా, నీవు నా పేరు పాడు చేస్తున్నావు, ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని అంటారు. అనంతమైన తండ్రి కూడా అంటారు – మీకు మాయ చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే ఇక మీరు సూర్యవంశంలోకి, చంద్రవంశంలోకి రానే రారు, మీకు మీరే చెంపదెబ్బ వేసుకుంటారు. తండ్రి, వారసులుగా అవ్వండి అని అంటారు. రాజ్య తిలకాన్ని తీసుకోవాలనుకుంటే నన్ను స్మృతి చేయండి మరియు ఇతరులకు కూడా స్మృతినిప్పించండి, అప్పుడు మీరు రాజులుగా అవుతారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. కొంతమంది బ్యారిస్టర్లు ఒక్కొక్క కేసుకు లక్షల రూపాయలు సంపాదిస్తారు, మరికొంతమందిని చూడండి, ధరించేందుకు కోటు కూడా ఉండదు. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది కదా. మీరు కూడా పురుషార్థం చేస్తే, ఉన్నత పదవిని పొందుతారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. యజమానులుగానైనా అవ్వండి, ప్రజలుగానైనా అవ్వండి. ప్రజలలో కూడా నౌకర్లుగా అవుతారు. విద్యార్థి నడవడిక ద్వారా టీచర్లు అర్థం చేసుకుంటారు. విచిత్రమేమిటంటే ముందు వచ్చిన వారి కంటే వెనుక వచ్చినవారు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకు రిఫైన్ పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అంటు కడుతూ ఉంటారు. ముందు వచ్చినవారైతే చాలామంది పారిపోయారు. కొత్తవారు జోడించబడుతూ ఉంటారు. కొత్త-కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. చాలా యుక్తిగా అర్థం చేయించడం జరుగుతుంది. బాబా అంటారు – నేను మీకు ఎంతో గుహ్యాతి-గుహ్యమైన, రమణీకమైన విషయాలు వినిపిస్తాను, వీటితో మీరు వెంటనే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. నా పాత్ర ఉన్నంతవరకు మిమ్మల్ని చదివిస్తూ ఉంటాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. కర్మాతీత స్థితిని చేరుకున్నప్పుడు చదువు పూర్తవుతుంది. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చివర్లో పరీక్ష ఫలితాలు తెలుస్తాయి కదా. ఈ చదువులో నంబరువన్ సబ్జెక్ట్ పవిత్రత. తండ్రిని స్మృతి చేయనంతవరకు, తండ్రి సేవ చేయనంతవరకు విశ్రమించకూడదు. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. రావణుడిని కాలుస్తారు కానీ అతడు ఎవరు అనేది తెలియదు. దసరా పండుగను చాలా బాగా జరుపుకుంటారు. భగవాన్ రాముని యొక్క భగవతి అయిన సీత అపహరించబడ్డారని, తర్వాత రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారని వింటే – ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైనా జరుగుతుందా? ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనీలకు వచ్చినప్పుడు మొట్టమొదట వారికి తెలపాలి – భారత్ లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు ఎంతమంది మనుష్యులు ఉండి ఉండవచ్చు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. ఇప్పుడిది కలియుగము, ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధం కూడా. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వినాశనం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏక ధర్మము, ఏక మతము ఎలా ఏర్పడతాయి అనగా శాంతి ఎలా ఏర్పడుతుంది? ఏక మతము ఏర్పడాలని ఎంతగా తల బాదుకుంటూ ఉంటారో, అంతగానే కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు – ఇప్పుడు నేను వారందరినీ పరస్పరంలో కొట్లాడుకునేలా చేసి వెన్న మీకు ఇస్తాను. ఎవరు చేస్తే, వారే పొందుతారని తండ్రి అర్థం చేయిస్తారు. కొంతమంది పిల్లలు, తండ్రి కంటే కూడా ఉన్నతంగా అవ్వగలరు. మీరు నా కంటే కూడా షావుకార్లుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. నేను అలా అవ్వను. నేను పిల్లలైన మీకు నిష్కామ సేవ చేస్తాను. నేను దాతను. ఎవ్వరూ కూడా, నేను శివబాబాకు 5 రూపాయలు ఇస్తున్నాను అని అనుకోకండి. నేను శివబాబా నుండి స్వర్గంలో 5 పదమాలు తీసుకుంటాను అని అనుకోండి. మరి ఇది ఇవ్వడమా? ఒకవేళ మేము ఇస్తున్నాము అని భావిస్తే, ఇది శివబాబాను చాలా అవమానపరచినట్లు. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తున్నారు! మీరు శివబాబా ఖజానాకు 5 రూపాయలిస్తారు. బాబా మీకు 5 కోట్లు ఇస్తారు. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారుచేస్తారు. మేము శివబాబాకు ఇచ్చాము అని ఎప్పుడూ సంశయపడకండి. వీరు ఎంతటి భోళానాథుడు! మేము తండ్రికి ఇస్తున్నాము అనే ఆలోచన ఎప్పుడూ రాకూడదు. శివబాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాము. శుద్ధ భావంతో ఇవ్వకపోతే ఎలా స్వీకరిస్తారు. అన్ని విషయాల జ్ఞానము బుద్ధిలో ఉంచుకోవాలి. ఈశ్వరార్థము దానం చేస్తారు, ఈశ్వరుడేమైనా ఆకలితో ఉన్నారా? లేదు. మాకు వేరే జన్మలో లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు. ఇక్కడ చేసే కర్మలన్నీ వికర్మలుగానే అవుతాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సత్యయుగంలో కర్మలు అకర్మలు అవుతాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కడ మీ ద్వారా అసలు వికర్మలు జరగవు. చాలామంది పిల్లలు తయారవుతారు, అప్పుడిక మీ డబ్బును ఏం చేసుకుంటారు. ఉపయోగపడనిది తీసుకుని, మళ్ళీ దానికి రిటర్న్ ఇవ్వడానికి నేనేమీ అనుభవం లేని వ్యాపారస్థుడను కాను. నేను పక్కా వ్యాపారిని. ఇంక అవసరం లేదని చెప్పేస్తాను. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తీవ్ర వేగంతో పురుషార్థం చేసి వికారాల మాలిన్యాలను యోగాగ్నిలో కరిగించేయాలి. పవిత్రత యొక్క పూర్తి ప్రతిజ్ఞను చేయాలి.
2. కర్మ-అకర్మ-వికర్మల గతిని బుద్ధిలో ఉంచుకొని తమదంతా కొత్త ప్రపంచం కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
వరదానము:-
ఎలాగైతే జ్యోతిష్కులు తమ జ్యోతిష్య జ్ఞానంతో, గ్రహాల జ్ఞానంతో రాబోయే ఆపదలను తెలుసుకుంటారో, అలా పిల్లలైన మీరు అడ్వాన్స్ లో (ముందుగానే) మాయ ద్వారా వచ్చే పేపర్లను పరిశీలించి పాస్ విత్ ఆనర్గా తయారయ్యేందుకు మీ బుద్ధి రూపీ నేత్రాన్ని క్లియర్ గా (స్పష్టంగా) చేసుకోండి మరియు కేర్ ఫుల్ గా (జాగ్రత్తగా) ఉండండి. రోజు రోజుకు స్మృతి యొక్క శక్తిని మరియు సైలెన్స్ శక్తిని పెంచుకోండి. అప్పుడు, ఈ రోజు ఏదో జరగబోతుంది అని ముందే తెలుస్తుంది. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా, శక్తిశాలిగా అయినట్లయితే ఎప్పుడూ ఓడిపోరు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!